శ్రీనాథ్ మహర్షి జ్ఞాపకార్ధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కూలీలు,బాటసారులకు అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారుకూరి సదానందం కుమారుడు శ్రీనాథ్ మహర్షి జయంతి సందర్భంగా అయన జ్ఞాపకార్ధం అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోజువారి కూలీలు బాటసారులు, నిరుపేదలు సుమారు 200 మంది పాల్గొని అల్పాహారం స్వీకరించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Chandrababu Convoy: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఆయన మార్గంలోనే చంద్రబాబు కాన్వాయ్ తగ్గింపు
Nuzendla, Andhra Pradesh:Fuel Conservation Drive: భారతదేశమంతటా పొదుపు మంత్రం మోగుతోంది. ఎవరు చెప్పారో.. దాని వలన ఏం ఉపయోగమో తెలియదు కానీ అకస్మాత్తుగా తక్కువ వాహనాలు వినియోగించాలని ప్రచారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో చెప్పినట్టుగానే ఆయన కూడా పొదుపు మంత్రం పాటించారు. ఆయన బాటలోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. చంద్రబాబు కూడా తన కాన్వాయ్లోని వాహనాలను తగ్గించారు. కాన్వాయ్లో తక్కువ వాహనాలు ఉంచాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. కాన్వాయ్లో వాహనాలు కుదించలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్లతో కీలక సమావేశం నిర్వహించారు. తన కాన్వాయ్లో వాహనాలు 50 శాతం తగ్గించాలని ఆదేశించారు. జిల్లా పర్యటనలో కూడా తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు కూడా తమ వాహనాలు తగ్గించుకోవాలని సూచించారు.
Also Read: Bandi Bhageerath: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ డుమ్మా.. తర్వాత ఏం జరగనుంది?
ప్రధాని కాన్వాయ్ తగ్గింపు
ప్రధాని తన కాన్వాయ్లోని వాహనాలను భారీగా తగ్గించారు. మెర్సిడెస్ అల్ట్రా లగ్జరీ కార్లు, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్ల సహా మొత్తం 12 నుంచి 15 కార్లు ఉండేవి. తాజాగా వాటి సంఖ్యను మొత్తం తగ్గించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు అధికారులు కాన్వాయ్లోని అన్ని వాహనాలను తొలగించి రెండింటినే ఉంచారు.
ఈ పొదుపు మంత్రంపై రేపు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో జరగనున్న సమావేశంలో ప్రధాని పొదుపు పిలుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో సీఎం, ఇతర మంత్రులు, అధికారులు పొదుపు చర్యలపై సూచనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Also Read: Cricket Betting: ఏపీ పోలీసులు స్టింగ్ ఆపరేషన్.. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
మంత్రివర్గంలో చర్చించే అంశాలు
మంత్రివర్గ సమావేశంలో 17వ ఎస్ఐపీబీ ఆమోదించిన పలు అంశాలపై చర్చ, ఆమోదం తెలపనున్నారు. మొత్తం 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. విశాఖలో రూ.లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్కు పచ్చజెండా ఊపనుంది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్కు ఆమోదం తెలపనుంది. పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
==> కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు
==> తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్
Bandi bhagirath: కీలక ఆధారాలతో ఆ రోజు వస్తా.!. సిట్ పోలీసులకు బండి భగీరథ్ సంచలన లేఖ..
Hyderabad, Telangana:Bandi Bhagirath responds to Hyderabad police sit notices: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండీ భగీరథ్ పోక్సో కేసు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తుంది. మే 8న కేసు నమోదైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేయక పోవడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. మంత్రుల కొడుకులకు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బండి సంజయ్ దేశం వదిలి పారిపోయాడా అంటూ పలు చోట్ల పోస్టర్ లు వెలిశాయి. ఈ క్రమంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్.. పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా.. బండి భగీరథ్ సిట్ పోలీసులకు మెయిల్ చేయడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో తాను మే 15న సిట్ పోలీసుల ఎదుట హజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కీలక సాక్షాలతో విచారణకు హాజరవుతానంటూ బండి భగీరథ పేర్కొన్నాడు. తనకు రెండు రోజుల సమయం కావాలని గడువు కోరాడు. అంతే కాకుండా SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరత్ తన లేఖలో పేర్కొన్నాడు.ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ మారింది.
