శ్రీనాథ్ మహర్షి జ్ఞాపకార్ధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కూలీలు,బాటసారులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం కుమారుడు శ్రీనాథ్ మహర్షి జయంతి సందర్భంగా అయన జ్ఞాపకార్ధం అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోజువారి కూలీలు బాటసారులు, నిరుపేదలు సుమారు 200 మంది పాల్గొని అల్పాహారం స్వీకరించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారా? దీపావళి రైలు టికెట్ల బుకింగ్స్ షురూ, వెంటనే బుక్ చేసుకోండి!
Hyderabad, Telangana:Diwali Trains 2026: ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 8వ తేదీన రానుంది. చాలామంది పండుగ వేడుకల కోసం సొంత ఊళ్లకు వెళ్లాలని అనుకుంటారు. దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడానికి ప్రయాణికులు అధిక సంఖ్యలో రైలు మార్గాల్లో ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది; ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మీరు దీపావళికి సంబంధించిన ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పండుగ రద్దీ దృష్ట్యా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో, ముందే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం.
IRCTC వెబ్సైట్లో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభం అవుతుంది. సాధారణంగా రైల్వే రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీపావళి కోసం టికెట్ల బుకింగ్ ఈరోజే ప్రారంభమవుతుంది. పండుగకు ముందే వెళ్తారు కాబట్టి ఈరోజు నుంచి బుక్ చేసుకోండి. సామాన్యంగా ప్రజలు పండుగకు రెండు రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకుంటారు, ఆలస్యం చేయకుండా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి.
సాధారణంగా ఏ రైలు అయినా 60 రోజుల ముందే బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 8 పండుగ కాబట్టి, మీరు ముందే రిజర్వ్ చేసుకుంటే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. దీపావళి,ఛత్ పూజ సందర్భంగా ఎక్కువ మంది సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో నివసించే బీహార్కు చెందిన వారు దీపావళి వేడుకల కోసం తప్పకుండా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బీహార్కు వెళ్లే రైళ్లలో, అలాగే ఢిల్లీ, వారణాసి, పాట్నా, అహ్మదాబాద్, ముంబై, హౌరా, రాంచీ, లుధియానా వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. ముఖ్యంగా ఢిల్లీ, గోరఖ్పూర్ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల టికెట్ కౌంటర్లు తెరిచిన గంటలోపే రైళ్లు నిండిపోతున్నాయి.
Also Read: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శబరి సహా 8 ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలు
Also Read: రోడ్డుపై ఊహించని ఘటన.. మహిళను రేప్ చేయబోయిన కామాంధుడికి చుక్కలు చూపించిన కుక్క!
सावधान!
यात्रियों से निवेदन है की टिकट हमेशा अधिकृत माध्यमों व एजेंट्स से ही बुक करें तथा बुकिंग के समय अपने नाम, लिंग, उम्र एवं मोबाइल नंबर की जांच करें।
गलत जानकारी से न सिर्फ यात्रा के समय परेशानी हो सकती है, बल्कि टिकट रद्द करने या रिफंड में कठिनाई आ सकती है।
सही टिकट =… pic.twitter.com/jtBPEGujpc
— IRCTC (@IRCTCofficial) September 2, 2026
రైలు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి దగ్గరలోని రిజర్వేషన్ కౌంటర్కు వెళ్లవచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు. IRCTC Rail Connect యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మీరు క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రద్దీగా ఉన్న సమయంలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోండి; వీలైతే వైఫై మాత్రమే ఉపయోగించండి. Rail Connect యాప్లో మీ వివరాలను ముందుగానే నమోదు చేసుకుని, క్లాస్ వంటి ఆప్షన్లను కూడా ముందుగానే ఎంచుకోండి. ఒకవేళ ఒక రైలు టికెట్ దొరకకపోతే, ప్రత్యామ్నాయ రైలును బుక్ చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుపతి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
Tirupati, Andhra Pradesh:Sri Krishna Janmashtami Celebrations In Tirupati ISKCON Temple Watch VideoTirumala: భక్తిశ్రద్ధలతో తిరుమలలో గోకులాష్టమి వేడుకలు
Dharmavaram, Andhra Pradesh:Sri Krishna Janmashtami Celebrations In Tirumala Watch VideoCM Chandrababu PRC DA: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, డీఏల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Demands CBI Probe: మరోసారి డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు వైఎస్ జగన్ డిమాండ్..విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పోస్ట్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Demands DSC CBI Probe: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు రోజురోజుకూ సరికొత్త సాక్ష్యాలు, వాస్తవాలతో వెలుగులోకి వస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. నిజానిజాలు బయటకు రావడానికి సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, కూటమి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును నిరాకరిస్తూ.. ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
డీఎస్సీ నియామక కుంభకోణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా వేదికలు, సామాజిక కార్యకర్తలు, చివరకు సాధారణ వ్యక్తుల పోస్టులను, ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా సామాజిక మాధ్యమాల్లో పరిమితం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సోషల్ మీడియా అకౌంట్లతో పాటు అనేక వ్యక్తిగత ఖాతాలను నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో కనిపించకుండా చేస్తున్నారని, ఇందుకు మెటా "చట్టపరమైన అవసరాలు" అనే కారణాన్ని పేర్కొంటోందని చెప్పారు.
