icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Hyderabad To Mumbai Bullet Train: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

Hyderabad, Telangana:

Hyderabad To Mumbai Bullet Train Project: హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్లే హైదరాబాద్-పుణె-ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధమైనట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది.

3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబైకి..
ప్రస్తుతం హైదరాబాద్ నుండి ముంబయికి రైలు లేదా రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే కనీసం 12 నుండి 15 గంటల సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన 671 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే, కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుండి ముంబయికి వెళ్లొచ్చు. ఇది ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఇరు రాష్ట్రాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాలకు భారీ ఊపునివ్వనుంది.

ఈ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతికతతో, ఎన్నో భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణ విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ కారిడార్‌లో మొత్తం 35.30 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని భూగర్భంలో నిర్మించనున్నారు. ప్రకృతి రమణీయతతో కూడిన పశ్చిమ కనుమలలోని ఖండాల ఘాట్ పరిధిలో దాదాపు 24 కిలోమీటర్ల మేర అధునాతన సొరంగ మార్గాలను తవ్వనున్నారు.

రాష్ట్రాల వారీగా విస్తరణ ఎలా ఉండబోతుంది?
ఈ హైస్పీడ్ రైలు మార్గం మొత్తం మూడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. దీని విస్తరణ విభజన ఇలా ఉందని ప్రాజెక్ట్ డీపీఆర్ వెల్లడిస్తోంది. మహారాష్ట్రలో 68 శాతం, కర్ణాటకలో 18 శాతం ఉండగా.. తెలంగాణలో కేవలం 14 శాతం ప్రాజెక్ట్ విస్తరణలో వాటా ఉండబోతుంది. 

ఈ రూట్‌లో ప్రయాణించే రైళ్లు గంటకు గరిష్ట వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌లను డిజైన్ చేస్తున్నారు. డీపీఆర్ సిద్ధం కావడంతో, తదుపరి అనుమతులు లభించిన వెంటనే భూసేకరణ, నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు దక్కన్ ప్రాంత రవాణా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.

Also REad: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం..45 డిగ్రీలు దాటిన ఎండలు..బయటకి రావొద్దని హెచ్చరిక

Also Read: ఆర్టీసీలో మరోసారి ప్రైవేటీకరణ సెగ..ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఉద్యోగ సంఘాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

CSK Vs SRH Prediction: చెన్నై Vs హైదరాబాద్.. ఐపీఎల్‌లో నేడు చావో రేవో మ్యాచ్..ధోనీ ఆడతాడా?

Chennai, Tamil Nadu:

CSK Vs SRH Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ రేసులో నేటి మ్యాచ్‌లో క్లారిటీ రానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. ఆ తర్వాతి మూడు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయి. 

12 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న SRH (NRR 0.331), ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొంత వెసులుబాటు ఉంది. సీఎస్కేకు 12 పాయింట్లు ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 14 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ముందు ఉంది. 

పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడిపోయినా కూడా, ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే, ఈ పరిస్థితి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండూ తమ చివరి రెండు మ్యాచ్‌లలో కనీసం ఒకదానిలోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎస్ఆర్‌హెచ్‌కు మార్గం సుగమం అవుతుంది. 

ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపోటముల మధ్య సతమతమవుతుంది. ప్లేఆఫ్స్ రేసులో బలంగా నిలవాలంటే ఈ జట్టులోని బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో, కష్టమైన వికెట్‌పై వారిని 168 పరుగులకే ఐదు వికెట్ల నష్టానికి పరిమితం చేసి SRH పట్టులో ఉన్నట్లు కనిపించింది. కానీ అత్యుత్తమ పేస్ బౌలింగ్ ముందు కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.

అంతకు ముందు పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అధిక స్కోరు నమోదు చేసి 33 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ విజయం లభించింది.

ఇక CSK విషయానికొస్తే, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు అంత సులువుగా లేవు. 16 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించే అవకాశం వారికి ఇంకా ఉన్నప్పటికీ, దాని కోసం వారు తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలవాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఎస్ఆర్‌హెచ్ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. 

నెట్ రన్ రేట్ పరంగా చూస్తే ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వెనుకబడి ఉంది. వారి రన్‌రేట్ 0.027 గా నమోదయ్యింది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న రాజస్థాన్ రాయల్స్ (0.082) కంటే వెనుకబడి ఉంది. మరోవైపు 0.355 అనే పటిష్టమైన NRR (నెట్ రన్ రేట్)తో 13 పాయింట్ల వద్ద ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా పోటీలో బలంగా నిలిచింది.

