icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

ஐசிசி உலகக் கோப்பை தேதிகள் வந்தாச்சு... 2027இல் எப்போது நடைபெறும்?

Bengaluru, Karnataka:

ICC World Cup 2027 Dates: உலகமே பிபா கால்பந்து உலகக் கோப்பைக்கு காத்திருக்கும் வேளையில், 2027 ஐசிசி உலகக் கோப்பை தொடர் குறித்த அப்டேட் வெளியாகி உள்ளது. கடந்த 2023 ஐசிசி உலகக் கோப்பை இந்திய அணிக்கு மறக்க முடியாத துயரை ஏற்படுத்தியிருக்கிறது என்பதால் பலரும் இத்தொடருக்கு ஆவலுடன் காத்திருக்கின்றனர். 

2023ஆம் ஆண்டு இந்தியாவில் நடைபெற்ற ஐசிசி உலகக் கோப்பை தொடரில் ரோஹித் சர்மா தலைமையிலான இந்திய அணி தொடர்ச்சியாக வென்று இறுதிப்போட்டி வரை முன்னேறியது.

மேலும் படிக்க | ரோஹித் - ஹர்திக் பாண்டியா பிட்னஸ் டெஸ்டில் பாஸா? பிசிசிஐ ரிப்போர்ட் விவரம்

அடுத்தடுத்து 3 கோப்பை

ஆனால், அகமதாபாத் நரேந்திர மோடி மைதானத்தில் நடந்த இறுதிப்போட்டியில் ஆஸ்திரேலியா அணியிடம் படுதோல்வி அடைந்து கோப்பையை தவறவிட்டது.

இதன் பின் இந்திய அணி ரோஹித் சர்மா தலைமையில் 2024 ஐசிசி டி20 உலகக் கோப்பை மற்றும் 2025 ஐசிசி சாம்பியன்ஸ் டிராபி; சூர்யகுமார் யாதவ் தலைமையில் 2026 ஐசிசி டி20 உலகக் கோப்பை என அடுத்தடுத்து 3 ஐசிசி கோப்பைகளை வென்று சாதித்திருக்கிறது.

அடுத்து இந்திய அணி, ஐசிசி உலக டெஸ்ட் சாம்பியன்ஷிப் மற்றும் ஐசிசி உலகக் கோப்பையை வென்றால் தொடர்ச்சியாக இத்தனை ஐசிசி கோப்பைகளை வென்ற சாதனையை படைக்கலாம். இந்த இரு தொடர்களுமே 2027ஆம் ஆண்டில் நடைபெற இருப்பது கவனிக்கத்தக்கது.

முக்கியத்துவம் பெறும் டெஸ்ட், ஓடிஐ

இந்த இரு தொடர்களும் சமீப காலமாக இந்திய அணியின் வசம் கிடைக்கவில்லை. இந்திய அணி கடைசியாக 2011இல் ஐசிசி உலகக் கோப்பையை வென்றது. ஐசிசி உலக டெஸ்ட் சாம்பியன்ஷிப் தொடங்கி மூன்று இறுதிப்போட்டிகள் முடிந்துவிட்டன.

மேலும் படிக்க | முகமது சிராஜ் நீக்கம்.. பிசிசிஐ எடுத்த அதிரடி முடிவு! இந்திய அணியில் திடீர் மாற்றம்

அதில் முதலிரண்டு முறை பைனல் வரை வந்து இந்தியா தோற்றது. கடைசி முறை இந்தியா இறுதிப்போட்டிக்கே தகுதிபெறவில்லை. எனவே, இந்திய அணி தற்போதைய முழு கவனமும் டெஸ்ட் மற்றும் ஓடிஐ அணியை வெற்றிகரமாக கட்டமைப்பதே ஆகும்.

2027 ஐசிசி உலகக் கோப்பை எப்போது?

இந்நிலையில், 2027 ஐசிசி உலகக் கோப்பை குறித்த அப்டேட் தற்போது கிடைத்துள்ளது. தென்னாப்பிரிக்கா, ஜிம்பாப்வே, நமீபியா உள்ளிட்ட நாடுகள் நடத்தும் இத்தொடர் வரும் 2027ஆம் ஆண்டு அக்டோபர் 4ஆம் தேதி முதல் நவம்பர் 21ஆம் தேதிவரை நடைபெற வாய்ப்பிருப்பதாக தற்காலிகமாக திட்டமிடப்பட்டுள்ளது.

