icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow10 Apr 2026, 12:01 pm

సోషల్ మీడియాలో అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి

Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డు సోషల్ మీడియా గ్రూపులో తను చేసిన మెసేజ్ ను ట్యాగ్ చేసి ఆసభ్యకరంగా స్టిక్కర్లు పెట్టి తనను అవమానించారని వార్డుకు చెందిన ఓ మహిళ ఆరోపించారు. బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ వార్డు కౌన్సిలర్ చిప్ప అర్చన, భర్త న్యాయవాది అయిన మనోహర్ కు సంబంధించి తాను వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన వాయిస్ మెసేజ్ కి వార్డ్ కి చెందిన మోహన్ అనే వ్యక్తి తనను అవమానించేలా వార్డు ప్రజల ముందు తన పరువు పోయేలా స్టిక్కర్ పెట్టడం జరిగిందని, ఈ విషయాన్ని వాట్స్అప్ గ్రూప్ అడ్మిన్ లకు తెలియజేసి మోహన్ అనే వ్యక్తి పెట్టిన మెసేజ్ తనకు అభ్యంతరకరంగా ఉందని, వెంటనే ఆ మెసేజ్ తొలగించి తనకు క్షమాపణ చెప్పించాలని కోరినట్లు తెలిపారు. కాగా వారు తనను గ్రూపు నుంచి రిమూవ్ చేసి తనను అవమానించిన వారిని మాత్రం గ్రూపులో కంటిన్యూ చేశారన్నారు. ఇట్టి విషయాన్ని న్యాయవాది చిప్ప మనోహర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తాను వార్డుకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకున్నానని, ఇలాంటి విషయాలు పట్టించుకోనని అన్నారని తెలిపారు. ఇదే విషయమై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఈ విషయంలో కేసు నమోదు చేయడం కుదరదని సిఐ తెలిపారని అన్నారు. దీంతో తాము జిల్లా డిసిపిని కలవగా కేసు నమోదు చేస్తారని, వెళ్లి మళ్లీ సిఐని కలవాలని ఆయన సూచన మేరకు వెళ్లి కలిసినప్పటికీ వారిని పిలిపిస్తా మీరు వెళ్ళండి అని చెప్పి మూడు రోజులు గడిచిన తమకు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదన్నారు. వాట్సాప్ గ్రూప్ లో తన వాయిస్ మెసేజ్ ను ట్యాగ్ చేస్తూ మోహన్ అనే వ్యక్తి చేసిన మెసేజ్ తో తాను తీవ్రంగా మానసిక క్షోభకు గురి అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి తనను వాట్సాప్ గ్రూప్ లో అవమానించిన వ్యక్తి, ఆయనకు సహకరించిన వ్యక్తులు, గ్రూప్ అడ్మిన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదరు మహిళా డిమాండ్ చేశారు.
0
0
Report
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow10 Apr 2026, 09:14 am

కామ్రేడ్ డాక్టర్ రాజు మృతదేహనికి నివాళులు అర్పించిన సీపీఐ నాయకులు

Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల గ్రామా నివాసి మాజీ కమ్యూనిస్ట్ నాయకులు కామ్రేడ్ డాక్టర్ రాజు రాత్రి గుండెపోటుతో మరణించగా బెల్లంపల్లి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ వారి ఇంటికి వెళ్లి అయన పార్తివ దేహానికి పార్టీ జెండా కప్పి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సీపీఐ నాయకుడిగా అనేక ప్రజా పోరాటాలలో రాజు పాల్గొన్నారన్నారు. డాక్టర్ గా, పంచాయతీ కార్యదర్శిగా అయన చేసిన సేవలను కొనియాడారు. మాల గురజాల సిపిఐ శాఖ కార్యదర్శి గుమాస గంగారం,మెరుగు పోచం, జూపాక సురేందర్, మాజీ సర్పంచ్ దూగుట తిరుపతి, కలాలి భూమేశ్వర్, అనుదీప్ భోగి కుమార్ తదితరులు పాల్గొన్నారు
0
0
Report
Advertisement
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow8 Feb 2026, 10:03 am

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుబాసి వరలక్ష్మి ఇంటింటి ప్రచారం

Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుబాసి వరలక్ష్మి-వెంకటస్వామి ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. తమను నమ్మి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆశీస్సులతో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఆరో వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్తమను ఆదరిస్తున్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి కష్టాలలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
0
0
Report
Advertisement
Back to top