కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి:బీఆర్ఎస్
Mahabubabad, Telangana:నేలకొండపల్లి లో BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నాయకులు ఆరోపించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేసారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
MP Lavu Krishna Devarayalu: ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మంచి మనసు..ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచిత చదువుకు హామీ!
Narasaraopeta, Andhra Pradesh:MP Lavu Krishna Devarayalu Latest News: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్నదే తమ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా ఎస్టీ విద్యార్థులకు నరసరావుపేటలోని ఎస్.ఎస్.ఎన్ (SSN) కళాశాలలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఎస్టీ ప్రతిభావంతులను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్లో 600 పైబడి మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీటు కల్పించి, ఉచిత విద్యను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల చదువులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి రాకూడదని, ధైర్యంగా పైచదువులకు పంపాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. అందులో ఏకంగా 287 మంది (83% పైగా) ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులకు, రాత్రింబవళ్లు కష్టపడి వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కనీసం డిగ్రీ వరకు చదివించాలి..
ఎస్టీ కుటుంబాల నుంచి ఒక్కో గ్రామానికి కనీసం నలుగురు చొప్పున చదువుకొని ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలన్నదే తమ కోరికని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆకాంక్షించారు. వారిని చూసి గ్రామంలోని మరో పది మంది స్ఫూర్తి పొంది చదువుకుంటారని చెప్పారు. ఎస్టీ విద్యార్థులు కనీసం డిగ్రీ వరకైనా పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సులువవుతుందని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే వేదికపై నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని స్థానిక ఉపాధ్యాయులు.. ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేటలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.
Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంపు?
Also Read: ఏపీలో అతిపెద్ద బంగారు గనీ..తవ్వేకొద్ది వచ్చి పడుతున్న బంగారం..సీఎం కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bhageerath Case: బండి భగీరథ్ కోసం రంగంలోకి దిగిన పోలీసులు..ఇల్లు తనిఖీ చేసిన పోలీసులు!
Hyderabad, Telangana:Bandi Bhageerath Case News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు వెతుకులాడుతున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని కూడా తనిఖీ చేశారని సమాచారం అందుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకోవాలని పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.AP CM Chandrababu: గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు..మూడో బిడ్డకు రూ.30,000..నాలుగో బిడ్డకు రూ.40,000!
Narasannapeta, Andhra Pradesh:CM Chandrababu On Population: నేడు శ్రీకాకుళంలోని నర్సన్నపేటలో జరిగిన "స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి గురించి మాట్లాడుతూనే జనాభా పెరుగుదల అవసరమని ఆయన అన్నారు. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహంగా మూడో బిడ్డకు రూ.30,000.. అలాగే నాలుగో బిడ్డ పుట్టిన తర్వాత రూ.40,000 అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.Peddi Chiru Leaks: 'పెద్ది' మూవీ ట్రైలర్పై చిరూ లీక్స్..వీడియో చూసి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..డైరెక్టర్కి క్షమాపణ!
Hyderabad, Telangana:Peddi Trailer Chiru Leaks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన 'చిరు లీక్స్'తో హైప్ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లారు. మే 18న ముంబైలో ఈ సినిమా ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. అయితే, అంతకంటే ముందే ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకోవడమే కాకుండా, ఒక పవర్ఫుల్ డైలాగ్ను కూడా లీక్ చేశారు.
'పెద్ది' ట్రైలర్ చూసిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన ఎక్సైట్మెంట్ను ఆయన పెట్టిన పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. "పెద్ది ట్రైలర్ చూసాను! జస్ట్ వావ్..అంతే. 3 నిమిషాలు… ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్.. అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి" అని 'పెద్ది' టీమ్పై ప్రశంసల వర్షం కురింపించారు.
అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి వివరిస్తూనే.. ఓ డైలాగ్ను మెగాస్టార్ చిరంజీవి లీక్ చేశారు. చిరూ లీక్స్కు పని చెప్పి చాలా రోజులు అవుతుందని చిరంజీవి చమత్కరించారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ 'పెద్ది' ట్రైలర్లోని ఓ డైలాగ్ను లీక్ చేశారు. 
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..." అనే డైలాగ్ లీక్ చేసి ఫ్యాన్స్లో క్యూరియాసిటీని మరింత పెంచారు. అయితే ఈ సినిమా ట్రైలర్లోని డైలాగ్ లీక్ చేయడం వల్ల 'పెద్ది' సినిమా డైరెక్టర్కు మెగాస్టార్ చిరంజీవి సారీ చెప్పారు. "Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ 'పెద్ది' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఇందులో కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మే 18న సినిమా ట్రైలర్ విడుదల చేయనుండగా.. జూన్ 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Also Read: టాలీవుడ్ నిర్మాతతో గొడవ పెట్టుకున్న త్రిష..సినిమాలో హీరోయిన్గా తీసుకోలేదని రచ్చ!
