Back
Kotha Yakesh
Mahabubabad506101blurImage

ఖమ్మం: రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం

Kotha YakeshKotha YakeshSep 16, 2024 13:44:47
Mahabubabad, Telangana:
ఖమ్మం ప్రకాశ్ నగర్ రైల్వే సమీపంలో ట్రాక్ పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. శరీర బాగాలు విడిపోయి మృతదేహం కనిపించగా రైల్వే పోలీసులు గుర్తించి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోలీసుల సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.
1
Report
Mahabubabad506101blurImage

ఖమ్మం: గణేష్ నిమజ్జనంలో అపశృతి

Kotha YakeshKotha YakeshSep 16, 2024 13:03:03
Mahabubabad, Telangana:

ఖమ్మంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. బ్రహ్మణబజార్ శివాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన 32 అడుగుల మట్టి గణపతి నేలమట్టం అయ్యాడు. నిమజ్జనానికి క్రేన్ సహాయంతో వాహనం పైకి తరలిస్తుండగా ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఖమ్మంలోనే అతిపెద్ద మట్టి గణపతిగా ఈ విగ్రహం పేరుంది.

1
Report
Mahabubabad506104blurImage

ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

Kotha YakeshKotha YakeshSep 08, 2024 11:11:13
Thattupalle, Telangana:

ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపాథ్యంలో మొదటగా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాన్ని వారు పరిశీలించిన అనంతరం తిరుమలాయపాలెం మండలం రాకాసితండలో పర్యటించారు. వరద ప్రవాహంతో రాసాకితండా మొత్తం కొట్టుకుపోయింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసి పంట సాగుచేయడానికి అవకాశం లేకుండా పోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. 

1
Report
Mahabubabad506104blurImage

ఖమ్మం జిల్లాలో వరదల పరిస్థితిని తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం భట్టి

Kotha YakeshKotha YakeshSep 08, 2024 11:08:12
Thattupalle, Telangana:
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముదిగొండ మండలం అయ్యగారిపల్లి గ్రామం వద్ద నుండి వెళుతుండగా గ్రామస్తులు భట్టిని‌ తమ గ్రామంలో ఆగాలని కోరారు. దీంతో ఆయన కాసేపు ఆగి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు‌. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై భట్టిని అడిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేసారు.
1
Report
Khammam507003blurImage

నేలకొండపల్లికి ప్రపంచ స్థాయి తీసుకొస్తా: మంత్రి పొంగులేటి

Kotha YakeshKotha YakeshAug 22, 2024 04:27:42
Khammam, Telangana:

భక్తరామదాసు నడియాడిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈక్రమంలో ఎంపి రాఘురంరెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి భక్తరామదాసు మందిరంలో ధ్యానమందిరాన్ని పొంగులేటి ప్రారంభించారు. భక్తరామదాసు ఆనాడు స్వర్థం కోసం పనిచేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసారు.

1
Report
Khammam507001blurImage

రుణమాఫీ కాలేదని బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా

Kotha YakeshKotha YakeshAug 21, 2024 11:55:27
Khammam, Telangana:
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్న గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు.ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం కొంతమంది రైతులకు అందలేదని,అర్హత ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఈ నిరసన ధర్నా నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు అందరూ లిస్ట్ ఇస్తే ప్రభుత్వానికి అందజేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో,రైతుల ధర్నా విరమించారు.
1
Report
Warangal506134blurImage

ఖమ్మంలో వర్షం, వేడి నుంచి ఉపశమనం

Kotha YakeshKotha YakeshAug 20, 2024 06:38:20
Manglavaripet, Telangana:

ఖమ్మం నగరంలో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండవేడిమితో బాధపడుతున్న ప్రజలు వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా కాలువలు పొంగి పొర్లాయి. పాత బస్ స్టేషన్ వద్ద రోడ్డుపై వరద నీరు వ్యాపించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

1
Report
Warangal506003blurImage

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: అఖిల పక్ష పార్టీలు

Kotha YakeshKotha YakeshAug 20, 2024 06:36:07
Kazipet, Telangana:
ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలని ఖమ్మం జిల్లా వైరాలో అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేసాయి. ఈ క్రమంలో స్థానిక తహశీల్దారు కు వినతి పత్రం‌ అందించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని సాంకేతిక కారణాలతో పాటు పలు విధాలుగా షరతులు పెట్టడంతో మాఫీ వర్తించడం లేదన్నారు. ఈ నేపాథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతులందరికి మాఫీ చేయాలని లేదంటే ఆందోళనలకు సిద్ధమవుతామని స్పష్టం చేసారు.
0
Report
MahabubabadMahabubabadblurImage

