కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి:బీఆర్ఎస్
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Tirumala Currency Permission: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండపైకి భక్త కోటి భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఓ పరిణామం భక్తులకు కొత్త సందేహం వ్యక్తమవుతోంది. తిరుమల కొండపైకి వెళ్లే సమయంలో అలిపిరి చెక్ పోస్టు వద్ద భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి కారులో దాదాపు అర కోటికి పైగా డబ్బులు తీసుకెళ్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
తిరుమల శ్రీవారికి భక్తులు తమకి తోచిన కానుకలు సమర్పిస్తుంటారు. తాజాగా తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త శ్రీవారికి రూ.65 లక్షలు హుండీలో వేయడానికి తన డ్రైవర్తో పంపించాడు. తిరుమల కొండ ఎక్కేందుకు కారు నిలవగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు, భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుండగా డబ్బులు గుర్తించారు. రూ. 65 లక్షల డబ్బును విజిలెన్స్ అధికారులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి ప్రూఫ్ చూపించి డబ్బును తిరుమలకి తీసుకెళ్లాలని అధికారులు చెప్పారు. అయితే కారు డ్రైవర్ డబ్బుకు సంబంధించిన ఆధారాలు సమర్పించలేదు. విజిలెన్స్ అధికారుల సూచన మేరకు డ్రైవర్ తన యజమాని అయిన పారిశ్రామికవేత్తకు సమాచారం అందించాడు.
Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ
కొండపైకి డబ్బులు తీసుకెళ్లాలంటే తప్పక ఆధారాలు చూపించాల్సిందేనని చెప్పడంతో చెన్నై నుంచి పారిశ్రామికవేత్త తిరుమలకు బయల్దేరారు. ఆయన వచ్చాక డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే కొండపైకి డబ్బులు అనుమతి ఇస్తారు. ఆధారాలు చూపించకపోతే విజిలెన్స్ అధికారుల ఆధీనంలో ఆ డబ్బులు ఉంటాయి. తాజా సంఘటనతో తిరుమల కొండపైకి ఎంత డబ్బు తీసుకెళ్లవచ్చనే సందేహం అందరిలో మెదలుతోంది. సాధారణంగా కోటి రూపాయల వరకు నగదును తిరుమలకు తీసుకెళ్లవచ్చు. అయితే ఆ నగదుకు సంబంధించి వివరాలు తప్పక ఉండాల్సిందే. లేదంటే మాత్రం తనిఖీల సమయంలో పట్టుబడితే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటారు.
Also Read: Adulterated Wheat Flour: హైదరాబాద్ ప్రజల్లారా జరభద్రం! గోధుమ పిండి కూడా కల్తీ
మళ్లీ తిరుమల వచ్చిన బండ్ల గణేశ్
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మరోసారి సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం తన కుటుంబంతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బండ్ల గణేశ్ వెలుపలకు వచ్చారు. కొన్ని వారాల కిందట హైదరాబాద్ నుంచి తిరుమలకు బండ్ల గణేశ్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబు, నారా లోకేశ్ను బండ్ల గణేశ్ కలిశాడు. ఇప్పుడు మరోసారి తిరుమలను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!
Washing Clothes At Night Vastu: నేటి బిజీ లైఫ్లో సమయం సరిపోక చాలామంది రాత్రి వేళల్లో బట్టలు ఉతుకుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నిపుణులు ఈ అలవాటు పట్ల హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట బట్టలు ఉతకడం వల్ల జీవితంలో ప్రతికూల మార్పులు వస్తాయని, కొన్ని వాస్తు దోషాలకు దారితీస్తుందని వారు చెబుతున్నారు. వాస్తు, శాస్త్రీయ దృక్కోణంలో రాత్రి వేళ బట్టలు ఉతకడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు, ఆధ్యాత్మిక కారణాలు
ప్రతికూల శక్తి: వాస్తు శాస్త్రం ప్రకారం పగలు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. రాత్రి వేళలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట బట్టలు ఉతకడం వల్ల ఈ ప్రతికూలత దుస్తుల ద్వారా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని నమ్ముతారు.
ఆర్థిక ఇబ్బందులు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అనవసరంగా రాత్రి వేళ నీటిని పారబోయడం ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుంది. ఇది ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు దారితీయవచ్చు.
వాస్తు దోషాలు: సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా ఆరబెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పెరిగి, మానసిక అశాంతికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాస్త్రీయ, ఆరోగ్య పరమైన సమస్యలు
కేవలం నమ్మకాలే కాదు, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. సూర్యరశ్మి ఒక సహజ క్రిమిసంహారకంగా ఉంటారు. రాత్రిపూట ఆరబెట్టిన బట్టలకు సూర్యకాంతి తగలదు. దీనివల్ల బట్టల్లోని తేమ వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పూర్తిగా నశించవు. సరిగ్గా ఆరని, బ్యాక్టీరియా ఉన్న బట్టలు ధరించడం వల్ల చర్మ అలెర్జీలు, దురద వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.