கடந்த மே மாதமே அகமதாபாத் நகரில் நடைபெற்ற ஐசிசி வாரியக் கூட்டத்தில் போட்டிகளின் தேதிகள் இறுதி செய்யப்ட்டதாகவும், ஜூலை மாதம் எடின்பரோவில் நடைபெற்ற இறுதி ஆண்டுப் பொதுக்கூட்டத்தில் இறுதி ஒப்புதல் எதிர்பார்க்கப்படுவதாக கூறப்படுகிறது.

சுமார் 20 ஆண்டுகளுக்கு பிறகு ஆப்ரிக்க கண்டத்தில் ஐசிசி உலகக் கோப்பை வரும் 2027இல் நடைபெற இருக்கிறது. 54 போட்டிகளில் 41 போட்டிகள் தென்னாப்பிரிக்காவில் நடைபெற இருக்கிறது. மொத்தம் 14 அணிகள் இத்தொடரில் பங்கேற்கின்றன. எனவே, அடுத்த 2027ஆம் ஆண்டு அக்டோபர், நவம்பர் காலத்தில் களைகட்டும். 

மேலும் படிக்க | ஹர்திக் பாண்டியாவுக்கும் மீண்டும் காயம்... ஓடிஐ தொடர் அம்போ - மாற்று வீரர் யார்?

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Alliance PUC: అలయన్స్ పీయూసీలో 'ఇగ్నైట్ 2026–27' ప్రారంభం.. విద్యార్థులకు దిశానిర్దేశం

RKRavi Kumar Sargam7 Jun 2026, 09:58 am
Bengaluru, Karnataka:

Alliance PUCIGNITE 2026–27: కొత్తగా చేరిన విద్యార్థులకు బెంగళూరులోని అలయన్స్ యూనివర్సిటీలో అలయన్స్ ప్రి యూనివర్సిటీ కాలేజ్ ఇగ్నైట్ 2026–27' పేరిట నూతన విద్యా సంవత్సరానికి నాంది పలికింది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సంస్థ విద్యా సంస్కృతి, విలువలు, అందుబాటులో ఉన్న అవకాశాల గురించి వివరించింది. విద్యార్థులు విద్యతోపాటు ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అతిథులు, అధ్యాపకులు సూచించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నిరంతర అభ్యాసన అలవాట్లను పెంపొందించడంపై అవగాహన కల్పించారు.

ఏపీయూసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీహెచ్ఎస్ తిమ్మప్ప స్వాగతోపన్యాసం చేస్తూ కీలక విషయాలు తెలిపారు. క్రమశిక్షణ, విద్యా నైపుణ్యం, సమగ్ర అభివృద్ధి విద్యార్థుల విజయానికి పునాదులు అని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఊచించారు. అలయన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (ఇంక్యూబేషన్, ఇన్నోవేషన్)డాక్టర్ రే టైటస్ కీలక ప్రసంగం చేశారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, వ్యవస్థాపక ఆలోచనలను విద్యార్థులు పెంపొందించుకోవాలని చెప్పారు. వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో పట్టుదల, అనుకూలత, నిరంతర అభ్యాసం చాలా ముఖ్యమని గుర్తుచేశారు.

అలయన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి.ప్రిస్లీ షాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను పట్టుదలతో, ఉత్సాహంతో సాధించాలని చెప్పారు. వ్యక్తిత్వ నిర్మాణం, నిరంతర అభ్యాసం చేయాలని సూచించారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలని కోరారు. యూనివర్సిటీ విద్యా విధానాన్ని వివరిస్తూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం విశ్వనాథయ్య మాట్లాడుతూ.. విజయానికి మార్గదర్శకాలుగా నిలిచే  లక్ష్యం, ఆచరణ, వైఖరి, సాధన, అంచనా అనే ఐదు సూత్రాలను వివరించారు.

అలయన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జనరల్ సురేఖ శెట్టి క్యాంపస్‌ అందిస్తున్న సౌకర్యాలు వివరించారు. విద్యాసంస్థ కల్పిస్తున్న విద్యా, సహ-పాఠ్య, పాఠ్యేతర అవకాశాలను విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా చేరిన 180 మంది విద్యార్థుల విద్యా ప్రయాణానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక స్పూర్తిదాయకమైన ఆరంభమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీయూసీ అసోసియేట్ డైరెక్టర్ జ్యోతి ఎస్ఆర్ పాల్గొన్నారు.