బండి భగీరథ్ పై పోలీసులు BNS 74,75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు.
Read more: Kalva kuntla Kavitha: మైనర్ అమ్మాయికే ఎక్కువ నష్టం..!.. బండి భగీరథ్
మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ వేశారు. ఇక తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై రేపు విచారణ జరగనుంది. హైకోర్టు ఏవిధంగా తీర్పునిస్తుంది.. బండి సంజయ్ కొడుకు ఏవిధమైన ఆధారాలను సిట్ ముందు ఉంచుతారో అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bandi Bhageerath: పోక్సో కేసులో పోలీసు విచారణకు బండి భగీరథ్ డుమ్మా..ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Bandi Bhageerath POCSO Case: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అత్యాచార ఆరోపణల నేపత్యంలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణకు బండి భగీరథ్ విచారణకు హాజరుకాలేదు.Work From Home: ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎంత లాభమో తెలుసా? ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి మేలు!
Hyderabad, Telangana:Work From Home Benefits: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (ఇంటి వద్ద నుంచే పని) ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధంగా ఇంధన ఆదా దిశగా అడుగులు వేయాలని సూచించిన ఆయ సూచించిన నేపథ్యంలో, హైదరాబాద్ ఐటీ హబ్ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అవసరమైన రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అమలు చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదాహరణకు హైదరాబాద్లోని గచ్చిబౌలి, నానక్రామ్గూడ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో సుమారు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు ఇంధనం భారీగా వృథా అవుతోంది.
ఒకవేళ ఉద్యోగుల్లో సగం మందికి (4.5 లక్షల మందికి) వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పిస్తే అనేక మార్పులు కలిగే అవకాశం ఉంది. రోజుకు సుమారు 90 లక్షల మేర ప్రయాణ దూరం తగ్గుతుంది. ఈ విధంగా రోజుకు దాదాపు 3.6 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుందని అంచనా. ఈ గణాంకాలతో ప్రస్తుత పెట్రోల్ ధరల ప్రకారం.. రోజుకు దాదాపు రూ.3.87 కోట్ల మేర ప్రజా ధనం ఆదా అవుతుంది.
అలాగే ప్రయాణాలు తగ్గడం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, మన తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు మరింత నివాసయోగ్యమైన 'స్మార్ట్ సిటీలు'గా మార్చడానికి దోహదపడుతుంది.
ఉద్యోగుల ఉత్పాదకతపై ప్రభావం
అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. దీనివల్ల కొన్ని కీలక ఉపయోగాలు ఉన్నాయి. ట్రాఫిక్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడంతో ఆ పనికి లేదా కుటుంబానికి కేటాయించవచ్చు. ప్రయాణ ఒత్తిడి తగ్గి ఉద్యోగుల పని సామర్థ్యం మెరుగుపడుతుంది. పెట్రోల్, వాహన నిర్వహణ ఖర్చులు తగ్గిపోతున్న ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలన్నా, దేశ ఇంధన భద్రతను కాపాడాలన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం.. ప్రభుత్వం, కంపెనీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ ఇంటి నుండే పనిచేయడం వల్ల అటు ఆర్థిక వ్యవస్థకు, ఇటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also Read: బంగారం ధరలు పెరుగుతున్న వేళ కేంద్రం బంపర్ ఆఫర్..ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ!
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే?
Nunna, Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే దిశగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.Bandi Bhageerath: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ డుమ్మా.. తర్వాత ఏం జరగనుంది?
