PINEWZ
icon-pinewzicon-zee
PINEWZ
201301
Noida, Gautam Budh Nagar, Uttar Pradesh
Log In
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
KASARLA RAMESH
Mancherial504251

కాల్ టెక్స్ లో భారీ వర్షానికి కూలిన ఇంటి గోడ

KASARLA RAMESHKASARLA RAMESHAug 09, 2025 13:43:48
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో బోద్దున శంకర్ కు చెందిన ఇంటి గోడ శనివారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఎటువంటి నిలువ నీడ లేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు నిస్సహాయ స్థితిలో వాపోయారు. వెంటనే మాజీ కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ తహసీల్దార్ కి సమాచారం అందించారు. సోమవారం RI ని పంపి పంచనామా చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.
15
Report
Mancherial504251

అక్రమంగా చేసుకున్న పట్టా రద్దు చేయాలి

KASARLA RAMESHKASARLA RAMESHAug 08, 2025 11:59:38
Bellampalle, Telangana:
బెల్లంపల్లి మండలం మాల గురిజాల గ్రామంలో 3 గుంటల భూమికి బదులు 13 గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న గ్రామానికి చెందిన కామెర నారాయణపై అధికారులు చర్యలు తీసుకోని, అక్రమ పట్టా రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి తమ భూమిని గుర్తించి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్న గోమాస శ్రీకాంత్ పై స్థానిక నేతకాని నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని నేతకాని మహర్ జిల్లా అధికార ప్రతినిధి తాళ్లపల్లి రాజలింగు మండిపడ్డారు.
15
Report
Mancherial504251

విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శిగా జన్నం సత్యనారాయణ

KASARLA RAMESHKASARLA RAMESHAug 08, 2025 03:15:57
Bellampalle, Telangana:
బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శిగా హనుమాన్ బస్తీకి చెందిన జన్నం సత్యనారాయణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణలు సంఘటితంగా తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు వారి అభివృద్ధికి కృషి చేస్తానని,సంఘం అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉంటుందని తెలిపారు.
15
Report
Mancherial504251

హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

KASARLA RAMESHKASARLA RAMESHAug 03, 2025 14:49:58
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గ హమాలీ సంఘాల సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ. సామ్రాజ్యం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న హమాలీలను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు హమాలీ సభ్యుల సంక్షేమం కోసం హమాలీ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నాయకులు గెల్లి రాజలింగు, హమాలీ సభ్యులు పాల్గొన్నారు.
15
Report
Advertisement
Mancherial504251

ఎమ్మెల్యే సారు.. మా వార్డ్ సమస్యలు పరిష్కరించండి

KASARLA RAMESHKASARLA RAMESHAug 03, 2025 13:58:31
Bellampalle, Telangana:
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, హనుమాన్ బస్తి 33వ వార్డులో నెలకొన్న నీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు పోలు శ్రీనివాస్, బస్తీ ప్రజలు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ నీటీ సమస్యతో వార్డ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం బోర్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా డ్రైనేజీ, రోడ్ లు నిర్మించాలని కోరారు.
15
Report
Advertisement
Back to top