కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
Khammam, Telangana:కల్లూరు మండలం నారాయణపురం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించారు. ఈక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తేగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామినిచ్చారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకుని పూజలు చేసారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఉన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
NEET Re-Exam Paper: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?
Hyderabad, Telangana:NEET Re-Exam Paper 2026: దేశవ్యాప్తంగా సర్వత్రాత్మక ఆసక్తి రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం అనగా జూన్ 21 నాడు అత్యంత కఠిన భద్రత ఏర్పాట్లు నడుమ ప్రశాంతంగా ముగిసింది. మే నెలలో జరిగిన తొలి పరీక్షతో పోలిస్తే, ఈ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం విద్యార్థులకు చుక్కలు చూపించిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో కఠినంగా రావడంతో ఈసారి నీటి కట్-ఆఫ్ మార్కులు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత 37 రోజుల్లో రీ-ఎగ్జామ్..
దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి మొత్తం 5,440 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహించింది. దాదాపు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష కోసం అధికారులు మునుపేన్నడు లేని విధంగా 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా 95 వేల పరీక్ష గదులను నిశితంగా ప్రవేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రధాన కార్యాలయం నుంచి స్వయంగా పరీక్షలను సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో కేవలం 37 రోజుల్లోనే రెండోసారి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ టఫ్..
మే 3న జరిగిన మొదటి పరీక్షతో పోలిస్తే ఈసారి రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) సబ్జెక్టు అత్యంత కఠినంగా రావడమే కాకుండా, ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఒక నాలుగు-ఐదు ప్రశ్నలు విద్యార్థులకు తీవ్ర గందరగోళాన్ని గురిచేసేలా వచ్చాయని అంటున్నారు.
కెమిస్ట్రీ సబ్జెక్ట్లో న్యూమరికల్స్ మెమొరీ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారట. ఇవి కూడా లెక్కల కట్టడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో స్కోరింగ్ తగ్గే అవకాశం ఉంది.
బయాలజీ.. బోటనీ, జువాలజీ ప్రశ్నలు పూర్తిగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి రావడంతో విద్యార్థులకు పెద్ద ఊరటం ఇచ్చింది. ఇందులో మంచి స్కూలు సాధించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
భారీగా తగ్గనున్న కటాఫ్ మార్కులు
ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న నేపథ్యంలో ఈసారి టాప్ స్కోర్ 700 నుంచి 710 మార్కుల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అది ఓపెన్ క్యాటగిరి కట్ ఆఫ్ మార్కులు 487 ఉండగా.. ఈసారి కటాఫ్ మార్కులు భారీగా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. పేపర్ కఠినత్వాన్ని బట్టి చూస్తే యావరేజ్ మార్కులు సాధించిన విద్యార్థులకు సైతం మెడికల్ సీటు దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
Also Read: రీ-నీట్ పరీక్షలోనూ ఆగని అక్రమాలు.. బిహార్ నకిలీ గ్యాంగ్ గుట్టురట్టు, 24మంది అరెస్ట్
Also REad: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్మాల్!
Vijayawada, Andhra Pradesh:Kanaka Durga Temple Ticket Fraud: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో టికెట్లు బూటకపు వ్యవహారం కలకలం రేపుతుంది. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్న కొంతమంది ఆలయ సిబ్బంది బాగోతం వారం వ్యవధిలోని రెండుసార్లు వెలుగు చూడటం తీవ్ర సంచలనంగా మారింది. ఆలయ ఈవో కార్యనిర్వాహణ అధికారి ఇచ్చిన ఫిర్యాదులతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు రెండు వేరువేరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి.
నకిలీ 500 రూపాయల దందా..
కొద్దిరోజులు కలిస్తే ఆలయంలో నకిలీ 500 రూపాయల దర్శన టికెట్లు వ్యవహారం తీవ్ర దుమారం లేపింది. భక్తుల నకిలీ టికెట్లు వంటగట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు వచ్చిన ఆధారాలతో ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ లో ప్రేమే ఉన్నట్లు తేలడంతో, హోంగార్డు చంద్రశేఖర్ను నగర పోలీస్ కమిషనర్ (సీపీ) రాజశేఖర్ బాబు తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు ఉద్యోగులపై వేటు..
ఈ నకిలీ టికెట్ల వ్యవహారం మరువకముందే, నిన్న ఆలయంలో మరొక టికెట్లు అక్రమం విక్రయం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ తాజా ఘటనకు తీవ్రంగా పరిగణించిన ఆలయ ఈవో.. విచారణ జరిపి అక్రమాలను పాల్పడినట్లు తేలిన ఇద్దరు ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రంలో, భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలు, టికెట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న అంతర్గత ముఠాలపై ఆలయ అధికారులు, పోలీస్ నిగా తీవ్రం చేశారు. ఈ లీలలు వెనుక ఇంకా ఎవరి హస్తము ఉందనే కోణంలో వన్ టౌన్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
Also Read: ఆంధ్రప్రదేశ్కు కూతవేటు దూరంలో మరో బంగారం నిధి..దక్షిణ భారతదేశంలో రెండో బంగారు గని!
Also Read: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET Re-Exam 2026: రీ-నీట్ పరీక్షలోనూ ఆగని అక్రమాలు.. బిహార్లో నకిలీ గ్యాంగ్ గుట్టురట్టు, 24 మంది అరెస్ట్!