Baddipadaga, Telangana:Bandi Bhageerath POCSO Case: మద్యం తాగించి తాగిన మైకంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, నిందితుడు బండి భగీరథ్ తప్పించుకు తిరుగుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు రావాలని నోటీసు ఇవ్వగా ఎలాంటి స్పందన రాలేదు. పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని కోరగా.. బండి భగీరథ్ రాలేదు. పరారీలో ఉన్నాడని చెబుతుండగా.. అయినా కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. సిట్ విచారణకు డుమ్మా కొట్టడంతో బండి భగీరథ్ కేసు ఏమవుతుందనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read: Cricket Betting: ఏపీ పోలీసులు స్టింగ్ ఆపరేషన్.. క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్ పోక్సో నమోదై ఆరు రోజులు గడిచినా ఇంకా అరెస్ట్ కాలేదు. వాస్తవంగా పోక్సో కేసు నమోదైతే వెంటనే 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడంతో బండి భగీరథ్ను ఆరు రోజులైనా పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేసినా విచారణను తూతూమంత్రంగా చేపడుతోంది. నోటీసులు ఇచ్చి ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు విచారణకు రావాలని చెప్పినా బండి భగీరథ్ రాలేదు.
Also Read: GT vs SRH Highlights: సన్రైజర్స్ ఘోర పరాభవం.. భారీ విజయంతో ప్లేఆఫ్స్కు గుజరాత్
తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులకు బండి భగీరథ్ వైపు నుంచి స్పందన లేదు. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీస్ ఇస్తే బండి భగీరథ్ డుమ్మా కొట్టాడు. భగీరథ్ అరెస్ట్ కానీ పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. రేపు ముందస్తు బెయిల్పై హైకోర్టులో వెకేషన్ బెంచ్ విచారణ చేయనుండడంతో ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ విచారణకు రాలేదు.
బండి భగీరథ్పై కేసులు ఇవే
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్లో వివిధ సెక్షన్ల కింద పోక్సో కేసు నమోదైంది. బీఎన్ఎస్ 74, 75తో పాటు సెక్షన్ 5 (ఐ) రెడ్ విత్ 6 కింద పేట్ బషీర్బాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి నుంచి పోలీసులు రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నిందితుడు బండి భగీరథ్పై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (ఐ)ను జోడించడంతో బండి భగీరథ్కు బెయిల్ అనేది రాదు. కానీ అతడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బండి భగీరథ్కు బెయిల్ వచ్చినా ఆశ్చర్యం లేదు.
పెద్ద ఉద్యమమే..
అసలు పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి బండి భగీరథ్ను తప్పించాలనే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగానే తీవ్రమైన పోక్సో కేసు నమోదైనా పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. వాస్తవంగా 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉండగా పోలీసులు విచారణ పేరిట తాత్సారం చేస్తున్నారు. నిందితుడు తప్పించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసుకోవాలని సమయం ఇస్తున్నారు. చట్టం, న్యాయం నుంచి బండి భగీరథ్ తప్పించుకున్నా ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన మీడియా పట్టించుకోకున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడినా కూడా ప్రజలు మాత్రం బండి భగీరథ్ను క్షమించలేరు. ఇప్పటికే సోషల్ మీడియాలో బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలనే ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతోంది. బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ప్రజల నుంచి పెద్ద ఉద్యమమే రాజుకునే అవకాశం ఉంది.
AP Local Body Elections: ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా..స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే?
Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించే దిశగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
తాజాగా అందిన సమాచారం మేరకు.. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే డిసెంబరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా కొత్త ఏడాది (2027) ఆరంభం నాటికి నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయని తెలుస్తోంది.
అంతకు ముందు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమీషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రానుంది. అదే విధంగా వార్డుల పునర్విభజనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. ఇది జూన్ 26 నాటికి పూర్తి కావాలి.