ఇది కేవలం డీఎస్సీ అక్రమాలకే పరిమితం కాలేదని, ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ సెన్సార్షిప్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను హరించడమేనని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రశ్నించేవారి నోరు మూయిస్తున్నారని, అసలు ఆయన దేనికి భయపడుతున్నారని నిలదీశారు. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలను తుడిచేయలేరని, ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పి, రాజ్యాంగబద్ధంగా పాలించాలని హితవు పలికారు.
అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారని, అలాగే టెట్ (TET) పరీక్షలో కనీసం ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. క్రీడా కోటా కింద జీవో జారీ చేసి, నియామకాలు పూర్తయిన తర్వాత ఆ జీవోను రద్దు చేసినప్పటికీ, ఆ అభ్యర్థులు ఇంకా ఉద్యోగాల్లో కొనసాగడం పెద్ద ఎత్తున జరిగిన అవినీతికి నిదర్శమన్నారు.
వెంటనే నిరోధించిన అన్ని ఖాతాలను, పోస్టులను పునరుద్ధరించాలని, ఈ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై తక్షణమే స్వతంత్ర సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని జగన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పీఆర్సీ కోసం రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!
Also Read: "మా ఎమ్మెల్యేను కాదు, మీ బావమరిదిని ప్రశ్నించండి!" చంద్రబాబుపై జనసేన నేత కౌంటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NHAI FASTag Reward: వాహనదారులకు గుడ్న్యూస్.. రూ.1,000 ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం.. ఈ పని చేస్తే చాలు!
Hyderabad, Telangana:NHAI FASTag Clean Toilet Reward: హైవేలపై ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల గురించి ఫిర్యాదు చేస్తే, వారికి రూ.1,000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ను బహుమతిగా ఇస్తారు. 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో సెప్టెంబర్ 2025లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రయాణికుల నుండి లభించిన అద్భుతమైన స్పందన కారణంగా ఈ పథకాన్ని 2027 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు NHAI ప్రకటించింది. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 429 మంది ప్రయాణికులు అపరిశుభ్ర టాయిలెట్లపై ఫిర్యాదు చేసి, రూ. 1,000 చొప్పున ఫాస్ట్ట్యాగ్ బ్యాలెన్స్ పొందారు.
ఫిర్యాదు చేయడం, రివార్డ్ పొందే విధానం..
NHAI తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ప్రక్రియను వెల్లడించింది. ఈ ఛాలెంజ్లో పాల్గొనడానికి కింది విధంగా చేయాలి.
1) ప్రయాణికులు తమ మొబైల్లో 'రాజ్మార్గ్యాత్ర' యాప్ తాజా వెర్షన్ను కలిగి ఉండాలి.
2) టోల్ ప్లాజా వద్ద టాయిలెట్ అపరిశుభ్రంగా ఉంటే, యాప్ ద్వారా స్పష్టమైన, జియో-ట్యాగ్డ్, టైమ్స్టాంప్ ఉన్న ఫొటోను తీసి అప్లోడ్ చేయాలి.
3) ఫొటోతో పాటు ఫిర్యాదుదారుడి పేరు, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయాలి.
4) ఈ వివరాలను మొదట కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో, ఆ తర్వాత మాన్యువల్గా అధికారులు తనిఖీ చేస్తారు.
5) వివరాలు సరిగ్గా ఉంటే, ఆ వాహన నంబర్కు అనుసంధానించబడిన ఫాస్ట్ట్యాగ్ ఖాతాకు రూ.1,000 క్రెడిట్ అవుతుంది.
కీలకమైన నిబంధనలు..
ఈ పథకం కింద ప్రయాణికులు గమనించవలసిన కొన్ని నిబంధనలు..