0
0
Report

RCB vs GT: ఐపీఎల్‌ ఫైనల్‌పై పోలీసుల తీవ్ర ఆంక్షలు.. బెంగళూరు ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!

RKRavi Kumar Sargam31 May 2026, 09:46 am
Bengaluru, Karnataka:

Bengaluru Police: టాటా ఐపీఎల్ 2026 నేటితో ముగియనుండగా ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ రేసులో రాయల్‌ చాలెంజర్స్‌ ఉండడంతో వారి సొంత గడ్డ బెంగళూరులో ఉత్సాహ వాతావరణం ఉంది. తమ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకునేందుకు భారీ ప్రణాళికలు వేసుకోగా.. వారికి బెంగళూరు పోలీసులు తీవ్ర నిరాశకు గురి చేశారు. ఒకవేళ బెంగళూరు జట్టు గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రోజంతా బెంగళూరు నగరంలో తీవ్ర ఆంక్షలు విధించారు. గతేడాది ఆర్‌సీబీ ట్రోఫీ గెలిచిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో 11 మంది చనిపోవడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమై తీవ్ర ఆంక్షలు విధించారు.

Also Read: Alcohol Consumption: దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌.. మద్యపానంలో జాతీయ రికార్డు బద్దలు

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు.. మ్యాచ్ సమయంలో.. తర్వాత నగరంలో ఎలాంటి సంబరాలు, కార్యక్రమాలకు అనుమతి లేదని బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు బెంగళూరు పోలీసులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పోలీసులు కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు, శాంతిభద్రతల సమస్యలు, వేడుకలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బెంగళూరు నగరంలో ప్రత్యేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్ ఫలితం తర్వాత అభిమానులు బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరి వేడుకలు చేసుకోరాదని పోలీసులు సూచించారు. ఈ వేడుకలతో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో టపాసులు పేల్చడం, బైక్ ర్యాలీలు చేయడం వంటివి నిషేధం అని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చడం, ఊరేగింపులు చేయడం వంటివి నిషేధించారు.

Also Read: Dmart Offers: స్కూల్స్‌ రీపెన్‌ వేళ డీమార్ట్‌ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ

లైవ్‌ స్ట్రీమ్‌పై ఆంక్షలు
ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి బెంగళూరు నగరంలో స్క్రీనింగ్‌లపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడాన్ని పోలీసులు నిషేధించారు. మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు లేదా ఇతర ప్రాంతాల వెలుపల సాధారణ ప్రజలకు కనిపించేలా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో పుకార్లు, రెచ్చగొట్టే సందేశాలు లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను షేర్ చేయవద్దని నెటిజన్లకు బెంగళూరు పోలీసులు సూచించారు. ప్రత్యర్థి జట్ల అభిమానులను ఎగతాళి చేయడం, రెచ్చగొట్టడం లేదా అవమానించడం వంటివి చేయవద్దని, ఇవి అనవసరమైన గొడవలకు దారితీస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. పైన పేర్కొన్న అంశాలను ఉల్లంఘించినా లేదా ప్రజా భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇవి నిషేధం
బైక్ ర్యాలీలు, మితిమీరిన వేగంతో వెళ్లడం, ప్రమాదకరమైన స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, రోడ్ల దిగ్బంధం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించడం, గొడవలకు దిగడం, వేడుకల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం

0
0
Report
Advertisement

ஆர்சிபி ரசிகர்களுக்கு... பெரிய தடை... காவல்துறை கொடுத்த எச்சரிக்கை - ஐபிஎல் பைனல் பரபரப்பு

SGSudharsan G31 May 2026, 08:36 am
Bengaluru, Karnataka:

IPL Final 2026, RCB vs GT : ஐபிஎல் 2026 தொடரின் இறுதிப்போட்டி இன்று (மே 31) நடைபெற இருக்கிறது. ரஜத் பட்டிதர் தலைமையிலான ராயல் சேலஞ்சர்ஸ் பெங்களூரு - சுப்மான் கில் தலைமையிலான குஜராத் டைட்டன்ஸ் என இரண்டு அணிகளுமே தங்களின் இரண்டாவது கோப்பைக்காக இன்று முட்டிமோத உள்ளன. 

