బోయిన్ పల్లి లోని జయ నగర్ లో ఉన్న సాయిబాబా ఆలయాన్ని గురుపౌర్ణమి సందర్భంగా మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.