Chintamanpur, Bihar:NEET Re-Exam 2026 Bihar Gang: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను చుట్టుముట్టిన వివాదాలు, అక్రమాలు రీ-నీట్ (Re-NEET) లోనూ కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన రీ-నీట్ పరీక్షలోనూ సరికొత్త మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా బిహార్లో భారీ నెట్వర్క్ కలిగిన ఒక 'సాల్వర్ గ్యాంగ్' (నకిలీ అభ్యర్థుల ముఠా) గుట్టును పోలీసులు రట్టు చేశారు.
నమ్మకమైన సమాచారం మేరకు లఖిసరాయ్ జిల్లాలోని మూడు ప్రధాన పరీక్ష కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించడంతో.. ఏడుగురు నకిలీ అభ్యర్థులు సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసలైన అభ్యర్థులకు బదులుగా భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని, పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ నకిలీ అభ్యర్థులను పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు.
బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు
ఈ వ్యవస్థీకృత మోసంలో పరీక్షా కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన బయోమెట్రిక్ సంస్థ సిబ్బంది పాత్ర ఉండటం గమనార్హం. బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కైన 14 మంది వెరిఫికేషన్ ఉద్యోగులను కూడా పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. అభ్యర్థుల వేలిముద్రలు, గుర్తింపు కార్డుల తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు బయటపడకుండా ఈ వెరిఫికేషన్ సిబ్బంది ముఠా సభ్యులకు సహకరించినట్లు విచారణలో తేలింది. సాంకేతిక లోపాలను సాకుగా చూపి, నకిలీ అభ్యర్థులను పరీక్షా హాళ్లలోకి అనుమతించేలా వీరు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు.
సీటు కోసం రూ.40 లక్షల వరకు వసూలు..
ఈ నకిలీ గ్యాంగ్ నీట్ పరీక్షలో అర్హత సాధించి, మెడికల్ సీటు సంపాదించి పెడతామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభను తుంగలో తొక్కుతూ.. కేవలం డబ్బు బలంతో సీట్లు కొల్లగొట్టేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ వేసింది. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు, నకిలీ గుర్తింపు కార్డులు, మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే నీట్ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రీ-నీట్లోనూ ఇలాంటి దారుణాలు బయటపడటం విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.
Also Read: రూ.500 లాటరీ టికెట్తో రూ.3 కోట్ల జాక్పాట్.. ఆ జర్నీతో డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు!
Also Read: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Stampede Case: నేడు కోర్టులో అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్..వెండాతున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు!
Hyderabad, Telangana:Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కేసు నేపథ్యం ఇదే!
డిసెంబర్ 4, 2024న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో 'పుష్ప 2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఒకేసారి పోటెత్తడంతో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి (39) అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తగిన భద్రతా అనుమతులు తీసుకోకపోవడం, పోలీసుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, మేనేజర్లను A1 నుంచి A10 నిందితులుగా పేర్కొనగా.. నటుడు అల్లు అర్జున్ను A11 (11వ నిందితుడు)గా చేర్చారు.
గతంలో (డిసెంబర్ 13, 2024న) ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్, ఆ తర్వాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ పొందారు.
నేటి విచారణపై సస్పెన్స్!
ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి కోర్టు, జూన్ 22న (నేడు) విచారణకు స్వయంగా హాజరుకావాలని అల్లు అర్జున్ సహా మరో 19 మందికి సమన్లు పంపింది. అయితే అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా? లేదా అనేదానిపై రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నేరుగా నాంపల్లి కోర్టుకు రావడం. ఒకవేళ నిందితులంతా హాజరైతే నేటి నుంచి ట్రయల్ (న్యాయ ప్రక్రియ) ప్రారంభమవుతుంది. తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేసి, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం వంటి జరగొచ్చు.
"సోమవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. దీనికి సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని అల్లు అర్జున్ లీగల్ టీమ్ పేర్కొంది. దీంతో ఐకాన్ స్టార్ కోర్టు మెట్లు ఎక్కుతారా లేక చట్టపరమైన ఇతర మార్గాలను ఎంచుకుంటారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Also Read: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!
Also Read: పోక్సో కేసులో బండి భగీరథ్కు భారీ ఊరట..రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Taxi Driver Lottery: రూ.500 లాటరీ టికెట్తో రూ.3 కోట్ల జాక్పాట్.. ఆ జర్నీ ట్యాక్సీ డ్రైవర్ను కోటీశ్వరుడ్ని చేసింది!
Bathinda, Punjab:Taxi Driver 3 Crore Lottery: జీవితంలో అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో మన తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. కొందరి జీవితాలు రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒక సామాన్య ట్యాక్సీ డ్రైవర్ జీవితంలో జరిగింది. పంజాబ్ రాష్ట్ర సూపర్ లాటరీ రూపంలో వచ్చిన అదృష్టం, కేవలం రూ.500 పెట్టుబడితో అతడిని ఏకంగా కోటీశ్వరుడిని చేసింది. రోజువారీ సంపాదన కోసం కష్టపడే ఒక సాధారణ డ్రైవర్, ఇప్పుడు రూ.3 కోట్ల భారీ జాక్పాట్ గెలుచుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఆ జర్నీ జీవితాన్నే మార్చేసింది!