అయినప్పటికీ, CSK తమ అవకాశాలపై ఇంకా ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే, పలు కీలక ఆటగాళ్ల గాయాలతో సహా లెక్కలేనన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ, వారి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రదర్శించిన పట్టుదల అమోఘంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడనే సంకేతాలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సమాచారం అందుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కార్తిక్ శర్మ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అమన్ ఖాన్, శివం దూబె, డియాన్ ఫోరెస్టర్, జక్ ఫౌల్కిస్, అన్షుల్ కాంబోజ్, మెక్‌నీల్ నోరోన్హా, మూథ్యా షార్ట్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, శ్రేయాస్ గోపాల్, గుజాప్‌నీత్ సింగ్, మ్యాట్ హెన్సీ, అకీల్ హోసీన్, స్పెన్సర్ జాన్సర్, అకాష్ మద్వేల్, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, ఆర్ఎస్ అంబరీష్, హర్ష్ దూబే, క్రైన్స్ ఫులేత్రా, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు కుమార్ పాట్‌స్టోన్, కమిందు కుమార్ పాట్‌స్టోన్ కుమార్, గెరాల్డ్ కోయెట్జీ, ప్రఫుల్ హింగే, దిల్షన్ మధుశంక, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ.

Also Read: రేపే ధోనీ చివరి మ్యాచ్..చెపాక్‌లో ఫ్యాన్స్ మధ్య వీడ్కోలు పలకనున్న దిగ్గజం?!

Also Read: ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి..బెంగళూరు గెలవాలని చెన్నై ఫ్యాన్స్ పూజలు..ఎందుకో తెలుసా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

DC vs RR Highlights: రసవత్తరంగా ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ పోరు.. రాజస్థాన్‌కు ఢిల్లీ అదిరిపోయే దెబ్బ

New Delhi, Delhi:

DC beat RR by 5 wickets: ఐపీఎల్‌ 2026 ముగింపు దశకు చేరుకున్న సమయంలో రసవత్తర పోరు సాగుతోంది. ప్లేఆఫ్స్‌ నుంచి దూరమైన జట్లు రేసులో ఉన్న జట్లను దెబ్బతీస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ దెబ్బ తీసింది. రాజస్థాన్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. అద్భుతంగా పోరాడిన ఢిల్లీ జట్టును మ్యాచ్‌ సొంతం చేసుకుని రాయల్స్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్‌ రావాల్సిందే: కేటీఆర్‌

ఢిల్లీలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ మరోసారి తక్కువ (12) స్కోర్‌కు ఔటవగా.. టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీ దూకుడుగా ఆడి 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ధ్రువ్‌ జురేల్‌ అద్భుత ప్రదర్శన కనబర్చి 40 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, రెండు సిక్సర్లు నమోదు చేయగా.. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ కూడా అద్భుతంగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లో 51 పరుగులు చేసి మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. ఫెరెరా గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. రవి సింగ్‌ (4), శుభమ్‌ దుబే (5), దసూన్‌ శనక (10) ఏమాత్రం మోస్తరు పరుగులు చేయలేకపోయారు. మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లతో విజృంభించగా.. లుంగీ ఎంగిడి, మాధవ్‌ తివారీ తలా రెండేసి వికెట్లు తీశారు.

Also Read: PBKS vs RCB Highlights: హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు బెంగళూరు.. పంజాబ్‌కు తీవ్ర నిరాశ

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్‌లలోనే 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అభిషేక్‌ పరేల్‌, కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడడంతో ఢిల్లీ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అభిషేక్‌ 31 బంతుల్లో 51 పరుగులు చేయగా.. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ నమోదు చేశాడు. రాహుల్‌ 42 బంతుల్లో 56 పరుగులు చేసి ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు బాదాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా ఆడి 34 పరుగులు చేసి మ్యాచ్‌ను విజయానికి చేరువలో చేశాడు. సాహిల్‌ పరాఖ్‌ (9), త్రిస్టన్‌ స్టబ్స్‌ (4), డేవిడ్‌ మిల్లర్‌ (9) తక్కువ పరుగులు చేయగా.. అశుతోష్‌ శర్మ మరోసారి బ్యాట్‌తో మెరిసి 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్లు తడబడ్డారు. జోఫ్రా ఆర్చర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు తీయగా.. దసూన్‌ శనక ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తే ముందడుగు వేయాల్సిన రాజస్థాన్‌ రాయల్స్‌ వెనుకడుగు వేసింది. ఏ రకంగానూ ప్లేఆఫ్స్‌కు వెళ్లలేని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు కాపాడుకుంది. అయితే ఈ విజయంతో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు దెబ్బతిన్నాయి. 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు విజయాలు, ఆరు ఓటములు సాధించింది. ఢిల్లీ క్యాపిట్స్‌ 13 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు ఏడు ఓటములు సాధించింది.

