ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
BRS Party 2026 Calendar: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మార్పు లేదని.. తిరోగమనం మాత్రమే ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు.. తిరోగమనం వైపు ప్రయాణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Harish Rao: కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదా? రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన సంవత్సర డైరీని మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు. న్యూ ఇయర్ రోజు కూడా ప్రజలు సంతోషంగా లేరని.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలి కాలంలో కూడా గంటల తరబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముందుకు సాగుదామని.. 2028లో తిరిగి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: Schools Holiday: జనవరి 1వ తేదీ అన్నీ స్కూళ్లకు సెలవు.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ చెప్పారు. కేంద్రంతోనూ సమైక్యవాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిల సంచలనం.. ప్రధాని మోదీ దేశ ద్రోహి అని విమర్శలు
రెండేళ్లుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. జెండాను చేతబట్టి నడిపించే నాయకుల కంటే.. ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి “ఇది నా జెండా” అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పార్టీ శ్రేణులపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
లగచర్ల పోరాటం, రుణమాఫీ వ్యతిరేక ఆందోళనలు, రైతుబంధును ఎగ్గొట్టిన అన్యాయంపై, ‘ఆరు గ్యారంటీలు- 420 హామీలు’పై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. 'గెలుపులు, ఓటములు శాశ్వతం కావని, అవి తాత్కాలికం. అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయని కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆటలా ఉంటే, తెలంగాణ సాధించిన బీఆర్ఎస్కు రాజకీయాలు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మమని, ఒక విధి' అని కేటీఆర్ తెలిపారు. గెలుపుఓటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలని చెప్పారు.
ఒక వైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే.. మరో వైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణం కూడా అవసరమని కేటీఆర్ గుర్తు చేశారు. పోరాటం, నిర్మాణం రెండింటినీ ఆధారంగా చేసుకుని ముందుకు సాగాలని, ధర్మం, న్యాయం, నిజాయితీ తమవైపే ఉన్నాయని, అందుకే విజయం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటై బీఆర్ఎస్ పార్టీపై దాడి చేస్తున్నా.. ప్రజల ఆశీర్వాదం, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా బీఆర్ఎస్ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని ప్రకటించారు. 2028లో తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jio New Year Offer 2026: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో నూతన సంవత్సరానికి ముందు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు "హ్యాపీ న్యూ ఇయర్ 2026" ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో రూ.103 నుండి రూ.3,599 వరకు మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్తో ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్ల ప్రత్యేకత ఏంటంటే, వినోద ప్రియులకు 13 కంటే ఎక్కువ OTT ప్లాట్ఫామ్లకు యాక్సెస్ లభించడంతో పాటు, వ్యాపారం, ఉత్పాదకతపై దృష్టి సారించే వారికి జెమిని ప్రో AI సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తుంది.
ఈ ప్లాన్లు జియో MyJio యాప్లో, అలాగే అన్ని జియో రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
1. జియో హీరో వార్షిక ప్లాన్ (రూ. 3,599)
ధర: రూ. 3,599
వ్యాలిడిటీ: 365 రోజులు
ప్రయోజనాలు: రోజుకు 2.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అపరిమిత 5G ఇంటర్నెట్. ఈ ప్లాన్లో రూ. 35,100 విలువైన 18 నెలల ఉచిత Google Gemini Pro సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
2. జియో సూపర్ సెలబ్రేషన్ నెలవారీ ప్లాన్ (రూ. 500)
ఒకేసారి సంవత్సరం రీఛార్జ్ చేసుకోలేని వారి కోసం జియో ఈ ఆకర్షణీయమైన నెలవారీ ప్లాన్ను తీసుకొచ్చింది.
ధర: రూ. 500
వ్యాలిడిటీ: 28 రోజులు
ప్రయోజనాలు: రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు.
OTT ప్లాట్ఫామ్లు: ఈ ప్లాన్లో మొత్తం 13 OTT ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ లభిస్తుంది. వీటిలో యూట్యూబ్ ప్రీమియమ్, జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, సోనీ లీవ్, జీ5 వంటివి ఉన్నాయి.
AI సబ్స్క్రిప్షన్: ఈ ప్లాన్లో కూడా రూ. 35,100 విలువైన 18 నెలల ఉచిత జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా, మీరు ఈ ప్లాన్ను కేవలం ఒక నెల పాటు రీఛార్జ్ చేసినప్పటికీ, మొత్తం 18 నెలల పాటు జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రీఛార్జ్ చేసిన తర్వాత, వినియోగదారులు తమ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ను యాప్లో విడిగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. జియో చౌకైన ఫ్లెక్సీ ప్యాక్ (రూ. 103)
"హ్యాపీ న్యూ ఇయర్ 2026" ఆఫర్ కింద జియో అందించే అత్యంత చౌకైన డేటా ప్లాన్ ఇది.