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ ప్రాంతానికి చెందిన కల్యాణ్చంద్ వృత్తిరీత్యా ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ లాగే ఆయన సాధారణంగానే తన విధులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒక ప్రయాణికుడిని లాంగ్ రూట్లో దింపేందుకు ఆయన పంజాబ్లోని బఠిండా నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని ఇంత పెద్ద మలుపు తిప్పుతుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు.
బఠిండాలో ప్రయాణికుడిని దించిన తర్వాత, కల్యాణ్చంద్ అక్కడ స్థానికంగా ఉన్న 'రతన్ లాటరీ స్టాల్' అనే దుకాణాన్ని గమనించారు. పంజాబ్ స్టేట్ లాటరీలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసి, సరదాగా ఒక చేయి వేద్దామని భావించారు. తన జేబులో ఉన్న డబ్బులతో రూ.500 విలువైన రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎప్పటిలాగే తన ట్యాక్సీని తీసుకుని తిరిగి సొంత ఊరికి చేరుకున్నారు.
ఊహించని విజయం..
లాటరీ ఫలితాలు వెల్లడైన రోజు కల్యాణ్చంద్ నమ్మలేని నిజం తెలిసింది. ఆయన కొనుగోలు చేసిన టికెట్లలో ఒకదానికి పంజాబ్ సూపర్ లాటరీలో మొదటి బహుమతి లభించింది. ఆ మొదటి బహుమతి నగదు విలువ అక్షరాలా రూ.3 కోట్లు. కేవలం రూ.500 రూపాయలతో కొన్న చిన్న కాగితం ముక్క, ఆయన కుటుంబ రాతను మార్చేసింది. రూ.3 కోట్ల భారీ నగదు బహుమతి గెలుచుకున్నారనే వార్త వినగానే కల్యాణ్చంద్ కుటుంబ సభ్యులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు.
ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సాగే ట్యాక్సీ డ్రైవర్ జీవితంలో ఈ లాటరీ విజయం ఊహించని వెలుగులను నింపింది. ఈ భారీ జాక్పాట్ గురించి సమాచారం అందడంతో కల్యాణ్చంద్ స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన స్నేహితులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కష్టపడి పనిచేసే ఒక సామాన్యుడిని అదృష్టం వరిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి కల్యాణ్చంద్ జీవితమే ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ డబ్బుతో తన కుటుంబ భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటానని కల్యాణ్చంద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే పొందుపరిచినది. దీన్ని కేవలం ఓ వార్తగానే పాఠకులు గమనిస్తారని ఆశిస్తున్నాము. జీ తెలుగు న్యూస్ లాటరీలపై ఎలాంటి ప్రోత్సహాన్ని చేయడం లేదు.)
Also Read: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!
Also Read: మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు దొరికితే ఏం చేయాలి? మీకు సొంతం కావాలంటే ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Rate Today: పడిపోతున్న బంగారం ధర.. జూన్ 22వ తేదీ సోమవారం గోల్డ్ రేట్స్ ఇవే.. బంగారం కొనేవారికి పండగే..!!
Secunderabad, Telangana:Gold Rate Today: బంగారం,వెండి ధరల్లో నిరంతర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర ఈ ఉదయం వరకు 1.39శాతం అంటే రూ. 2070 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,47,239 వద్ద ఉంది. గత ట్రేడింగ్ రోజున ఇది 10 గ్రాములకు రూ. 149309 వద్ద ముగిసింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, సోమవారం ఉదయం వరకు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 144970గా ఉంది. మరోవైపు, బులియన్స్ ప్రకారం 10 గ్రాములకు రూ. 1,47,550కి చేరింది. గుడ్రిటర్న్స్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,46,230కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,600వద్ద ట్రేడ్ అవుతోంది.
చివరి ట్రేడింగ్ రోజు అయిన శుక్రవారం, ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర వరుసగా నాలుగో రోజు కూడా తగ్గుదల నమోదు చేసింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 2,840 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,50,600 వద్దకు చేరింది. అంతకుముందు గురువారం, దీని ధర 10 గ్రాములకు రూ. 1,53,440గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలో బలహీనత కనిపించింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $60.70 అంటే 1.44శాతం తగ్గి $4,148.45 వద్దకు చేరింది. చివరి ట్రేడింగ్ రోజు విషయానికొస్తే, ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,440 వద్ద ముగిసింది. శుక్రవారం, ఇది రూ. 2,840 తగ్గుదలను నమోదు చేసింది.
ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కూడా బంగారం ధరలు బలహీనంగానే ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో, ఆగస్టు డెలివరీ బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,392 (2.27%) తగ్గి, రూ. 1,45,917కి చేరింది. అదే సమయంలో, న్యూయార్క్లోని కామెక్స్లో, ఆగస్టు కాంట్రాక్టుల గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు రూ. 95 (2.24%) తగ్గి, $4,150.90కి చేరింది.
బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడిదారుల ప్రస్తుత సెంటిమెంట్ డాలర్ వైపు మళ్లింది. ఇది బంగారంపై ఒత్తిడిని పెంచుతోంది. అంతేకాకుండా, అమెరికాలో దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు కొనసాగే అవకాశం కూడా బంగారానికి ప్రతికూలంగా పరిగణిస్తున్నారు. డాలర్ బలం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరడంతో, బంగారం డిమాండ్ బలహీనపడింది. బలమైన డాలర్ ప్రపంచ అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు ఒత్తిడిలోనే ఉన్నాయని చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం:
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తదుపరి దశకు సంబంధించి నెలకొన్న అనిశ్చితి కూడా మార్కెట్పై ప్రభావం చూపుతోందని నిపుణులు భావిస్తున్నారు. స్విట్జర్లాండ్లో జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలు వాయిదా పడటం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలహీనపరిచింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాను పునరుద్ధరించే ఆశలకు గండి పడింది. ఇది ప్రపంచ మార్కెట్లపైనా మరియు సురక్షిత పెట్టుబడి అవకాశాలపైనా ప్రభావం చూపుతోంది.
అటు వెండి ధర కూడా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ఫ్యూచర్స్ ధర ఈ ఉదయం వరకు 2.04శాతం అంటే రూ. 4836 తగ్గి, కిలోకు రూ. 232736కు చేరింది. గత ట్రేడింగ్ రోజున, ఇది కిలోకు రూ. 2,37,572 వద్ద ముగిసింది. అయితే, బులియన్స్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 233,850కి చేరుకుంది. గుడ్రిటర్న్స్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 2,50,000గా ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, సోమవారం ఉదయం వరకు ఇది కిలోకు రూ. 2,31,973గా ఉంది.
Also READ: మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే
Also Read: Cafe Niloufer సిబ్బంది జీతాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FIFA World Cup 2026: అంతరిక్షంలో Trionda ఫుట్బాల్.. నాసా క్రేజీ ప్రయోగం వెనుక ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా?
Secunderabad, Telangana:FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫీఫా సందడి నెలకొంది. తాజాగా అంతరిక్షం నుండి ఒక అద్భుతమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచిన అధికారిక ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్, ట్రియోండాను ఈ చిత్రం చూపిస్తుంది. భూమికి 421 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు, సూక్ష్మ గురుత్వాకర్షణలో ఫుట్బాల్ గతిశీలత, పనితీరును అధ్యయనం చేసే లక్ష్యంతో ట్రియోండా పై ఒక ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. నాసా ప్రకారం, ఐ.ఎస్.ఎస్ సిబ్బంది 2019లో నిర్వహించిన ఒక అధ్యయనాన్ని పునరావృతం చేశారు. అడిడాస్ తయారు చేసిన ట్రియోండా ఫుట్బాల్ను ఉపయోగించి, బంతి సమతుల్యత, ద్రవ్యరాశి కేంద్రం దాని కదలికను ఎలా ప్రభావితం చేస్తాయో వారు పరిశీలించారు.
అధికారిక ఫీఫా ప్రపంచ కప్ బంతి అంతరిక్షాన్ని చేరుకుందని నాసా తెలిపింది. మైదానంలో బంతి వేగం, దిశ మరింత కచ్చితంగా, ఊహించదగినవిగా ఉండేలా చూసేందుకు, క్రీడా ఇంజనీర్లు ఫుట్బాల్ ద్రవ్యరాశి కేంద్రం, సమతుల్యతను చాలా జాగ్రత్తగా కొలిచి, మెరుగుపరుస్తారు. బాగా సమతుల్యం చేసిన సరిగా సమతుల్యం చేయని బంతుల ప్రవర్తన మధ్య వ్యత్యాసాన్ని ప్రదర్శించడానికి వ్యోమగాములు ఈ ప్రయోగాన్ని పునరావృతం చేశారని నాసా తెలిపింది. మ్యాచ్ బంతులలో పొందుపరిచిన సెన్సార్ల వంటి సాంకేతికతలు వాటి పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
The official FIFA World Cup ball went to space!
We're working to inspire the next generation by showing how space exploration inspires innovation in sports science — and everyday life. Learn more: https://t.co/CWbI8MFDtp pic.twitter.com/ebJtkpD5uM
— NASA (@NASA) June 20, 2026
ఫీఫా ప్రకారం, ట్రియోండాలో గాలిలో బంతి స్థిరత్వాన్ని పెంచే అనేక అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. అదే సమయంలో దానిపై ఉన్న ఉబ్బెత్తు ఉపరితలం వర్షంలో మెరుగైన పట్టును అందిస్తుంది. ఈ బంతిలో అత్యాధునిక కనెక్టెడ్-బాల్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది 500Hz మోషన్ సెన్సార్ చిప్ను కలిగి ఉండి... నిజ-సమయ కదలిక డేటాను వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) సిస్టమ్కు ప్రసారం చేస్తుంది. ఈ సాంకేతికత మ్యాచ్ అధికారులకు ఆఫ్-సైడ్ నిర్ణయాలు. ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
Also Read: బంగారం ధరలను కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. బ్యాంకులపై కఠిన ఆంక్షలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TG20 League 2026: అట్టహాసంగా టీజీ20 లీగ్ 2026 ప్రారంభం.. విజయ్ దేవరకొండ సందడి
Hyderabad, Telangana:Palamuru Strikers: తెలంగాణలో తొలిసారి దేశీయ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవగా క్రీడాకారులు సందడి చేశారు. ఐపీఎల్ తరహాలో జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణలోని ప్రధాన జిల్లాలు జట్లుగా పోటీ పడుతుండగా.. మట్టిలోని మాణిక్యాలు ఈ క్రికెట్ టోర్నీలో తమ తడాఖా చూపించబోతున్నారు. ఈ టోర్నీని యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రారంభించగా.. తెలంగాణ ప్రజాప్రతినిధులు హాజరై క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.