ఇప్పటికే 13,291 పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. తాజా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్, పురపాలక, బీసీ సంక్షేమ శాఖలతో ఎన్నికల కమిషనర్ వరుస సమావేశాలు నిర్వహించారు. కోర్టు కేసులు ఉన్న 56 పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల నిర్వహణ సర్వసన్నద్ధంగా ఉంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కూటమి ఎన్నికలు కావడంతో, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిష్పక్షపాతంగా, పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
Also Read: Gold Monetisation: బంగారం ధరలు పెరుగుతున్న వేళ కేంద్రం బంపర్ ఆఫర్..ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Monetisation: బంగారం ధరలు పెరుగుతున్న వేళ కేంద్రం బంపర్ ఆఫర్..ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ
Vijayawada, Andhra Pradesh:Gold Monetisation Policy: ఇళ్లలో లేదా లాకర్లలో ఊరికే పడి ఉన్న బంగారంపై ఆదాయం పొందేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేస్తోంది. పసిడి ప్రేమికుల కోసం త్వరలో సరికొత్త 'గోల్డ్ మానిటైజేషన్ పాలసీ' తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, దానిపై వడ్డీని సంపాదించవచ్చు.
ఈ నూతన విధానం ప్రకారం, కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా సరే బ్యాంకులో డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ పథకం చేరువ కానుంది.
సాధారణంగా బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే ధర పెరిగినప్పుడు మాత్రమే లాభం ఉంటుంది. కానీ ఈ పాలసీ ద్వారా బంగారాన్ని బ్యాంకులో పెడితే, అది సురక్షితంగా ఉండటమే కాకుండా, ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే నిర్ణీత శాతం వడ్డీ లభిస్తుంది. లాకర్ల కోసం అద్దె కట్టే అవసరం లేకుండా, ప్రభుత్వం హామీ ఇచ్చే ఈ పథకంలో బంగారాన్ని దాచుకోవడం వల్ల అదనపు భద్రత లభిస్తుంది.
ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?
భారతదేశంలో టన్నుల కొద్దీ బంగారం ప్రజల ఇళ్లలో నిరుపయోగంగా ఉంది. ఈ బంగారాన్ని చలామణిలోకి తీసుకురావడం ద్వారా.. దేశీయంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెస్తే, విదేశాల నుండి దిగుమతి చేసుకునే అవసరం తగ్గుతుంది. ప్రజల వద్ద ఉన్న సంపద ఉత్పాదక రంగంలోకి మళ్లడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బంగారం దిగుమతుల కోసం వెచ్చించే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు.
త్వరలోనే ఈ పాలసీకి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో, దానిపై వడ్డీ కూడా వస్తుందన్న వార్త పసిడి ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమ వద్ద ఉన్న పాత నగలను లేదా బిస్కెట్లను ఈ పథకం ద్వారా లాభదాయకంగా మార్చుకునే అవకాశం ప్రజలకు కలగనుంది.
Also Read: బంగారం, వెండి ప్రియులకు కేంద్రం మరో ఝలక్..భారీగా పెరగనున్న ధరలు!
Also Read: భగ్గుమన్న బంగారం ధరలు..ఒకే రోజులో రూ.13,910 పెరిగిన గోల్డ్ రేట్..ఆకాశానికి వెండి ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iQOO సంచలనం.. 200MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో iQOO 15T లాంచ్!
Hyderabad, Telangana:iQOO 15T Launching on May 20 News: స్మార్ట్ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత శక్తివంతమైన మొబైల్ iQOO 15T విడుదలకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ మే 20వ తేదిన ఈ స్మార్ట్ఫోన్ను అధికారంగా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు సంస్థ అధికారంగా వెల్లడించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ అత్యాధునిక ఫీచర్స్తో, ప్రీమియం ఫోటోగ్రఫీ ఫీచర్స్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది బడ్జెట్ ధరలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
iQOO 15T స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ.. దీని కెమెరా సెటప్గా భావించవచ్చు. దీని వేనక భాగంలో ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత స్పష్టమైన ఫోటోలను, 4K నాణ్యతతో కూడిన వీడియోలను రికార్డ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే దీని తోడు అదనంగా దీనికి తోడు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉండడం విశేషం.. ఇందులో కంపెనీ సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది.
