మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ 4వ వర్ధంతి సందర్బంగా నివాళులు
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక సీపీఐ పట్టణ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదలకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి గుండా మల్లేష్ అన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
మీ పేరు ఓటర్ లిస్ట్ నుంచి పోయిందా? ఈసీ కొత్త డ్రాఫ్ట్ డిలీషన్ లిస్ట్ విడుదల! జిల్లా వారీగా చెక్ చేసుకునే విధానం ఇదే!
Hyderabad, Telangana:List of Electors Names Deleted SIR 2026: సర్ ప్రక్రియ వేగంగా ముగియడంతో, ఆగస్టు 17న డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేశారు. భారీ స్థాయిలో ఓట్లు తొలగించబడ్డాయనే వార్తలు వస్తున్నాయి. మొత్తం 3.38 కోట్ల మందిలో 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా అధికారిక వెబ్సైట్లో డ్రాఫ్ట్ లిస్టు అందుబాటులో ఉంది. ఒకవేళ మీ పేరు లేకపోతే, వెంటనే BLOని సంప్రదించండి. లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. తెలంగాణలో తమ ఓటర్ల నమోదు సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి మొబైల్లో 'ECI' అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, ఓటర్ ఐడి నంబర్ను ఎంటర్ చేసి 1950కి SMS పంపే వెసులుబాటును కల్పించారు. వెంటనే వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. అంటే సర్వే పూర్తయిందని అర్థం. ఒకవేళ SMS రాకపోతే వెంటనే BLOని సంప్రదించాలని అధికారులు చెప్పారు.
ఈ సర్వేలో సుమారు 73 లక్షల ఓట్లు గల్లంతయినట్లు ప్రాథమికంగా తేలింది. ఇందులో ప్రధానంగా మరణించిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు ఎన్యూమరేషన్ సమర్పించని వారు ఉన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైనందున, అందులో పేరు లేనివారు మళ్లీ అప్లై చేసుకోవచ్చు. వివరాలు సరిగ్గా నమోదు చేయని 20 శాతం మందికి వివరణ కోరుతూ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. వారు తమ గుర్తింపు కార్డులో ఏదో ఒకటి సమర్పిస్తే ఓటును పునరుద్ధరిస్తారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేశారు. ఇందులో 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారమ్స్ సమర్పించారు. మరో 57.46 లక్షల మంది అడ్రస్ మారడం లేదా అడ్రస్ సరిగా లేకపోవడం వల్ల పెండింగ్లో ఉన్నాయి. మీ పేరు జాబితాలో ఉందో లేదో అధికారిక వెబ్సైట్లో క్లిక్ చేసి చూసుకోవచ్చు.
మీ ఓటు డిలీట్ అయిందా? కారణం ఇలా తెలుసుకోండి..
అధికారిక వెబ్సైట్ https://ceotserms2.telangana.gov.in/tgasdd/ASDD.aspx ను ఓపెన్ చేయండి. అక్కడ 'ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ సర్వే 2026'లో గైర్హాజరైన వారు, షిఫ్ట్ అయిన, మరణించిన వారి వివరాలు ఉంటాయి. మీరు పోలింగ్ స్టేషన్ వారీగా చెక్ చేసుకోవచ్చు. మొదట మీ జిల్లా పేరు, ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నంబర్ లేదా పార్ట్ పేరు ఇవ్వాలి. కింద క్యాప్చా కోడ్ను నమోదు చేసి 'సబ్మిట్' బటన్ నొక్కండి. అప్పుడు మీ ఓటు ఎందుకు డిలీట్ అయిందో కారణం తెలుస్తుంది. అక్కడ మీ క్రమ సంఖ్య, ఓటర్ ఐడి (EPIC) నంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు సులభంగా వెతకవచ్చు. ఓటరు పేరు, సంబంధం, బంధువు పేరు, పాత సంఖ్య, వయస్సు, లింగం, ఓటు డిలీట్ కావడానికి గల కారణం కూడా అక్కడ స్పష్టంగా ఉంటుంది.
Also Read: ప్రయాణీకులకు పండగే.. ఏకంగా 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
Also Read: నెట్ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క నంబర్కు SMS, మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ముందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Irumudi Movie Review: 'ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లన్నీ అయ్యప్ప నామాలతో మోతమ్రోగిపోతాయి!
Hyderabad, Telangana:Irumudi Movie First Review: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ థ్రిల్లర్ 'ఇరుముడి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ చిత్రంపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యంలో సాగే ఈ కథలో దర్శకుడు శివ నిర్వాణ ఒక సరికొత్త అమ్మాయిల మిస్టరీ డెత్స్ కాన్సెప్ట్ను జోడించి ఉత్కంఠభరితమైన థ్రిల్లర్గా మలిచారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్ లభించింది. రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవి ఈ చిత్రాన్ని నిర్మించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇందులో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రివ్యూ ప్రదర్శించగా, సినీ వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రవితేజ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ యాక్టింగ్, ఆయనలోని అసలైన ఎనర్జీ ఈ చిత్రంలో పూర్తిగా కనిపిస్తాయని టాక్ వినిపిస్తోంది.
తండ్రీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు, రవితేజ పాత్రలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. తొలిభాగంలో కుటుంబ కథాంశం, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, ఇక రెండో భాగంలో అసలు కథ ప్రారంభమై చివరి 25 నిమిషాలు సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్తుందని తెలుస్తోంది.
మొత్తానికి, విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి, రవితేజకు బలమైన పునరాగమనాన్ని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరింత సమాచారం. అప్డేట్స్ కోసం అధికారిక సోషల్ మీడియా పేజీలను లేదా మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ఖాతాను సందర్శించవచ్చు.
Also Read: Irumudi Pre-Release Event: 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ స్పీచ్..
Also REad; "బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది" ఇరుముడి ఈవెంట్లో హీరో రవితేజ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev Effect: ఈ 3 రాశులకు ఏలినాటి శని బాధల నుంచి ఊరట, ఇకపై తిరుగుండదు!
Hyderabad, Telangana:Saturn Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో, శని దేవుడిని కర్మ, న్యాయానికి అధిపతిగా చెప్పుకుంటారు. అంతేకాకుండా దీనిని శక్తివంతమైన గ్రహంగా కూడా పిలుస్తూ ఉంటారు.. అలాగే ఈ గ్రహం అన్నింటిలా కాకుండా చాలా నెమ్మదిగా ఒక గ్రహం నుంచి మరో గ్రహంలోకి సంచారం చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఆగస్టు 20న శని నక్షత్రం సంచారం చేయబోతోంది.. ఈ గ్రహ సంచారం సమయంలో ఆర్థష్టమ శనితో బాధపడుతున్నవారికి అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది.. ఈ రాశుల వారికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. అయితే, ఇది కొన్ని రాశులవారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలను తెచ్చి పెడుతుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి శని బాధ నుంచి ఉపశమనం కలుగుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశివారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమయ్యింది. అయితే, ఈ నక్షత్ర సంచారం కారణంగా జీవితంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆకస్మిక అడ్డంకులు చాలా వరకు తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు వ్యాపారాలు అద్భుతంగా ముందుకు సాగుతాయి. పెట్టుబడుల నుంచి కూడా భారీ ప్రయోజనాలు కూడా కలిగే ఛాన్స్లు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి:
కుంభ రాశివారికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే, వీరికి చివరి దశ కొనసాగుతోంది. శని నక్షత్ర మార్పు కారణంగా కుంభ రాశివారికి ఊహించని స్థాయిలో ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుంగా దీర్ఘకాలికంగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే అనేక సమస్యల నుంచి బయపడే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మీన రాశి:
మీన రాశివారికి కూడా ఏలినాటి శని కొనసాగుతోంది. అయితే, ఈ రాశివారికి కూడా ఇప్పుడు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా గందోరళ పరిస్థితుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్ట్ కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈ సమయంలో తప్పకుండాబ ప్రతి శనివారం రోజు రావి చెట్టు వృక్షం కింద ఆవాల నూనె దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తప్పకుండా ఓం షణ్ శనైశ్చారయ నమః అనే మంత్రాన్ని జపించాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పేదలకు నల్ల నువ్వులు, బియ్యపు పప్పు లేదా బట్టలు దానం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని వారు తెలుపుతున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య..
Hyderabad, Telangana:Eshwar Sai Extramarital Affair: ప్రస్తుతం యూట్యూబ్ పుణ్యమా అని.. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్కు విపరీతమైన క్రేజ్ పెరుగుతూ వస్తోంది.. పాటల ద్వారా కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు... తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వివాదాల్లో చిక్కపోతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ప్రముఖ ఫోక్ సాంగ్స్లో నటిస్తున్న ఇద్దరు నటుల అక్రమ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఘటన కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటీవల యూట్యూబ్లో విడుదలై.. లక్షలాది వ్యూస్ సాధించిన బాసింగా బాసింగా బలాలే, ప్రమీల ఓ ప్రమీల.. పాటల్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్.. షూటింగ్స్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం కాస్తా.. ఇప్పుడు అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే, ఈ ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న రాసలీలల బాగోతాన్ని.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య స్వయంగా పసిగట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
వేములవాడలోని రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయితో పాటు మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే గదిలో ఏకాంతంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో.. భార్య శరణ్య అర్ధరాత్రి అక్కడికి వచ్చింది.. రాత్రి 12 గంటల సమయంలో తలుపులు తీయించి చూడగా.. తన భర్త ఈశ్వర్ సాయి, సహనటి మాధురితో కలిసి అడ్డంగా దొరికిపోయాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన శరణ్య.. వెంటనే వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురు నటులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అక్రమ సంబంధంతో భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన నటుడు ఈశ్వర్ సాయి.. తనను క్షమించాలని భార్య కాళ్లావేళ్లా పడ్డట్లు కూడా తెలుస్తోంది.. తాను పూర్తిగా మారిపోతానని.. తన తప్పును మన్నించి జీవితంలో మరో అవకాశం ఇవ్వాలని భార్య శరణ్యను కోరుతున్నట్లు కూడా తెలుస్తోంది.. ఏది ఏమైనా.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వీరు, ఇలా అడ్డంగా బుక్కవడంతో ఫోక్ ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ వేములవాడ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OTT Releases This Week:'చెన్నై లవ్స్టోరీ' నుంచి 'జన నాయగన్' వరకు..ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే!
Hyderabad, Telangana:OTT Releases This Week Telugu: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల సినిమా ప్రియుల కోసం ఈ వారం ఓటీటీ (OTT)ల్లో పలు ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. విభిన్న జోనర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సినిమాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1) జన నాయగన్ (ZEE5)
ప్రముఖ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ నటించిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. హెచ్.వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, నారాయణ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 21 నుండి ZEE5 (జీ5) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
2) ఇన్వాజి తాని (Hungama OTT)
పి.జెరిన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'ఇన్వాజి తాని'. ఇందులో ఫజల్ పూకోడే, హేమ, అభిలాష్ నరికిని, బిందు బాలా, జోబాన్ జాకబ్ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే ఆగస్టు 18 నుండి Hungama OTT (హంగామా ఓటీటీ)లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
3) ప్యార్ ప్రేమ కళ్యాణం (Netflix)
అలన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రంలో అలన్, సాన్వి మేఘన, రాధికా శరత్కుమార్, యోగి బాబు, ఎంఎస్ భాస్కర్, గీతా కైలాసం, ఎలాంగో కుమారవేల్ నటించారు. చక్కని వినోదాన్ని పంచే ఈ చిత్రం ఆగస్టు 21 నుండి ప్రముఖ డిజిటల్ వేదిక Netflix (నెట్ఫ్లిక్స్) లో ప్రసారం కానుంది.
4) మిస్టర్ మిడిల్ క్లాస్ (Aha)
శ్రీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ తెలుగు కామెడీ-డ్రామా చిత్రంలో మేక శ్రీకాంత్, లయ గోర్టీ, రాజేంద్ర ప్రసాద్, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, పృథ్వీరాజ్, అలీ బాషా ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఆగస్టు 19 నుండి Aha (ఆహా) వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ ప్రారంభించింది.
5) చెన్నై లవ్ స్టోరీ (SonyLIV)
రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, త్రిగుణ్, దేవి ప్రసాద్, పి. వాసు, దీపా శంకర్ నటించారు. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఆగస్టు 21 నుండి SonyLIV (సోనీ లీవ్)లో విడుదలవుతోంది.
ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న ఈ విభిన్న చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనున్నాయి. మీకిష్టమైన చిత్రాన్ని తగిన ఓటీటీ ప్లాట్ఫామ్లో వీక్షించి ఆనందించండి. మరింత సమాచారం కోసం సంబంధిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు.
Also Read: "బల్లగుద్ది చెప్తున్నా..ఈ సినిమా అందరికి నచ్చుతుంది" ఇరుముడి ఈవెంట్లో హీరో రవితేజ
Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక అప్డేట్..మరి ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి ఏంటి?
Velgapudi, Andhra Pradesh:AP Local Body Elections Update: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అధికార కూటమి, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది.
ఈ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం పలు కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇకపై మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను సకాలంలో రాబట్టేందుకే ఈ ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్లను కొత్త జిల్లాల విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్లుగా పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశమై, స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ తొలి వారంలో మున్సిపల్ ఎన్నికలు, చివరి వారంలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఈ పరిణామాలపై వైసీపీ కూడా తీవ్రంగా దృష్టి సారించింది. అధికార కూటమి వ్యూహాలను తిప్పికొట్టి, ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖ్య నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. అధికార కూటమి ఏకపక్ష విజయాల కోసం పావులు కదుపుతుంటే, వైసీపీ అనుసరించబోయే వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరింత అధికారిక సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్స్ను సందర్శించవచ్చు.
Also REad: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. నదిలో దూకిన ఏఈ కుటుంబం..ముగ్గురు గల్లంతు!
Also Read: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖరారు.. సీనియర్ నేతతో పాటు సాధారణ మహిళకు అవకాశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn And Jupiter: శని, గురు గ్రహాల అద్భుతం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం, ప్రమోషన్లు!
Hyderabad, Telangana:Saturn And Jupiter Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ సంచారాల పరంగా సెప్టెంబర్ నెల చాలా ప్రత్యేకమైనగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా శక్తివంతమైన గ్రహాలు కదలికలు కూడా జరుపబోతున్నాయి.. ఇవి వ్యక్తుల జీవితాల్లో ఉద్యోగాలు, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులో పాటు దీర్ఘకాలంగా పరిష్కారం కాని ప్రాజెక్టులను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
గురు గ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచార దశలో ఉంది.. అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో, కర్కాటక రాశిలో గురు గ్రహ సంచారం చాలా శుభప్రదమైనగా భావిస్తూ ఉంటారు.. శని గ్రహం జూలై 27 నుంచి మీన రాశిలో సంచార దశలో కొనసాగుతోంది. డిసెంబర్ 11 వరకు శని తిరోగమనంలోనే సంచార దశలో కొనసాగుతుంది... దీని కారణంగా పాత పరిష్కారం కాని పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఈ సమయంలో వ్యాపారాలు కూడా అద్భుతంగా ముందుకు కొనసాగుతాయి. అంతేకాకుండా బంపర్ ధన లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ ప్రయోజనాలు:
వృశ్చిక రాశి
సెప్టెంబర్ వరకు వృశ్చిక రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఉన్న కష్టాలు సులభంగా తొలగిపోతాయి.. ఈ రాశివారికి జాతకంలో తొమ్మిదవ స్థానంలో గురుడు ఉండడం విశేషం.. దీంతో వీరికి అదృష్టం, ఉన్నత విద్య, సుదూర ప్రయాణాలకు సంబంధించిన ఎలాంటి పనులైనా సులభంగా కలిసి వచ్చే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. దీని ఫలితంగా.. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఊపందుకునే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి అద్భుతమైన కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. దీంతో పాటు మంచి మంచి అవకాశాలు లభించే ఛాన్స్లు ఉన్నాయి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక కొత్త మార్గం కూడా లభిస్తాయి. దీని కారణంగా వీరు డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు. వ్యాపారంలో, గతంలో నిలిచిపోయిన ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా లభించడడం విశేషం.. డబ్బు విషయంలో.. ఈ రాశుల వారికి అకస్మాత్తుగా పెద్ద లాభాలు కూడా సొంతం చేసుకునే ఛాన్స్లు కనిపిస్తున్నాయి.. కొత్త ఆదాయ వనరు కూడా తిరిగి పొందుతారు. ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా మారే ఛాన్స్లు ఉన్నాయి..
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గురు గ్రహం ప్రభావంతో ఈ సమయంలో వస్తున్న ఎలాంటి సమస్యలైన సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా గురు గ్రహం జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో ఉండడం వల్ల మీకు అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. పనిలో కొత్త బాధ్యత లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. వీరికి భారీగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.. దీని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక విషయాలలో కూడా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మకర రాశి
మకర రాశివారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ వరకు భారీగా లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత పరిచయం నుంచి భారీ మొత్తంలో ప్రయోజనాలు కూడా సొంతం చేసుకుంటారు. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాల నుంచి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మార్పులతో పాటు పదోన్నతులు కూడా తప్పకుండా కలుగుతాయి.. అలాగే మీ కష్టానికి కార్యాలయంలో అద్భుతమై గుర్తింపు కూడా లభిస్తుంది. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి వస్తాయి.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే.. ఇది సాధారణ నమ్మకాలతో పాటు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ZEE తెలుగు న్యూస్ ధృవీకరించదు.)
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Rishabh Pant Record: టెస్టుల్లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు..రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రికార్డు బ్రేక్ చేసిన వికెట్-కీపర్!
Hyderabad, Telangana:Rishabh Pant Test Record: శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. తొలి టెస్టులో భాగంగా 69 బంతుల్లో 66 పరుగులు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించాడు. టీమ్ఇండియా తరఫున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అథ్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అయితే అంతకుముందు రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్.. ఇప్పుడు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డును కూడా ఇప్పుడు అధిగమనించాడు. అలాగే వేగంగా 100 టెస్ట్ సిక్సర్లు కొట్టి రికార్డును రిషబ్ పంత్ రికాక్డు నెలకొల్పాడు.
శ్రీలంకలోని గాలెలో ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులు చేసి రిషబ్ పంత్ అవుటయ్యాడు. కానీ అతను రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించాడు. దీంతో రిషబ్ పంత్ డబ్ల్యూటీసీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రిషబ్ పంత్ గిల్ రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో టీమ్ ఇండియా తరఫున శుభ్మన్ గిల్ 2867 పరుగులు చేయగా, డబ్ల్యూటీసీ చరిత్రలో రిషబ్ పంత్ పరుగుల సంఖ్య 2885కు చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2716 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
టాప్ 10లో ఏ భారతీయుడూ లేడు..!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల టాప్ 10 జాబితాలో ఏ భారత ఆటగాడూ లేడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు బలంగా ఉన్నారు. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్ అజామ్ ఏడవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 77 మ్యాచ్లలో 6651 పరుగులు చేసిన జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు.
రిషబ్ పంత్ 41 మ్యాచ్లలో 73 ఇన్నింగ్స్లలో 2885 పరుగులు సాధించి, 4 సార్లు నాటౌట్గా నిలిచాడు. అతని అత్యధిక స్కోరు 146 పరుగులు కాగా, ఈ కాలంలో అతని సగటు 41.81గా ఉంది. 3870 బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 74.54 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. పంత్ బ్యాట్ నుండి 6 సెంచరీలతో పాటు 17 హాఫ్ సెంచరీలు కూడా వచ్చాయి. అయితే అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 314 ఫోర్లు, 80 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అతని కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడు బెన్ స్టోక్స్ మాత్రమే. స్టోక్స్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లలో 88 సిక్సర్లు కొట్టాడు.
Also Read: రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్లో సెటిల్..త్వరలోనే పెళ్లి?
Also Read: పిల్లకూన బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా ఘోర ఓటమి..ఆసీస్ గడ్డపై బంగ్లా జట్టు తొలి విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
తెలంగాణ పోలీస్ పోస్టుల అప్లికేషన్ ప్రాసెస్ షురూ.. ఈ లింక్ ద్వారా వెంటనే అప్లై చేయండి!
Hyderabad, Telangana:TG Police Jobs 2026: చాలా కాలంగా తెలంగాణ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఈరోజు నుండి మొదలైంది. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష కోసం పార్ట్-1 అప్లికేషన్ను సెప్టెంబర్ 9 లోపు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 7437 పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైంది. దీని కోసం ఆధార్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి.ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ https://www.tgprb.in/ లో ఈరోజు నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు వయోపరిమితి పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి కాబట్టి, అభ్యర్థులు నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి..
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. దీని కోసం మీ మొబైల్లో ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన నంబర్లను సంప్రదించవచ్చు. కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు, ఆ తర్వాత PMT, PET, తుది పరీక్షలు ఉంటాయి. ఈ ప్రక్రియలన్నింటిలో విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్టింగ్ ఇస్తారు.
మీ వద్ద ఉండాల్సిన సర్టిఫికేట్లు..
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వద్ద ఈ క్రింది సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకోవాలి:
1 నుండి 7వ తరగతి వరకు చదివిన బోనఫైడ్ సర్టిఫికేట్, రెజర్వేషన్ ఉంటే కుల ధృవీకరణ పత్రం, ఏప్రిల్ తర్వాత తీసుకున్న నాన్-క్రిమినల్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్లతో పాటు క్లాసిఫికేషన్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి.
Also Read: తిరుచానూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కాచిగూడ - తిరుచానూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్
Also Read: నెట్ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క నంబర్కు SMS, మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ముందే!
మొత్తం 7437 పోలీసు పోస్టుల కోసం అభ్యర్థులు ఈ నెల 19 ఉదయం 8 గంటల నుండి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. పోస్టుల ఆధారంగా ఫీజును ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600 నుండి 750 వరకు, ఇతరులకు రూ. 1200 నుండి 1500 వరకు నిర్ణయించారు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే, ఎస్సీ, ఎస్టీ వారికి రూ. 50 చొప్పున, ఇతరులకు రూ. 100 చొప్పున అదనపు రుసుము ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sania Mirza Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా..లవర్ కోసమే దుబాయ్లో సెటిల్..త్వరలోనే పెళ్లి?
Hyderabad, Telangana:Sania Mirza Second Marriage: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత దుబాయ్కి చెందిన ఒక విదేశీ వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయమైనట్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. సదరు వ్యక్తి సానియా మీర్జాకు అత్యంత సన్నిహితుడని, గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతని కోసమే సానియా దుబాయ్లో శాశ్వతంగా స్థిరపడినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సీక్రెట్ లవ్కు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, దుబాయ్లోనే అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో రహస్యంగా వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వస్తున్న ఈ పెళ్లి వార్తలపై సానియా మీర్జా గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తొలి వివాహం, విడాకుల నేపథ్యం
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2010 ఏప్రిల్లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు.
అయితే వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్ను రెండో వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తరుణంలో, సానియా కుటుంబం వారి విడాకుల విషయాన్ని బయటపెట్టింది. షోయబ్ వివాహేతర సంబంధాల వల్లే వారు విడిపోయినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం సానియా టెన్నిస్ రిటైర్మెంట్ తర్వాత దుబాయ్లో ఉంటున్నారు.
గతంలోనూ వచ్చిన రూమర్లు
సానియా మీర్జా రెండో పెళ్లిపై ఇలాంటి వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓ టాలీవుడ్ హీరోతో, ఆ తర్వాత భారత క్రికెటర్ మహ్మద్ షమీతో ఆమె పెళ్లి జరగనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఆ వార్తలను సానియా పూర్తిగా ఖండించారు. ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి వార్తలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారాయి.
Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Also REad: పిల్లకూన బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా ఘోర ఓటమి..ఆసీస్ గడ్డపై బంగ్లా జట్టు తొలి విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
365 Days Maternity: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!
Nagalapuram, Tamil Nadu:Tamil Nadu 365 Days Maternity: తమిళనాడులోని విజయ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జనాభాను పెంచే ప్రాతిపదికన ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు తీపికబురు చెప్పింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న వివాహిత మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పూర్తి వేతనంతో కూడిన 12 వారాల (లేదా 84 రోజుల) సెలవు మాత్రమే లభిస్తుంది.
మూడవ బిడ్డ జననం విషయంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 12 వారాల సెలవు అనగా 84 రోజులు సెలవును 365 రోజులకు పెంచుతున్నట్లు తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మార్పుతో, మొదటి ఇద్దరు పిల్లలకు లభించే ఏడాది కాలపు సెలవు సదుపాయం మూడవ బిడ్డ విషయంలోనూ వర్తిస్తుంది.
రాష్ట్ర అసెంబ్లీలో తన శాఖకు సంబంధించిన నిధుల కేటాయింపుపై జరిగిన చర్చ సందర్భంగా మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. "సామాజిక సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే సంక్షేమ ఆధారిత ప్రభుత్వం తమిళనాడుది కాబట్టి, మూడవ బిడ్డ విషయంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచుతున్నాము" అని శరత్కుమార్ పేర్కొన్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న వివాహిత మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పూర్తి వేతనంతో కూడిన 12 వారాల (లేదా 84 రోజుల) సెలవు మాత్రమే లభిస్తుంది.
మూడవ బిడ్డ విషయంలో ప్రసూతి ప్రయోజనాలను నిరాకరించకూడదన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు అనుగుణంగా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 12 వారాల సెలవు సదుపాయాన్ని గతంలో ప్రవేశపెట్టారు.
అసెంబ్లీకి నవజాత శిశువును తీసుకువచ్చిన తొలిసారి ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాలకు తన నవజాత శిశువును తీసుకురావడం ద్వారా టీవీకే (TVK) పార్టీకి చెందిన తొలిసారి ఎమ్మెల్యే ఆర్.పల్లవి అందరి దృష్టిని ఆకర్షించిన తరుణంలోనే ఈ ప్రకటన వెలువడింది.
పల్లవి శిశువును అసెంబ్లీ ప్రాంగణానికి తీసుకువచ్చారని, సభ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రధాన హాలులోకి వెళ్లే ముందు బిడ్డను సంరక్షకురాలి (కేర్గివర్) వద్ద ఉంచారని అధికారిక వర్గాలు తెలిపాయి. పల్లవి తిరిగి వచ్చేవరకు ఆ సంరక్షకురాలు అసెంబ్లీ హాలు సమీపంలోని ఒక గదిలో శిశువును చూసుకున్నారు.
బిడ్డను వెంట తీసుకురావడం ద్వారా "హడావిడి సృష్టిస్తున్నారని" సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, నవజాత శిశువును ఇంట్లో వదిలి రాలేనని ఎమ్మెల్యే చెప్పారు.
"దయచేసి ఏదైనా వ్యాఖ్యానించే ముందు ఆలోచించండి. మరొకరి బాధ మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ట్రోల్ చేయకండి." అని ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్తో అన్నారు. తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.4 కంటే తక్కువగా ఉండడం గమనార్హం. తమిళనాడులో జనాభా మార్పులపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రసూతి సెలవులను కూడా విస్తరించారు.
'ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ సౌత్ ఇండియా' నిర్వహించిన ఒక వర్క్షాప్లో ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్రాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.4 కంటే తక్కువకు పడిపోయిందని, ఇది జనాభా భర్తీ స్థాయి అయిన 2.1 కంటే చాలా తక్కువ అని అన్నారు.
తమిళనాడు జనాభాలో దాదాపు 16 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నందున, ఈ జనాభా మార్పు ఒక పెద్ద ప్రజారోగ్య సవాలు అని మంత్రి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లుగా, అటువంటి విధానాలను ప్రభుత్వం కూడా పరిగణించవచ్చని అరుణ్రాజ్ అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ వంటి ప్రదేశాలలో, మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు అందించే ప్రభుత్వ పథకాలు ఉన్నాయని మాకు చెప్పారు. అందువల్ల, భవిష్యత్తులో ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవచ్చు" అని ఆయన అన్నారు.
Also Read: బీహార్లో ఘోర ప్రమాదం..ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురు మహిళలు దుర్మరణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala SSD Tokens: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు
Tirupati, Andhra Pradesh:Tirumala SSD Tokens: ఆపద మొక్కులవాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి దాదాపు ఒక రోజు సమయం పడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అంటే బుధవారం ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ సర్వదర్శనానికి వెళ్లాలని సూచించారు.
రేపు గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లు బుధవారం జారీ చేయడం లేదని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలిపేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎస్ఎస్డీ టోకెన్లు ఇవ్వకపోవడంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని సూచించింది. ఇక శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లు యథావిధిగా గురువారం మధ్యాహ్నం జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. కాగా ఎస్ఎస్డీ టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో టీటీడీ 8 వారాలుగా అధ్యయనం చేస్తోంది.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకోగా.. 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం లభించింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.6.12 కోట్లు చేరింది. 4.16 లక్షలు లడ్డూ ప్రసాదం విక్రయాలు జరగ్గా.. 2.88 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
భక్తుల రద్దీతో తిరుమలలో వేచి చూసే సమయం పెరగడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు వెంటనే దర్శనం అయ్యేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు ఆహార పానీయాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Tirumala Darshan Update | 19 August 2026
Om Namo Venkatesaya
Tirumala Present Situation:
Waiting compartments are full; 31
the outside queue is extending towards Silathoranam.
Sarvadarshanam (without SSD tokens): Approx. 20–24 hours#Tirumala #Tirupati #TTD #TirumalaDarshan pic.twitter.com/Ii8ljK4Q1z— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) August 19, 2026
Balapur Murder Case: హైదరాబాద్లో మరో దారుణమైన హత్య..లవర్ని హత్య చేసి గోనెసంచిలో కుక్కిన ప్రియుడు..ఆ తర్వాత..!
Balapur, Telangana:Balapur Murder Case News: హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి విషయంలో జరిగిన గొడవ కారణంగా ఒక మహిళను తన ప్రియుడి ఘోరంగా హత్య చేశాడు. ఆమెను నిందితుడు కత్తితో పొడిచి చంపి, ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి ఇంట్లోనే వదిలేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఏం జరిగింది?
సోమవారం అనగా ఆగస్టు 17న ఉదయం బాలాపూర్లో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడు తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి పరారయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలు రెహానా, అనుమానితుడు మహమ్మద్ సలామ్ ప్రేమించుకుంటున్నారు. వీరు బిస్మిల్లా కాలనీలో నివసిస్తున్నారు. అందిన సమాచారం మేరకు, రెహానా కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోవాలని సలామ్పై ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల సలామ్ ఆగ్రహానికి గురయ్యాడు.
పెళ్లి విషయంలో తెచ్చిన ఒత్తిడి కారణంగా వారి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత సలామ్ కత్తితో రెహానాపై దాడి చేసి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అతను ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి, బెడ్రూమ్లో పెట్టి ఇంటి నుండి పరారైనట్లు తెలుస్తోంది.
ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో రెహానా, సలామ్ ఇద్దరూ బీహార్కు చెందినవారని తేలింది. అనుమానితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. హత్యకు గల ఖచ్చితమైన కారణాలు, పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: హైదరాబాద్లో ఘోర ప్రమాదం..వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢీకొని యువ నర్స్ మృతి!
Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం.. ఇక రేవంత్ రెడ్డి సర్కార్ భారీ తిరుగుబాటు
Baddipadaga, Telangana:Telangana Govt Employees: ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కటీ కూడా నెరవేర్చకపోవడంతోపాటు కాలయాపన చేస్తూ తమను విస్మరిస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు దక్కాల్సిన ప్రయోజనాలు, న్యాయపరంగా రావాల్సినవి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు వేస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధికంగా డీఏలు పెండింగ్, వేల కోట్ల పెండింగ్ బిల్లులు, వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాలేదు. దీనిపై చర్చలు, కమిటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుండడంతో ఇక తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్నీ జిల్లాల నుంచి ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం మాట విన్నామని.. ఇకపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే ప్రకటించాలని.. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్న ప్రధాన విషయాలు. అవి చేయకుండా హెల్త్ కార్డులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయాయని ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జూన్ 2వ తేదీన అన్ని డిమాండ్స్ పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. హెల్త్ కార్డు విధి విధానాలు, ఏ ఆసుపత్రులు అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏ ఆసుపత్రిలో ఏ చికిత్స చేస్తారని ఇప్పటికీ సమాచారం లేదు. మూడు నెలల నుంచి డబ్బులు కడుతున్నాం' అని వివరించారు. ఇక వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పైన ఇంకా ఎలాంటి సమాచారం లేదని మారం జగదీశ్వర్ తెలిపారు. జూన్ 2వ తేదీన పీఆర్సీ అమలు చేస్తామని, జీపీఎస్ని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.
'రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినప్పుడు దాని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆగే ఓపిక మాకు లేదు' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 27వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 'రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. మీరు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గుర్తుచేశారు.
Hyderabad: రెండోసారి మాదే అధికారం.. 117 సీట్లు గెలవబోతున్నాం: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Revanth Reddy: 'రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్హౌస్లు కట్టుకున్నారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని.. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
'అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 36 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. 95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. 60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 'యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా అకాడమీని ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు.
'మేం చేసినవన్నీ చెబితే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రారు. చెబుతున్న అబద్ధాలను నమ్మడం లేదని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడు. కరువు రావాలని, రైతులు నష్టపోవాలని చేతబడి పూజలు చేస్తున్నారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా?' అని అసహనం వ్యక్తం చేశారు. ఏది ఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దామని ప్రకటించారు.
'ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కులం, కుటుంబం కోసం మాత్రమే పనిచేయలేదు. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. శివాజీ మాదిరి తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. బహుజనుల కోసం పాపన్న గౌడ్ తన జీవితాన్ని అంకితం చేయడంతోనే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది' అని వివరించారు.
'పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరిది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. 'మహేష్ గౌడ్ గాంధీభవన్లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను, భట్టి విక్రమార్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రిగా నేను మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాం. మళ్లీ అధికారాన్ని తీసుకువస్తాం. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చా' అని తెలిపారు.
'ప్రభుత్వ పొలాల్లో ఈత, తాటి చెట్లు నాటేలా చూస్తాం. కాలువ గట్లపైన కూడా ఈత, తాటి చెట్లు నాటాలి. పిల్లల తలరాతలను మనం మార్చవచ్చు. ఈనాడు చైతన్యం వచ్చింది. కులవృత్తిని కొనసాగించండి, గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తామని.. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తామని ప్రకటించారు.