Also Read: విజయ్ నుంచి హన్సిక వరకు..విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు వీళ్లే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monsoon Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు..రాష్ట్రంలో వర్షాలు కురిసేది అప్పటి నుంచే..
Ram Krishna Pur, Andaman and Nicobar Islands:Southwest Monsoon Update: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. దీనితో దేశంలో వర్షాల సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. అయితే మన తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చేరేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు అండమాన్, నికోబార్ దీవుల్లోని మెజారిటీ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోనూ ఇవి ప్రవేశించాయి. మరో 3-4 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.
మే చివర్లో కేరళలోకి ఎంట్రీ!
సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈసారి వాతావరణ మార్పుల వల్ల అంతకంటే ముందే భారత్ను పలకరించబోతున్నాయి. ఈ ఏడాది మే 26 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తేదీకి ఒక నాలుగు రోజులు అటుఇటుగా (మే చివరి వారంలో) ఎప్పుడైనా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చు.
తెలుగు రాష్ట్రాలకు రాక ఎప్పుడు?
కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత సాధారణంగా దేశమంతటా విస్తరించడానికి సమయం పడుతుంది. కేరళను తాకిన దాదాపు 7 నుండి 10 రోజుల్లో రుతుపవనాలలోని రాయలసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈసారి మే నెలాఖరులోనే కేరళకు వస్తే, జూన్ మొదటి వారంలోనే ఏపీలో తొలి రుతుపవన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో ప్రవేశించిన కొద్దిరోజులకే తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. సెప్టెంబర్ వరకు ఈ వర్షాల కాల సీజన్ అలాగే కొనసాగుతుంది.
గత ఏడాది కూడా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల కారణంగా సాధారణ సమయం కంటే 8 రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత అంత త్వరగా నైరుతి రుతుపవనాలు రావడం గత ఏడాదే కావడం విశేషం.
వాతావరణ శాఖ నుంచి చల్లటి సమాచారం రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు రుతుపవనాలు తోడ్పతాయి. దీంతో రుతుపవనాల రాక కోసం తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంపు?
Also Read: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR Vs GT Prediction: గుజరాత్ టీమ్కు గోల్డెన్ ఛాన్స్..గెలిస్తే అగ్రస్థానానికి, కోల్కతా ట్విస్ట్ ఇస్తుందా?
Kolkata, West Bengal:KKR Vs GT Prediction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే నేడు జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తప్పక గెలవాల్సి ఉంటుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గుజరాత్, కోలకతా నైట్రైడర్స్తో తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో చిన్న అవకాశం కోసం కేకేఆర్ చూస్తుండగా.. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని గుజరాత్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ సునీల్ నరైన్కు ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో 200 మ్యాచ్ ఘనతను సాధిస్తాడు.
ఐపీఎల్ గణాంకాల ప్రకారం.. కోల్కతా నైట్రైడర్స్ ఇప్పటికీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే అది ఇతర టీమ్స్ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 11 మ్యాచ్ల నుండి 9 పాయింట్లతో ఉన్న కేకేఆర్, తమ మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే 15 పాయింట్లకు చేరుకోగలదు. ఒకవేళ ఏ టీమ్ 16 పాయింట్లను సాధించడం విఫలమైతే నాలుగో స్థానానికి కేకేఆర్ అధికారికంగా చేరుతుంది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆడే అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో మిగిలిన జట్లేవి 16 పాయింట్ల సాధించకపోతే కేకేఆర్ జట్టుకు ఛాన్స్ వస్తుంది.
మరోవైపు, గుజరాత్ వాస్తవంగా ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. వారు ఇప్పటికే 12 మ్యాచ్లలో 16 పాయింట్లతో సాధించగా.. మరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో అడుగుపెట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో, భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు ఇప్పటికీ 6 సార్లు తలపడ్డాయి. వీటిలో గుజరాత్ 6 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. కోల్కతా కేవలం ఒకే మ్యాచ్లో గెలుపొందడం గమనార్హం. ఈ గణాంకాలను చూస్తే గుజరాత్ టైటాన్స్ జట్టు కేకేఆర్పై పైచేయి సాధించింది. కానీ, ప్రస్తుత సీజన్ ఆరంభంలో కేకేఆర్ తడబడినా.. తాజాగా జరిగిన మ్యాచ్ల్లో రాణిస్తుంది.
కోల్కతా నైట్రైడర్స్ తుదిజట్టు అంచనా..
ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగక్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. (ఇంపాక్ట్ ప్లేయర్: సౌరభ్ దూబే).
