Back
Kotha Yakesh
Khammam507002

ఖమ్మం: సెప్టెలిక్ ట్యాంకులతో ధర్నా

KYKotha YakeshNov 27, 2024 06:57:09
Dhamsalapuram, Telangana:
ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు సెప్టిక్ ట్యాంక్ వాహనాలతో కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వ్యర్థాలను డంప్ చేయడానికి ఖమ్మం చుట్టుప్రక్కల సుమారు 20 కిలో మీటర్ల మేర ఎక్కడ డంప్ చేయనివ్వడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేసారు. వరదలు వచ్చిన తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.
1
Report
Khammam507001

ఖమ్మంలో శిక్షణపూర్తి చేసుకున్న ఏఆర్, సివిల్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు

KYKotha YakeshNov 21, 2024 08:39:34
Khammam, Telangana:
శిక్షణపూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థుల అవుట్ పాసింగ్ ఖమ్మంలో జరిగింది. రామగుండం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 263 అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు నగరంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అవుట్ పాసింగ్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి మల్టీజోన్_1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, సిపి సునీల్ దత్ తదితరులు హాజరయ్యారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
1
Report
Mahabubabad506101

ఖమ్మంలో ప్రత్యక్షమైన లేడీ ఆఘోరీ

KYKotha YakeshNov 17, 2024 10:28:05
Mahabubabad, Telangana:
ఖమ్మం జిల్లా మధిరలో లేడీ ఆఘోరీ ప్రత్యేక్షం అయింది. ఓ ప్రవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె చేరుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇదే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని హాజరైయ్యారు. ఈ క్రమంలో ఆఘోరీ కాళ్లు మొక్కిన నందిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నేపాథ్యంలో స్థానికులు ఆఘోరీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
1
Report
Mahabubabad506101

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్3 పరీక్ష

KYKotha YakeshNov 17, 2024 10:26:36
Mahabubabad, Telangana:
ఖమ్మం జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 పరీక్ష ఉండగా మద్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్2 పరీక్ష కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలు ఉండగా 27,984 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. నిమిషం నిభందన అమల్లో ఉండడంతో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
1
Report
Advertisement
Khammam507001

రుణమాఫీ చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

KYKotha YakeshOct 29, 2024 05:29:17
Khammam, Telangana:
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని ఖమ్మం కలెక్టర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేసాయి. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఒక క్లారిటీతో లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, మౌలానా పాల్గొన్నారు.
1
Report
Khammam507003

ఖమ్మం గ్రీవెన్స్ భారీగా బాధితుల ఫిర్యాదులు

KYKotha YakeshOct 28, 2024 17:46:41
Khammam, Telangana:
ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ డేకు ప్రజలు పెద్దసంఖ్యలో తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు తనీఖీ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ కు సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో భారీగా బాధితులు గ్రీవెన్స్ కు తరలివస్తున్నారు.
1
Report
Khammam507001

మధిరలో సబ్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

KYKotha YakeshOct 26, 2024 16:30:35
Khammam, Telangana:
ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా మంజూరైనా సబ్ కోర్టు(సీనియర్ సివిల్ జడ్జి కోర్టు) భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీ సుధ,కాజ శరత్,భీమపాక నగేష్ లు భూమి పూజచేశారు. అనంతరం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన సబ్ కోర్టు ను హైకోర్టు జడ్జిలు ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు విసృతపరచడం కోసం నూతన కోర్టులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో పాటు మధిర న్యాయవాదులు పాల్గొన్నారు.
1
Report
Khammam507002

చింతకాని: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

KYKotha YakeshOct 24, 2024 10:03:56
Khammam, Telangana:

చింతకానిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పులంటూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేసారు. ఈక్రమంలో పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపాథ్యంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. అనంతరం బలవంతంగా పుల్లయ్య ను స్టేషన్ కు తరలించారు. ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

1
Report
Mahabubabad506101

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి:బీఆర్ఎస్

KYKotha YakeshOct 20, 2024 13:44:01
Mahabubabad, Telangana:
నేలకొండపల్లి లో BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నాయకులు ఆరోపించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటన్నారు. ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేసారు.
1
Report
Khammam507003

కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

KYKotha YakeshOct 09, 2024 07:05:32
Khammam, Telangana:
కల్లూరు మండలం నారాయణపురం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంలో పర్యటించారు. ఈక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తేగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామినిచ్చారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకుని పూజలు చేసారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఉన్నారు.
1
Report
Khammam507003