ఏ సమయంలో ఉతకడం ఉత్తమం?
వీలైనంత వరకు ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో బట్టలు ఉతకడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉతికిన బట్టలను సూర్యరశ్మి బాగా తగిలే చోట ఆరబెట్టడం వల్ల అవి పూర్తిగా క్రిమిరహితంగా మారుతాయి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నింపడమే కాకుండా, మీ దుస్తులకు తాజాగా ఉండేలా చేస్తుంది.
బిజీ షెడ్యూల్ వల్ల ఉదయం కుదరకపోతే, బట్టలను రాత్రి ఉతికినప్పటికీ, ఆరబెట్టే ప్రక్రియను మాత్రం పగలు సూర్యకాంతిలో ఉండేలా చూసుకోండి. సరైన పద్ధతుల్లో బట్టలు ఉతకడం వల్ల మీ ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు రెండూ మెరుగుపడతాయి.
Also Read: Snake Viral Video: నల్లత్రాచు పాము మరణశాసనం..విషాన్ని చిమ్మి, అక్కడికక్కడే కుప్పకూలిపోయింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Death Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రం మనల్ని ఆశ్చార్యాని గురిచేస్తాయి. తాజాగా కింగ్ కోబ్రా (నాగుపాము) మరణానికి సంబంధించిన ఒక అరుదైన, భయంకరమైన వీడియో నెటిజన్లను వణికిస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముగా పేరుగాంచిన కింగ్ కోబ్రా, చనిపోయే చివరి క్షణాల్లో ఎలా ప్రవర్తించిందో ఈ వీడియోలో తెలుస్తోంది. సాధారణంగా పాములు పడగ విప్పడం మనం చూస్తుంటాం, కానీ ఒక పాము చనిపోయే ముందు ఇంత భయంకరంగా ప్రవర్తించడం చాలా అరుదు.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియో ప్రారంభంలో ఒక భారీ కింగ్ కోబ్రా నేలపై చుట్టుకుని కనిపిస్తుంది. అయితే, అకస్మాత్తుగా అది బుసకొడుతూ పైకి లేచి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లు పడగ విప్పుతుంది. తన నోరును వెడల్పుగా తెరిచి, తీవ్రమైన ఒత్తిడితో కోరల నుండి విషాన్ని బయటకు చిమ్ముతుంది. ఆ దృశ్యం చూస్తుంటే అది తన చివరి శక్తినంతా కూడగట్టుకుని పోరాడుతున్నట్లు అనిపిస్తుంది.
విషాన్ని ఉమ్మిన మరుక్షణమే, ఆ పాము తన నియంత్రణను కోల్పోయి ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అది ప్రాణాలు వదలడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నెటిజన్ల స్పందన
@NR LIFE అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. "పాము మరణం ఇంత భయంకరంగా ఉంటుందా?" అని కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఇది ప్రకృతిలో కనిపించే అత్యంత అరుదైన "సహజ మరణం" అని వ్యాఖ్యానిస్తున్నారు.
గమనిక: ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, కింగ్ కోబ్రా వంటి శక్తివంతమైన జీవి అంత వేగంగా ప్రాణాలు వదలడం సంచలనంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాములకు తీవ్రమైన అంతర్గత గాయాలు అయినప్పుడు లేదా నాడీ వ్యవస్థ విఫలమైనప్పుడు ఇలాంటి ప్రవర్తన కనిపించే అవకాశం ఉంది. ప్రకృతిలో ప్రతి జీవి మరణం ఒక రహస్యమే. ఈ వీడియో కింగ్ కోబ్రా భీకరమైన అంతిమ క్షణాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
Also Read: LPG Shortage In Hyderabad: తెలంగాణలో మొదలైన గ్యాస్ సెగ..రంజాన్ పండుగ వేళ హోటల్ యజమానుల ఆందోళన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco C85x 5g Price In India: భారత మార్కెట్లోకి పోకో కంపెనీ అద్భుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీనిని కంపెనీ పోకో C85x 5G పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనిని కంపెనీ గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన పోకో C85 కొత్త వేరియంట్లో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్తో లాంచ్ చేసింది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పోకో C85x 5G స్మార్ట్ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో కూడిన 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా నాచ్ డిజైన్తో 8MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది అద్భుతమైన యూనిసోక్ T8300 చిప్సెట్ ప్రాసెసర్పై రన్ అవుతుంది. దీంతో పాటు 4GB ర్యామ్ వేరియంట్లో బేస్ వేరియంట్ ప్రారంభమవుతుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఈ Poco C85x 5G స్మార్ట్ఫోన్కి సంబంధించిన వేరియంట్స్ వివరాల్లోకి వెళితే.. మొదటి వేరియంట్ 4GB + 64GB ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 4GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999 ధరతో అందుబాటులోకి రాబోతోంది. అయితే, మార్చి 14వ తేదిన ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్తో పాటు గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Poco C85x 5G స్మార్ట్ఫోన్కి సంబంధించిన స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1600 × 720 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులోకి రాబోతోంది. ఈ డిస్ప్లే 810 నిట్ల వరకు గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ T8300 6nm ప్రాసెసర్పై రన్ అవుతుంది. దీంతో పాటు మాలి G57 MC2 GPUను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ భాగంలో 32MP ప్రైమరీ రియర్ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 6300mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా 15W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ బ్యాటరీ 1000 ఛార్జింగ్ సైకిల్స్ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. దీంతో పాటు 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్లో కంపెనీ 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.4 కనెక్టీవిటీ ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. దీంతో పాటు ఇది IP52 రేటింగ్తో వస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amit Mishra Police Case: ప్రముఖ క్రికెటర్పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. నటి గరీమా తివారీ తన భర్తపై కోర్టును ఆశ్రయించింది. తనను బలవంతంగా మద్యం తాగించడమే కాకుండా..డబ్బు, అదనపు కట్నం కోసం ఎంతో క్రూరంగా హింసించినట్లు ఆపే ఆరోపించింది.