1) ఒక వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) కు ఈ పథకం కాలంలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే రివార్డ్ లభిస్తుంది.
2) ఈ రివార్డ్ను మరొకరికి బదిలీ చేయడం లేదా నగదుగా మార్చుకోవడం కుదరదు.
మొదటి ఫిర్యాదుకే ప్రాధాన్యత: ఒకే టాయిలెట్పై ఒకే రోజులో ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తే, మొదటగా అందిన చెల్లుబాటు అయ్యే ఫిర్యాదుదారుడికి మాత్రమే రివార్డు లభిస్తుంది. ఇది కేవలం NHAI స్వయంగా నిర్వహిస్తున్న టోల్ ప్లాజా టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ధాబాలు, పెట్రోల్ పంపులలోని టాయిలెట్లకు ఇది వర్తించదు.
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు NHAI తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంది. మీ ప్రయాణంలో అపరిశుభ్ర టాయిలెట్లను గుర్తిస్తే వెంటనే రాజ్మార్గ్యాత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేసి మీ రివార్డును పొందండి.
Also Read: "రాష్ట్ర ప్రభుత్వాలు బైక్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలి" కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
Also REad: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Japan T20I: జపాన్తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్.. భారత్కు ఇన్ని లాభాలా?
Suginami City, Tokyo:India Vs Japan T20I 2026: ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టుగా ఉన్న టీమిండియా, క్రికెట్లో ఎదుగుతున్న జపాన్ దేశంతో తలపడేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 22న జపాన్లోని తోచిగి ప్రిఫెక్చర్లో గల సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. రెండు దేశాల సీనియర్ పురుషుల జట్ల మధ్య జరగనున్న తొలి అధికారిక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.
ఈ మ్యాచ్ వెనుక ప్రధానంగా బలమైన దౌత్య కారణాలు ఉన్నాయి. భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచిల ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 'స్పోర్ట్ 75' కార్యక్రమాన్ని ఈ మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తున్నారు. రెండు దేశాల ప్రజల మధ్య క్రీడా సహకారాన్ని పెంచడం దీని లక్ష్యం.
అలాగే, జపాన్లోని ఐచి-నగోయా వేదికగా జరిగే 2026 ఆసియా క్రీడలకు ముందు భారత ఆటగాళ్లకు ఇది ఒక ఉపయోగకరమైన సన్నాహకంగా నిలవనుంది. ఈ ఆసియా గేమ్స్లో పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఈ మ్యాచ్ ఆడటం వల్ల భారత ఆటగాళ్లకు స్థానిక పిచ్ పరిస్థితులు, ప్రయాణ పరిస్థితులు, వాతావరణంపై పూర్తి అవగాహన వస్తుంది.
ప్రస్తుతం జపాన్ జట్టు ప్రపంచ క్రికెట్ ర్యాంకింగ్స్లో 41వ స్థానంలో ఉంది. ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్తో ఆడటం జపాన్ క్రికెట్ అభివృద్ధికి ఒక మైలురాయిగా మారుతుందని జపాన్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. తూర్పు ఆసియాలో క్రికెట్ను విస్తరించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపిన వివరాల ప్రకారం.. ఇది భారత క్రికెట్ను సరికొత్త భౌగోళిక ప్రాంతాలకు తీసుకెళ్లే ఒక ముఖ్యమైన అడుగు. భవిష్యత్తులో అక్కడ ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్ల వంటి వాణిజ్య మార్కెట్ కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది.
మరోవైపు, 2036 ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్న భారత్కు, ఒలింపిక్ క్రీడలలో కీలకమైన జపాన్తో క్రీడా బంధాలను బలోపేతం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. ఇప్పటికే ఆటోమొబైల్, టెక్నాలజీ, తయారీ వంటి రంగాల్లో జపాన్ భారత్కు కీలక భాగస్వామిగా ఉండటంతో ఈ క్రీడా సంబంధాలు ద్వైపాక్షిక మైత్రిని మరింత పెంచుతాయి. అందువల్ల, ఈ చారిత్రక మ్యాచ్ను కేవలం ఒక ఆటగానే కాకుండా రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన 'క్రికెట్ డిప్లమసీ'గా చెప్పవచ్చు.
Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్లో హై-వోల్టేజ్ మ్యాచ్!
Also REad: గౌతమ్ గంభీర్కు బీసీసీఐ చెక్..ఆసియా గేమ్స్లో హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Raghu Master Police Complaint: డ్యాన్సర్స్ అసోసియేషన్లో ముసలం.. రఘు మాస్టర్పై పోలీసులకు సుమలత ఫిర్యాదు?