இன்று மாலை 6.30 மணியில் இருந்து நள்ளிரவு தாண்டியும் இந்திய ரசிகர்கள் மட்டுமின்றி ஒட்டுமொத்த கிரிக்கெட் உலகமே இறுதிப்போட்டியை ஆவலோடு கண்டுகளிக்க தயாராகி வருகிறது. இப்போட்டியில் குஜராத் வெல்வதை காட்டிலும் ஆர்சிபி வென்றால் நிச்சயம் நாடு முழுவதும் பெரியளவில் கொண்டாட்டம் இருக்கும் என எதிர்பார்க்கப்படுகிறது.

மேலும் படிக்க | ஐபிஎல் இறுதி போட்டியில் வெல்லப்போகும் அணி இதுதான் - அடித்து சொல்லும் அஸ்வின்!

ஆர்சிபி அணிக்கு வெற்றி பெற அதிக வாய்ப்பு

ஐபிஎல் தொடரின் நடப்பு சாம்பியன் ஆர்சிபி அணி தொடர் முழுவதும் பேட்டிங், பந்துவீச்சு, பீல்டிங் என அனைத்திலும் கலக்கி வந்துள்ளது. சீனியர் வீரரான விராட் கோலி இந்தாண்டு விளையாடும் கடைசி டி20 போட்டியும் இதுதான். ஆனால், இவை அனைத்தையும் தாண்டி ஆர்சிபி அணியால் கப் அடிக்கவே முடியாது என சொல்லப்பட்டு வந்த நிலையில், 18 ஆண்டுகளுக்கு பின் கடந்தாண்டு ஆர்சிபி அணி முதல் கோப்பையை ருசித்தது.

குஜராத் டைட்டன்ஸ் அணியின் நிலை என்ன?

குஜராத் டைட்டன்ஸ் அணிக்கோ பலத்தை விட பலவீனங்களே அதிகம். சாய் சுதர்சன், சுப்மான் கில், ஜாஸ் பட்லர் ஆகியோர் பேட்டிங்கிலும், ரபாடா மற்றும் சிராஜ் ஆகியோர் பந்துவீச்சிலும் தொடர்ந்து கைக்கொடுக்கிறார்கள். ஹோல்டர் அவ்வப்போது கைக்கொடுக்கிறார். ஆனால், மற்ற வீரர்கள் அனைத்தும் பெரியளவில் சோபிக்கவில்லை. இதனால் பலரும் ஆர்சிபி அணியே வெற்றிபெறும் என்றும் கணிக்கிறார்கள், சிலர் மட்டுமே குஜராத் பக்கம் நிற்கிறார்கள்.

மேலும் படிக்க | ஐபிஎல் 2026 இறுதிப்போட்டி: ஒருவேளை மழை பெய்தால் சாம்பியன் யார்? முழு விவரம்

காவல்துறை முக்கிய அறிவுறுத்தல்கள் என்னென்ன?