ఐపీఎల్ క్రికెటర్ అమిత్ మిశ్రా, అతని కుటుంబంపై గరిమా తివారీపై ఇప్పుడు కోర్టుకు వెళ్లింది. వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసించడంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆమె చేశారు.
జాతీయ మీడియా నివేదికల ప్రకారం..ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన 35 ఏళ్ల మోడల్ గరిమా తివారీ అదనపు సివిల్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. వివాహం తర్వాత తన భర్త, అతని కుటుంబం నుండి అనేక సార్లు శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అమిత్ మిశ్రాతో పాటు, అతని తల్లి బీనా మిశ్రా, తండ్రి శశికాంత్ మిశ్రా, సోదరుడు అమర్ మిశ్రా, వదిన రీతు మిశ్రా, సోదరి స్వాతి మిశ్రాలను కూడా ఆమె తన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్నారు.
"అమిత్ మిశ్రా..నేను 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. మేము దాదాపు మూడేళ్లు ప్రేమలో ఉండి.. 2021 ఏప్రిల్ 26న కాన్పూర్లోని ఒక క్లబ్లో పెళ్లి చేసుకున్నాము. మా వివాహం జరిగిన వెంటనే.. నా భర్త, అత్తమామలు నాకు హోండా సిటీ కారు రూ.10 లక్షల కట్నం ఇవ్వాలని మా కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. పెళ్లి తర్వాత నన్ను పంపించేటప్పుడు మా కుటుంబం రూ.2.5 లక్షలు ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత కూడా, మరిన్ని డబ్బుల డిమాండ్ చేస్తున్నారని" గరిమ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అమిత్ మిశ్రా తరచూ మద్యం సేవించి తనను తీవ్రంగా కొట్టి, హింసించేవాడని ఆమె భార్య గరిమా తివారీ ఆరోపింది. అయితే కొన్నిసార్లు రోజుల తరబడి ఆహారం, నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. చివరికి తాను మోడలింగ్ పని ద్వారా సంపాదించిన డబ్బును లాక్కునేవాడని, విడాకులు తీసుకుంటానని పదే పదే బెదిరించేవాడని కూడా ఆమె ఆరోపించింది. ఇలాంటి నిరంతర వేధింపుల కారణంగా, తాను నిరాశకు గురయ్యానని తన మోడలింగ్ వృత్తిని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.
ఈ వేధింపులతో విసుగు చెందిన గరిమ తివారీ కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ఒకసారి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీస్ కమిషనర్ కార్యాలయంతో సహా అనేకసార్లు పోలీసులను ఫిర్యాదు చేసినా.. క్రికెటర్ అమిత్ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టుకు విన్నవించుకుంది.
