Back
Mancherial504251blurImage

బోగస్ స్వచ్చంద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

KASARLA RAMESH
Oct 08, 2024 10:47:25
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాలనే బురిడీ కొట్టిస్తూ ఉద్యోగాల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ నకిలీ నియామక పత్రాలు అందిస్తున్న బోగస్ స్వచ్చంద సంస్థలపై వెంటనే చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com