తొలి మ్యాచ్ పాలమూరు స్ట్రైకర్స్
టీజీ 20 లీగ్ 2026 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమవగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరవగా.. ఈ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించాడు. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి రోజు పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టోర్నీ ప్రారంభం సందర్భంగా డిప్యూటీ సీఎం స్వాగత ప్రసంగం చేశారు.
స్వాగత ప్రసంగం
'గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లను సానబట్టి వెలికితీసి ప్రపంచానికి అందించడానికి ఈ లీగ్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాహకులను అభినందిస్తున్నాం. క్రికెట్ అంటే అర్బన్ సెంటర్స్ కు మాత్రమే అవకాశాలు ఉండేవి. మొదటిసారి ప్రతీ జిల్లాలో ఉండే క్రీడాకారులను గుర్తించి టీమ్స్ను సెలెక్ట్ చేసి నిర్వహిస్తున్న లీగ్ దేశానికి మార్గదర్శకంగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న గ్రామీణ క్రీడాకారులకు అద్భుతమైన అవకాశం ఉంది' అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
భవిష్యత్లో ఒలింపిక్స్లో
'క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్కి తీసుకొచ్చాం. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం. భవిష్యత్లో ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి మెడల్స్ పొందేలా శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తుంది' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ జట్లలో టీమ్ఇండియా అండర్ 19కు ఆడిన ప్లేయర్లు, రంజీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు బరిలో దిగుతుండగా.. దేశీయ టోర్నీల్లో సత్తా చాటిన క్రికెటర్లు కూడా ఉన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో టీజీ20 లీగ్-2026 తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, తెలంగాణ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు ఉన్నారు.
టోర్నీలో పాల్గొంటున్న జట్లు ఇవే!
పాలమూరు స్ట్రెకర్స్
మెదక్ ఫాల్కాన్స్
నల్గొండ నైట్స్
వరంగల్ వారియర్స్
ఖమ్మం ఏసెస్
కరీంనగర్ డైమండ్స్
రంగారెడ్డి రైజర్స్
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్
టోర్నీలో స్టార్ ఆటగాళ్లు
టీజీ20 లీగ్లో స్టార్ ప్లేయర్లు కూడా గ్రౌండ్లో దిగనున్నారు. భారత స్టార్ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్లో బరిలో దిగే అవకాశం ఉంది. తిలక్ వర్మను వేలం రూ.33 లక్షలకు మెదక్ జట్టు కొనుగోలు చేయగా, మహ్మద్ సిరాజ్ను రూ.14 లక్షలకు వరంగల్ జట్టు వేలంలో దక్కించుకుంది. ఈ టోర్నీలో వారిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
Yoga Day 2026: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! మోడ్రన్ సైన్స్ ఏం చెబుతుందంటే?
Hyderabad, Telangana:Modern Science On Yoga: యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మకు కలిపి చేసే ప్రాచీన అభ్యాసం. ఇది ఒక వ్యక్తి శారీరక బలం, మానసిక శ్రేయస్సు, అంతర్గత చైతన్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అలాంటి వాళ్లను చురుకుగా ఉంచేందుకు ప్రేరేపిస్తుంది. "యోగా" అనే పదం "యుజ్" అనే సంస్కృత మూలం నుండి వచ్చింది. దీని అర్థం "ఐక్యం చేయడం" లేదా "కలపడం" . వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన యోగా, ప్రపంచంలోని ప్రతి మూలలో ఆచరించబడే ఒక సంపూర్ణ క్రమశిక్షణగా పరిణామం చెందింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగాకు ఉన్న అపారమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, చురుకుగా ఉండడం సహా ఆరోగ్యకరమైన, మరింత సామరస్యపూర్వకమైన జీవనశైలిని నిర్మించుకోవడానికి ఈ ప్రాచీన అభ్యాసాన్ని స్వీకరించమని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహిస్తుంది.
ఆధునిక విజ్ఞానశాస్త్రానికి యోగా ఎందుకు ముఖ్యం?
ప్రపంచవ్యాప్తంగా ఆధునిక విజ్ఞానశాస్త్ర రంగంలో యోగాకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. యోగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గిస్తుంది. ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది, మెదడు పనితీరును ఎలా మెరుగుపరుస్తుంది అనే విషయాలు ఈ రోజుల్లో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది శాస్త్రవేత్తలను యోగా ప్రభావాలను లోతుగా అన్వేషించడానికి ప్రోత్సహిస్తోంది.
యోగా గురించి ఆధునిక విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతుంది?