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కాగిసో రబాడా, మహ్మద్ సిరాజ్. (ఇంపాక్ట్ ప్లేయర్: ప్రసిద్ కృష్ణ).
Also Read: పెళ్లిపీటలు ఎక్కనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్..ప్రేయసితో పెళ్లికి పాండ్యా రెడీ..
Also Read: హైదరాబాద్ Vs బెంగళూరు మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో ఖాళీ..ధరలు భారీగా పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Thalliki Vandanam: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంచుతామన్న సీఎం!
Narasannapeta, Andhra Pradesh:Thalliki Vandanam Amount: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో పాటు తల్లికి వందనం పథకం గురించి ఓ కీలక ప్రకటన చేశారు.
'స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. "రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. 'స్వచ్ఛాంధ్ర'తో ప్రారంభించి, 2047 నాటికి 'స్వర్ణాంధ్ర' సాధించడమే మన లక్ష్యం" అని పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
తాను ఎక్కడ ఉన్నా పేదల సేవ గురించే ఆలోచిస్తానని.. ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా, గౌరవప్రదంగా అర్హులకు పింఛన్లు అందుతున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు.
'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
గతంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న 'తల్లికి వందనం' పథకంపై సీఎం చంద్రబాబు నరసన్నపేట వేదికగా మరికొన్ని కీలక మార్గదర్శకాలను, ఆలోచనలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రతి పాఠశాల విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే, ఈ రూ.15,000 సాయాన్ని ఇంకా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం సంచలన ప్రకటన చేశారు.
అదే విధంగా పిల్లలను కనిపెంచాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బిడ్డలు ఆస్తి కానీ భారం కాదని ఆయన అన్నారు. ఈ క్రమంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించిన సీఎం.. మూడో బిడ్డ పుడితే రూ.30,000.. నాలుగో బిడ్డకు రూ.40,000 అందజేస్తామని ఆయన ప్రకటించారు.
Also Read: ఏపీలో అతిపెద్ద బంగారు గనీ..తవ్వేకొద్ది వచ్చి పడుతున్న బంగారం..సీఎం కీలక ప్రకటన!
Also Read: రూ.15,803 కోట్లతో పుట్టపర్తిలో డిఫెన్స్ పెట్టుబడి..ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంఖుస్థాప
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: కింగ్ కోబ్రా పడగపై ముట్టుకున్న స్నేక్ క్యాచర్.. చివరికి ఏం జరిగింది? వీడియో..
Hyderabad, Telangana:King Cobra Hood Video Watch Now: కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్.. మరోసారి అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములను పట్టడంలో తనదైన శైలిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఓ ఇంట్లో చొరబడిన భారీ కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో షాక్కు గురవుతున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియో వివరాల ప్రకారం.. ఒక నివాస గృహంలోకి సుమారు 7 నుంచి 8 అడుగుల పొడవున్న అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా చొరబడింది. సమాచారం అందుకున్న వావా సురేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా.. కేవలం చేతులతోనే ఆ పామును పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో పాము పడకపై చేయి వేసి అదుపు చేస్తుండగా.. ఆ కింగ్ కోబ్రా ఒక్కసారిగా కోపంతో సురేష్ పైకి దూసుకు వచ్చింది.. అత్యంత వేగంగా దాడి చేసేందుకు ప్రయత్నించిన ఆ సర్పం నుంచి ఆయన ఎంతో చాకచక్యంగా.. అన్ని సెకండ్ల పరిధిలోనే పక్కకు తప్పుకున్నారు. కొద్దిగా అటు ఇటు అయినా ఆయన ప్రాణాలకే ముప్పు వాటి లేదని వీడియో చూస్తే అర్థమవుతూ వస్తోంది.
ఈ వీడియో గతంలో ఎప్పటిదో అయినప్పటికీ.. ఎవరో కావాలనే ఇప్పుడు పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్ తో పాటు షేర్లతో వైరల్ గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు సురేష్ ధైర్యాన్ని మెచ్చుకున్నప్పటికీ.. అంతటి ప్రమాదకరమైన పాములతో వ్యవహరించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గతంలో కూడా వావా సురేష్ పలుమార్లు పాముకాటుకు గురై.. మృత్యు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారని ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ వీడియో చూసిన వన్యప్రాణి నిపుణులు సైతం స్పందిస్తూ వస్తున్నారు. కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములను పట్టుకునేటప్పుడు స్నేక్ ఉక్స్, చేతి తొడుగులు వంటి రక్షణ పరికరాలను తప్పకుండా వాడాలని.. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని వారి అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ కింగ్ కోబ్రా వర్సెస్ సురేష్ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Cobra Video: బుల్లెట్ బైక్లో దూరిన నాగుపాము.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం!
