Realme 16 Pro Offer Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్ మీ లేటెస్ట్గా విడుదల చేసిన స్మార్ట్ఫోన్స్లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) ఒకటి. దీనిని కంపెనీ ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. అయితే, ఇది ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంది. వెనక భాగంలోని కెమెరా మాడ్యూల్ గతంలో కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) అత్యంత తగ్గింపు ధరకి లభించడం విశేషం. ఇక ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి రియల్ మీ మొబైల్గా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ Realme 16 Pro స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తోంది. అలాగే ఇది 6,500 నిట్స్ (Nits) బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇది ఇతర కాంతి ఉన్నచోట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ని కలిగి ఉంటుంది. రియల్ మీ బ్యాక్ సెటప్లో 200MP మెయిన్ కెమెరా (Samsung HP5 సెన్సార్, OIS సపోర్ట్) ప్రధాన కెమెరా అందించింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7300 Max 5G చిప్సెట్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ Realme 16 Pro స్మార్ట్ఫోన్ మొత్తం మూడు వేరియన్స్లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరీస్తో లభిస్తోంది. కానీ ఇది 8gb ర్యామ్ ని మాత్రం కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 12gb ర్యామ్తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.36,999 నుంచి ప్రారంభమవుతుంది.
స్పెషల్ ఆఫర్స్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ఎంపిక చేసిన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే బేస్ వేరియంట్పై రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ.28,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అదనంగా భారీ తగ్గింపు పొందాలి అనుకునేవారు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది.. దీంతో మీరు కేవలం రూ.1,999 చెల్లిస్తే.. ఈ Realme 16 Pro స్మార్ట్ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
KSRTC Employees 17 Percent Hike: దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ శుభవార్త అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న జీతాల సవరణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో రవాణా రంగ కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఎందుకు ఆలస్యమైంది?
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో కాలానుగుణంగా జీతాల సవరణ జరుగుతుంది. అయితే KSRTCలో గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరిసారి గత బీజేపీ ప్రభుత్వం 2020లో జీతాలను సవరించినప్పటికీ, కరోనా సంక్షోభం కారణంగా అప్పట్లో పెంపుదల ఆశించిన స్థాయిలో లేదు. ఆ తర్వాత 2023లో సవరణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
జీతాల పెంపు - కీలక వివరాలు:
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలో 15 శాతం పెంపు ఉండగా, ఈసారి ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని 17 శాతం వరకు జీతాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జీతాల పెంపు మార్చి 2027 నుండి అధికారికంగా అమలులోకి రానుందని విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ పెంపుదల జనవరి 2026 నుండి వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కార్మిక సంఘాల డిమాండ్ ఇదే?
ప్రభుత్వం జనవరి 2026 నుండి పెంపును వర్తింపజేయాలని చూస్తుండగా, ఉద్యోగ సంఘాలు మాత్రం జనవరి 2024 నుండే ఈ పెంపును వర్తింపజేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుండి మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
ఏకసభ్య కమిటీ సిఫార్సులు, కార్మిక సంఘాల చర్చల అనంతరం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, సంక్రాంతి పండుగ పూట జీతాల పెంపు ప్రకటన రావడం KSRTC కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.
Also Read: Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gruhalakshmi Yojana Status Check: రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు అందించింది. సాంకేతిక కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న రెండు విడతల సొమ్మును (రూ.4,000) నేటి నుండే (జనవరి 14) దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
24, 25వ విడతల నిధులు విడుదల
గృహలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 24వ, 25వ విడతలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తొలి దశ: బెంగళూరుతో సహా 26 జిల్లాల్లో 25వ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
పెండింగ్ బకాయిలు: గతంలో నిలిచిపోయిన విడతల ఫైళ్లు కూడా చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ రూ.4,000 కూడా ఖాతాల్లో పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు.
ముఖ్యమైన వివరాలు..
లబ్ధిదారుల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.2 కోట్లకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
నిధుల జమ: పండుగ కానుకగా నేటి నుండే దశలవారీగా నగదు బదిలీ ప్రక్రియ మొదలైంది. ఒకేసారి కాకుండా జిల్లా వారీగా అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.
రేషన్ కార్డు రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ఇటీవల ప్రభుత్వం అనర్హులైన వారి BPL (బిపిఎల్) కార్డులను రద్దు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సందేహాలు తలెత్తాయి.