Also REad: LPG Shortage In Hyderabad: తెలంగాణలో మొదలైన గ్యాస్ సెగ..రంజాన్ పండుగ వేళ హోటల్ యజమానుల ఆందోళన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola G57 Power 5g Price Cut: ప్రముఖ మోటోరోలా కంపెనీకి సంబంధించిన మంచి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ వార్త మీ కోసమే.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్కార్ట్లో చాలా తగ్గింపు ధరలకే ఈ బ్రాండ్ మొబైల్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా జీ సిరీస్ స్మార్ట్ఫోన్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్తో పాటు ఎక్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై ఉన్న ఆఫర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ అద్భుతమైన భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన 6.72-అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తోంది. అంతేకాకుండా ప్రొటక్షన్గా Corning Gorilla Glass 7i గ్లాస్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి Qualcomm Snapdragon 6s Gen 4 (4nm) చిప్సెట్ ప్రాసెసర్తో ఈ స్మార్ట్ఫోన్ పని చేస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన భారీ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.. అంతేకాకుండా ఇది 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు బ్యాక్ సెటప్లో Sony LYT-600 సెన్సార్ ఎంతో శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరాతో అందుబాటులో ఉంది. అలాగే అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీల కెమెరా కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్తో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత Hello UI పై ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. అలాగే ఇది IP64 రేటింగ్, డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అందుబాటులో ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ప్రస్తుతం మార్కెట్లో Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ MRP ధర రూ.17,999 కాగా.. ఇప్పుడే ఫ్లిప్కార్డ్లో దీనిని కొనుగోలు చేసేవారికి 17 శాతం ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.14,999 లోపే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఎక్చేంజ్ ఆఫర్తో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ.11 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ మొబైల్ను ధర నుంచి మైనస్ చేస్తే ఏకంగా రూ.3,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Shortage In Hyderabad Today: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు సామాన్యుడి వంటగదిపై పడుతోంది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాల వల్ల హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనివల్ల నెలకొన్న తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంజాన్ మాసం కావడంతో హోటళ్లకు గ్యాస్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. కానీ, 100 బుకింగ్లు ఉంటే కనీసం 10 నుండి 20 సిలిండర్లు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసినా దొరకకపోవడం, బయట బ్లాక్లోనూ సిలిండర్లు లభ్యం కాకపోవడంతో దాదాపు 2 లక్షల మంది వినియోగదారులపై దీని ప్రభావం పడుతోంది.
గృహ అవసరాలకు తిప్పలు
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. గృహ అవసరాల సిలిండర్ బుక్ చేసుకుంటే వారం రోజుల వరకు రావడం లేదని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే.
గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలను కొందరు డిస్ట్రిబ్యూటర్లు తోసిపుచ్చుతున్నారు. గృహ అవసరాల సిలిండర్ల కొరత లేదని, బుక్ చేసిన ఒక్క రోజులోనే అందజేస్తున్నామని హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ తెలిపారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన వినియోగదారులకు సూచించారు.
అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరాలో కొంత నెమ్మది ఉన్నప్పటికీ, గృహ అవసరాల సిలిండర్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, గ్రౌండ్ లెవల్లో కొరత ఉందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bangalore Hotels Close: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణ.. అలజడులు నేపథ్యంలో అన్నీ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుండగా.. భారతదేశంపై మరింత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడిన భారత్కు చిక్కులు వచ్చిపడ్డాయి. ఇంధనం, గ్యాస్పై అంతా బాగానే ఉంది.. ఏం భయం అవసరం లేదని భారత ప్రభుత్వం పైకి గట్టిగానే చెబుతుండగా అంతర్గతంగా మాత్రం భయాందోళన చెందుతోంది. వంట గ్యాస్ కొరత ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గృహ వినియోగదారుల గ్యాస్పై ఎలాంటి ఆందోళన లేకపోయినా కమర్షియల్ గ్యాస్పై మాత్రం గందరగోళం ఏర్పడింది. ఈ గ్యాస్ కొరత ఉందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ కారణం చేత హోటళ్ల బంద్ చేపడతామని బెంగళూరులోని హోటళ్ల సంఘం ప్రకటించింది.
Also Read: Telangana CM: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తెలంగాణ సీఎం
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన వనరులపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సంఘర్షణలతో ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా చమురు, ఇంధనంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ కారణంగా వంటగ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం కారణంగా బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని హోటళ్ల నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కారణంతో బెంగళూరు హోటళ్ల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా రేపటి నుంచి హోటళ్ల బంద్ కార్యక్రమం చేపడతామని సంచలన ప్రకటన చేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడతాయని ప్రకటించింది. హోటళ్ల బంద్ పిలుపుతో ఒక్కసారిగా బెంగళూరులో ఆందోళన నెలకొంది.
హోటళ్ల బంద్తో హోటల్ పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వృద్దులు, అత్యవసర సేవలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడంతో హోటల్ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని హోటల్ సంఘం తెలిపింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో అంతర్జాతీయం ఎల్పీజీ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బపడింది. ఈ పరిస్థితుల్లో రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగరాదని.. ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. గ్యాస్ కొరతను నివారణ కోసం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్పై తీవ్ర ప్రభావం పడింది. గృహ వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇక కమర్షియల్ గ్యాస్ సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు హోటల్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Police: 'పోలీసులకు ఛాలెంజ్లు రెండు రకాలు.. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్. రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ను అధిగమించవచ్చు. కానీ అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థం చేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకున్నాం' అని తెలంగాణ సీఎం తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్-2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 కి.మీ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా పరిగణించుకుంటున్నాం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయి. మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమే' అని తెలంగాణ సీఎం తెలిపారు.
Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ
'ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేది. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న సిబ్బంది, అధికారులను అప్ గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోదించలేరు. రిట్రీట్ కార్యక్రమం ద్వారా మీ సమస్యలను గుర్తించి విశ్లేషించుకున్నారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
Also Read: Adulterated Wheat Flour: హైదరాబాద్ ప్రజల్లారా జరభద్రం! గోధుమ పిండి కూడా కల్తీ
'సమస్య ఏమిటో గుర్తిస్తే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లే. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. సమస్యల పరిష్కారానికి మీరు అందించిన ప్రతిపాదనలపై విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
'పోలీస్ శాఖలో సిబ్బంది రేషనలైజేషన్ చేసుకుని జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి' అని పోలీస్ శాఖకు తెలంగాణ సీఎం సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఇతర శాఖల్లా పోలీస్ శాఖలో ఆటోమోడ్.. ఆటో ప్రమోషన్ ఉండదని చెప్పారు. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సిందేనని తెలిపారు. అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Srikalahasti Temple: కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిపించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అనంతరం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. తన కొడుకు, కొత్త కోడలితో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. వియ్యంకులతోపాటు భార్యా పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా డిప్యూటీ సీఎం విక్రమార్క ఏపీకి వచ్చారు. ఏపీలోని తిరుమలతోపాటు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజ చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
తిరుమల వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం కుటుంబం మొక్కులు చెల్లించుకుంది. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల వచ్చిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. 'మా పెద్ద కుమారుడు వివాహం పూర్తయిన సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం కుటుంబసభ్యులతో తిరుమలకు వచ్చాం' అని తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నామని.. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ బడ్జెట్ ఉండబోతున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి చేసేలా త్వరలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నట్లు వెల్లడించారు.
Also Read: Virosh Gold: విజయ్, రష్మిక పెళ్లిలో 257 తులాల బంగారం.. ఇక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
అనంతరం తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సోమవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ ఈవో వెంకటేశులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తన కుమారుడు వివాహానికి ముందు గతనెలలో స్వామి వారి దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివాహననంతరం మొక్కు తీర్చుకోవడానికి కుటుంబసమేతంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తన భార్య, పిల్లలు, కొత్త కోడలితో కలిసి భట్టి విక్రమార్క రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేశారు. పూజల అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసునాంబ అమ్మవారిని భట్టి కుటుంబం దర్శించుకుంది. దర్శనం, పూజల అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. 'తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళ్లల్లో జరుగుతున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకున్నా' అని భట్టి విక్రమార్క తెలిపారు. దర్శనం అనంతరం శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధానంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి ఈవో వెంకటేశులు భట్టి కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందజేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Venezuela Gold: అమెరికా ఇటీవల వెనిజులా నుండి భారీ మొత్తంలో బంగారాన్ని దేశానికి తరలించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా అంతర్గత వ్యవహారాల కార్యదర్శి డగ్ బర్గమ్ ధృవీకరించారు. ఆయన ప్రకారం, సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారం ఇటీవల అమెరికాకు చేరుకుంది. ఈ బంగారం పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక రంగాల విస్తరణలో ఇది కీలక పాత్ర పోషించగలదని చెప్పారు.
బర్గమ్ వివరించినట్లుగా, అమెరికా ప్రస్తుతం వెనెజువెలా లో ఉన్న అరుదైన ఖనిజ సంపదను అన్వేషించేందుకు పలు ప్రణాళికలను రూపొందిస్తోంది. అక్కడ ఉన్న బంగారం నిల్వల విలువ దాదాపు 500 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బంగారంతో పాటు బాక్సైట్, అల్యూమినియం వంటి కీలక ఖనిజాలు కూడా అక్కడ లభిస్తాయని చెప్పారు. ఈ ఖనిజాలు రక్షణ రంగం, విద్యుత్ ఉత్పత్తి, అలాగే వినియోగ వస్తువుల తయారీలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
అదనంగా, ఈ వనరులు సాంకేతిక రంగంలో కూడా అమెరికాకు ప్రయోజనం కలిగిస్తాయని బర్గమ్ తెలిపారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతల అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, చైనాతో జరుగుతున్న సాంకేతిక పోటీలో అమెరికాకు ఈ ఖనిజాలు వ్యూహాత్మకంగా సహాయపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు కీలకమని కూడా చెప్పారు.
బర్గమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల అమెరికా చమురు, గ్యాస్, మైనింగ్ రంగాలకు చెందిన అధికారులు వెనిజులా పర్యటనకు వెళ్లారు. అక్కడి సహజ వనరులను పరిశీలించి, వాటిని వినియోగించే అవకాశాలపై చర్చలు జరిపారు. స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారని, ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, 2026 జనవరిలో అమెరికా వెనిజులాలో సైనిక చర్యలు చేపట్టింది. ఆ సమయంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించినట్లు సమాచారం. నార్కో-టెర్రరిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు.
వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మదురో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, అక్కడి చమురు ఉత్పత్తి, విక్రయాల నిర్వహణపై అమెరికా పలు ప్రైవేట్ సంస్థలతో చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో కొన్ని ఆర్థిక ఆంక్షలను కూడా తగ్గిస్తూ, వెనిజులాకు ముడి చమురు వ్యాపారం చేయడానికి లైసెన్సులు మంజూరు చేసింది.
