Back
Hyderabad500016blurImage

బేగంపేట: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

Manohar
Jun 26, 2024 09:19:04
Hyderabad, Telangana
బేగంపేట ఎమ్మార్వో కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గం కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com