అర్హత ఉంటేనే: ఒకవేళ పొరపాటున అర్హత కలిగిన లబ్ధిదారుల కార్డు రద్దు అయితే, వారు తగిన ఆధారాలతో అధికారులకు వివరణ ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
నిబంధన: లబ్ధిదారురాలు ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారు అయి ఉండకూడదు.
అక్రమాలపై వేటు: అక్రమంగా కార్డులు పొందిన వారిపై చర్యలు తీసుకుంటూనే, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పండుగ పూట తమ ఖాతాల్లోకి డబ్బులు చేరుతుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ ఖాతాలోకి నగదు జమ అయిందో లేదో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే మెసేజ్ ద్వారా లేదా సంబంధిత వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bengaluru Techie Sharmila Case: బెంగళూరులోని రామమూర్తి నగర్లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ షర్మిల (35) కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇది ప్రమాదకర అగ్నిప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో కేరళకు చెందిన 18 ఏళ్ల పీయూసీ (PUC) విద్యార్థి కల్నల్ కురైని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
మంగళూరుకు చెందిన షర్మిల.. రామమూర్తి నగర్లోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో తన స్నేహితురాలు షబరీన్తో కలిసి నివసిస్తోంది. షబరీన్ పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లడంతో గత 15 రోజులుగా షర్మిల ఫ్లాట్లో ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న పొరుగింటి విద్యార్థి కల్నల్ కురై జనవరి 3వ తేదీ రాత్రి బాల్కనీ గుండా ఆమె ఫ్లాట్లోకి అక్రమంగా ప్రవేశించాడు.
ఒన్సైడ్ లవ్..దాడి..హత్య
నిందితుడు కురైకి షర్మిల అంటే ఒన్సైడ్ లవ్ ఉందని, ఆ రాత్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. షర్మిల దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించడంతో, ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై భౌతిక దాడి చేసి హతమార్చాడు.
సాక్ష్యాల ధ్వంసం కోసం అగ్నిప్రమాదం సృష్టి
హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నిందితుడు కిరాతక ప్లాన్ వేశాడు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయని నమ్మించడానికి.. స్నేహితురాలు షబరీన్ ఉన్న బెడ్రూమ్కు నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. కానీ, షర్మిల మృతదేహం వంటగదిలో లభించింది. ఆమె శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాలు
మొదట అగ్నిప్రమాదంగా భావించినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం ఒక బెడ్రూమ్ మాత్రమే తగలబడటం, హాల్, కిచెన్ సురక్షితంగా ఉండటం. మద్యం బాటిల్ ఉన్నప్పటికీ పార్టీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం. పోస్ట్మార్టం రిపోర్ట్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
నిందితుడు కల్నల్ కురైని అదుపులోకి తీసుకున్న రామమూర్తి నగర్ పోలీసులు, కోర్టు అనుమతితో అతడిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానిక అపార్ట్మెంట్ వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme Neo 8 Turbo 5G Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ Realme మీ తమ మరో కొత్త టర్బో సిరీస్ మొబైల్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ 2026 సంవత్సరం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్కు సంబంధించిన కొన్ని ఫీచర్స్తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీని ప్రకారం ఈ స్మార్ట్ఫోన్ Realme Neo 8 Turbo పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Realme Neo 8 Turbo స్మార్ట్ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెట్ అప్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ లెన్స్తో 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్ హైయ్యండ్ మోడల్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో భారీ 8000 mAh బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇవే కాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ HD+ రిజల్యూషన్తో 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన ప్రొటెక్షన్ గ్లాస్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఇందులో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ కూడా లభిస్తోంది. Realme Neo 8 Turbo స్మార్ట్ ఫోన్కు సంబంధించిన ఇతర కెమెరా వివరాల్లోకి వెళ్తే.. అదనంగా ఈ మొబైల్కి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 8000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది.. ఇక ఈ మొబైల్ ను కంపెనీ Realme UI 7.0తో Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేస్తుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
Realme నియో 8 టర్బో స్మార్ట్ ఫోన్కు సంబంధించిన విడుదల తేదీ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఈ మొబైల్కు సంబంధించిన విడుదల, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికారిక సమాచారం ప్రకారం ఈ మొబైల్ ను మొదటగా చైనాలో 2026 సంవత్సరం రెండవ నెలలో లేదా మూడవ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదల చేసిన తర్వాతే ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Actor Shiv Rajkumar arrives at a polling center in Bangalore to cast his vote.