ధర: రూ. 103
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా: 5GB డేటా.
ఎంటర్టైన్మెంట్ ప్యాక్స్: ఈ ప్లాన్ వినియోగదారులకు మూడు విభిన్న ఎంటర్టైన్మెంట్ ప్యాక్ల నుండి ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది.
హిందీ ప్యాక్: జియో హాట్స్టార్, జీ5, సోనీ లీవ్
ఇంటర్నేషనల్ ప్యాక్: జియో హాట్స్టార్, ఫ్యాన్కోడ్, Lionsgate, డిస్కవరీ+
రీజినల్ ప్యాక్: జియో హాట్స్టార్, సన్ నెక్ట్స్, కాంచ లంక, హోయ్చోయ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
One dead and 15 hospitalized in biryani party tragedy Hyderabad: దేశమంత కూడా కొత్త ఏడాది సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా న్యూ ఇయర్ ను ఆనందోత్సవాల నడుమ జరుపుకున్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేళ కొంత మంది తమ ఇళ్లలో పార్టీలు చేసుకుంటే, మరికొంత మంది మాత్రం ఫ్రెండ్స్ లతో కలిసి ఇళ్ల దగ్గర అపార్ట్ మెంట్స్ లలో, హోటల్స్, రెస్టారెండ్ లలో చేసుకున్నారు. మొత్తంగా గతేడాదికి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇచ్చి మరీ న్యూ ఇయర్ ను గ్రాండ్ గా వెల్ కల్ చేప్పారు.
అయితే.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు కాస్త విషాదంగా మారాయి. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలో కొత్త ఏడాది సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. నిన్న రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషాదం కొత్త ఏడాది వేడుకల వేళ పెనువిషాదకరంగా మారింది.
జగద్గిరిగుట్టలోని భవానినగర్లో ఈ ఘటన సంభవించింది. న్యూ ఇయర్ సందర్భంగా సుమారు 17 చిన్న, పెద్దా దోస్తుల గ్యాంగ్ మంది ఒకచోట చేరి మద్యం సేవించారు. అనంతరం అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. అయితే.. తిన్న తర్వాత కొద్ది సేపటికి వారంతా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
కొంత మంది వామిటింగ్ చేసుకున్నారు. దీంతో అక్కడి వారు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఒకరు చనిపోయారు. ఏకంగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పాండు (53) అనే వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మిగిలిన 15 మందికి చికిత్స అందిస్తున్నారు.
Read more: New Year 2026: ఇది కదా అసలైన హైదరాబాద్.. న్యూ ఇయర్ వేళ సీపీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్..
ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ ఘటన జరిగిందా లేదా మరేతర కారణాలు ఉన్నాయా..?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ ఘటన కొత్త ఏడాది ప్రారంభంవేళ హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Trainee Police Constables Stipend Hike: ఆంధ్రప్రదేశ్లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ భారీ గుడ్ న్యూస్ అందించింది. ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుళ్లకు ఇప్పటివరకు నెలకు కేవలం రూ.4,500గా ఉన్న స్టైపెండ్ను ఏకంగా రూ.12,000కి పెంచుతూ హోంశాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో శిక్షణలో ఉన్న వేలాది మంది అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ.. న్యాయపరమైన అడ్డంకులు పరిష్కరించకపోవడంతో పరీక్ష ఫలితాలు నిలిచిపోయాయి. దీని కారణంగా ఎంపికైన అభ్యర్థులు సంవత్సరాల పాటు నిరీక్షణలోనే ఉండాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, పెండింగ్లో ఉన్న న్యాయ సమస్యలను పరిష్కరించి ఎట్టకేలకు ఫలితాలను విడుదల చేసింది. ఫలితంగా ఎంపికైన 5,751 మంది కొత్త పోలీస్ కానిస్టేబుళ్లు డిసెంబర్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీటీసీలు (District Training Centres), పీటీసీలు (Police Training Centres), బీటీసీలు (Basic Training Centres)లో శిక్షణకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ట్రైనీ కానిస్టేబుళ్లకు అందిస్తున్న స్టైపెండ్ తక్కువగా ఉందన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు అక్కడికక్కడే స్టైపెండ్ను నెలకు రూ.12,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా హోంశాఖ మరుసటి రోజే ఉత్తర్వులు జారీ చేయడం విశేషంగా నిలిచింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని 21 శిక్షణ కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని పోలీస్ ట్రైనింగ్ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అన్ని శిక్షణ కేంద్రాల్లో ఆధునిక స్క్రీన్లు ఏర్పాటు చేసి, నిపుణుల సహకారంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతి ట్రైనీకి సైకోమెట్రిక్ అసెస్మెంట్ నిర్వహించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా శిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ చర్యలతో పోలీస్ శాఖకు నాణ్యమైన, క్రమశిక్షణ గల సిబ్బందిని అందించాలనే కూటమి ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.