  • அப்படியிருக்க, ஆர்சிபி ரசிகர்கள் இப்போது இருந்தே தங்களின் கொண்டாட்டங்களை தொடங்கிவிட்டனர். இந்நிலையில், பெங்களூரு போலீசார் பொதுமக்களுக்கு சில அறிவுறுத்தல்களை வழங்கி உள்ளனர்.
  • இன்றைய போட்டிக்கு முன்னரும், போட்டி நடைபெறும் போதும், போட்டிக்கு பின்னரும், அமைதியுடனும் ஒழுக்கத்துடனும், பொது ஒழுங்கை பேணும்படி பெங்களூரு காவல்துறை பொதுமக்களுக்கு அறிவுறுத்தி உள்ளது.
  • பெங்களூரு முழுவதும் போக்குவரத்து நெரிசல், சட்டம் ஒழுங்கு பிரச்னைகள் மற்றும் கொண்டாட்டங்கள் தொடர்பான விரும்பத்தகாத சம்பவங்களைத் தடுப்பதற்காக சிறப்பு முன்னெச்சரிக்கைர நடவடிக்கைகள மேற்கொள்ளப்பட்டுள்ளது.
  • போலீசார் நேற்று முன்தினம் (மே 29) அறிவுறுத்தலின்பேரில், போட்டியின் முடிவு அறிவிக்கப்பட்ட பிறகு, ரசிகர்கள் பொது இடங்களில் கொண்டாடங்களுக்காக ரசிகர்கள் கூட வேண்டாம் என்றும் காவல்துறை கேட்டுக்கொண்டுள்ளது. 
  • கட்டுப்பாடற்ற கொண்டாட்டங்கள் பாதுகாப்பு அபாயங்களையும் பொதுமக்களுக்கு சிரமத்தையும் ஏற்படுத்தக்கூடும் என்றும் அதிகாரிகள் தெரிவித்தனர். 
  • அதேநேரத்தில், எவ்வித அனுமதியும் இன்றி சாலைகளை நோக்கியவாறு எல்.ஈ.டி திரைகளை வைப்பதற்கும், போட்டிகளை ஒளிப்பரப்புவதற்கும் காவல்துறை தடைவித்துள்ளது.
  • அதேபோல், மால்கள், பப்கள், உணவகங்கள் அல்லது பிற நிறுவனங்களுக்கு வெளியே பொதுமக்கள் பார்க்கும் வகையில் போட்டியை நேரடி ஒளிபரப்புகளை ஏற்பாடு செய்யக்கூடாது. 
  • கொண்டாட்டம் என்ற பெயரில் பட்டாசு வெடிப்பதற்கும், அபாயகரமான பொருட்களைப் பயன்படுத்துவதற்கும் அதிகாரிகள் தடை விதித்துள்ளனர். 
  • பைக் பேரணிகள், அதிவேகமாகச் செல்லுதல், அபாயகரமான சாகசங்கள் செயதல் போன்ற நடவடிக்கைகளுக்கும் இந்த அறிவுரை மேலும் தடை விதித்துள்ளது. 
  • பொது இடங்களில் மது அருந்துவது, பொதுமக்களுக்கு இடையூறு விளைவிப்பது, சண்டையிடுவது அல்லது கண்ணியமற்ற முறையில் நடந்துகொள்வது போன்றவற்றுக்கு எதிராக அதிகாரிகள் எச்சரித்துள்ளனர்.
  • வதந்திகள், ஆத்திரமூட்டும் செய்திகள் அல்லது வெறுப்புணர்வைத் தூண்டும் உள்ளடக்கங்களை இணையத்தில் பரப்ப வேண்டாம் என்று காவல்துறை பொதுமக்களை கேட்டுக்கொண்டுள்ளது. 
  • எதிரணி ஆதரவாளர்களை கேலி செய்யவோ, சீண்டவோ அல்லது அவமதிக்கவோ வேண்டாம் என்றும் ரசிகர்களுக்கு அறிவுறுத்தப்பட்டுள்ளது. அத்தகைய நடத்தை தேவையற்ற மோதல்களுக்கு வழிவகுக்கலாம் என எச்சரிக்கை விடுக்கப்பட்டது.

கூட்டநெரிசல் சம்பவத்தால் அறிவுரைகள்

கடந்தாண்டு ஜூன் 3ஆம் தேதி ஆர்சிபி அணியின் வெற்றிக் கொண்டாட்டத்தின்போது பெங்களூருவில் கூட்டநெரிசல் ஏற்பட்டத்தில் 11 பேர் உயிரிழந்தது குறிப்பிடத்தக்கது. இதையொட்டி, இந்த அறிவுறுத்தலை போலீசார் வெளியிட்டுள்ளனர்.

மேலும் படிக்க | குஜராத் கப் அடிக்க அதிக வாய்ப்பு... ஆர்சிபிக்கு ஆப்பு ரெடியா...? ஐபிஎல் பைனல் A to Z இதோ

0
0
Report

முதல்வர் பதவியை ராஜிநாமா செய்தது ஏன்...? சித்தராமையா சொன்ன பதில்

SGSudharsan G28 May 2026, 11:04 am
Bengaluru, Karnataka:

Siddaramaiah Resigns : கர்நாடக முதலமைச்சர் பதவியை சித்தராமையா ராஜிநாமா செய்தார். ஆளுநரிடம் தனது ராஜினாமா கடிதத்தை வழங்கினார். அப்போது அவருடன் துணை முதல்வர் டி.கே. சிவக்குமார் உடன் இருந்தார்.