Hyderabad, Telangana:Cobra In Bullet Bike Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వింత విశేషాలు వైరల్ అవుతాయో ఊహించడం చాలా కష్టం. తాజాగా బైక్లో దర్శనమిచ్చిన అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక బుల్లెట్ మోటార్ సైకిల్లో భారీ నాగుపాము దూరిన ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చినీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
సాధారణంగా వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేసినప్పుడు సీట్ల కిందనో.. ఇంజన్ భాగంలోనో చిన్నపాటి జీవులు చేరడం చూస్తూ ఉంటాం.. కానీ ఇక్కడ ఏకంగా అత్యంత విషపూరితమైన నాగుపాము బుల్లెట్ బండిని తన నివాసంగా మార్చుకుంది.. రోడ్డుపై నిలిపించిన ఆ బుల్లెట్ మోటార్ సైకిల్లో నాగుపాము అటు ఇటు కదులుతూ ఉన్న దృశ్యాలను అటుగా వెళుతున్న కొందరు గమనించారు. మొదట అది ఏదో వైర్ అనుకోని పొరపాటు పడినప్పటికీ.. అది కదలడం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు.. పాము చూసి భయాందోళనతో బైకుకు దూరంగా ఉండిపోయారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
విషయం క్షణాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో ఆ బుల్లెట్ బండిలో ఉన్న పాములు చూసేందుకు జనం భారీగా గుమ్మికూడడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. స్థానిక స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే వార అక్కడికి తమకు కావాల్సిన పరికరాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు..
బైక్ వెనక సీటు కింద నాగుపాము గట్టిగా చుట్టుకొని పడుకోవడంతో దానిని బయటికి తీయడం రెస్క్యూటివ్కు పెద్ద సవాలుగా మారింది. పాముకు ఎటువంటి గాయం కాకుండా అలాగే అక్కడ ఉన్నవారికి ప్రమాదం జరగకుండా స్నేక్ క్యాచర్స్ ఎంతో చాకచక్యంగా.. అరగంట పాటు శ్రమించి కష్టపడి మరి ఆ నాగుపాముని సురక్షితంగా బయటికి తీశారు. అలా బయటికి తీసిన నాగుపామును ఒక ప్లాస్టిక్ సంచిలో బంధించి సురక్షితమైన ప్రదేశంలో తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే.. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Kaleshwaram: కాళేశ్వరంలో కాకతీయుల శిల్పకళా వైభవం.. రూ.1.20 కోట్లతో అత్యాధునిక మ్యూజియం!
Hyderabad, Telangana:Kaleshwaram Museum Latest Telugu News: ప్రముఖ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాలేశ్వరంలో కాకతీయుల కాలం నాటి అరుదైన పురాతన విగ్రహాలతో పాటు అద్భుతమైన శిల్ప సంపదను భద్రపరిచేందుకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.. ఇందులో భాగంగా ఒకటి పాయింట్ 20 కోట్ల భారీ వ్యాయామంతో ఒక ప్రతిష్టాత్మక మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో లభించిన, శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక కళాఖండాలను భక్తులతో పాటు పర్యాటకులు ఒకే చోట వీక్షించేలా ఈ అత్యాధునిక మ్యూజియంలో తీర్చిదిద్దుతున్నారు.
కాలేశ్వర పరిసర ప్రాంతాల్లో గతంలో జరిగిన తవ్వకాలతో పాటు ఆలయ పునర్నిర్మాణ సమయాల్లో కాకతీయ శిల్పాకళా వైభవానికి ప్రతీకంగా భావించే అనేక విగ్రహాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. కాలగర్భంలో కలిసిపోకుండా వీటిని సంరక్షించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యూజియంలో విగ్రహాలను ప్రదర్శించడమే కాకుండా.. వాటి చరిత్రక నేపథ్యంతో పాటు కాలం, ప్రాముఖ్యతను వివరించే డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పరిశోధనలకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన జ్ఞాన వేదికగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు..
త్వరలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్న సరస్వతీ నది పుష్కరాల నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుష్కరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది భక్తులు కాళేశ్వర క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉండడంతో.. వారందరికీ తెలంగాణ ప్రాచీన సాంస్కృతితో పాటు కాకతీయుల కళా నైపుణ్యాన్ని పరిచయం చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం..
Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
ప్రస్తుతం సివిల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.. ఇంటీరియల్ తో పాటు లైటింగ్ వ్యవస్థ, విగ్రహాల అమరిక కోసం ప్రత్యేక నిపుణుల బృందం పర్యావేక్షిస్తోంది. కాలేశ్వరం వచ్చి భక్తులకు ముక్తేశ్వరుని దర్శనంతో పాటు మన పూర్వీకుల శిల్పకళా నైపుణ్యాన్ని చూపించాలన్నదే మా లక్ష్యం అని అధికారులు తెలుపుతున్నారు. పుష్కర ఘాట్లకు సమీపంలోనే ఈ మ్యూజియం నిర్మిస్తున్నామని.. పనులను నిరంతరం పర్యావేక్షిస్తూ గడువులోగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.. ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే కాలేశ్వరం ఆధ్యాత్మిక, పర్యాటక రంగంలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Snake Attract Plants: ఇంట్లో ఈ చెట్లు ఉంటే పాముల ఎక్కడ ఉన్నా వచ్చేస్తాయి..పాములకు విపరీతంగా నచ్చే మొక్కలు!
Hyderabad, Telangana:Plants Attract Snakes: మన ఇంటి పెరట్లోని పచ్చని చెట్లు, మొక్కలు ఇళ్లకు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. అవి మనుషులకు మనశ్శాంతిని కలిస్తాయి. ఉదయాన్నే వికసించే పువ్వుల సువాసన, పచ్చని ఆకుల గుండా వీచే గాలి మనలోని ఒత్తిడిని, మనసులో ఆందోళనను తగ్గిస్తాయి. మనం ఎంతో ప్రేమతో పెంచే కొన్ని మొక్కలు మనకు మాత్రమే కాకుండా భూమిపై ఉన్న ఇతర జీవులకు కూడా ఆకర్షిస్తాయి. వాటి సువాసనతో జీవాలు వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని రకాల పువ్వులు, దట్టమైన పొదల నుండి వెలువడే సువాసన అయస్కాంతంలా పాములను ఆకర్షిస్తుంది. అయితే ఎలాంటి మొక్కలు, పువ్వులు ఇంట్లోకి పాములను ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గున్నెరా చెట్లు గొడుగు ఆకారంలో విశాలంగా పెరుగుతాయి. ఇవి గుబురుగా పెరగడం వల్ల వాటి కింద నీడ ఎక్కువగా ఉండడం సహా ఆ చెట్ల కింద ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో నేల చల్లగా ఉన్నప్పుడు పాములు విశ్రాంతి తీసుకునేందుకు వీలు ఉండదు. కానీ, గున్నెరా పువ్వుల దగ్గర వచ్చే కీటకాలు, తేనటీగలు, కప్పలు, బల్లులను పాములు వేటాడి తింటాయి. అందుకోసం పాములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే మనుషుల సంచారం తక్కువగా ఉన్న చోట పాములు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి.
మల్లెపువ్వుల సువాసన పాములను ఎక్కువగా ఆకర్షిస్తుంది. మల్లె పువ్వులు ప్రధానంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వికసించి వాటి సువాసనను గుబాళింపజేస్తాయి. అదే సమయంలో, పాములు కూడా ఆహారం కోసం బయటకు వస్తాయి. అందువల్ల, మల్లె పూల పొదలలో పాములు తరచుగా కనిపిస్తాయని కొందరు చెప్పే మాటల్లో లేదా మీరే స్వయంగా చూసే ఉంటారు. ఈ తీగల తేమ, చల్లదనం కూడా పాములను ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, మల్లె పూల పొదలు దట్టంగా ఉంటాయి. ఇది కూడా పాములు అక్కడ ఉండేందుకు ఇష్టపడతాయి.
గంధపు చెట్లు సహజంగా చాలా చల్లగా ఉంటాయి. శీతల రక్త జీవులైన పాములు, తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి ఈ చెట్ల వద్దకు వస్తాయి. గంధపు చెట్టు నుండి వెలువడే గంధపు వాసన పాములను ఆకర్షిస్తుంది. గంధపు మొక్కలు పెరిగే ప్రాంతం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఇది పాములకు చాలా అనువైనది. గంధపు చెట్టు బెరడు మరియు దాని చుట్టూ ఉండే దట్టమైన ఆకులు, పాములు పగటిపూట నిద్రపోవడం సహా శత్రువుల నుండి దాక్కోవడానికి అనువుగా ఉంటాయి.
తీగల మొక్కలు గోడల మీద లేదా నేల మీద చాలా దట్టంగా పెరుగుతాయి. ఆ తీగలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. పాములు ఈ దట్టమైన తీగల మధ్య కొరకగలవు. అంతేకాకుండా, ఈ తీగలు నేలపై సూర్యరశ్మి పడకుండా అడ్డుకుంటాయి, దీనివల్ల లోపల ఎప్పుడూ తేమగా, చల్లగా ఉంటుంది. ఇది పాములను ఆకర్షిస్తుంది. చిన్న కీటకాలు, బల్లులు, ఎలుకలు ఈ ఐవీ పొదల మధ్య నివసిస్తాయి. పాములు వాటిని వేటాడటానికి వస్తాయి. కాబట్టి, ఇలాంటి మొక్కలను ఇంటి చుట్టుపక్కల పెంచడం ఎంతో రిస్క్తో కూడుకున్న పని.