నివేదికల ప్రకారం.. యోగాను క్రమం తప్పకుండా అభ్యసించినప్పుడు అది అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం సూచిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడంలో, శరీర సౌలభ్యాన్ని, సమతుల్యతను మెరుగుపరచడంలో, మానసిక శ్రేయస్సును పెంచడం సహా మొత్తం జీవన నాణ్యత పెంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జీవితంలో యోగా అభ్యాసం వల్ల ఆందోళన, కుంగుబాటు, దీర్ఘకాలిక నొప్పులు, అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
1) మానసిక ఒత్తిడి
మన శరీరంలో కార్టిసాల్ హార్మోన్ అనేది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. రోజూ యోగా సాధన చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలను తగ్గించవచ్చని శాస్త్రీయంగా నిరూపితం అయ్యింది. ఈ విధంగో క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం అభ్యాసం చేయడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.
2) మెదడు ఆరోగ్యం
క్రమం తప్పకుండా యోగా చేసే వారి మెదడులో గ్రే మ్యాటర్ పెరిగినట్లు.. ఎంఆర్ఐ స్కానింగ్ ఉపయోగించి చేసిన అధ్యయనాలు బయటపెట్టాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంతో పాటు వయసుతో పాటు వచ్చే మెదడు సమస్యలను నివారించడంలో యోగా ప్రభావవంతంగా ఉంటుంది.
3) గుండె ఆరోగ్యం
రోజూ యోగా చేయడం వల్ల గుండె సంబంధిత రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు సహాయపడుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి.
4) రోగనిరోధక శక్తి పెరుగుదల
రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు ఉన్నాయి.
5) దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం
ఎన్నో రోజులుగా లేదా నెలలుగా పడుతున్న నడుము నొప్పి, కీళ్లవాతం, మైగ్రేన్లు మొదలైన వాటికి యోగా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఇది శరీరంలోని కండరాలను బలపరచడం సహా.. తద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: రోజూ 10 నిమిషాల యోగా మీ జీవితాన్నే మార్చేస్తుంది! యోగా
Also Read; Fathers Day 2026: మనకు అన్నీ నేర్పించిన నాన్న కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Strait Of Hormuz: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత..హోర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్!
Strait Of Hormuz Closed: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని అమలు చేయడంపై చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు స్విట్జర్లాండ్లో సమావేశం కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని శనివారం మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల్లో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించిన తర్వాత.. లెబనాన్లో ఇజ్రాయెల్ వరుస దాడులు జరపడంతో, శుక్రవారం స్విట్జర్లాండ్లో తదుపరి చర్చలు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.Road Accident: ఫాదర్స్ డే రోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం
Khammam, Telangana:Fathers Day Turns Tragedy: ప్రపంచమంతా ఫాదర్స్ డేను ప్రశాంతంగా.. ఆనందోత్సాహాలతో చేసుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర విషాదం నింపింది. ఫాదర్స్ డే రోజే పలు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ తల్లి కాపురంలో కలహాలతో తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రిని ఒంటరిని చేసింది. మరో ఘటనలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకుతోపాటు ఓ మహిళ కూడా మరణించారు. ఈ సంఘటనలన్నీ కూడా ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నాయి.
రోడ్డు ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం, మాదారం అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన (భార్యాభర్తలు, కొడుకు) ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సాయి ప్రకాష్, సంధ్య, వారి కొడుకు మోక్షిత్ (ఐదు సంవత్సరాలు) ఉండగా.. వారి తల్లి జ్యోతికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
బంధువుల ఇంటికి వెళ్లి
ప్రమాదానికి గురయిన కుటుంబం మొత్తం భద్రాచలం పట్టణానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
కాపురంలో కలహాలు
ఖమ్మం జిల్లాలో ఓ వివాహిత తనతోపాటు తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి ప్రాణాలు తీసింది. వారి ముగ్గురు మరణంతో ఓ తండ్రి దిక్కులేని వాడుగా మారాడు. ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్కు లింగరాజు, స్వాతి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5)తో ఉన్నారు. అయితే నిత్యం కాపురంలో కలహాలు ఉండడంతో భార్యాభర్తలు నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో స్వాతి క్షణికావేశానికి గురయి తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి.. తానూ తిని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే లింగరాజు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది.
వివాహేతర సంబంధంతో హత్య
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుంచుపల్లి మండలం పెనగడప అంబేద్కర్ నగర్లో తన భార్యను వేధిస్తున్నాడని అనుమానంతో నాగరాజు అనే వ్యక్తిని కత్తితో పొడిచి ఓ దుండగుడు హత్య చేశాడు. ఓ ఫంక్షన్ హాల్లో నాగరాజుకు శివాజీకి మధ్య ఘర్షణ జరిగింది. కక్షపెంచుకున్న శివాజీ పథకం ప్రకారం నాగరాజును రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 'పాల్వంచ పెద్దమ్మ గుడిలో జరిగిన ఫంక్షన్లో శివాజీ తన భార్యతో వెళ్లగా అదే ఫంక్షన్కు హాజరైన నాగరాజు గొడవ పడ్డాడు. శివాజీకి తన భార్యకు నాగరాజు మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం ఉంది. ఫంక్షన్కు తన భార్య కోసమే నాగరాజు వచ్చాడని శివాజీ ఆగ్రహంతో నాగరాజుతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది' అని మృతుడి మేనత్త తెలిపారు. ఈ ఘటనపై రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KTR: ఒక్క ఏడాది ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Requests To Public: 'అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తాను గుంపు మేస్త్రి అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడు. ఈ ప్రభుత్వానికి సగం కాలం పూర్తయింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లూటీలు జరుగుతున్నాయి.. కానీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు అని చెప్పారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్నగర్లో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 60 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ బస్తీలో నివసిస్తున్న తమను బలవంతంగా తరలించి.. ఆ భూములను ప్రభుత్వం అమ్మేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బస్తీవాసులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందించిన పట్టాలను కూడా రద్దు చేసి.. తమ భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్న బస్తీబాటలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదని గుర్తుచేశారు. హనుమాన్ నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు కూడా లేవని మండిపడ్డారు.
'ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది' అని బస్తీవాసులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోండి... కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దని సూచించారు. పెద్దలకు ఒక నీతి... పేదలకు మరో నీతి అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. మేమంతా మీకు అండగా ఉంటాం. ఎవరూ భయపడకండి' అని మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు.
UK Grooming Gang Report: 2,50,000 అమ్మాయిలపై అత్యాచారం చేసిన పాకిస్థానీ టీమ్..పనికట్టుకొని మరీ బాలికలకు ఎర!
England:UK Grooming Gang News: బ్రిటన్లో గత కొన్ని దశాబ్దాలుగా సాగిన అమానవీయ 'గ్రూమింగ్ గ్యాంగ్' వ్యవస్థీకృత బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన నమ్మలేని నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు (MP) రూపెర్ట్ లోవ్ నేతృత్వంలోని ఒక స్వతంత్ర విచారణ సంస్థ జూన్ 16న విడుదల చేసిన 'సామూహిక అత్యాచార విచారణ నివేదిక' దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘోరాల బారిన పడి కనీసం 2,50,000 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఈ నివేదిక వెల్లడించింది.
బాధితురాలి నుండి సామాజిక కార్యకర్తగా మారిన సామీ వుడ్హౌస్ అధ్యక్షతన, కోర్టు రికార్డులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ దారుణాల్లో బాధితులుగా మారిన వారిలో అత్యధిక శాతం మంది శ్వేతజాతీయులైన బ్రిటిష్ బాలికలే కావడం గమనార్హం. 2005 నుండి 2017 మధ్య కాలంలో బాలల లైంగిక దోపిడీకి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిలో 84 శాతం మంది దక్షిణాసియా ముస్లిం (ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న) పురుషులేనని నివేదిక స్పష్టం చేసింది.
యూకేలోని దాదాపు 40 శాతం ప్రాంతాలు (149 స్థానిక అధికార జిల్లాలు) ఈ ముఠాల బారిన పడ్డాయి. రోథర్హామ్, ఆక్స్ఫర్డ్, టెల్ఫోర్డ్, రోచ్డేల్ వంటి నగరాల్లో ఇవి తీవ్రస్థాయిలో సాగాయి.
ముఠాల అమానుష వ్యూహం
ఈ వ్యవస్థీకృత ముఠాలు విచ్ఛిన్నమైన కుటుంబాలు, సంరక్షణ గృహాలకు చెందిన 11 ఏళ్ల లోపు బలహీనమైన బాలికలను లక్ష్యంగా చేసుకునేవి. పాఠశాలల వద్ద, వీధుల్లో బాలికలతో స్నేహం చేసి.. వారికి బహుమతులు, మద్యం, మాదకద్రవ్యాలు ఎరగా వేసి టాక్సీలలో రహస్య ప్రాంతాలకు తరలించేవారు.
ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వారిపై పదేపదే సామూహిక అత్యాచారాలు, చిత్రహింసలు జరిపేవారని నివేదికలు వెల్లడించాయి. బ్లాక్మెయిల్ చేయడం కోసం వాటిని చిత్రీకరించి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, కొన్నిసార్లు విదేశాలకు సైతం అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రూరత్వం కారణంగా ఎంతోమంది మైనర్ బాలికలు గర్భవతులయ్యారు. బలవంతపు అబార్షన్లు, తీవ్ర మానసిక ఆఘాతాల వల్ల గర్భస్రావాలకు గురయ్యారు.
బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ (NHS) 13 ఏళ్ల చిన్న పిల్లలలో జననేంద్రియ గాయాలు, లైంగిక వ్యాధులు, ఆత్మహత్యాయత్నాలను గుర్తించినప్పటికీ, బాధితులకు సరైన రక్షణ కల్పించడంలో విఫలమై తిరిగి వారిని అదే నరకంలోకి నెట్టేసిందని నివేదిక తీవ్రంగా తప్పుబట్టింది.
దశాబ్దాలుగా సాగిన ఈ దారుణాలను అణచివేయడంలో పోలీసులు, సామాజిక సేవా సంస్థలు, విద్యాసంస్థలు, ఎన్హెచ్ఎస్, ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. నివేదిక ఆరోపణ ఆధారంగా.. నేరస్థుల జాతి, మతపరమైన నేపథ్యం కారణంగా, తమపై ఎక్కడ "జాత్యహంకారులు" అనే ముద్ర పడుతుందోననే భయంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. కొన్ని ముస్లిం సమాజాల్లోని సాంస్కృతిక వైఖరులు, ముస్లిమేతర అమ్మాయిలను తక్కువగా చూసే ధోరణి కూడా ఈ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి.