Hyderabad, Telangana:Paradise Release Delay: నాని పారడైజ్ సినిమా రిలీజ్కు మళ్లీ బ్రేక్.. మరోసారి సినిమా విడుదలపై సస్పెన్స్? ఈసారి కూడా కష్టమే?
Hyderabad, Telangana:Paradise Release Delay News: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది పారడైజ్' రిలీజ్ డేట్పై మళ్లీ సస్పెన్స్ రేగింది. ఈ ప్రతిష్టాత్మక సినిమాను కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం చేయకుండా, పాన్-ఇండియా స్థాయిలో పలు భాషల్లో అత్యంత భారీగా విడుదల చేసేందుకు చిత్ర మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, 'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదలకు సంబంధించి వస్తున్న తాజా ఊహాగానాలు ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్పై పలు అనుమానాలను, ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. దీంతో చిత్ర బృందం మొత్తం సినిమాను అక్టోబర్కు వాయిదా వేస్తుందా, లేదా కేవలం తెలుగు వెర్షన్ను మాత్రమే సెప్టెంబర్ 24న విడుదల చేస్తుందా అనేది త్వరలో అధికారికంగా తేలనుంది.
ప్రస్తుతం వినిపిస్తున్న వివిధ వార్తల ప్రకారం.. 'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. మునుపటి అధికారిక ప్రకటనల ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకులకు విడుదల కావాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు ఉత్తరాది ప్రాంతంలో ఆశించిన స్థాయిలో సినిమా ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడమే ఈ తాత్కాలిక వాయిదా అనుమానాలకు ప్రధాన బలంగా మారుతోంది. తగిన ప్రచారం లేకుండా హిందీలో విడుదల చేయడం కంటే వాయిదా వేయడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రచార లోపం హిందీ ప్రేక్షకులలో సినిమాపై సరైన అంచనాలను కలిగించలేకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విచిత్రమైన పరిస్థితుల్లో చిత్ర నిర్మాతల ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 24న తెలుగు వెర్షన్ను మాత్రమే థియేటర్లలోకి విడుదల చేసి, ప్రస్తుతానికి హిందీ వెర్షన్ను ఆపివేస్తారా? లేదా పాన్-ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ ఒకేసారి అత్యంత గ్రాండ్గా విడుదల చేయడం కోసం సినిమా మొత్తాన్ని అక్టోబర్ నెలకు వాయిదా వేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమా మార్చి నుంచి ఆగస్టుకు, ఆ తర్వాత సెప్టెంబర్ 24కు వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన ప్రమోషన్ ప్లాన్ కోసం మరోసారి సినిమా విడుదల తేదీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నానికి ఈ సినిమా విడుదల తేదీ కేవలం ఒక మామూలు తేదీ మార్పు మాత్రమే కాదు. తన మార్కెట్ను పాన్-ఇండియా స్థాయిలో మరింత బలంగా విస్తరించుకోవడానికి 'ది పారడైజ్' చిత్రాన్ని ఒక పెద్ద మైలురాయిగా హీరో నాని భావిస్తున్నారు. హిందీ వెర్షన్ను పక్కన పెట్టి కేవలం తెలుగులో సెప్టెంబర్ 24న రావడం ఒక మార్గమైతే, అన్ని భాషల ప్రేక్షకుల వద్దకు ఒకేసారి తీసుకెళ్లేందుకు మొత్తం సినిమాను అక్టోబర్కు వాయిదా వేయడమే సరైన నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా సెప్టెంబర్ 24 రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ, మేకర్స్ నుంచి త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Also Read: 'బడిపంతులు' నుంచి 'సార్' వరకు..వెండితెరపై గురుశిష్యుల బంధాన్ని ఆవిష్కరించిన చిత్రాలు
Also Read: బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..ఆదిరెడ్డి వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Chandrababu PRC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు.. పీఆర్సీ, డీఏల చెల్లింపులపై ముహూర్తం ఖరారు!
Vijayawada, Andhra Pradesh:CM Chandrababu PRC Commission News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన చర్చల అనంతరం, 12వ వేతన సవరణ సంఘం (PRC) నియామకానికి సీఎం అంగీకరించారు. అలాగే పెండింగ్లో ఉన్న రెండు డీఏలను (DA) వచ్చే అక్టోబర్ 1వ తేదీ నుండి చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.