ఖమ్మంలో సీఎం‌ సభకు సిద్దం

Kotha YakeshKotha YakeshAug 15, 2024 18:28:06
Ravigudem, Telangana:

నేడు ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ క్రమంలో సభ వేధిన సిద్ధం చేసారు. రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను ఇదే సభ వేధికపై డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు‌. సభకు పెద్ద సంఖ్యలో రైతులను తరలించేలా నేతలు ఏర్పాట్లు చేసారు. మద్యాహ్నం 2:30 గంటల తర్వాత సభ వేధికపై సీఎం చేరుకుని మాట్లాడనున్నారు

1
Report
Khammam507003blurImage

ఆదివాసీలకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు కావాలి: వీరనారీమణుల సమితి

Kotha YakeshKotha YakeshAug 09, 2024 13:28:22
Khammam, Telangana:

ఖమ్మంలో వీరనారీమల ఆశయ సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహించింది. గిరిజనుల లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. అడవిని ఆదివాసీలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

1
Report
Mahabubabad506101blurImage

ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్‌ సమావేశం

Kotha YakeshKotha YakeshAug 09, 2024 11:10:09
Mahabubabad, Telangana:

ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.

1
Report
Mahabubabad506381blurImage

ఖమ్మంలో ఆదివాసీ గిరిజనుల ర్యాలీ

Kotha YakeshKotha YakeshAug 09, 2024 10:31:58
Mannegudem, Telangana:
ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవం ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈక్రమంలో నగరంలోని నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈనేపాథ్యంలో ఆదివాసీల తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కలెక్టర్ కూడా వారితో కలిసి కాసేపు నృత్యం చేసారు. తమ హక్కుల సాధనకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కృషి చేయాలని వారు కోరారు.
1
Report
Mahabubabad506105blurImage

సీతరామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

Kotha YakeshKotha YakeshAug 09, 2024 10:30:47
Kamepally, Telangana:
సీతారామ సాగునీటి ప్రాజెక్టు పనులను ఖమ్మం జిల్లా ఏన్కూర్ వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మొదటగా ట్రాక్టర్ పై ప్రాజెక్ట్ కాలువలను సందర్శించారు. అనంతరం కాలినడకన తిరుగుతూ పనుల పరిస్థితిని తెలుసుకున్నారు. ఈక్రమంలో మంత్రి అధికారులకు పలు సూచనలు సలహాలు చేసారు. ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు.
1
Report
Mahabubabad506105blurImage

వైరాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం‌ శంకుస్థాపన

Kotha YakeshKotha YakeshAug 09, 2024 10:29:57
Madugulagudem, Telangana:
వైరా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసారు. మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా జనవరి నీటి సరఫరా పథకం పనులను భట్టి ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. భట్టి వెంట ఎమ్మెల్యే రాందాస్ నాయక్,రాయల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ జైపాల్ తదితరులు ఉన్నారు.
1
Report
Mahabubabad506101blurImage

హామిల అమలు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా

Kotha YakeshKotha YakeshAug 08, 2024 07:27:32
Mahabubabad, Telangana:

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాలను అమలు చేయాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. అర్హులైన వారికి నివాస స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. రేషన్‌కార్డులు, పోడు భూములకు పట్టాలు, రైతు బీమా, పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

1
Report
Khammam507001blurImage

ఖమ్మం: పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య

Kotha YakeshKotha YakeshAug 07, 2024 07:56:33
Khammam, Telangana:

ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలో రైతు వెంకట్ రెడ్డి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు. తన భూమిని జాటోత్ వీరన్న కబ్జా చేస్తున్నాడని ఆరోపిస్తూ, పొలంలో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఈ సంఘటన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1
Report
Khammam507001blurImage

ఖమ్మంలో జోరువాన

Kotha YakeshKotha YakeshAug 07, 2024 07:53:51
Khammam, Telangana:
ఖమ్మంలో భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. స్కూల్స్, ఆఫీస్ లకు వెళ్లే వారు వర్షంలో ఇబ్బంది పడ్డారు. ఖమ్మం నగరంలో కురిసిన వర్షానికి డ్రైన్లు నిండి వర్షాపు నీరు రోడ్లపైకి నీరు చేరింది. దీంతో వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. జిల్లాలో కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుంది. ఈరోజు, రేపు కూడా జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
1
Report
Khammam507002blurImage

ఖమ్మంలో సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ పార్టీ డిమాండ్‌

Kotha YakeshKotha YakeshAug 01, 2024 10:35:06
Dhamsalapuram, Telangana:

ఖమ్మంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎంఎల్‌ ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పట్టణ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి బైఠాయించారు. పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా అనేక హామీలు అమలు కాలేదన్నారు. పింఛన్‌, ఇందిరమ్మ గృహాలు తదితర వాటిని వెంటనే అమలు చేసి అర్హులకు అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.