Also Read: Carrot Juice: ఎండల్లో క్యారెట్ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్యానికి అమృతమే!
Also Read: Grapes Juice: వేసవిలో రోజూ ద్రాక్ష జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Used Cars: కార్ల లవర్స్కి బంపర్ ఆఫర్.. సగం ధరకే మహీంద్రా థార్, స్కార్పియో, ఇన్నోవా క్రిస్టా..
Hyderabad, Telangana:Huge Second-Hand Car Market In Delhi News: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రియుల కోసం కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ అద్భుతమైన కార్లకు సంబంధించిన కార్ల మేళాను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని పీతాంపురా పరిధిలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్లు ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ మార్కెట్లో ఉన్న ఒక్కొక్క సెకండ్ హ్యాండ్ షో రూమ్లో దాదాపు 100కు పైగా సెకండ్ హ్యాండ్ డీజిల్, పెట్రోల్ కార్లు అత్యంత తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరలోనే కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఢిల్లీలోని ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తే ప్రత్యేకమైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే కొన్ని కార్లు అయితే ఇక్కడ కేవలం రూ.1,25,000 లోపే ప్రారంభం అవ్వడం విశేషం.. అయితే ఇక్కడ ఏయే బ్రాండ్లకు సంబంధించిన కార్లు అత్యంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక్కడ లభించే సెకండ్ హ్యాండ్ షోరూమ్స్లో మహీంద్రా స్కార్పియోతో పాటు ఎక్స్యూవీ 500 (XUV 500), థార్, టాటా హారియర్, సఫారీ, జీప్ కంపాస్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి స్విఫ్ట్, డిజైర్, ఇన్నోవా క్రిస్టా వంటి టాప్ బ్రాండ్లకు సంబంధించిన కార్లు అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ వస్తున్నాయి. ఇక్కడ వీటిని దాదాపు సగం ధరల్లోనే సొంతం చేసుకుని స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ను కూడా అందిస్తూ వస్తున్నారు. అలాగే దాదాపు 20 లక్షలకు పైగా విలువైన కొత్త మోడల్ బొలెరోతో పాటు మహీంద్రా థార్, స్కార్పియో వంటి కార్లను సగం ధరలకే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ లభించే అన్ని కార్లు కేవలం రూ.40 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినవని నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు..
అదేవిధంగా సన్రూఫ్తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కార్లు కూడా ఇక్కడ అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ వస్తున్నాయి.. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వినియోగదారుల కోసం ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్లు రన్ చేసే నిర్వాహకులు ప్రత్యేకమైన సదుపాయాలను కూడా అందిస్తూ వస్తున్నారు. ఢిల్లీ బయట రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వివిధ రకాల ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలుపుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా చెల్లుబాటే అయ్యే విధంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ను అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
అంతేకాకుండా కొనుగోలు చేసిన వాహనాలను కస్టమర్లు సొంత రాష్ట్రాలకు సురక్షితంగా పంపేందుకు నిర్వాహకులే ప్రత్యేకమైన ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కూడా అందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా వాహనాలపై లోన్ సదుపాయంతో పాటు ఇన్సూరెన్స్ కూడా అక్కడే అత్యంత తక్కువ ధరల్లో చేపిస్తున్నారు. ముఖ్యంగా SUV వాహనాలను రూ.10 లక్షల లోపే కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్గా భావించవచ్చు.. ఎందుకంటే ఇక్కడ అన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు సగం ధరల్లో, సగం కంటే తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ కొనుగోలు చేసేవారు తప్పకుండా అన్ని పత్రాలను, కార్లను బాగా పరిశీలించి మాత్రమే విక్రయించడం మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు..
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Luxury Cars In Delhi: రూ.16 లక్షలకే BMW, జాగ్వార్ లగ్జరీ కార్లు.. అన్ని కార్లు సగం ధరలకే మీ సొంతం..
Hyderabad, Telangana:Second Hand Luxury Cars In Delhi: సొంతగా ఒక మంచి కారును కొనుగోలు చేయాలని ప్రతి ఒక్క సాధారణ కుటుంబ సభ్యుడు కలలు కంటూ ఉంటాడు. ఇక సాధారణ ధనవంతులైతే లగ్జరీ కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. సాధారణంగా మార్కెట్లలో లగ్జరీ కార్లు కోట్ల రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీటిని ధనవంతులు సైతం కొనుగోలు చేయలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు అయితే, ఏకంగా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు విక్రయిస్తూ ఉంటారు. ఇలాంటి కార్లను ధనవంతులు సైతం సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇలా సెకండ్ హ్యాండ్ కార్ల ధరలోనే ఢిల్లీలో మంచి కండిషన్ కలిగిన లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫార్చునర్ కారు ధరకే లగ్జరీ కార్లు సొంతం చేసుకోవచ్చు.