సంక్రాంతి నాటికి 2022 సరెండర్ లీవ్స్ నిధుల విడుదల, పోలీసులకు దసరా కానుకగా అదనపు లీవ్ చెల్లింపు, అదనపు పెన్షన్ వంటి పలు కీలక హామీలను ఇచ్చారు. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.2,880 కోట్ల అదనపు బడ్జెట్ భారం పడనుంది.
ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలకు ఉపశమనం కలిగించే పలు కీలక వరాలను ప్రకటించారు. ఈ చర్చల్లో భాగంగా, ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన 12వ పీఆర్సీ (12th PRC) నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెండు డీఏలను (1-7-2024, 1-1-2025 కి సంబంధించినవి) వచ్చే నెల అక్టోబర్ 1వ తేదీ నుండి ఉద్యోగులకు చెల్లించడానికి అంగీకరించారు. దీంతో పాటు, 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్స్ (సెలవుల నగదు) బకాయిలను వచ్చే సంక్రాంతి పండుగ నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సమ్మతించింది.
మరోవైపు, పోలీస్ సిబ్బందికి దసరా కానుకగా ఒక అదనపు సరెండర్ లీవ్ చెల్లింపు చేయనున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెన్షనర్లకు కూడా ఊరటనిస్తూ 'అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్'ను జనవరి 2027 నుండి అమలు చేయడానికి నిర్ణయించారు. దీని ప్రకారం, 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ లభించనుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కేం (EHS)ను మరింత క్రమబద్ధం చేస్తూ, వచ్చే నెల నుండి ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు ప్రభుత్వ వాటా నిధులను క్రమం తప్పకుండా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ నిర్ణయాల అన్నింటి వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం దాదాపు రూ.2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుందని అంచనా వేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ప్రభుత్వానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..పీఆర్సీ, డీఏల చెల్లింపుపై నేడే సీఎం కీలక ప్రకటన!
Also REad: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Teachers Day Movies: 'బడిపంతులు' నుంచి 'సార్' వరకు..వెండితెరపై గురుశిష్యుల బంధాన్ని ఆవిష్కరించిన టాలీవుడ్ చిత్రాలు!
Hyderabad, Telangana:Teachers Day Tollywood Movies: సెప్టెంబర్ 5 వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బ్లాక్బోర్డ్, చాక్ పీస్, క్లాస్రూమ్ కంటే మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఒక గురువే. మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, పడిపోయినప్పుడు నిలబెట్టేది ఉపాధ్యాయుడే. తెలుగు సినిమా కూడా గురు-శిష్యుల పవిత్రమైన బంధాన్ని, విద్యావ్యవస్థలోని మార్పులను ఎన్నో అద్భుతమైన చిత్రాల ద్వారా ఆవిష్కరించింది. వెండితెరపై గురువులుగా అలరించి, సమాజానికి విలువైన పాఠాలు నేర్పిన కొన్ని చిరస్మరణీయ తెలుగు చిత్రాల ప్రత్యేక కథనం ఇది.
1) బడిపంతులు (1972)
తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన మహోన్నత చిత్రం 'బడిపంతులు'. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) (NTR) బడిపంతులుగా కంటికి రెప్పలా విద్యార్థులను తీర్చిదిద్దే పాత్రలో జీవించారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్యాబోధనలో ఆయన చూపిన నిబద్ధత ఇప్పటికీ తరాలపాటు గుర్తుండిపోతుంది.
2) మాస్టర్ (1997)
సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు లెక్చరర్ 'రాజ్కుమార్' పాత్రలో నటించారు. కాలేజీలో దారితప్పిన, గొడవలు పడే యువతను క్రమశిక్షణలోకి తెచ్చి మార్చే గురువుగా ఆయన కనిపించారు. గురువు అంటే కేవలం కఠినంగా ఉండటం మాత్రమే కాదు, విద్యార్థులతో కలిసిపోయి వారిలో ఉన్న మంచిని బయటకు తీసి, ఆదర్శవంతమైన ఆలోచనను మార్చగలరని ఈ పాత్ర నిరూపించింది.
3) సుందరకాండ (1992)
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ లెక్చరర్గా నటించిన ఈ చిత్రం, వినోదాన్ని పంచుతూనే ఉపాధ్యాయుడికి ఉండాల్సిన బాధ్యతను, లెక్చరర్, విద్యార్థి మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని చాలా చక్కగా చిత్రీకరించింది.
