Back
KASARLA RAMESH
Mancherial504251blurImage

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు

KASARLA RAMESHKASARLA RAMESHSep 17, 2024 11:30:32
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతంగ సాయిధ పోరాట వారోత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, అంకుశం గ్రామంలో సీనియర్ నాయకులు మూల శంకర్ గౌడ్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం రాచరిక పాలనకు, కరుడు గట్టిన భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వాస్తవ చరిత్రను చీకటి పొరల్లోకి నెట్టాలనుకుంటున్న బీజేపీ ఆటలు సాగనీయమన్నారు.
1
Report
Mancherial504251blurImage

సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బీజేపీ

KASARLA RAMESHKASARLA RAMESHSep 16, 2024 04:05:06
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
0
Report
MancherialMancherialblurImage

రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి

KASARLA RAMESHKASARLA RAMESHSep 14, 2024 18:05:44
Kannal Rural, Telangana:
సెప్టెంబర్ 11 తేది నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్-2 ఇంక్లైన్ రడగంబాల బస్తిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని పట్టణ కార్యదర్శి రాజమౌళి ఆవిష్కరించారు. సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.
0
Report
MancherialMancherialblurImage

బెల్లంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

KASARLA RAMESHKASARLA RAMESHSep 14, 2024 18:05:14
Kannal Rural, Telangana:
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.
0
Report
Mancherial504251blurImage

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

KASARLA RAMESHKASARLA RAMESHSep 13, 2024 07:18:03
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను గురువారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా సజ్న షఫీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కే.సదానందం, ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే, ఎస్ కే.సుభాన్ పాష ,కోశాధికారిగా కే.నవీన్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ అందరం సమిష్టిగా కలిసి మెలసి పనిచేసి ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
0
Report
Mancherial504251blurImage

గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహానుబావుడు బాలగంగాధర్ తిలక్

KASARLA RAMESHKASARLA RAMESHSep 12, 2024 06:36:58
Bellampalle, Telangana:
1893లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగ ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహాను బావుడు బాలగంగాధర్ తిలక్ అని ఎస్సీ మోర్చ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో గుర్తించాలన్నారు.
2
Report
Mancherial504251blurImage

గోదావరి వాటర్ స్కీం పాయింట్ సందర్శించిన ఎమ్మెల్యే వినోద్

KASARLA RAMESHKASARLA RAMESHSep 09, 2024 05:11:50
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి గోదావరి వాటర్ స్కీం పాయింట్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు నీరు సరఫరా చేయనున్న విధివిధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడా ప్రాజెక్టు నుంచి కాకుండా గోదావరి నీటిని అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ రూపొందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
1
Report
Mancherial504251blurImage

నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా-ఎమ్మెల్యే వినోద్

KASARLA RAMESHKASARLA RAMESHSep 07, 2024 15:47:57
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సోనియాగాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
0
Report
Mancherial504251blurImage

సేవాజ్యోతి శరణాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

KASARLA RAMESHKASARLA RAMESHSep 07, 2024 15:44:35
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల సేవాజ్యోతి శరణాలయంలో బాలగణేశ్ మండలి శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలగణేశ్ మట్టి ప్రతిమను మండపంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి భజనలు కీర్తనలు పాడారు. రానున్న తరాలకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని శరణాలయం నిర్వాహకురాలు శ్రీదేవి పేర్కొన్నారు.
0
Report
Mancherial504251blurImage

బెల్లంపల్లిలో సంతరించుకున్న వినాయక చవితి శోభ

KASARLA RAMESHKASARLA RAMESHSep 07, 2024 05:56:20
Bellampalle, Kannal Rural, Telangana:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుకాణాలు కొనుగోరుదారులతో కిటకిటలాడుతున్నాయి. చవితి పూజ సామాగ్రి కేంద్రాలు ప్రధాన రహదారుల పక్కన ఏర్పాటు చేయడంతో రహదారులు రద్దీగా మారాయి. వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య ప్రతిమలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వినాయక విగ్రహాల కొనుగోలు జోరుగా సాగుతోంది. పూజ సామాగ్రి కోసం మండలాల నుండి పట్టణానికి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు.

1
Report
Mancherial504251blurImage

జనహిత ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

KASARLA RAMESHKASARLA RAMESHSep 07, 2024 04:23:59
Bellampalle, Kannal Rural, Telangana:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, వన్ టౌన్ సీఐ దేవయ్యలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణకై మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.
1
Report
Mancherial504251blurImage

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు

KASARLA RAMESHKASARLA RAMESHSep 06, 2024 09:43:35
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డ్ లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ అన్నారు. బెల్లంపల్లిలో అయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి అక్కడిక్కడే మందులు అందజేస్తున్నామని, అవసరమైతే పీహెచ్సీకి రిఫర్ చేస్తున్నామన్నారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.
1
Report
Mancherial504251blurImage

ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలి

KASARLA RAMESHKASARLA RAMESHSep 06, 2024 09:40:45
Bellampalle, Telangana:
ప్రశాంత వాతావరణంలో ప్రజలందరు వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతు పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 34 వార్డ్ లలోని వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
1
Report
Mancherial504251blurImage

యూపీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు

KASARLA RAMESHKASARLA RAMESHSep 04, 2024 15:56:42
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో యూపీహెచ్సీ షంషీర్ నగర్ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే టీం పర్యవేక్షణలో బుధవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు మందులు అందజేశారు. అత్యవసరమైన కేసులను సీహెచ్ సీ కి సూచిస్తున్నారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటామని అన్నారు.
1
Report
Mancherial504251blurImage

అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించిన రెవెన్యూ అధికారులు

KASARLA RAMESHKASARLA RAMESHSep 03, 2024 09:44:33
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు సర్వే నంబర్ 112లో బీఆర్ఎస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను మంగళవారం మధ్యాహ్నం 1:30 సమయంలో బెల్లంపల్లి తహసిల్దార్ జ్యోత్స్న ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఆదిలక్ష్మి ,మురళీధర్ లు బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
0
Report
Mancherial504251blurImage

పట్టణంలోని 11వ వార్డ్ లో వైద్య శిబిరం ఏర్పాటు.