0
Report
Khammam507001blurImage

రెవెన్యూ సంబందిత సమస్యలు త్వరగా పరిష్కారించాలి: కలెక్టర్

Kotha YakeshKotha YakeshAug 01, 2024 05:21:33
Khammam, Telangana:

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్‌లో రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజావాణి, ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై చర్చించారు. మండల స్థాయిలో రెవిన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. డిటి, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు చట్టాలపై శిక్షణ అందించాలని సూచించారు. రెవిన్యూ అధికారులకు పూర్తి నాలెడ్జ్ ఉండాలని, తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోవడం అంగీకరించలేమని స్పష్టం చేశారు.

1
Report
Khammam507003blurImage

ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి

Kotha YakeshKotha YakeshAug 01, 2024 05:20:14
Khammam, Telangana:
విషపు నీరు తాగి 20 గొర్రెలు మృతి చెందగా మరో 150 గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన 200 గొర్రెలను క్రాస్ వద్ద మేపుతున్నాడు. అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంప్ చేస్తున్నారు. నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది.
1
Report
Khammam507003blurImage

ఖమ్మం:సిపిఆర్ చేసి ఓ వ్యక్తికి ప్రాణం

Kotha YakeshKotha YakeshAug 01, 2024 05:17:45
Khammam, Telangana:
సిపిఆర్ చేసి ఓ వ్యక్తిని బతికించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్ లో చోటుచేసుకుంది. పెనుబల్లి నుండి విఎం బంజార్ కు బైక్ పై యేసుబాబు అనే వ్యక్తి వెళుతుండగా అదుపుతప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరాడు. సమీపంలో శానిటైజేషన్ పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి అక్కడకు చేరుకుని సీపీఆర్ చేసాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రామారావును అభినందించారు.
1
Report
Khammam507003blurImage

భూ తగాదాలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు

Kotha YakeshKotha YakeshAug 01, 2024 02:42:18
Khammam, Telangana:

ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో అంగన్‌వాడీ టీచర్ అరుణపై ఆమె మరిది కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్రం వెంకట్రావు-రాంబాబు అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ జరుగుతోంది. అరుణకు రుణమాఫీ అయిన పొలంలో వాటా కోరుతున్న రాంబాబు కుమారుడు సాయి కుమార్, అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లి ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1
Report
Mahabubabad506101blurImage

ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ, హామీల అమలుకు డిమాండ్

Kotha YakeshKotha YakeshJul 30, 2024 12:09:33
Mahabubabad, Telangana:

ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మయూరి సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం రాస్తారోకో చేశారు. ఇంటి స్థలం, నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల హామీలో ఈ అంశం ఉండటంతో ఉద్యమకారులు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు.

1
Report
Khammam507002blurImage

రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు

Kotha YakeshKotha YakeshJul 29, 2024 05:00:56
Dhamsalapuram, Telangana:

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్‌లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.

1
Report
Mahabubabad506101blurImage

మంత్రి తుమ్మల మిత్రుడి మృతి కన్నీరు పెట్టుకున్న తుమ్మల

Kotha YakeshKotha YakeshJul 27, 2024 17:08:15
Mahabubabad, Telangana:

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్తమిత్రుడు జక్కంపూడి కృష్ణమూర్తికి నివాళిఅర్పించారు. తన మిత్రుడు మరణించిన విషయం తెలుసుకుని హుటాహుటిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న హైద్రాబాద్ నుండి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చేరుకుని కడసారి నివాళిఆర్పించారు. తన మిత్రుడి పార్థీవదేహాం చూసిన మంత్రి తుమ్మల కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను భుజం తట్టి ఓదార్చారు.

1
Report
Khammam507003blurImage

అమరుల త్యాగాల వల్లే ప్రజలకు స్వేచ్ఛ జీవితం: కలెక్టర్ ముజామిల్ ఖాన్

Kotha YakeshKotha YakeshJul 26, 2024 11:58:30
Khammam, Telangana:
సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ లో బాగంగా అమరులకు కలెక్టర్ నివాళిఅర్పించారు. దేశ ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమని కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తుచేసుకున్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ నీరజా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
1
Report