అంతేకాకుండా సాధారణంగా ఫ్లాగ్షిప్ ఫోన్లలో 5000mAh బ్యాటరీలను మాత్రమే కలిగి ఉంటాయి.. కానీ ఈ iQOO ఒక అడుగు ముందుకు వేసి ఇందులో ఏకంగా 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు నిరంతరాయంగా ఎంతో సులభంగా వినియోగించవచ్చు. అలాగే ఇందులో ఈ భారీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గేమింగ్ పనితీరు మెరుగుపరచడానికి ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (Dimensity 9500) మాన్స్టర్ ఎడిషన్ చిప్సెట్ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 6.82 అంగుళాల 2K OLED డిస్ప్లేను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 1800 నిట్స్ బ్రైట్నెస్తో రావడంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్తో పాటు IP68/69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. దీనిని కంపెనీ ముందుగా చైనాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టనుంది. దీని ధర, మరిన్ని వివరాలు మే 20న జరిగే లాంచ్ ఈవెంట్లో అధికారికంగా వెల్లడి కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cricket Betting Gang: బెంగాల్లో ఏపీ పోలీసులు స్టింగ్ ఆపరేషన్.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్!
Visakhapatnam, Andhra Pradesh:Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా సభ్యులను పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో విశాఖపట్టణం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడటం, బలవంతంగా సోషల్ మీడియా లింక్స్ వేదికగా బెట్టింగుల్లో పాల్గొనేలా ఆకర్షిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. బెట్టింగ్ నిర్మూలించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ శాఖ సమర్ధవంతమైన చర్యలు చేపడుతోందని పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో గత ఏడాది నమోదైన కేసులో లోతైన దర్యాప్తు చేపట్టగా ఈ బెట్టింగ్ అరెస్ట్ అయ్యింది.
Also Read: GT vs SRH Highlights: సన్రైజర్స్ ఘోర పరాభవం.. భారీ విజయంతో ప్లేఆఫ్స్కు గుజరాత్
గతేడాది నమోదైన బెట్టింగ్ కేసులో దర్యాప్తు చేయగా ఫస్ట్ ఫెయిర్ ప్లే, రెడ్డి అన్న, ఎక్చేంజ్ 666, 4 ఆర్ ఏ బుక్, అల్ట్రా వైన్ 2 యాప్లను విదేశాల నుంచి సేకరించారు. గోవాను కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జంషెడ్పూర్ ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక ప్రధాన ముఠా కార్యకలాపాలను విశాఖపట్టణం పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.
Also Read: GT vs SRH Live Updates: గుజరాత్ బౌలర్ల ప్రతాపం.. ఓటమి దిశగా సన్రైజర్స్
కలకత్తాలోని రెజెంట్ పార్క్ ప్రాంతంలోని ఒక నివాస గృహంపై దాడి నిర్వహించి బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుడు పఖరాని కరణ్ అలియాస్ అలెక్స్ అలియాస్ గబ్బర్తో పాటు అతడి సహచరులు సరస అగర్వాల్, అరవింద్ విరిడి, కరణ్ సింగ్, సయాద్ అమనత్ హుస్సేన్, అంబుజ్ గోపి, పరస్ అగర్వాల్ను విశాఖపట్టణం అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం నిందితుడు పఖరాని కరణ్ వివిధ రాష్ట్రాల వ్యక్తులతో కలిసి ఒక పెద్ద ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. టెలిగ్రామ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా బెట్టింగ్ లింకులు పంపించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. అనంతరం భారీ మొత్తంలో డబ్బు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు వివిధ వ్యక్తుల నుంచి బ్యాంక్ ఖాతాలను సేకరించి వాటిని బెట్టింగ్ లావాదేవీలకు ఉపయోగించడం, ఫ్రాంచైజ్ విధానంలో బెట్టింగ్ కార్యకలాపాలను విస్తరించడం వంటి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, బ్యాంక్ పాస్ పుస్తకాలు, చెక్ బుక్లు, నోట్ బుక్స్, పాస్పోర్టులు, ఇతర కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వస్తువులపై ఫోరెన్సిక్ పరిశీలన కొనసాగుతోందని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రతభగ్జీ తెలిపారు. ఈ కేసులో మరింత మంది నిందితులను గుర్తించేందుకు, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
RCB Vs KKR Preview: బెంగళూరు Vs కోల్కతా..ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం హోరాహోరీ పోరు..