ఖమ్మం: సింగరేణి బాధిత ప్రాంతంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పర్యటన

KYKotha YakeshOct 04, 2024 13:49:53
Khammam, Telangana:
సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతం కిష్టారంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి ఎమ్మెల్యే రాగమయి పర్యటించారు. ఈక్రమంలో సింగరేణి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. సింగరేణి నుండి వచ్చే పేలుళ్లతో నివాసాలు కుంగిపోయి, పగుళ్లు వస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వాయు, శబ్ద కాలుష్యంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు.
1
Report
Khammam507003

ఖమ్మంలో 4 కోట్ల గంజాయిని దహనం: ఎక్సైజ్ పోలీసుల శక్తివంతమైన చర్య!

KYKotha YakeshOct 04, 2024 10:03:16
Kamanchikal, Telangana:
ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ లో రికవరీ చేసిన రూ. 4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసారు. 1611.947 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలోని ఐఎన్టీసీ కాంప్లెక్స్ లో దహనం చేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ జి. గణేష్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుండగా అడ్డుకుని ప్రభుత్వ అనుమతితో దహనం చేసామన్నారు.
1
Report
Mahabubabad506381

ఖమ్మంలో 5 కిలోల మాదక పదార్థం: యువకులు అరెస్టు!

KYKotha YakeshSept 28, 2024 08:18:39
Dornakal, Telangana:

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం సమీపంలో బైక్ పై అవిధి నషీల మాదక పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం నుండి గుంటూరుకు 5 కిలోల అవిధి నషీల మాదక పదార్థంతో పల్సర్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసిన బైక్ మరియు మాదక పదార్థాలను సత్తుపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

1
Report
Mahabubabad506101

వయస్సుతో సంబంధం లేకుండా ఎదైనా సాధించవచ్చు: కలెక్టర్

KYKotha YakeshSept 28, 2024 06:24:20
Mahabubabad, Telangana:
తెలంగాణ తొలి దశ ఉద్యమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసిన కలెక్టర్ నివాళిఅర్పించారు. ఈ క్రమంలో అయన చేసిన సేవలను కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎదైనా సాధించవచ్చని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని ఆయన ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
1
Report
Mahabubabad506101

తిరుపతి లడ్డూ కల్తీపై పురోహితుల నిరసన

KYKotha YakeshSept 27, 2024 12:48:35
Mahabubabad, Telangana:
తిరుపతిలో కల్తీ లడ్డు ఘటనపై సత్తుపల్లిలో హిందూభక్త ధార్మిక మండలి సంస్థ కార్యకర్తలు(పురోహితులు) నిరసన చేపట్టారు. ఈక్రమంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం నుండి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ చేసారు. ఈ నేపాథ్యంలో నడిరోడ్డుపై పురోహితులు దోష పరిహార మంత్రాన్ని చదివారు. కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బోర్డును ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేసారు.
1
Report
Mahabubabad506101

భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన: ఎమ్మెల్యే మట్టా రాగమయి

KYKotha YakeshSept 27, 2024 12:47:27
Mahabubabad, Telangana:
సత్తుపల్లి పట్టణంలో విప్లవ యోధుడు భగత్ సింగ్ విగ్రహానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి శంకుస్థాపన చేసారు. భగత్ సింగ్ త్యాగానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన భగత్ సింగ్ దేశ స్వతంత్రం కోసం కృషి చేసారని కొనియాడారు.. విగ్రహా నిర్వహణ కమిటిలో ఆదినారాయణ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే అన్నారు.
1
Report
Mahabubabad506101

భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీ వలలో అవినీతి చేప

KYKotha YakeshSept 19, 2024 06:21:45
Mahabubabad, Telangana:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు రైడ్ చేసారు. ఈ రైడ్ లో రూ. లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ రెడ్ హ్యాండెండ్ గా పట్టుపడ్డారు. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై.రమేష్ విచారణను కొనసాగిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించి సబ్సిడీ పొందేందుకు సర్టిఫై చేయడం కోసం లంచం డిమాండ్ చేసాడు.
1
Report
Mahabubabad506101

ఖమ్మం: రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం

KYKotha YakeshSept 16, 2024 13:44:47
Mahabubabad, Telangana:
ఖమ్మం ప్రకాశ్ నగర్ రైల్వే సమీపంలో ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. శరీర బాగాలు విడిపోయి మృతదేహం కనిపించగా రైల్వే పోలీసులు గుర్తించి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోలీసుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.
1
Report
Mahabubabad506101

ఖమ్మం: గణేష్ నిమజ్జనంలో అపశృతి

KYKotha YakeshSept 16, 2024 13:03:03
Mahabubabad, Telangana:

ఖమ్మంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. బ్రహ్మణబజార్ శివాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన 32 అడుగుల మట్టి గణపతి నేలమట్టం అయ్యాడు. నిమజ్జనానికి క్రేన్ సహాయంతో వాహనం పైకి తరలిస్తుండగా ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఖమ్మంలోనే అతిపెద్ద మట్టి గణపతిగా ఈ విగ్రహం పేరుంది.