KASARLA RAMESHKASARLA RAMESHSep 03, 2024 09:40:52
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11వ వార్డ్ లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మంగళవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ప్రతిఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సౌజన్య, అలేఖ్య , శిరీష,సీడీపీఓ స్వరూప అంగన్వాడీ సూపర్వైజర్ ,ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
0
Report
Mancherial504251blurImage

ఉప్పొంగి ప్రవహిస్తున్న రాంనగర్ బ్రిడ్జి, ఇబ్బందుల్లో 33వ వార్డ్ ప్రజలు

KASARLA RAMESHKASARLA RAMESHSep 02, 2024 09:56:34
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు హనుమాన్ బస్తీ-అశోక్ నగర్ మధ్య గల రాంనగర్ బ్రిడ్జి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాంనగర్ నుండి రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి ఉప్పొంగి ప్రవహించడంతో 33వ వార్డ్ లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నామని వార్డ్ ప్రజలు వాపోయారు. వరద నీటితో పాటు తేల్లు, పాములు వంటి విషపురుగులు వస్తుండడంతో పిల్లలు మహిళలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా నూతన బ్రిడ్జి నిర్మించాలని కోరారు
1
Report
Mancherial504251blurImage

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు, భయందోళనలో భక్తులు

KASARLA RAMESHKASARLA RAMESHAug 31, 2024 17:35:45
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆలయంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి నిత్యం మంటలు వస్తున్నాయని, అనేక సార్లు విద్యుత్ అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లిన పట్టించికోవడం లేదన్నారు. అధికారులు స్పందించి ఆలయం లోపలి నుండి ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని డిమాండ్ చేశారు.
1
Report
Mancherial504251blurImage

పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి ఎదుట నిరసన

KASARLA RAMESHKASARLA RAMESHAug 31, 2024 17:34:21
Bellampalle, Kannal Rural, Telangana:
గత 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంటాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. అధికారులకు, నాయకులకుు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ డీసీహెచ్ వైద్యులు డాక్టర్ కోటేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని 15 రోజుల క్రితం కాంట్రాక్టర్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
1
Report
Mancherial504251blurImage

ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని భారీ ర్యాలీ

KASARLA RAMESHKASARLA RAMESHAug 31, 2024 05:56:26
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇసుక కొరత వల్ల తమకు ఉపాధి కరువైందని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భవన నిర్మాణాలకు ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంట చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
0
Report
Mancherial504251blurImage

ఇసుక సరఫరా లేక ఖాళీగా ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు

KASARLA RAMESHKASARLA RAMESHAug 29, 2024 08:47:08
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఇసుక లభించక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ స్లాట్ బుక్ చేసి ప్రభుత్వపరంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించినప్పటికి ఇసుక సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీంతో కార్మికులు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అధికారులు వెంటనే ఇసుక అందించే ఏర్పాటు చేయాలన్నారు.
0
Report
Mancherial504251blurImage

భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి

KASARLA RAMESHKASARLA RAMESHAug 28, 2024 08:20:55
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలను అధికారులు అరికట్టాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు, ఆక్రమణదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్మకాలు చేసి నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి కబ్జాలు,అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని లేనిపక్షంలో ఎన్సిపి తరఫున కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
3
Report
Mancherial504251blurImage

ముంపు బాధితులను ఆడుకోవాలని కాంట్రాక్టర్ కు ఆదేశం

KASARLA RAMESHKASARLA RAMESHAug 27, 2024 12:42:55
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో రెండు రోజుల క్రితం వరద నీటిలో ఇళ్లు మునిగిపోయిన బాధితులను ఆదుకోవాలని మునిసిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాస రావు సంబంధిత రైల్వే కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వరద నీరు వచ్చి ఇళ్లు నీళ్లల్లో మునిగిపోయాయ్నారు. బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు.
0
Report
Mancherial504251blurImage

శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్

KASARLA RAMESHKASARLA RAMESHAug 27, 2024 03:00:56
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో పోలీసులు కార్డెన్‌ అండ్ సెర్చ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పాల్గొన్నారు. బస్తీలోని ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో 42మోటార్‌సైకిళ్లు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్భహిస్తున్నామని తెలిపారు. బస్తీలో ఎవరైన అనుమానస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని, బస్తీలో సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
0
Report
Mancherial504251blurImage

లోటస్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

KASARLA RAMESHKASARLA RAMESHAug 26, 2024 06:07:48
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపిక, శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు పాల ఉట్టిని కొట్టి వేడుకలు జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు, నేటి యువతకు పండుగలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయని అన్నారు.
0
Report
Mancherial504251blurImage

రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇండ్లలోకి వర్షం నీరు

KASARLA RAMESHKASARLA RAMESHAug 25, 2024 13:18:06
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11,12 వార్డ్ ల లో రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రహరీ కూల్చడం వల్లే రైల్వే క్వార్టర్స్ ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నష్ట పోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా అన్నారు. ఆదివారం బాధితుల ఇండ్లను పరిశీలించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో వర్షపు నీటిని తొలగించారు. రైల్వే కాంట్రాక్టర్ వల్లే వర్షం నీరు ఇండ్లలోకి వచ్చిందని, కాంట్రాక్టర్ బాధ్యత వహించి బాధితులకు నష్టపరిహారం అందించాలని అన్నారు.
0
Report