Hyderabad, Telangana:RCB Vs KKR Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. నేడు జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్లో వారి స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్లేఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకంగా మారనుంది. ఓ వైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకొని ప్లేఆఫ్స్కు చేరాలని ఆర్సీబీ చూస్తుంటే..ఎలాగైనా ఈ మ్యాచ్లో నెగ్గి విజయం సాధించాలనే పట్టుదలతో కేకేఆర్ ఉంది.
ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లో 167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో కష్టపడింది. లీగ్ ఆరంభంలో ఉన్న బ్యాటింగ్ లైనప్ ఇప్పుడూ కొనసాగుతున్నా.. అందరూ వైఫల్యం చెందడం ఆర్సీబీ టీమ్ను కలవరపరుస్తుంది. విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచ్ల్లో డకౌట్గా నిలవగా.. కెప్టెన్ పాటిదార్ గత ఆరు ఇన్నింగ్స్లలో కేవలం ఒక అర్ధశతకం మాత్రమే చేసి ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ ఆదుకుంటున్నప్పటికీ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లపై అతిగా ఆధారపడాల్సి వస్తోంది.
మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద ఉంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిల స్పిన్ ద్వయం ఆర్సీబీ బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారనున్నారు. అలాగే పేస్ దళం వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, మతీషా పతిరానా వంటి యువ బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు.
కేకేఆర్ బ్యాటింగ్ విభాగంలో అజింక్య రహానే తడబడుతున్నా, రింకు సింగ్, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ అద్భుత ఫామ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ పుంజుకోవడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లు ప్రారంభ ఓవర్లలో కేకేఆర్ టాప్ ఆర్డర్ను దెబ్బతీయాలని భావిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆడిన 11 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. అలాగే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్ల్లో 4 గెలిచి, 1 డ్రాతో 9 పాయింట్లతో టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు చేరాలంటే కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఇది డూ-ఆర్-డై మ్యాచ్.. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్కు చేరే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లీ, జకోబ్ బెథెల్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, సుయాష్ శర్మ. (ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్, వెంకటేష్ అయ్యర్)
కోల్కతా నైట్రైడర్స్ తుదిజట్టు అంచనా..
అజింక్య రహానే (కెప్టెన్), రింకూ సింగ్, రఘువంశీ, కెమెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, మనీష్ పాండే, రోవ్మన్ పావెల్. (ఇంపాక్ట్ ప్లేయర్: ఫిన్ అలెన్).
Also Read: భగ్గుమన్న బంగారం ధరలు..ఒకే రోజులో రూ.13,910 పెరిగిన గోల్డ్ రేట్..ఆకాశానికి వెండి ధర!
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Import Duty: బంగారం, వెండి ప్రియులకు కేంద్రం మరో ఝలక్..భారీగా పెరగనున్న ధరలు!
Hyderabad, Telangana:Gold Import Duty Hike India: దేశంలో పసిడి, వెండి ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పసిడి దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు ఈ లోహాలపై 5 శాతం విలువైన దిగుమతి సుంకాన్ని కేంద్రం ఏకంగా 10 శాతం పెంచింది. అంటే కస్టమ్స్ డ్యూటీని ఏకకాలంలో రెట్టింపు చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నా.. మన దేశంలో తులం బంగారంపై వేలల్లో భారం పడనుంది.
నిర్ణయానికి కారణాలు ఏంటి?
కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా 'రికార్డు స్థాయి దిగుమతులు' ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులను నమోదు చేసింది. ఏకంగా 71.98 బిలియన్ విలువైన పసిడిని విదేశాల నుండి కొనుగోలు చేయడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.
బంగారంపై మోజు తగ్గించుకోవాలని, అనవసరంగా పసిడిని కొనుగోలు చేసి నిల్వ చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రజలకు వివరించారు. అయినప్పటికీ డిమాండ్ తగ్గిన ప్రభుత్వం సుంకాల పెంపును అస్త్రంగా ఏంచుకుంది.
సామాన్యులపై ప్రభావం
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశం భారత్. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలకు బంగారం కొనడం ఒక సెంటిమెంట్గా మారింది. ప్రస్తుత పెంపుతో అటు వెండి, ఇటు బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజల పొదుపుపై , వివాహ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా వెండిపై కూడా సుంకం పెరగడంతో పారిశ్రామిక రంగానికి కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు నగల వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు పెద్ద గండంగా మారింది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Also REad: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: వామ్మో.. నాగుపాము తల కట్ చేసిన నాగమణి తీసిన యువకుడు.. వీడియో..
Hyderabad, Telangana:Nagamani Video Watch: గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇప్పటికీ పాము కాటుకు గురైనవారు నాటు వైద్యంపై ఆధాపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా నాగమణి అని పిలిచే ఒక రకమైన అరుదైన రాయిని కాటు వేసిన చోట ఉంచితితే.. అది విషాన్ని పీల్చుకుంటుందని ఒక బలమైన నమ్మకం ఇప్పటికీ చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవించే ప్రజల్లో ఉంది.. అయితే, తాజాగా దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వివియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
పాము తల వెనుక భాగంలో ఒక రకమైన గట్టి పదార్థం తయారవుతుంది.. పాము చనిపోయిన తర్వాత లేదా దాని తలను చీల్చి ఆ రాయిని బయటికి తీస్తారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ ఘటన కూడా దీనికి సంబంధించిందే.. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన కోబ్రాను సంచిలో నుంచి తీసి.. అందరూ చూస్తుండగా.. ఒక ఛాక్తో ఆ కింగ్ కోబ్రా పాము తల భాగాన్ని కట్ చేయడం మీరు చూడొచ్చు..
అంతేకాకుండా ఆ పాము తల భాగాన్ని ఒక చేతితో నెమ్మదిగా పట్టుకుని.. మరో చేతితో కత్తి పట్టుకుని కట్ చేయడం మీరు చూడొచ్చు. అలాగే, అతను వెంటనే అందులో నుంచి రెండు రాళ్లను తీసి అక్కడే పరిచి పేపర్లో ఉంచారు. అయితే, దానిని అక్కడే ఉన్న కొంతమంది కొనుగోలు చేశారు. అలాగే అతను ఆ పాము తల భాగం నుంచి తీసిన మణి గురించి వివరించడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఈ రాయి విషాన్ని ఎలా లాగేస్తుందో వివరిస్తూ.. పాము కాటు వేసిన చోట చిన్నగా కోసి.. అక్కడ ఈ రాయిని ఉంచితే అది రక్తాన్ని, విషాన్ని పీల్చుకుని అతుక్కుపోతుందని.. విషం పూర్తిగా పోయాక అదే కింద పడిపోతుందని సదరు వ్యక్తి వివరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఆ తర్వాత ఆ రాయిని పాలలో లేదా నీళ్లలో వేస్తే విషం విరిగిపోయి.. రాయి మళ్లీ శుద్ధి అవుతుందని అతను అక్కడున్నవారికి తెలిపారు. తాజా ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Thalliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
Vijayawada, Andhra Pradesh:Thalliki Vandanam Amount 2026: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. గత ప్రభుత్వంలోని 'అమ్మఒడి' పథకంలో మార్పు చేస్తూ ఈ పథకం కింద, రెండో ఏడాది నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
ప్రస్తుత అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ 12న అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు.. అర్హత ప్రమాణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థుల వివరాలను విద్యాశాఖ సేకరించింది. ఈ వివరాలను సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మరో రెండు నుండి మూడు వారాల్లో పూర్తికానుంది. ఆ తర్వాతే తుది అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రతి లబ్ధిదారురాలి ఖాతాలో రూ.13,000 జమ చేయనున్నారని సమాచారం.