ఈ పరిణామాలు అమెరికా ఆర్థిక, రక్షణ, ఇంధన వ్యూహాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. వెనిజులా నుండి వచ్చిన 100 మిలియన్ డాలర్ల బంగారం అమెరికా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ప్రపంచ మార్కెట్లో అమెరికా స్థానాన్ని మరింత బలపరచే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అలాగే సహజ వనరులపై వ్యూహాత్మక ప్రాప్యతతో అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో పాటు, వాణిజ్య, రక్షణ రంగాల్లో కూడా కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Ishan kishan sister dies before t20 wc final: ఈ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగింది. సమష్టిగా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీమ్ ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది. అంతేకాదు డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ను నిలబెట్టుకోవడంతో పాటు స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది.
ఫైనల్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు సంజు శాంసన్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన స్కోర్ను అందించాడు. మ్యాచ్ అనంతరం అధికారిక ప్రసారకర్తతో మాట్లాడిన ఇషాన్ కిషన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఫైనల్ మ్యాచ్కు రెండు రోజుల ముందు తన కజిన్ సిస్టర్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని తెలిపాడు. ఆ విషాద వార్త కారణంగా తన కుటుంబ సభ్యులు ఎవరూ ఫైనల్ మ్యాచ్కు రావలేకపోయారని చెప్పాడు. ఈ గెలుపును ఆమెకు అంకితం చేస్తున్నానని చెప్పుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఫైనల్కు ముందు మా కజిన్ సిస్టర్ ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కోసం నేనింకా బాగా ఆడాలని అనుకున్నాను. ఈ కప్ను ఆమెకే అంకితం చేస్తున్నాను. ఆమె ఇక మన మధ్య లేదని నమ్మడం చాలా కష్టం. మ్యాచ్కు ముందు ఈ విషాదం నన్ను మానసికంగా బాగా కుంగదీసింది. కానీ ఆమె కోసం ఈ ట్రోఫీ గెలవాలని సంకల్పించాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా నా విజయాన్ని చూసి ఆమె గర్వపడుతుందని నమ్ముతున్నాను అని ఇషాన్ తెలిపాడు.
ఈ విషాద సమయంలో తనకు జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంతో ధైర్యం చెప్పాడని కూడా వెల్లడించాడు. “నా సోదరి మరణించిన విషయం తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆ బాధను హార్దిక్ భాయ్తో పంచుకున్నాను. జట్టు ప్రయోజనాలను ముందుగా చూడాలని ఆయన సూచించారు. ఆయన మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఈ విజయం నాకు మరింత భావోద్వేగాన్ని కలిగిస్తోంది” అని చెప్పాడు.
ఇలాంటి కష్టకాలంలో తన కుటుంబంతో పాటు జట్టు సభ్యులందరూ తనకు అండగా నిలిచారని, సహచర ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని ఇషాన్ కృతజ్ఞతలు తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జట్టులోకి రావడం–మళ్లీ బయటపడడం వంటి పరిస్థితులు ఎదురైనా ఈ ప్రపంచకప్లో మంచి ప్రదర్శన చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పాడు.
ఇక ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ మరియు ఆమె భర్త మార్చి 6న జరిగిన ఘోర కారు ప్రమాదంలో మరణించారు. ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దంపతులకు ఆరు నెలల వయసున్న ఒక శిశువు, మూడు సంవత్సరాల చిన్నారి ఉన్నారు. అదృష్టవశాత్తూ ఆ ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషాదం కారణంగా ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడడానికి ఇషాన్ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్కు రావలేకపోయారు. అయితే ఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఇషాన్ కిషన్ తన బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ తన సోదరికి ప్రత్యేకంగా నివాళులర్పించాడు. ఆ క్షణం ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురి చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Adulterated Wheat Flour: ఏం తినాలన్నా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోటిలోకి ఒక ముద్ద పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది తింటే ఏమవుతుందోనని భయాందోళన చెందాల్సి వస్తోంది. దీనికి కారణం కల్తీ. ఆహార పదార్థాలను యథేచ్చగా కల్తీ చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించడం.. అధిక ఆదాయం.. లాభం కోసం వ్యాపారులు కొందరు కల్తీకి పాల్పడుతున్నారు. వారి దురాశకు ప్రజల ప్రాణాలు దెబ్బతింటున్నాయి. నూనెలు, నెయ్యి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ కల్తీ చేస్తుండగా.. తాజాగా గోధుమపిండిని కూడా కల్తీ చేస్తున్నారు. అలా కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: India vs NZ: విశ్వవిజేతగా భారత్.. కివీస్ను ఊచకోత కోసిన సూర్యసేన
హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శేరిలింగంపల్లి ఎస్ఓటీ బృందం గచ్చిబౌలి పరిధిలోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి చేసింది.
