ఖమ్మం: రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం
ఖమ్మం: గణేష్ నిమజ్జనంలో అపశృతి
ఖమ్మంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. బ్రహ్మణబజార్ శివాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన 32 అడుగుల మట్టి గణపతి నేలమట్టం అయ్యాడు. నిమజ్జనానికి క్రేన్ సహాయంతో వాహనం పైకి తరలిస్తుండగా ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఖమ్మంలోనే అతిపెద్ద మట్టి గణపతిగా ఈ విగ్రహం పేరుంది.
ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన
ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపిలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపాథ్యంలో మొదటగా ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాన్ని వారు పరిశీలించిన అనంతరం తిరుమలాయపాలెం మండలం రాకాసితండలో పర్యటించారు. వరద ప్రవాహంతో రాసాకితండా మొత్తం కొట్టుకుపోయింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసి పంట సాగుచేయడానికి అవకాశం లేకుండా పోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు.
ఖమ్మం జిల్లాలో వరదల పరిస్థితిని తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం భట్టి
నేలకొండపల్లికి ప్రపంచ స్థాయి తీసుకొస్తా: మంత్రి పొంగులేటి
భక్తరామదాసు నడియాడిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈక్రమంలో ఎంపి రాఘురంరెడ్డి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి భక్తరామదాసు మందిరంలో ధ్యానమందిరాన్ని పొంగులేటి ప్రారంభించారు. భక్తరామదాసు ఆనాడు స్వర్థం కోసం పనిచేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసారు.
రుణమాఫీ కాలేదని బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా
ఖమ్మంలో వర్షం, వేడి నుంచి ఉపశమనం
ఖమ్మం నగరంలో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండవేడిమితో బాధపడుతున్న ప్రజలు వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా కాలువలు పొంగి పొర్లాయి. పాత బస్ స్టేషన్ వద్ద రోడ్డుపై వరద నీరు వ్యాపించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: అఖిల పక్ష పార్టీలు
ఖమ్మంలో సీఎం సభకు సిద్దం
నేడు ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ క్రమంలో సభ వేధిన సిద్ధం చేసారు. రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను ఇదే సభ వేధికపై డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సభకు పెద్ద సంఖ్యలో రైతులను తరలించేలా నేతలు ఏర్పాట్లు చేసారు. మద్యాహ్నం 2:30 గంటల తర్వాత సభ వేధికపై సీఎం చేరుకుని మాట్లాడనున్నారు
ఆదివాసీలకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు కావాలి: వీరనారీమణుల సమితి
ఖమ్మంలో వీరనారీమల ఆశయ సమితి ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహించింది. గిరిజనుల లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. అడవిని ఆదివాసీలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్ సమావేశం
ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.
ఖమ్మంలో ఆదివాసీ గిరిజనుల ర్యాలీ
సీతరామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి
వైరాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
హామిల అమలు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాలను అమలు చేయాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. అర్హులైన వారికి నివాస స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. రేషన్కార్డులు, పోడు భూములకు పట్టాలు, రైతు బీమా, పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మం: పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య
ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలో రైతు వెంకట్ రెడ్డి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు. తన భూమిని జాటోత్ వీరన్న కబ్జా చేస్తున్నాడని ఆరోపిస్తూ, పొలంలో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఈ సంఘటన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మంలో జోరువాన
ఖమ్మంలో సీపీఐఎంఎల్ మాస్లైన్ పార్టీ డిమాండ్
ఖమ్మంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎంఎల్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పట్టణ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి బైఠాయించారు. పథకాలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా అనేక హామీలు అమలు కాలేదన్నారు. పింఛన్, ఇందిరమ్మ గృహాలు తదితర వాటిని వెంటనే అమలు చేసి అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.
రెవెన్యూ సంబందిత సమస్యలు త్వరగా పరిష్కారించాలి: కలెక్టర్
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజావాణి, ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై చర్చించారు. మండల స్థాయిలో రెవిన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. డిటి, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు చట్టాలపై శిక్షణ అందించాలని సూచించారు. రెవిన్యూ అధికారులకు పూర్తి నాలెడ్జ్ ఉండాలని, తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోవడం అంగీకరించలేమని స్పష్టం చేశారు.
ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి
ఖమ్మం:సిపిఆర్ చేసి ఓ వ్యక్తికి ప్రాణం
భూ తగాదాలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో అంగన్వాడీ టీచర్ అరుణపై ఆమె మరిది కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గుర్రం వెంకట్రావు-రాంబాబు అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ జరుగుతోంది. అరుణకు రుణమాఫీ అయిన పొలంలో వాటా కోరుతున్న రాంబాబు కుమారుడు సాయి కుమార్, అంగన్వాడీ సెంటర్కు వెళ్లి ఈ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి, బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ, హామీల అమలుకు డిమాండ్
ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మయూరి సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం రాస్తారోకో చేశారు. ఇంటి స్థలం, నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల హామీలో ఈ అంశం ఉండటంతో ఉద్యమకారులు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు.
రైతులతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మార్గమధ్యంలో మంత్రి రైతు కూలీలను కలుసుకుని వారి కష్టాలు. ఎలాంటి ధాన్యం వేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రజాపరిపాలనపై ఆరా తీశారు.
మంత్రి తుమ్మల మిత్రుడి మృతి కన్నీరు పెట్టుకున్న తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్తమిత్రుడు జక్కంపూడి కృష్ణమూర్తికి నివాళిఅర్పించారు. తన మిత్రుడు మరణించిన విషయం తెలుసుకుని హుటాహుటిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న హైద్రాబాద్ నుండి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చేరుకుని కడసారి నివాళిఆర్పించారు. తన మిత్రుడి పార్థీవదేహాం చూసిన మంత్రి తుమ్మల కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులను భుజం తట్టి ఓదార్చారు.