Back
KASARLA RAMESH
Mancherial504251

భూ కబ్జాలు చేస్తూ పేదలను ఇబ్బంది పెడుతున్న మాజీ జడ్పీటీసీ

KRKASARLA RAMESHJun 24, 2025 14:14:50
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారు సర్వేనెంబర్ 64 లో తమ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో మాజీ జడ్పీటీసీ కారుకూరి రామచందర్ అతని అనుచరులు తమపై కక్షగట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పనాస గణేష్ ఆరోపించారు. మంగళవారం మాట్లాడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే తానే ఎమ్మెల్యే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. ఎమ్మెల్యే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రామచందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
0
Report
Mancherial504251

గుండా మల్లేష్ పేరు మార్కెట్ కు పెట్టుకుంటే ఆమరణ నిరాహార దీక్ష

KRKASARLA RAMESHOct 29, 2024 08:32:54
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నూతన కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మల్లేష్ పేరు పెట్టని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, కార్యాలయాల ముట్టడి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.
0
Report
Mancherial504251

బెల్లంపల్లి సివిల్ జడ్జి గృహాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జి

KRKASARLA RAMESHOct 26, 2024 16:11:06
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన బెల్లంపల్లి సివిల్ జడ్జి గృహాన్ని శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇ.వి వేణుగోపాల్ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. గుస్సాడీ నృత్యాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన కోర్టు ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జడ్జి నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు.
1
Report
Mancherial504251

వాల్టా చట్టం ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి

KRKASARLA RAMESHOct 26, 2024 16:09:52
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి శివారు పరిధిలో ఒక ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సిద్ధంగా ప్రవహిస్తున్న వాగుపై కాంక్రీట్ సహాయంతో పర్మినెంట్ వంతెన నిర్మించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారుల అనుమతి లేకుండా వాల్టా చట్టం ఉల్లంఘించి వంతెన నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు.
0
Report
Advertisement
Mancherial504251

అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో రాస్తారోకో

KRKASARLA RAMESHOct 25, 2024 09:21:01
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని, లేబర్ సైట్ ను వెంటనే పునరుద్ధరించాలని శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత 2 నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్లైన్ సైట్ పనిచేయక పోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చాలా మంది కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు.
0
Report
Mancherial504251

కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే మల్లేష్ పేరు పెట్టాలి

KRKASARLA RAMESHOct 25, 2024 07:11:35
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల సముదాయానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నామకరణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి నాయకులు మెమోరాండం అందజేశారు. బెల్లంపల్లి అభివృద్ధి కొరకు తన జీవితాంతం కృషిచేసిన గుండ మల్లేష్ పేరు పెట్టడమే సరైన నిర్ణయం అన్నారు. అప్పుడే పట్టణ ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు.
0
Report
Hanumakonda506002

మురికివాడలో కౌన్సిలర్ కబ్జా: వితంతువు చేసిన సంచలన ఆరోపణ!

KRKASARLA RAMESHOct 16, 2024 13:23:46
Warangal, Telangana:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి స్థానిక మురికివాడలో తన ఇంటి ముందున్న భూమిని స్థానిక కౌన్సిలర్, ఆయన భార్య కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ వితంతువు ఆరోపించింది. 30 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండేదన్నారు. పట్టాదారు సర్టిఫికెట్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇంటి పన్ను, ఇంటి ప్లాట్‌కు సంబంధించి తహసీల్దార్‌ ఇచ్చిన విద్యుత్‌ బిల్లు రశీదు తన వద్ద ఉన్నాయని తెలిపారు.