Also Read: Abhishek Sharma: ఇది అభిషేక్ నుంచి కోరుకున్నది.. దంచికొట్టిన కాటేరమ్మ కొడుకు
రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామాయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు బయటపడింది.
ఈ దాడిలో పోలీసులు మొత్తం 5,026 లీటర్ల కల్తీ వంట నూనె (సుమారు రూ.10,55,460 విలువ), 5,192 కిలోల గోధుమ పిండి (సుమారు రూ.3,11,520 విలువ)ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక వెయింగ్ మెషిన్, ఒక ఆయిల్ ఫిల్టర్ మెషిన్, ఒక గోధుమ ఫిల్టర్ మెషిన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టెంపో ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం సీజ్ చేశారు.
కల్తీకి పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన భన్వర్ రామ్ జాట్ (46), అతడి కుమారుడు అశోక్ కుమార్ (22)లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ ధరకు వచ్చే పదార్థాలను నమ్మకూడదని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Crude Oil Price Today: పశ్చిమాసియాలో ముడిచమురు ధరలు బ్యారెల్ కు దాదాపు 120 డాలర్ల మార్క్ ను దాటేసింది. ఇరాన్ యుద్ధం చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు అంతరాయం కలగడం.. గత మూడు సంవత్సరాలకు కాలంలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ ప్రమాణం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 117 డాలర్లకి చేరుకుంది. ఇది శుక్రవారం ముగింపు ధర $92.69 నుండి 16.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అమెరికా చమురు ధరలకు బెంచ్ మార్క్ గా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియ్ ధర 106.22 డాలర్లు వరకు పలికింది. అయితే శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఆ రేటు 90.90 డాలర్లుగా ఉంది. తాజాగా 16.9 శాతం పెరిగింది. దీంతో షికాగ మెర్కంటైల్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ ప్రారంభమైన అనంతరం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 16.5శాతం పెరిగింది. దీంతో 107. 97డాలర్లకు ఎగిసింది.గత వారం అమెరికా క్రూడ్ ధర 36శాతం, బ్రెంట్ క్రూడ్ 26శాతం వరకు పెరిగాయి. ఈ ఎఫెక్ట్ ట్రేడింగ్ లోనూ కనిపించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతం ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ వంటి దేశాల నుంచి ప్రపంచానికి పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. అయితే తాజా యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది.
నిల్వ ట్యాంకులు ఇప్పటికే నిండిపోవడంతో ఎగుమతులు తగ్గే పరిస్థితి రావడంతో ఇరాక్, కువైట్, యూఏఈ వంటి దేశాలు తమ ఉత్పత్తిని కొంత మేర తగ్గించినట్లు సమాచారం. ఇదే సమయంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు పరస్పరం చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడులు జరపడం ఆందోళనలను మరింత పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కూడా అస్థిరత కనిపిస్తోంది.
చమురు ధరలు కూడా ఈ ఉద్రిక్తతలతో ప్రభావితమయ్యాయి. అమెరికా ముడి చమురు ధర చివరిసారిగా 2022 జూన్ 30న బ్యారెల్కు 100 డాలర్లను దాటి 105.76 డాలర్ల వరకు చేరింది. అలాగే బ్రెంట్ ముడి చమురు ధర 2022 జూలై 29న బ్యారెల్కు సుమారు 104 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. తాజాగా మార్చి 1న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడులు జరిపిన తర్వాత చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనలను రేకెత్తించింది. ఇంధన ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అధికమవుతుందని, ముఖ్యంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో పెట్రోల్ ధరలు కూడా ఇటీవల పెరిగాయి. ఆదివారం నాటికి గాలన్ పెట్రోల్ ధర సుమారు 3.45 డాలర్లకు చేరింది. ఇది వారం రోజుల క్రితం కంటే గణనీయమైన పెరుగుదలగా పేర్కొంటున్నారు. డీజిల్ ధరలు గాలన్కు సుమారు 4.6 డాలర్లకు చేరాయి. ఈ ధరలు ఒక వారంలోనే దాదాపు 83 సెంట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ మాట్లాడుతూ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగదని చెప్పారు. త్వరలోనే పెట్రోల్ ధరలు మళ్లీ గాలన్కు 3 డాలర్ల కంటే దిగువకు రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ ప్రభావం కొన్ని వారాలు మాత్రమే ఉండవచ్చని తెలిపారు.
ఇదే సమయంలో టెహ్రాన్లోని ఒక చమురు డిపో మరియు పెట్రోలియం బదిలీ టెర్మినల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలుగురు మరణించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ డిపోలను ఇరాన్ సైన్యం క్షిపణి ప్రయోగాలకు అవసరమైన ఇంధన నిల్వల కోసం ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్ రోజుకు సుమారు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం చైనాకు వెళ్తుంది. యుద్ధ ప్రభావంతో ఈ ఎగుమతులు తగ్గితే చైనా ఇతర దేశాల నుంచి చమురు సరఫరాను పొందేందుకు ప్రయత్నించాల్సి వచ్చే అవకాశం ఉంది.