4) గోల్కొండ హైస్కూల్ (2011)
హరి మోహన్ పరువు రాసిన 'ది మెన్ వితిన్' (The Men Within) పుస్తకం ఆధారంగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమంత్ ఇందులో క్రికెట్ కోచ్ 'సంపత్'గా నటించారు. విద్యార్థుల్లో గెలవాలనే నమ్మకం తగ్గిపోయినప్పుడు, వారికి కేవలం ఆట మాత్రమే కాకుండా, ఓడిపోయిన తర్వాత కూడా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించడం ఎలాగో నేర్పిన గురు పాత్ర ఇది.
5) సార్ (2023)
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ లెక్చరర్ 'బాల గంగాధర్ తిలక్'గా అద్భుతంగా నటించారు. విద్యావ్యవస్థలోని వ్యాపారీకరణను, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రభావాన్ని ఎండగడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి పోరాడే పాత్ర ఇది. చదువు అనేది కేవలం వ్యాపారం కాదు, ప్రతి ఒక్కరి హక్కు అని ఈ చిత్రం చాటిచెప్పింది.
6) ఇతర చిత్రాలు...
'ఠాగూర్'లో ప్రొఫెసర్గా చిరంజీవి భౌతికశాస్త్రం బోధిస్తూనే, విద్యార్థుల సహాయంతో అవినీతిపై పోరాడే పాత్రలో నటించారు. ఇది ఉపాధ్యాయుడు విద్యార్థులలో సామాజిక స్పృహను ఎలా పెంపొందించవచ్చో చూపించింది. అలాగే 'రిపబ్లిక్' లో సాయి ధరమ్ తేజ్ రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య బాధ్యతలను నేర్పించే గొప్ప మార్గదర్శకుడిగా కనిపించారు.
మంచి గురువు కేవలం సమాధానాలు ఇవ్వడమే కాదు, మనమే స్వయంగా సమాధానాలు వెతుక్కునేలా చేస్తాడు. కొన్ని పాఠాలు పుస్తకాల్లో ఉండవు.. అవి గురువుల రూపంలోనే మన జీవితంలోకి వస్తాయి.
Also Read: బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..ఆదిరెడ్డి వీడియో వైరల్!
Also REad: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అనసూయ మరో వివాదం..రాధా గెటప్పై నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
నెలకు రూ.5,000 దాచుకుంటే రూ.8.5 లక్షల రాబడి.. సూపర్ హిట్ స్కీమ్ వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Post Office RD Scheme: మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, మంచి రిటర్న్స్తో కూడిన పెద్ద కార్పస్ను నిర్మించుకోవాలని అనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు; నెలకు రూ.100 నుండి రూ.5,000 వరకు సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీతో కలిపి క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ ఉంటే, మీరు రూ.8.5 లక్షల వరకు భారీ కార్పస్ను సృష్టించవచ్చు.
ప్రతిరోజూ సుమారు రూ.165 పొదుపు చేస్తే, అది నెలకు రూ.5,000 అవుతుంది. మీరు మీ పేరు మీద ఖాతాను ఓపెన్ చేసుకుని, ప్రతి నెలా పెట్టుబడిని రూ.100 చొప్పున పెంచుకుంటూ కూడా పోవచ్చు. ఇది మీ ఆర్థిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్పై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో మీరు జాయింట్ అకౌంట్ను కూడా ఓపెన్ చేయవచ్చు. మీరు చేసిన పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది. తద్వారా పదేళ్లలో మీరు అద్భుతమైన కార్పస్ను పొందవచ్చు.
అయితే, ప్రతి నెలా మీరు నిర్ణీత వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అయితే, ఒక శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి నెలా మంత్లీ ఇన్స్టాల్మెంట్ను క్రమం తప్పకుండా చెల్లించాలి. మీకు అవసరమైతే పోస్ట్ ఆఫీస్ RDని ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు.
మీరు ప్రతి నెలా రూ.5,000 పోస్ట్ ఆఫీస్ RDలో ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్లలో అది 3 లక్షలు అవుతుంది. 6.7 శాతం వడ్డీతో కలిపి మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.3,56,830 అందుతాయి. ఒకవేళ మీరు దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తే, మొత్తం పదేళ్ల కాలంలో మీరు దాదాపు రూ. 6 లక్షల వరకు పొందుతారు. ఈ కాలంలో వడ్డీ మొత్తం రూ.2,54,272 అవుతుంది, తద్వారా పదేళ్ల మెచ్యూరిటీ సమయానికి మీరు మొత్తం రూ.8,54,272 పొందుతారు.