0
0
Report
Advertisement
Advertisement

KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్‌ రావాల్సిందే: కేటీఆర్‌

Hyderabad, Telangana:

BRS Party: 'హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కాలి అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రెండున్నర సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. కనీస పౌర సదుపాయాలు కూడా నిర్వహించలేని దుస్థితిలోకి నగరం ఉందని, ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి వృధా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: PBKS vs RCB Highlights: హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు బెంగళూరు.. పంజాబ్‌కు తీవ్ర నిరాశ

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ 'మన బూత్ - మన బాధ్యత' కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)పై గులాబీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పలు అంశాలపైన వివరంగా మాట్లాడారు. 'ఉన్న నగరాన్ని వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి వృధా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న నగరాన్ని నిర్వహణ చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు' అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

కాంగ్రెస్ ప్రభుత్వం వారాంతాల్లో.. సెలవు రోజుల్లో బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి పంపిస్తూ రెండున్నర సంవత్సరాల పాటు వేలాది మంది ఇండ్లను కూల్చివేసిందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తే.. రేవంత్‌ రెడ్డి వచ్చాక హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదని గుర్తుచేశారు. 'ఒకప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు ఈరోజు కేసీఆర్‌ ప్రభుత్వ చొరవతో.. కృషితో వచ్చినవే అని వాటి వెనుక ఎంత శ్రమ, ఎంత నిబద్ధత ఉంది. ఇది ప్రజలు గుర్తించాలి' అని కేటీఆర్ కోరారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో ఎల్బీనగర్ రూ.వేల కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను మార్చారని గుర్తుచేశారు.

Also Read: Telangana Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్‌సీపై కీలక ముందడుగు

'గత ప్రభుత్వంలో కేసీఆర్ పేదలకు అండగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాలను.. గతంలో ఉన్న ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి అనేక అంశాల గురించి ప్రస్తుతం ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. వాటిని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది' అని గులాబీ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని.. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని ప్రకటించారు.

'గత ప్రభుత్వం 'తెలంగాణ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (టిమ్స్) పేరుతో ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు చేపడితే ప్రస్తుతం గడ్డిఅన్నారంలో జరుగుతున్న నిర్మాణం పూర్తిగా స్తంభించిపోయింది. త్వరలోనే టిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఒక భారీ ధర్నాను చేపడతాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటించారు. కచ్చితంగా హైదరాబాద్ నగరంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాడితే అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘనమైన విజయాలు సాధిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

0
0
Report

PBKS vs RCB Highlights: హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు బెంగళూరు.. పంజాబ్‌కు తీవ్ర నిరాశ

Wadgaon, Maharashtra:

RCB Qualifies IPL 2026 Playoffs: రెండో ట్రోఫీపై కన్నేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లో తొలి స్థానం పొందింది. ప్లేఆఫ్స్‌లో స్థానం పొందాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తృటిలో విజయాన్ని తప్పించుకుని ఓటమిపాలైంది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 23 పరుగుల తేడాతో గెలిచి బెంగళూరు హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: LSG vs CSK Highlights: లక్నో సంచలన విజయం.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ కష్టమే!

0
0
Report
Advertisement

Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

Hyderabad, Telangana:

AIKYA Dhairya Sena Samithi: సినీ నటుడు హీరో మంచు మనోజ్‌ మానవతా కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు ఉన్న సంపాదనలో కొంత సమాజానికి అందించాలని నిర్ణయించి ఒక ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఆ ట్రస్ట్‌కు 'ఐక్య ధైర్య సేన సమితి' పేరిట నామకరణం చేశాడు. తన జన్మదిన వేడుకల కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మనోజ్‌ తెలిపాడు. సమాజ సేవలో భాగమయ్యేందుకు ఈ ట్రస్ట్‌ను ప్రారంభించిన మనోజ్‌.. వెంటనే ఐదుగురు విద్యార్థులను దత్తత ఈసుకున్నాడు. ట్రస్ట్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: LSG vs CSK Highlights: లక్నో సంచలన విజయం.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ కష్టమే!

మార్చి 20వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ సేవా కార్యక్రమాలను ప్రారంభించాడు. కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తన వ్యక్తిగత సోషల్‌ మీడియాలో కూడా తన ట్రస్ట్‌కు సంబంధించిన పోస్ట్‌ పెట్టాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది పేర్కొంటూ సోషల్‌ మీడియా తన ట్రస్ట్‌ ఫొటో, వివరాలు పంచుకున్నాడు.

Also Read: Telangana Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్‌సీపై కీలక ముందడుగు

తనకు మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదని.. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉందని మంచు మనోజ్‌ తెలిపాడు. అవసరంలో ఉన్నవారి కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని.. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నట్లు మంచు మనోజ్‌ చెప్పాడు. తన సతీమణి మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్య ధైర్య సేనా సమితిని ప్రారంభించినట్లు వెల్లడించాడు.

'ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం' అని మంచు మనోజ్‌ అర్థం వివరించాడు. దేవుడు తమకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట తమ ట్రస్ట్‌ సంస్థ ఉంటుందని తెలిపాడు. ఇది రాజకీయం కాదు, ఈ సంస్థ మాది మాత్రమే కాదు మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ అని ప్రకటించారు. ఈ ట్రస్ట్‌ ద్వారా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్‌ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని మంచు మనోజ్‌ తెలిపాడు.

0
0
Report
Advertisement

RTC Privatisation: ఆర్టీసీలో మరోసారి ప్రైవేటీకరణ సెగ..ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఉద్యోగ సంఘాలు!

Vijayawada, Andhra Pradesh:

APSRTC Privatisation News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కొత్తగా ప్రవేశపెడుతున్న విద్యుత్ (ఈ-బస్సు) బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణను ఆర్టీసీ స్వయంగా చేపట్టలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏపీఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దశలవారీగా సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్న వేళ.. ఉద్యోగులు భారీ ఉద్యమానికి తెరలేపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ఎంప్లాయీస్ యూనియన్' (EU) కూటమి ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది.

మండిపడుతున్న కార్మిక సంఘాలు..
ఇటీవలే ఆర్టీసీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు సంస్థను దశలవారీగా ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలను పన్నుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడాన్ని సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నిరసనల్లో భాగంగా ఇప్పటికే డిపోల వద్ద ధర్నాలు చేపడుతున్నారు. 

మే 16, 17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతం అయ్యాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అలాగే మే 18న రాష్ట్రంలోని అన్నీ జిల్లాల కలెక్టర్లను కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెమోరాండం సమర్పించనున్నారు. మే 26న విజయవాడలో నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను, తదుపరి ఆందోళనలను ఉద్యోగ సంఘాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఉద్యోగ సంఘాల డిమాండ్స్..
1) విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా, ఆర్టీసీనే స్వయంగా కొనుగోలు చేసి నడపాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. 
2) అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలు, దివ్యాంగుల ఉచిత ప్రయాణ పథకాలకు సంబంధించి నెలకు రావాల్సిన రూ.300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 
3) ఈ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తే ఆర్టీసీ స్వయంగా ఈ-బస్సులను కొనుగోలు చేయగలదని నేతలు స్పష్టం చేశారు.
4) అదే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం..45 డిగ్రీలు దాటిన ఎండలు..బయటకి రావొద్దని హెచ్చరిక

Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు..రాష్ట్రంలో వర్షాలు కురిసేది అప్పటి నుంచే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Uppal X Road: ఉప్పల్ క్రాస్ రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపులు ఇవే!

Hyderabad, Telangana:

Uppal Traffic Diversions: హైదరాబాద్‌ నగరంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఎలివేటెడ్‌ కారిడార్‌లో పురోగతి లభించింది. ఈ కారిడార్‌లో ప్రధానమైన ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం జరగనుంది. పిల్లర్‌ నిర్మాణ పనుల్లో భాగంగా ఉప్పల్‌ చౌరస్తాను మూసివేయనున్నారు. ఫ్లైఓవర్‌ పనులు చకచకా జరిగేలా ట్రాఫిక్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరం నలువైపులా నుంచి రాకపోకలు సాగించే ఈ ప్రధాన మార్గం మూసివేతతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అధికారులు ట్రాఫిక్‌ మళ్లింపు చేశారు. ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా ఉంది.

Also Read: Gold Theft RTC Bus: కాకినాడలో ఫ్రీ బస్సు ఎఫ్టెక్‌.. బ్యాగ్‌లో 35 తులాల బంగారం చోరీ!

నేటి నుంచి తాత్కాలికంగా బంద్
అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్‌ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్‌ విద్యుత్‌ జంక్షన్‌ ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ పిల్లర్‌ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్‌ బస్టాప్‌ను ఇప్పటికే ఉప్పల్‌ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే.

Also Read: LSG vs CSK Highlights: లక్నో సంచలన విజయం.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ కష్టమే!

ప్రత్యామ్నాయ మార్గాలు..
హబ్సిగూడ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్‌ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్‌ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్‌ ఫ్లవర్‌ వెనక దారి నుంచి వరంగల్‌ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్‌ ఏషియన్‌ సినీ థియేటర్‌ ఎదుటి హెచ్‌ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్‌ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్‌ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

భారీ వాహనాల మళ్లింపు
ఎలివేటెడ్‌ కారిడార్‌లో భాగంగా భారీ వాహనాలను కూడా దారి మళ్లించారు. నాగోల్‌ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్‌ చేసుకుని తిరిగి ఉప్పల్‌ వైపు రావాలి. వరంగల్‌ వైపు వెళ్లేవారు హెచ్‌ఎండీఏ లే అవుట్‌ నుంచి వరంగల్‌ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్‌కు వచ్చే వరంగల్‌ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్‌ఆర్‌ మీదుగా హయత్‌నగర్‌ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది.

0
0
Report
Advertisement
Advertisement
Back to top