1
Report
Mahabubabad506104

ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

KYKotha YakeshSept 08, 2024 11:11:13
Thattupalle, Telangana:

ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపాథ్యంలో మొదటగా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాన్ని వారు పరిశీలించిన అనంతరం తిరుమలాయపాలెం మండలం రాకాసితండలో పర్యటించారు. వరద ప్రవాహంతో రాసాకితండా మొత్తం కొట్టుకుపోయింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసి పంట సాగుచేయడానికి అవకాశం లేకుండా పోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. 

1
Report
Mahabubabad506104

ఖమ్మం జిల్లాలో వరదల పరిస్థితిని తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం భట్టి

KYKotha YakeshSept 08, 2024 11:08:12
Thattupalle, Telangana:
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ మండలం అయ్యగారిపల్లి గ్రామం వద్ద నుండి వెళుతుండగా గ్రామస్తులు భట్టిని‌ తమ గ్రామంలో ఆగాలని కోరారు. దీంతో ఆయన కాసేపు ఆగి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు‌. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై భట్టిని అడిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేసారు.
1
Report
Khammam507003

నేలకొండపల్లికి ప్రపంచ స్థాయి తీసుకొస్తా: మంత్రి పొంగులేటి

KYKotha YakeshAug 22, 2024 04:27:42
Khammam, Telangana:

భక్తరామదాసు నడియాడిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈక్రమంలో ఎంపి రాఘురంరెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి భక్తరామదాసు మందిరంలో ధ్యానమందిరాన్ని పొంగులేటి ప్రారంభించారు. భక్తరామదాసు ఆనాడు స్వర్థం కోసం పనిచేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసారు.

1
Report
Khammam507001

రుణమాఫీ కాలేదని బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా

KYKotha YakeshAug 21, 2024 11:55:27
Khammam, Telangana:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు.ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం కొంతమంది రైతులకు అందలేదని,అర్హత ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఈ నిరసన ధర్నా నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ లిస్ట్ ఇస్తే ప్రభుత్వానికి అందజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో,రైతుల ధర్నా విరమించారు.
1
Report
Warangal506134

ఖమ్మంలో వర్షం, వేడి నుంచి ఉపశమనం

KYKotha YakeshAug 20, 2024 06:38:20
Manglavaripet, Telangana:

ఖమ్మం నగరంలో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండవేడిమితో బాధపడుతున్న ప్రజలు వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా కాలువలు పొంగి పొర్లాయి. పాత బస్ స్టేషన్ వద్ద రోడ్డుపై వరద నీరు వ్యాపించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

1
Report
Warangal506003

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: అఖిల పక్ష పార్టీలు

KYKotha YakeshAug 20, 2024 06:36:07
Kazipet, Telangana:
ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలని ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. ఈ క్రమంలో స్థానిక తహశీల్దారు కు వినతి పత్రం‌ అందించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని సాంకేతిక కారణాలతో పాటు పలు విధాలుగా షరతులు పెట్టడంతో మాఫీ వర్తించడం లేదన్నారు. ఈ నేపాథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతులందరికి మాఫీ చేయాలని లేదంటే ఆందోళనలకు సిద్ధమవుతామని స్పష్టం చేసారు.
0
Report
MahabubabadMahabubabad

ఖమ్మంలో సీఎం‌ సభకు సిద్దం

KYKotha YakeshAug 15, 2024 18:28:06
Ravigudem, Telangana:

నేడు ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ క్రమంలో సభ వేధిన సిద్ధం చేసారు. రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను ఇదే సభ వేధికపై డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు‌. సభకు పెద్ద సంఖ్యలో రైతులను తరలించేలా నేతలు ఏర్పాట్లు చేసారు. మద్యాహ్నం 2:30 గంటల తర్వాత సభ వేధికపై సీఎం చేరుకుని మాట్లాడనున్నారు

1
Report