Also Read: రోడ్డుపై ఊహించని ఘటన.. మహిళను రేప్ చేయబోయిన కామాంధుడికి చుక్కలు చూపించిన కుక్క!
Also Read: SBI PO మెయిన్స్ హాల్ టికెట్లు వచ్చేశాయి..
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్ ద్వారా మీరు హామీతో కూడిన మంచి రిటర్న్స్ను పొందవచ్చు. చిన్న మొత్తాలతో నెలవారీ డిపాజిట్లు చేస్తూ వెళ్తే, మీరు మరింత ఎక్కువ లాభాలను పొందవచ్చు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో ఎలాంటి భయం లేకుండా పెట్టుబడి పెట్టి మంచి కార్పస్ను సృష్టించుకోవచ్చు. ఒకవేళ మీకు ఐదేళ్లలోనే డబ్బులు అవసరమైతే, ఆ మొత్తాన్ని కూడా మీరు పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..యూట్యూబర్ ఆదిరెడ్డి వీడియో వైరల్!
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Contestants: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ లాంచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో షోలో సరికొత్త సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, మార్పులు ఉంటాయని హోస్ట్ నాగార్జున, నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హౌస్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ ఆదిరెడ్డి ఈ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్ల జాబితాతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. గతంలో ఆదిరెడ్డి చేసిన అంచనాలు చాలా వరకు నిజం కావడంతో ఈ క్రేజీ జాబితా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ముఖ్యంగా గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతితో పాటు డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేవారినే ఈసారి కంటెస్టెంట్స్ గా ఎంపిక చేశామంటూ బిగ్ బాస్ మేకర్స్ వెల్లడిస్తున్నారు.
ఈ తరుణంలో హౌస్లోకి వెళ్లే సెలబ్రిటీల గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో సినీ, టీవీ రంగాల ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఉన్నారు.
అయితే, గత సీజన్లలో కంటెస్టెంట్ల గురించి ఖచ్చితమైన అంచనాలు వేసిన ఆదిరెడ్డి, ఈ సారి కూడా ఫైనల్ లిస్ట్ను బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన విడుదల చేసిన అంచనా ప్రకారం హౌస్లోకి రాబోయే 16 మంది కంటెస్టెంట్స్ వీరే..
1) అదిత్ ఈశ్వరన్: 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో సెకండ్ హీరో.
2) ముఖేష్ గౌడ అలియాస్ రిషి: ప్రముఖ టీవీ సీరియల్ నటుడు.
3) రోహిత్: సామాన్యుడి (కామనర్) కేటగిరీ కింద ఎంపికైన కంటెస్టెంట్.
4) కృష్ణుడు: 'వినాయకుడు' సినిమా హీరో.
5) శాలినీ
6) జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్: ప్రముఖ కామెడీ నటుడు
7) టెంపర్ వంశీ
8) సృష్టి వ్యాకరణం
9) ఆర్జే చరణ్: 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్
10) యాంకర్ వర్షిణీ సౌందర రాజన్
11) ఝాన్సీ: రైతు, సింగర్, 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్
12) 'జబర్దస్త్' నరేష్
13) దేబ్జానీ మోదక్: సీరియల్ నటి
14) చైత్ర రాయ్: ప్రముఖ సీరియల్ నటి
15) నవరసాలు ఆర్కే: 'అగ్నిపరీక్ష' కామనర్ కంటెస్టెంట్
16) సుధీర్ రెడ్డి: పోడ్కాస్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఆదిరెడ్డి వెల్లడించిన ఈ ఆసక్తికరమైన జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆదివారం సాయంత్రం జరిగే గ్రాండ్ లాంచ్తో ఈ పేర్లపై తుది అధికారిక స్పష్టత రానుంది.
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
Also Read: బిగ్బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:Gold Price India Today: భారతదేశంలో సెప్టెంబర్ 5న ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 'గుడ్ రిటర్న్స్' తాజా సమాచారం ప్రకారం.. దేశీయంగా ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,480గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.14,190, 18 క్యారెట్ల ధర రూ.11,610గా నమోదైంది. నిన్నటితో (సెప్టెంబర్ 4) పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.186 తగ్గగా, 22 క్యారెట్లపై రూ.170.. అలాగే 18 క్యారెట్లపై రూ.139 మేర తగ్గుదల నమోదైంది.
అయితే, పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా విలువైన లోహాల ధరలలో రోజువారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
నగరాల వారీగా ధరల వివరాలు
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 15,667 కాగా.. 22 క్యారెట్లు రూ. 14,361.. 18 క్యారెట్లు రూ. 12,131గా ఉంది. ఇక్కడ ధరలు అత్యధికంగా నమోదయ్యాయి.
