- Your PIN
- Trending
- Following
बड़ौत में मशाल जुलूस के साथ छात्रों-समाज की एकजुटता, लाठीचार्ज की निष्पक्ष जांच की मांग
Baghpat, Uttar Pradesh:दिल्ली के जंतर-मंतर पर छात्रों पर हुए कथित लाठीचार्ज के विरोध में बागपत के बड़ौत कस्बे में समाजसेवियों, छात्रों और विभिन्न संगठनों ने मशाल जुलूस निकाला। प्रदर्शनकारियों ने नारेबाजी करते हुए छात्रों पर बल प्रयोग का विरोध किया और दोषियों के खिलाफ कार्रवाई की मांग की। बड़ौत में शाम के समय समाजसेवियों, छात्रों, खाप प्रतिनिधियों और कांग्रेस नेताओं के नेतृत्व में मशाल जुलूस निकाला गया। यह जुलूस नगर के प्रमुख मार्गों और बाजारों से होकर गुजरा। प्रदर्शनकारियों ने हाथों में मशाल लेकर केंद्र सरकार और प्रशासन के खिलाफ नारेबाजी की तथा जंतर-मंतर पर छात्रों के साथ हुई कथित लाठीचार्ज की घटना की निंदा की। प्रदर्शन में शामिल लोगों ने कहा कि लोकतांत्रिक व्यवस्था में शांतिपूर्ण प्रदर्शन करना सभी का अधिकार है और छात्रों की आवाज को लाठी के बल पर दबाना उचित नहीं है। उन्होंने घटना की निष्पक्ष जांच कर दोषी अधिकारियों के खिलाफ कार्रवाई की मांग की। इस दौरान खाप चौधरी, कांग्रेस नेता, स्थानीय समाजसेवी और बड़ी संख्या में छात्र मौजूद रहे。दिल्ली के जंतर मंतर पर CJP का विरोध, 2300 बजे प्रदर्शन
Noida, Uttar Pradesh:ANI DEL JANTAR MANTAR PROT 2300 DELHI: CJP PROTEST AT JANTAR MANTAR / VISUALS FROM JANTAR MANTAR NEAR SBI
ఉద్రిక్తతల వేళ మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు.. అవి ఏమిటంటే?
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign: నీట్ పరీక్ష పేపర్ లీక్పై పోరాటం చేస్తు0న్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్లు జరిగాయని ప్రకటించారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏమిటని ప్రశ్నించారు. భారతదేశంలో విద్యా వ్యవస్థను మోదీ నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.
నీట్ విద్యార్థుల కోసం న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్లో చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులు, లాఠీచార్జ్లపై వీడియోలు చూపించి పోలీసుల దమనకాండను ఖండించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు న్యాయం, జవాబుదారీతనం కోరుతూ తమ గళాన్ని వినిపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మూడు డిమాండ్లు చేశారు.
రాహుల్ మూడు డిమాండ్లు
1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
2. విద్యార్థులపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలి.
3. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
మోదీ ప్రభుత్వం 152 ప్రశ్నపత్రాల లీకులు జరిగాయని.. వాటి వలన 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. అయితే వీటిలో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ చెప్పారు.
We fully support the students' demands. The Opposition, as a whole, 100 percent supports these demands.
: LoP Shri @RahulGandhi pic.twitter.com/c0isuuVnll
— Congress (@INCIndia) July 22, 2026
ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన భారత విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారిందని మోదీ పాలనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. పదేళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్లు జరగ్గా.. నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టేనని పేర్కొన్నారు. లీక్ల ప్రభావంతో 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడిందని.. వారంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారని.. వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారని మోదీ పాలనపై రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. 'కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం భారతదేశ విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది?' అని ప్రశ్నించారు. ఒక్క శిక్ష కూడా పడలేదని చెప్పారు. విద్యా వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందనేది ఒక్క విషయమే కాదని.. సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారిందని తెలిపారు.
pic.twitter.com/qzDPYdNdoxThe Congress Party, the entire Opposition, and LoP Shri Rahul Gandhi stand firmly with the students and their demands.
— Congress (@INCIndia) July 22, 2026