ఢిల్లీలోని అశోక్ విహార్లో అందుబాటులో ఉన్న సెకండ్ హ్యాండ్ షోరూమ్స్లో మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోని, హర్భజన్ సింగ్ వంటి ఎందరో ప్రముఖ సెలబ్రిటీలు ఎంతగానో ఇష్టపడే ఐకానిక్ లగ్జరీ మోడల్ హమ్మర్ H2 (Hummer H2) ఇక్కడి సెకండ్ హ్యాండ్ షోరూమ్స్లో కొనుగోలు చేసే వారికి అత్యంత చవక ధరలో లభిస్తుంది. అంతేకాకుండా దీనిని వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో విక్రయిస్తున్నారు. అయితే, ఈ కారు 2009 మోడల్కు సంబంధించింది. ఇది రాయల్ ఎల్లో కలర్ లో అందుబాటులో ఉంది. అలాగే దీనికి 2029 వరకు పూర్తి ఫిట్నెస్ వాలిడిటీ కలిగి ఉంది. మార్కెట్లు దీనికి ఉన్న క్రేజీను దృష్టిలో పెట్టుకొని ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కేవలం రూ.52 లక్షల లోపే విక్రయిస్తున్నారు..
అలాగే భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాని నిస్సాన్ పెట్రోల్ 2026 మోడల్ లగ్జరీ కార్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్ కి సంబంధించిన 2025 మోడల్ కార్లు అయితే ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్తో విక్రయిస్తున్నారు. అలాగే ఢిల్లీలోని రోడ్డు టాక్స్తో పాటు ఇన్సూరెన్స్, VIP ఫ్యాన్సీ నెంబర్లతో కలిగిన ఈ బ్రాండ్ కొత్త కార్లు కేవలం రెండు కోట్ల లోపే విక్రయిస్తున్నారు. దీనిపై దాదాపు 80 నుంచి 90 శాతం వరకు ఫ్యాన్ ఇండియా బ్యాంకు లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలను కూడా అందిస్తూ వస్తున్నారు.
రూ.16 లక్షల లోపే లగ్జరీ కార్లు..
సాధారణంగా వర్నా లేదా క్రెటా కార్లను బడ్జెట్ ఉన్న వారు కొనుగోలు చేస్తారు. అయితే, ఇదే కార్ల బడ్జెట్లో ఆడి కార్లతో పాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు ఈ మార్కెట్లో లభించడం విశేషం.. ముఖ్యంగా జాగ్వర్ బ్రాండ్కి సంబంధించిన కార్లు కూడా ఇక్కడ అత్యంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 2018 పెట్రోల్ టాప్ ఎండ్ మోడల్ జాగ్వార్ ఎక్స్ ఎఫ్ కార్లు కేవలం ఇక్కడ రూ.17 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనికి కేవలం నాలుగు లక్షల లోపే డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు సులభంగా ఈఎంఐ లోన్ లభిస్తుంది.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
అంతేకాకుండా ఆడి ఏ సిక్స్తో పాటు మెర్సిడెస్ సి క్లాస్ 2016 మోడల్ పెట్రోల్ ఇంజన్ కలిగిన కార్లు కేవలం ఇక్కడ రూ.16 లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ x7 ప్రత్యేకమైన ఎడిషన్ కేవలం 64 లక్షల లోపే అందుబాటులో ఉంది. అదేవిధంగా బీఎండబ్ల్యూ x5 కారు కూడా ఇక్కడ రూ.42 లక్షల లోపే లభిస్తుంది. ఇక ఇవే కాకుండా ఆడి q5, ల్యాండ్ రోవర్ ఎవోక్ కార్లు అయితే, కేవలం రూ.20 లక్షలు లోపే అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇలాంటి బ్రాండ్లకు సంబంధించిన ఎన్నో కార్లు అత్యంత తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉండడం విశేషం.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: ఒకే రోజు రెండు దారుణాలు.. ఆస్తి తగాదాలు, గొడవలతో తండ్రులను పొట్టనబెట్టుకున్న కిరాతకులు!
Karimnagar, Telangana:Karimnagar Double Murder Latest News: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలుస్తూ వస్తున్నాయి. కన్న ప్రేమ కరువైపోతోంది.. నవ మాసాలు పెంచి.. రక్తాన్ని కూడుగా చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులపైనే కొడుకులు కిరాతకులుగా మారుతూ వస్తున్నారు. చిన్నపాటి ఆస్తి తగాదాలతో పాటు పంపకాల్లో లెక్కల తప్పుల కారణంగా క్షణికావేషాల్లో కన్నవారిని కాటికి పంపుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 11న పోషణ భారమై.. కన్నతల్లి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేరువేరు వరస హత్యలు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇల్లందకుంటలో జరిగిన ఘటన..
