504251
బుగ్గ దేవాలయ పూజారిని సస్పెండ్ చేయడం అన్యాయం
Bellampalle, Telangana:బెల్లంపల్లి శివారు కన్నాల బుగ్గ దేవాలయ పూజారి వేణుగోపాల శర్మను ఎండోమెంట్ అధికారులు సస్పెండ్ చేయడంపై కౌన్సిలర్ తిరుమల వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సౌకర్యాలు లేకపోయినా నిబద్ధతతో పనిచేస్తున్న పూజారిని, అనారోగ్యం వల్ల ఒక్కరోజు ఆలస్యంగా వస్తే తొలగించడం సరికాదన్నారు. ఆలయ ఈఓ తక్షణమే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, ఆయనను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.0
0
Report
504251
రైతుల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే-కోడి రమేష్
Bellampalle, Telangana:వడ్ల కేంద్రాల వద్ద రైతులు భగభగ మండే ఎండల్లో పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం తొందరగా కొనాలని తిరుగుతుంటే ఇంతవరకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఒక్క వడ్ల కేంద్రాన్ని కూడా తనిఖీ చేసిన సందర్భాలు లేవని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ శనివారం ప్రకటనలో ఆరోపించారు. ఇంతవరకు ఎమ్మెల్యే రైతులతో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.ఎమ్మెల్యే వస్తున్నారంటే సుమారుగా నాలుగు ఐదు చోట్ల మామిడి తోటలు శుభ్రం చేసి మేకలతో దావతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల కోసం వస్తున్నాడా లేక దావత్ ల కోసం వస్తున్నాడా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పమన్నారు.0
0
Report
504251
సోషల్ మీడియాలో అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డు సోషల్ మీడియా గ్రూపులో తను చేసిన మెసేజ్ ను ట్యాగ్ చేసి ఆసభ్యకరంగా స్టిక్కర్లు పెట్టి తనను అవమానించారని వార్డుకు చెందిన ఓ మహిళ ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ వార్డు కౌన్సిలర్ చిప్ప అర్చన, భర్త న్యాయవాది అయిన మనోహర్ కు సంబంధించి తాను వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన వాయిస్ మెసేజ్ కి వార్డ్ కి చెందిన మోహన్ అనే వ్యక్తి తనను అవమానించేలా వార్డు ప్రజల ముందు తన పరువు పోయేలా స్టిక్కర్ పెట్టడం జరిగిందని, ఈ విషయాన్ని వాట్స్అప్ గ్రూప్ అడ్మిన్ లకు తెలియజేసి మోహన్ అనే వ్యక్తి పెట్టిన మెసేజ్ తనకు అభ్యంతరకరంగా ఉందని, వెంటనే ఆ మెసేజ్ తొలగించి తనకు క్షమాపణ చెప్పించాలని కోరినట్లు తెలిపారు. కాగా వారు తనను గ్రూపు నుంచి రిమూవ్ చేసి తనను అవమానించిన వారిని మాత్రం గ్రూపులో కంటిన్యూ చేశారన్నారు. ఇట్టి విషయాన్ని న్యాయవాది చిప్ప మనోహర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తాను వార్డుకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకున్నానని, ఇలాంటి విషయాలు పట్టించుకోనని అన్నారని తెలిపారు. ఇదే విషయమై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఈ విషయంలో కేసు నమోదు చేయడం కుదరదని సిఐ తెలిపారని అన్నారు. దీంతో తాము జిల్లా డిసిపిని కలవగా కేసు నమోదు చేస్తారని, వెళ్లి మళ్లీ సిఐని కలవాలని ఆయన సూచన మేరకు వెళ్లి కలిసినప్పటికీ వారిని పిలిపిస్తా మీరు వెళ్ళండి అని చెప్పి మూడు రోజులు గడిచిన తమకు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. వాట్సాప్ గ్రూప్ లో తన వాయిస్ మెసేజ్ ను ట్యాగ్ చేస్తూ మోహన్ అనే వ్యక్తి చేసిన మెసేజ్ తో తాను తీవ్రంగా మానసిక క్షోభకు గురి అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి తనను వాట్సాప్ గ్రూప్ లో అవమానించిన వ్యక్తి, ఆయనకు సహకరించిన వ్యక్తులు, గ్రూప్ అడ్మిన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదరు మహిళా డిమాండ్ చేశారు.0
0
Report
Advertisement
504251
కామ్రేడ్ డాక్టర్ రాజు మృతదేహనికి నివాళులు అర్పించిన సీపీఐ నాయకులు
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల గ్రామా నివాసి మాజీ కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ డాక్టర్ రాజు రాత్రి గుండెపోటుతో మరణించగా బెల్లంపల్లి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ వారి ఇంటికి వెళ్లి అయన పార్తివ దేహానికి పార్టీ జెండా కప్పి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సీపీఐ నాయకుడిగా అనేక ప్రజా పోరాటాలలో రాజు పాల్గొన్నారన్నారు. డాక్టర్ గా, పంచాయతీ కార్యదర్శిగా అయన చేసిన సేవలను కొనియాడారు. మాల గురజాల సిపిఐ శాఖ కార్యదర్శి గుమాస గంగారం,మెరుగు పోచం, జూపాక సురేందర్, మాజీ సర్పంచ్ దూగుట తిరుపతి, కలాలి భూమేశ్వర్, అనుదీప్ భోగి కుమార్ తదితరులు పాల్గొన్నారు0
0
Report
504251
ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం ఘనంగా నిర్వ హించారు. విశ్వశాంతి, లోక కల్యాణార్దం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, స్వర్ణకార సంఘ కార్పెంటర్ సంఘ, మనుమయ సంఘం సభ్యులు పాల్గొన్నారు0
0
Report
