- Your PIN
- Trending
- Following
ये वायरल शो है क्या? जानिए क्या बना रहा है ट्रेंड
Noida, Uttar Pradesh:ये वायरल शो के लिये है
Sonia Gandhi Vande Mataram: వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు!
Delhi, Delhi:Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జాతీయ గేయాన్ని పూర్తిగా పాడకుండా అడ్డుకోవాలని సోనియా సూచించారని, కాంగ్రెస్కు జాతీయ చిహ్నాలపై కనీస గౌరవం లేదని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపాటు
రాజస్థాన్లోని చిత్తౌర్గఢ్ సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే జాతీయ గేయాన్ని ఆపేయాలని పార్టీ అధ్యక్షుడికి సోనియా గాంధీ చెప్పడం వారి సిగ్గుమాలిన చర్యలకు, దురహంకారానికి అద్దం పడుతోందని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ వివరణ
మరోవైపు బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు పూర్తిగా ఖండించాయి. వందేమాతరం గీతాన్ని ఆపేయాలని సోనియా గాంధీ ఎలాంటి సైగలు చేయలేదని స్పష్టం చేశాయి. వేదికపై ఎక్కువసేపు నిలబడలేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూర్చోవడానికి వెంటనే ఒక కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సోనియా కోరారని కాంగ్రెస్ నాయకులు వివరణ ఇచ్చారు.
Also Read; శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..
ALso Read: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