కావాల్సిన అర్హతలు
పథకం ప్రయోజనం పొందాలంటే ఈ కింది నిబంధనలు పాటించడం తప్పనిసరిగా అధికారులు సూచిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు (వైట్ రేషన్ కార్డ్) తప్పనిసరిగా ఉండాలి. వ్యవసాయ భూమిమాగాణి అయితే 3 ఎకరాల లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. ఇంటి విద్యుత్ వినియోగంలో 300 యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడకం ఉండాలి. నివాస స్థలం పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉండాలి. అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు, ఆదాయ పన్ను (IT) చెల్లించే వారు కాకూడదు. ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే 'తల్లికి వందనం' పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
గమనిక: 'తల్లికి వందనం' లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ (e-KYC) అయి ఉందో లేదో ముందే సరిచూసుకోవడం ఉత్తమం. దీనివల్ల నగదు జమ సమయంలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.
Also Read; ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?
Also Read: విడాకుల తర్వాత ఒకే వేదికపై సమంత, నాగచైతన్య..మాజీ భార్యభర్తల వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Worlds Longest Cobra Video: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రా.. వామ్మో ఎలా ఉందో చూడండి.. వీడియో!
Hyderabad, Telangana:Worlds Longest King Cobra Video Watch Now: ప్రకృతిలో కొన్ని దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడవక మానదు..ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను వణికిస్తోంది. చాలా మంది దీనిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత ప్రమాదకరమైన జాతికి చెందిన ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక ఎత్తైన గట్టుపై ఈ భారీ సర్పం కనిపిస్తోంది. సాధారణ పాముల కంటే చాలా భిన్నంగా కనిపించడం మీరు చూడొచ్చు. ఇది తన శరీరంలోని మూడో వంతు భాగాన్ని పైకి లేపి, పడగ విప్పి అటువైపు ఉన్న పరిసరాలను అత్యంత క్షుణ్ణంగా గమనించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా దాని శరీర పరిమాణం, పొడవు చూస్తుంటే అది కనీసం 25 నుంచి 35 అడుగుల వరకు పొడవు ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా అన్ని కింగ్ కోబ్రాలు తన పడగను భూమి నుంచి దాదాపు 4 నుంచి 5 అడుగుల వరకు ఎత్తు వరకు లేపగలవు.. కానీ ఈ వీడియోలో మాత్రం.. అది ఒక మనిషి కంటే ఎక్కువ ఎత్తుకు సమానంగా పడగ విప్పి ఉండడం చూసి జనం భయాందోళకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనను చిత్రీకరించిన విధానం కూడా చాలా అసక్తిగా ఉండడం మీరు గమనించవచ్చు. పాము ప్రమాదకరమైనది కావడంతో, కెమెరామెన్ చాలా దూరం నుంచి జూమ్ లెన్స్ వినియోగించి దీనిని షూట్ చేసినట్లు తెలుస్తోంది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వేలల్లో షేర్ల కూడా అయిన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. అది పాము కాదు.. సాక్షాత్తు ఆ యముడి పాశంలా కనిపిస్తుందని.. అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ప్రకృతిలో ఇంతటి భారీ జీవులను చూడడం.. ఇదే మొదటిసారి, అలాగే వాటికి దూరంగా ఉండటమే మంచిదని కామెంట్ చేస్తూ వస్తున్నారు. మరికొంతమంది ఈ వీడియోను ఏ ప్రాంతంలో తీశారని ఆరా కూడా తీస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్