నివేదిక చేసిన కఠిన సిఫార్సులు
సమూహ ఆధారిత బాలల లైంగిక దోపిడీకి పాల్పడే ప్రధాన సూత్రధారులకు కనీసం 50 సంవత్సరాలు, సహకరించిన వారికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘోరాలకు పాల్పడినట్లు రుజువైన విదేశీ పౌరుల బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలి. ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారితో సహా అందరినీ వెంటనే దేశం నుండి బహిష్కరించాలి. ప్రాణాలతో బయటపడిన బాధితులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయి పునరావాసం, మానసిక వైద్యం అందించాలి. ప్రజల నుంచి సేకరించిన నిధులతో, బాధితుల ఆధ్వర్యంలోనే సాగిన ఈ స్వతంత్ర విచారణ నివేదిక ప్రస్తుతం యూకేలో బాలల రక్షణ, వలసల విధానం, చట్టపరమైన జవాబుదారీతనంపై తీవ్రస్థాయి చర్చకు దారితీసింది.
Also Read: హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్కు 74 కొరడా దెబ్బలు!
Also Read: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం..యుద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prakash Raj Arrest: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఆదేశం!
Hyderabad, Telangana:Prakash Raj Arrest Warrant: సినీ నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవల 'ధర్మస్థల' కేసుతో వార్తల్లో నిలిచిన బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో చిక్కులో పడ్డారు. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణపై నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ప్రకాష్ రాజ్పై దిలీప్ కుమార్ కేసు నమోదు చేయడంతో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణలపై దిలీప్ కుమార్ కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత, 48వ ఏసీజేఎం కోర్టు ప్రకాష్ రాజ్పై ఎన్బీడబ్ల్యూ జారీ చేయగా, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు ద్వారా రెండుసార్లు సమన్లు జారీ చేసినా, రెండుసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినా ప్రకాష్ రాజ్ హాజరు కాకపోవడంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ఆయనపై మూడోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా నటుడు ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరు కాలేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధమైన ఓటర్ ఐడి కలిగి ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే ఒక ఓటర్ ఐడి కార్డును మాత్రమే కలిగి ఉండటానికి అనుమతి ఉంది.
కానీ నటుడు ప్రకాష్ రాజ్ నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు పొందారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, నిందితుడు ప్రకాష్ రాజ్ సమన్లు, వారెంట్లను పట్టించుకోకుండా కోర్టుకు హాజరు కాకపోవడంపై ఏసీజేఎం కోర్టు ఆగ్రహంగా ఉందని అంటున్నారు. దీంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ప్రకాష్ రాజ్ కోసం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏ సమన్లు, వారెంట్లకూ హాజరుకాని ప్రకాష్ రాజ్పై ఇప్పుడు చట్ట ఉల్లంఘన ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ కారణాలన్నిటి వల్ల నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు.
Also Read: మరణించిన తర్వాత ఆరుగురికి ప్రాణం పోసిన రాజ్..ముంబై కుర్రాడి హృదయ విదారక గాథ!
Also Read: భారీగా తగ్గిన ధరలు.. బంగారంపై రూ.3 వేలు.. వెండి రూ.14 వేలు డౌన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో 'చెన్నై లవ్ స్టోరీ బృందం', ఇతర ప్రముఖులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం పూట సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలు రాష్ట్రాల న్యాయమూర్తులు స్వామిని దర్శించుకున్నారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగిసినా కూడా భక్తుల తాడికి తిరుమలకు తగ్గడం లేదు. వారికి ప్రత్యేక దర్శనం కల్పించిన అనంతరం టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సినీ ప్రముఖులు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చెన్నై లవ్ స్టోరీ చిత్ర బంధం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల స్వామిని ఆదివారం ఉదయం కిరణ్ అబ్బవరంతోపాటు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించిన టీటీడీ అధికారులు.. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దర్శనానంతరం సినిమా బృందం ఆలయం వెలుపల సందడి చేశారు. తమ సినిమా విజయం సాధించాలని.. ప్రేక్షకుల ఆదరణ పొందాలని స్వామివారి సన్నిధిలో వారు ప్రార్థించినట్లు సినీ నటుడు కిరణ్ అబ్బవరం తెలిపారు
న్యాయమూర్తులు
శ్రీవారిని తెలంగాణ, మేఘాలయ న్యాయమూర్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేఘాలయ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి శ్రవణ కుమార్ ఆలయ దర్శనానికి రాగా.. అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు .
After the blockbuster Musical Fest of #ChennaiLoveStory
Hero @Kiran_Abbavaram, #SriGouriPriya & producers @SKNonline & #SaiRajesh, @DheeMogilineni completed divine darshan at Tirupati ✨❤️ pic.twitter.com/KVbjkOv3gZ
— Mohan Kumar (@ursmohan_kumar) June 21, 2026
తిరుమలలో భక్తుల రద్దీ
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలోని క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 2-5 గంటలు దర్శనానికి సమయం పడుతుంటా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-6 గంటల సమయం కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 20వ తేదీన స్వామివారిని 93,303 మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. స్వామివారికి తలనీలాలు 46,688 మంది భక్తులు సమర్పించగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చింది.