1
Report
Mancherial504251

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ 4వ వర్ధంతి సందర్బంగా నివాళులు

KRKASARLA RAMESHOct 14, 2024 06:44:33
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక సీపీఐ పట్టణ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదలకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి గుండా మల్లేష్ అన్నారు.
0
Report
Mancherial504251

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

KRKASARLA RAMESHOct 11, 2024 13:21:48
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగానిర్వహించారు. బతుకమ్మ సంబరాలలో ఎమ్మెల్యే వినోద్ దంపతులు పాల్గొన్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను చిన్నారి వైష్ణవి తో కలిసి బతుకమ్మ ఆడేందుకు ఎమ్మెల్యే దంపతులు బయలుదేరారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మహిళ కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే సతీమణి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
0
Report
Mancherial504251

ప్రభుత్వ భూమిలో రియల్ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలి-కోడి రమేష్

KRKASARLA RAMESHOct 09, 2024 09:58:01
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారులోని సర్వే నంబరు 3పైన అసైన్డ్ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహసీల్దార్ జ్యోష్నకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో నిర్మాణం చేసిన ఇండ్లను తక్షణమే తొలగించి దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
0
Report
Mancherial504251

శ్రీనాథ్ మహర్షి జ్ఞాపకార్ధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

KRKASARLA RAMESHOct 09, 2024 06:20:06
Bellampalle, Telangana:

మంచిర్యాల జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కూలీలు,బాటసారులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం కుమారుడు శ్రీనాథ్ మహర్షి జయంతి సందర్భంగా అయన జ్ఞాపకార్ధం అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోజువారి కూలీలు బాటసారులు, నిరుపేదలు సుమారు 200 మంది పాల్గొని అల్పాహారం స్వీకరించారు.

0
Report
Mancherial504251

బోగస్ స్వచ్చంద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

KRKASARLA RAMESHOct 08, 2024 10:47:25
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాలనే బురిడీ కొట్టిస్తూ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నకిలీ నియామక పత్రాలు అందిస్తున్న బోగస్ స్వచ్చంద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
0
Report
Mancherial504251

పెరిగిన ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

KRKASARLA RAMESHOct 05, 2024 12:32:00
Bellampalle, Kannal Rural, Telangana:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కాంట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. డీజిల్, వంటనూనె, పప్పు దినుసుల ధరలు గణనీయంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు।

0
Report
Mancherial504251

అంగన్వాడి సెంటర్ టీచర్ ను సస్పెండ్ చేయాలి

KRKASARLA RAMESHOct 03, 2024 10:37:00
Bellampalle, Kannal Rural, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బూడిదిగడ్డ బస్తీ అంగన్వాడి సెంటర్ టీచర్ సెంటర్ తెరవకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నందున ఆమెను సస్పెండ్ చేయాలని ఎంసీపీఐ యూ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలన్నారు.
0
Report
Mancherial504251

దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు

KRKASARLA RAMESHOct 02, 2024 05:00:03
Bellampalle, Kannal Rural, Telangana:
దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు మరోసారి ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గోమాస రాజం అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. 3నెలల క్రితం దళిత సంఘాల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దరసంగాలు అధ్యక్షుడు చిలక రాజనర్సును సంఘం ఐక్యత కోసం భవనిర్మానం కోసం అభివృద్ధి పని కోసం పని చేయాలని కోరారు.
0
Report
Mancherial504251

కూరగాయల మార్కెట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

KRKASARLA RAMESHSept 28, 2024 11:23:20
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని మాదిగ హక్కుల దండోరా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మెన్ జక్కుల శ్వేత కమిషనర్ శ్రీనివాస్ రావు లకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు చిలుక రాజనర్సు మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా అంబేద్కర్ విగ్రహ పరిసరాలలో కూరగాయల వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారని కాబట్టి నూతన మార్కెట్ కు అంబేద్కర్ నామకరణం చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
0
Report
Mancherial504251

లడ్డూ అపవిత్రం: హిందూ సంఘాలు తిరుమలలో హోమం నిర్వహించాయి!

