504251
ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం ఘనంగా నిర్వ హించారు. విశ్వశాంతి, లోక కల్యాణార్దం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, స్వర్ణకార సంఘ కార్పెంటర్ సంఘ, మనుమయ సంఘం సభ్యులు పాల్గొన్నారు0
0
Report
504251
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుబాసి వరలక్ష్మి ఇంటింటి ప్రచారం
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుబాసి వరలక్ష్మి-వెంకటస్వామి ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. తమను నమ్మి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆశీస్సులతో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఆరో వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్తమను ఆదరిస్తున్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి కష్టాలలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు0
0
Report
504251
మధుకర్ ఆత్మహత్య నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్యకు కారకులైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడారు. సూసైడ్ నోట్లో వెల్లడించిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. నాయకులు సంతోష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు0
0
Report
Advertisement
504251
రేపు ప్రధమ మండల పూజకు హాజరుకానున్న మంత్రి వివేక్
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న ప్రధమ మండల పూజా కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కోడి రమేష్ ఆదివారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ ప్రథమ మండల పూజకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పూజకు నియోజకవర్గం వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు0
0
Report
504251
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల దృవపత్రాలు అందజేత
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అదేశాల మేరకు 31వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు లెంకల శ్రావణ్ ,లెంకల.శ్రీనివాస్ ,బుకాల రంజిత్ కుమార్, మాజి కౌన్సిలర్ రాజలింగుల అద్వర్యంలో ప్రొసీడింగ్ కాపీలను శనివారం అందజేశారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. ఈ సందర్బంగా లబ్దిదారులు ఎమ్మెల్యేకి దాన్యవాదాలు తెలిపి సంతోషం వ్యక్తం చేసారు.0
0
Report