చమురు ధరలతో పాటు సహజ వాయువు ధరలు కూడా యుద్ధ ప్రభావంతో పెరుగుతున్నాయి. అయితే చమురు ధరలతో పోలిస్తే పెరుగుదల కొంత తక్కువగా ఉంది. ఆదివారం రాత్రి నాటికి సహజ వాయువు ధర 1,000 క్యూబిక్ అడుగులకు సుమారు 3.33 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇది శుక్రవారం ముగింపు ధర 3.19 డాలర్లతో పోలిస్తే సుమారు 4.6 శాతం ఎక్కువ. గత వారంలో మొత్తంగా సహజ వాయువు ధరలు దాదాపు 11 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Team India Creates New History: అద్భుతమైన ఆట తీరుతో అదరగొట్టిన భారత జట్టు టీ 20 ప్రపంచకప్ను వరుసగా రెండోసారి చేజిక్కించుకుంది. వరుసగా రెండోసారి ఐసీసీ ట్రోఫీని భారత జట్టు ముద్దాడింది. ఏమాత్రం ప్రత్యర్థి న్యూజిల్యాండ్ అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు, బౌలర్లు చెలరేగి ఆడి భారతదేశాన్ని చాంపియన్గా నిలిపారు. స్వదేశంలో జరిగిన ఫైనల్లో అద్భుతాలు చేసిన టీమిండియా ఆఖరి పోరులో కివీస్పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫలితంగా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను భారత జట్టు కైవసం చేసుకుంది. మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం ఆలయాల్లో పూజలు.. బెట్టింగ్ల జోరు
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 255 పరుగులు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 255 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన కివీస్ జట్టు వికెట్లకు పరుగులు చేసి ౦౦౦౦౦ తేడాతో ఘోరంగా ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. భారత్ ధాటికి ఏమాత్రం పోటీనివ్వకుండా కివీస్ ట్రోఫీని చేజార్చుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. ట్రోఫీని గెలవాలనే కసితో బ్యాటర్లందరూ అద్భుతంగా ఆడారు. ఓపెనర్ సంజూ శామ్సన్ మొదలుకుని చివరి బ్యాట్స్మన్ తిలక్ వర్మ వరకు అందరూ దుమ్మురేపారు. ప్రపంచకప్ కోసం తన ఇన్నింగ్స్ దాచుకున్నట్టు అభిషేక్ శర్మ ఫైనల్లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్ల కన్నాను పరిశీలిస్తే ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. ఈ మెగాటోర్నీ ప్రారంభం నుంచి నాకౌట్, సూపర్ 8, సెమీ ఫైనల్లో అభిషేక్ శర్మ అస్సలు బ్యాట్ కదిలించలేకపోయాడు. మూడుసార్లు డకౌట్.. తర్వాత డబుల్ డిజిట్ సాధించడానికి చాలా శ్రమించాడు. అలాంటి అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔరా అనిపించాడు.
Also Read: IND vs NZ Live: న్యూజిలాండ్కు భారీ లక్ష్యం.. భారత్ ఖాతాలో మరో ట్రోఫీ పక్కానా?
ఆడిన 21 బంతుల్లో 52 పరుగులు సాధించి అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఓవర్ తడబడ్డా కూడా తర్వాత పుంజుకుని సంజూ శామ్సన్తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధ సెంచరీలో 6 ఫోర్లు సాధించగా.. 3 సిక్సర్లు బాది అభిమానుల్లో జోష్ నింపాడు. ఎక్కడ డకౌట్ అవుతాడోనని భయాందోళన చెందిన ప్రేక్షకులకు మాత్రం అభిషేక్ ఉత్సాహం నింపి వారి నిరాశను దూరం చేశాడు. వరుసగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న అభిషేక్ ఫైనల్లో మాత్రం నిరాశపరిస్తే భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అయ్యేది. భారీ లక్ష్యం విధించి ప్రత్యర్థిని ప్రమాదంలో నెట్టాలని భారత్ వేసిన వ్యూహం అభిషేక్ శర్మ ఇన్నింగ్స్తో ఫలించిందని చెప్పుకోవచ్చు. సెంచరీ దిశగా అడుగుపెడతానుడనుకుంటే రచిన్ రవీంద్ర వేసిన చక్కటి బంతికి అభిషేక్ దొరికిపోయాడు. ఆ ఔట్ కూడా ఎలా ఔటయ్యాడా? అని ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పరిస్థితి. అభిషేక్ ఔటవడంతో క్రీజులోకి ఇషాన్ కిషన్ దిగాడు. మరి ఉత్కంఠ రేపే ఈ మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా ఆడి చివరికి విజయం సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook