Back
Medchal-Malkajgiri500072blurImage

పీజీ ఈ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల

Vidya Sagar Reddy
Jun 19, 2024 07:03:01
Hyderabad, Telangana
జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ 2024 ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆర్.లింబాద్రి ఎగ్జామ్ కన్వీనర్ అరుణకుమారి విడుదల చేశారు. జూన్ 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో 20,626 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 18,829 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష నిర్వహించిన నాలుగు రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు అధికారులు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com