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్కతా, పూణే.. ఈ నగరాలన్నింటిలోనూ ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,480, 22 క్యారెట్లు రూ. 14,190.. 18 క్యారెట్లు రూ. 11,610గా ఉన్నాయి.
ఢిల్లీ: 24 క్యారెట్లు రూ. 15,495 కాగా, 22 క్యారెట్లు రూ. 14,205.. 18 క్యారెట్లు రూ. 11,625గా ఉంది.
అహ్మదాబాద్ & వడోదర: 24 క్యారెట్లు రూ. 15,485, 22 క్యారెట్లు రూ. 14,195.. 18 క్యారెట్లు రూ. 11,615గా నమోదైంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు సంక్షోభం
బంగారం ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ పరిణామాలు బలమైన కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికాల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్లోని 'పికాక్స్ మౌంటైన్' పై "చాలా త్వరగా" దాడి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఏ విధమైన ఘర్షణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఇరాన్ వైమానిక రక్షణ దళ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీరేజా ఎల్హామి స్పష్టం చేశారు.
మరోవైపు, గాజా నుండి ప్రజలను తరలించాలన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, పాలస్తీనియన్ల బహిష్కరణను సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు పెరిగాయి. దీనితో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జూన్ 2026లో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది.
మరోవైపు సౌదీ అరేబియా ముడి చమురు ఎగుమతులు రోజుకు 3 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయి, 9 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడంతో చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరాయి. ఈ ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో దౌత్య మార్గాలు దెబ్బతినడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆశ్రయంగా బంగారం వైపు మళ్లడం వల్ల ధరలలో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: నాగమణికి కోబ్రా కాపలా.. వైరల్ వీడియో మీరు చూశారా?
Hyderabad, Telangana:Nagamani Video Viral: పురాణాలతో పాటు అనేక ఇతిహాసాల్లో, జానపద కథల్లో నాగమణి గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.. నాగమణిని నాగుపాములు తమ ప్రాణాల కంటే ఎక్కువగా కాపాడుకుంటాయని.. వాటి దగ్గరికి ఎవ్వరిని రానివ్వమని పెద్దలు కొన్ని కథల్లో చెప్పేవారు.. కాలక్రమేన ఇవన్నీ కేవలం కల్పిత కథలని చాలామంది భావిస్తూ ఉంటారు.. అయితే సరిగ్గా అలాంటి నమ్మకాలనే నిజం చేసేలా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అసలు ఈ వీడియో ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అద్భుతమైన కాంతితో ధగధగ మెరుస్తున్న నాగమణి నేలపై కనిపించడం మీరు చూడొచ్చు.. ఆశ్చర్యకరంగా.. ఆ ప్రకాశవంతమైన మణికి అత్యంత సమీపంలో ఒక ప్రమాదకరమైన భారీ కోబ్రా పడక విప్పి రక్షణ వలయంగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. ఎవరైనా ఆ మణిని తాకడానికి వస్తే కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పాము ఉగ్రరూపం దాల్చి ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.. ఆ పాము నాగమణికి రక్షణగా నిలుస్తున్నట్లు ఈ వీడియో భావన..
ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఎవరు చిత్రీకరించారు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.. అయినప్పటికీ.. మెరుస్తున్న నాగమణి పక్కనే పడగవిప్పి కోబ్రా ఎంతో భయంకరంగా ఉగ్రరూపం దాల్చి.. రక్షణగా నిలిచిన వైనం సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
ఈ వీడియో ఇంస్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భక్తి భావంతో కామెంట్లు పెడుతూ.. గతంలో మాత్రమే విన్న అద్భుతమైన రూపంలో దర్శనమిచ్చిందని.. ఇది ప్రకృతిలో దాగివున్న దైవిక శక్తులకు నిదర్శనమని నమ్ముతూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఇక మరికొంతమంది ఇది కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ ను వినియోగించి పామును అలా డిజైన్ చేసి.. నాగమణిని పెట్టారని కామెంట్లలో పెడుతున్నారు.. ఇక మరి కొంతమంది ఎల్ఈడి బల్బు పెట్టి.. పెంచుకుంటున్న నాగుపామును అక్కడ పెట్టి వీడియో తీశారని కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా చాలామంది ఈ వీడియోను నిజమైన వీడియోగా విశ్వసిస్తున్నారు..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