KRKASARLA RAMESHSept 28, 2024 08:16:10
Bellampalle, Telangana:
కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కారణంగా బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ బస్తీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హోమం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ హిందువుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా లడ్డూను అపవిత్రం చేసి సనాతన ధర్మంపై కుట్ర చేస్తున్నారన్నారు. హిందూ ధర్మం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.
0
Report
Mancherial504251

మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలి

KRKASARLA RAMESHSept 23, 2024 10:39:54
Bellampalle, Telangana:
జైనూర్ మండలానికి చెందిన ఆదివాసి మహిళపై అత్యాచారానికి పాల్పడిన మగ్ధూమ్ అనే నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా తుడుము దెబ్బ ఆధ్వర్యంలో నిందితుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు నాయకులు మెమోరండం అందజేశారు.
0
Report
Mancherial504251

సంజీవని హనుమాన్ ఆలయ భూముల సర్వే

KRKASARLA RAMESHSept 23, 2024 10:39:27
Bellampalle, Telangana:
బెల్లంపల్లి పట్టణంలోని సంజీవని హనుమాన్ ఆలయానికి సంబంధించిన దేవాలయ భూములు కబ్జా కావడంతో భూ సర్వే నిర్వహణను జిల్లా సర్వే డిపార్ట్మెంట్ ఏడీ. శ్రీనివాస్ తో శనివారం చేపట్టారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం జరిగిన విషయంపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దేవాదాయ శాఖ భూమిని తిరిగి స్వాధీన పరచుకునేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు.
0
Report
Mancherial504251

పట్టణంలో కలకలం రేపిన చోరి యత్నం

KRKASARLA RAMESHSept 19, 2024 10:36:10
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తి 33 వార్డులో అనాధ శరణాలయమునకు పాత దుస్తులు దానం చేయాలంటూ ఆటోలో బస్తీలో తిరుగుతున్న మహిళతో పాటు యువకుడిని బస్తీ ప్రజలు పోలీసులకు పట్టించారు. బస్తీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం పాత దుస్తుల కోసం వచ్చిన యువకుడు బస్తీలో ఒంటరిగా ఉన్న మహిళతో దురుసుగా మాట్లాడి మహిళ వద్ద ఉన్న బంగారం దొంగతనం చేయడానికి ప్రయత్నించగా మహిళ కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకుని యువకుడిని బందించి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
0
Report
Mancherial504251

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు

KRKASARLA RAMESHSept 17, 2024 11:30:32
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతంగ సాయిధ పోరాట వారోత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, అంకుశం గ్రామంలో సీనియర్ నాయకులు మూల శంకర్ గౌడ్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం రాచరిక పాలనకు, కరుడు గట్టిన భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వాస్తవ చరిత్రను చీకటి పొరల్లోకి నెట్టాలనుకుంటున్న బీజేపీ ఆటలు సాగనీయమన్నారు.
2
Report
Mancherial504251

సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బీజేపీ

KRKASARLA RAMESHSept 16, 2024 04:05:06
Bellampalle, Kannal Rural, Telangana:
తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
0
Report
MancherialMancherial

రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి

KRKASARLA RAMESHSept 14, 2024 18:05:44
Kannal Rural, Telangana:
సెప్టెంబర్ 11 తేది నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్-2 ఇంక్లైన్ రడగంబాల బస్తిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని పట్టణ కార్యదర్శి రాజమౌళి ఆవిష్కరించారు. సాయుధ పోరాట యోధుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పార్టీ శ్రేణులు పునరంకితం కావాలని విజ్ఞప్తి చేశారు.
0
Report
MancherialMancherial

బెల్లంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

KRKASARLA RAMESHSept 14, 2024 18:05:14
Kannal Rural, Telangana:
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వం నమోదు చేయించాలని నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు.
0
Report
Mancherial504251

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

KRKASARLA RAMESHSept 13, 2024 07:18:03
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం టేకులబస్తీలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను గురువారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడిగా సజ్న షఫీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కే.సదానందం, ప్రధాన కార్యదర్శులుగా మనోజ్ కుమార్ పాండే, ఎస్ కే.సుభాన్ పాష ,కోశాధికారిగా కే.నవీన్ ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ అందరం సమిష్టిగా కలిసి మెలసి పనిచేసి ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
0
Report
Mancherial504251

గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహానుబావుడు బాలగంగాధర్ తిలక్

KRKASARLA RAMESHSept 12, 2024 06:36:58
Bellampalle, Telangana:
1893లో స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగ ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహాను బావుడు బాలగంగాధర్ తిలక్ అని ఎస్సీ మోర్చ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. బెల్లంపల్లిలో మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో గుర్తించాలన్నారు.
2
Report