మొదటి ఘటన ఇల్లందకుంట మండలంలో చోటుచేసుకుంది. వ్యవసాయ భూమి కౌలుకు సంబంధించిన విషయంలో తండ్రి కొడుకుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూ వస్తోందట.. ఈ క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్దదైపోయింది.. తీవ్ర ఆగ్రహానికి లోనైన కొడుకు.. ఇంట్లోని రోకలి బండను తీసుకొని కన్న తండ్రి తలపై బలంగా బాదాడు.. తీవ్ర రక్తస్రాభమై ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..
కరీంనగర్లో మరో ఘటన..
ఈ దారుణం మరవక ముందే కరీంనగర్ నగర పరిధిలో మరో ఘోరం చోటుచేసుకుంది.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇక్కడ ఒక కొడుకు కసాయిగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తండ్రితో ఏర్పడిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో.. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని తండ్రి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ తో పాటు తలభాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో ఆ తండ్రి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు..
Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు దారుణ హత్యలతో కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలను సందర్శించి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నిందితులపై హత్య కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు..
సమాజం ఇంత ఇంత దారుణంగా ఎందుకు మారుతుంది?
ఆధునిక సమాజంలో నైతిక విలువలు నశించిపోతున్నాయి అనడానికి ఈ సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆస్తులతో పాటు ఇతర వాటికోసం కన్నపేగును పెంచేస్తున్న కసాయి కొడుకుల తీరుపై సానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కిరాతకులకు చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు పడాలని అధికారులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు..
Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Jupiter Transit 2026: పుష్యమి నక్షత్రంలోకి గురుడు.. ఈ 4 రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు, ఊహించని సక్సెస్!
Hyderabad, Telangana:Jupiter Transit In Pushya Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి.. ఇది జాతకంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తుల జాతకాల్లో గురు గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి దేనికి డోకా ఉండదు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో కూడా దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతూ ఉంటారు. అలాగే ఉన్నట్టుండి రాత్రికి రాత్రే అదృష్టం సహకరించి సక్సెస్ అవుతారు. ఇవన్నీ జాతకంలో గురు గురు గ్రహం స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ గ్రహం అతి త్వరలోనే పుష్యమి నక్షత్రంలోకి సంచారం చెయ్యబోతోంది. గురు నక్షత్ర సంచారానికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు..
ఈ సంవత్సరం జూన్ 18వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అదృష్టంతో పాటు జ్ఞానం, ఆనందానికి అధిపతి అయిన గురు పుష్య నక్షత్రం లోకి సంచారం చేయబోతోంది. ముఖ్యంగా శని నక్షత్రంగా పరిగణించే ఈ నక్షత్రంలోకి గురుడు సంచారం చేయడం చాలా ప్రత్యేకమైన. దీని కారణంగా నాలుగు రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు అసంపూర్తిగా ఉండ పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు, డబ్బే..డబ్బే!
కర్కాటక రాశి
శని నక్షత్రంలో గురుగ్రహం సంచారం చేయడం కారణంగా కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కలగవచ్చు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా కుటుంబ సంబంధిత సమస్యలనుంచి పరిష్కారం లభించబోతోంది. ఉద్యోగాలు చేస్తున్నవారు అద్భుతమైన పదోన్నతులు పొందడమే కాకుండా జీతాలు విపరీతంగా పెరుగుతాయి. సమాజంలో వీరికి గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కన్యారాశి
శని నక్షత్రంలో గురుగ్రహం సంచారం చేయడం కన్యారాశి వారికి కూడా చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ప్రదేశాల్లో విపరీతమైన గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఊహించని స్థాయిలో హోదా పెరిగి అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీని కారణంగా మానసిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా మారుతుంది. వృత్తి జీవితంలో కూడా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి
గురు గ్రహ సంచారంతో ధనస్సు రాశి వారికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అంతేకాకుండా ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే వారికి మంచి లాభాలు కూడా కలుగుతాయి. దీంతోపాటు పాత సమస్యల నుంచి అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా వీరు ఉద్యోగాల్లో మార్పులు పొంది.. అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు..
మీన రాశి
గురు గ్రహ సంచారంతో మీన రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు చేసుకునే వారికి మంచి భాగస్వాములతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు తప్పకుండా శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా అదృష్టం తోడుండి.. అన్ని రకాల లాభాలు పొందగలుగుతారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభించి అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. ఇక్కడ అందించిన వార్త కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని రాసింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