பதவி விலகிய பின்னர், சித்தராமையா செய்தியாளர்களை சந்தித்தார். அப்போது, "தலைமையின் முடிவுக்கு கட்டுப்படுவேன் என முன்னரே கூறியிருந்தேன். அந்த வகையில், கட்சி தலைமையின் உத்தரவை ஏற்று ராஜிநாமா செய்துள்ளேன். புதிய முதலமைச்சருக்கு வழிவிட்டு, பதவி விலகுகிறேன்" என்றார்.

மேலும், "நான் ஒரு சிறிய கிராமத்தில் இருந்து வந்தவன். நான் ஒரு நாள் சட்டப்பேரவை உறுப்பினராக, ஒரு அமைச்சராக, ஒரு முதலமைச்சராக அல்லது ஒரு எதிர்க்கட்சித் தலைவராக வருவேன் என ஒருபோதும் கனவிலும் நினைத்தது இல்லை. எனது குடும்பத்தில் யாரும் அரசியலில் இல்லாததால், எனது அரசியல் பிரவேசம் தற்செயலாக நிகழ்ந்தது.

என் பெற்றோரோ அல்லது எனது குடும்பத்தைச் சேர்ந்த மற்ற எவருமோ அரசியலில் ஈடுபடவில்லை. நான் அரசியலில் நுழைந்த ஆரம்ப காலகட்டத்தில் இருந்தே புத்தர், பசவர், பாபாசாகேப் அம்பேத்கர், காந்திஜி ஆகியோரின் கொள்கைகளிலும் தத்துவங்களிலும் நம்பிக்கை கொண்டுள்ளேன்.

எனக்கு அரசியல் சாசனத்தின் மீது மிகுந்த மரியாதை உண்டு, சாதி, மத பேதமின்றி நாம் அனைவரும் ஒரே குடும்பமாக இணைந்து வாழ வேண்டும் என்பதில் நான் நம்பிக்கை கொண்டவன்" என சித்தராமையா உணர்ச்சிப் பெருக்கில் பேசினார். அவர் பேசியபோது கண் கலங்கினார்.

கர்நாடகாவில் கடந்த 2023ஆம் ஆண்டு நடந்த சட்டப்பேரவை தேர்தலில் காங்கிரஸ் கட்சி ஆட்சியமைத்தது. 2023ஆம் ஆண்டு மே மாதம் முதல் சித்தராமையா முதல்வர் பதவியிலும், டி.கே. சிவக்குமார் துணை முதல்வர் பதவியிலும் இருந்து வந்தனர். கர்நாடாகவின் புதிய முதலமைச்சராக டி.கே. சிவக்குமார் நாளை  (மே 29) பதவி ஏற்பார் என தகவல் வெளியாகி உள்ளது. 

தற்போது சித்தராமையா மூன்று ஆண்டுகளுக்கு பின் ராஜிநாமா செய்துள்ளார். இதற்கு முன், 2013ஆம் ஆண்டு முதல் 2018ஆம் ஆண்டுவரை சித்தராமையா கர்நாடகாவின் முதலமைச்சராக இருந்தார்.

 

0
0
Report

Anjanadri Hanuman Temple: అంజనాద్రి హనుమాన్ ఆభరణాలపై అసత్య ప్రచారాలు వద్దు: ఏఎంఆర్ ఇండియా లిమిటెట్ స్పష్టత

HDHarish Darla22 May 2026, 08:09 am
Bengaluru, Karnataka:

Anjanadri Hanuman Temple Gold Ornaments: కర్నాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలోని ప్రసిద్ధ అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి సమర్పించిన బంగారు ఆభరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ (AMR India Ltd) తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ సంస్థ చైర్మన్ శ్రీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఆ ఆభరణాలను విరాళంగా అందించారు.

ఈ ఆభరణాలలో కేవలం 250–300 గ్రాముల బంగారమే వాడారంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు ముమ్మాటికీ అసత్యమని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన అసలు వాస్తవాలు, అధికారిక వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

2026 మే 8వ తేదీన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ తరఫున అంజనాద్రి హనుమాన్ స్వామి వారికి దాదాపుగా రూ.2,20,42,000 (రూ.2.20 కోట్లు) విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చారు.  దాదాపుగా ఒక కిలో 280 గ్రాముల (నికర బరువు) ఉన్న ఈ ఆభరణాలలో కిరీటం, మకరతోరణం, గద, ఛత్రి, సూర్య చంద్ర, గరుడ హనుమ జెండా సహా మొత్తం 12 రకాలు ఆభరణాలను స్వామి వారికి సమర్పించారు. 

జ్యుడీషియల్ బాండ్ వివరాలు
ఈ ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రసిద్ధ 'కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్' సంస్థ వీటిని తయారు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి వారు జ్యుడీషియల్ బాండ్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు. ఆభరణాల తయారీ కోసం ఏఎంఆర్ చైర్మన్ మహేష్ రెడ్డి తమకు 1400 గ్రాముల (1.4 కిలోలు) బంగారాన్ని అందజేశారు. తయారీలో తరుగు (Wastage) పోగా మిగిలిన 1 కిలో 280 గ్రాముల నికర బరువుతో 12 ఆభరణాలను రూపొందించారు. ఈ బంగారు ఆభరణాలకు తయారీ సంస్థ 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తూ బాండ్ సమర్పించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ 'Tibarumal Jewellery' ఇన్వాయిస్ ఆధారంగా ఈ ఆభరణాల విలువ రూ.2,20,42,000/- గా నిర్ధారించారు.

"అవగాహన లోపంతోనో లేదా కావాలనే తప్పుదారి పట్టించేందుకో కొందరు కేవలం 300 గ్రాముల బంగారమే వాడారని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఒరిజినల్ బిల్లులు, ఆధార పత్రాలను ఇప్పటికే ఆలయ అధికారులకు సమర్పించాము. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, షిర్డీ సాయి బాబా వంటి ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన గొప్ప చరిత్ర దాత మహేష్ రెడ్డి గారికి ఉంది. అలాంటి వారిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం అత్యంత బాధాకరం." అని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్ధ డైరెక్టర్ బి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. 

లీగల్ యాక్షన్ హెచ్చరిక
భక్తులు, ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సంస్థ విజ్ఞప్తి చేసింది. దేవుడికి భక్తితో సమర్పించిన పవిత్ర ఆభరణాల విషయంలో హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోరింది. వాస్తవాలను పరిశీలించకుండా కుట్రపూర్వకంగా అసత్యాలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటామని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ హెచ్చరించింది.

ప్రకటన విడుదల చేసినవారు: 
బి. సుబ్బరామిరెడ్డి 
డైరెక్టర్, AMR India Limited, హైదరాబాద్.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రకటన మాత్రమే. ఇందులో సదరు ఆలయంతో గానీ, దాతల వ్యవహారాల్లో కానీ జీ తెలుగు న్యూస్ కు ఎలాంటి ప్రమేయం లేదు. దీన్ని జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు కేవలం ప్రకటనగానే తీసుకుంటురాని ఆశిస్తున్నాం.)

Also Read; Gudivada Temple: తాకట్టులో వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం..దాని విలువ అక్షరాల రూ.కోటి!

Also Read: తెలంగాణ కార్మికులకు గుడ్‌న్యూస్..రూ.20,000లకు జీతం పెంచిన రేవంత్ సర్కార్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

3 மாநிலங்களை இணைக்கும் அதிவேக வந்தே பாரத் ரயில்... 4 முக்கிய வழித்தடங்களில் இயங்கும் ரயில்களின் அட்டவணைகள் இதோ!

MMathan21 May 2026, 06:27 am
Bengaluru, Karnataka:

Banglore Vande Bharath Trains: இந்தியாவில் உள்ள தகவல் தொழில்நுட்ப மையங்களுக்கு தலைமையிடமாக அமைந்துள்ள ‘சிலிக்கான் வேலி’ என்றழைக்கப்படும் பெங்களூரு பல முன்னனி நிறுவனங்களுக்கு முக்கிய இடமாக திகழ்கிறது. இந்தியாவின் பல மாநிலங்களில் இருந்து பெங்களூருவை நோக்கி படையெடுக்கும் படித்த இளைஞர்கள், படிக்காத இளைஞர்களின் எண்ணிக்கை நாளுக்கு நாள் அதிகரித்துக் கொண்டே செல்கிறது. இவர்கள் தங்களது பணியிடங்களுக்கு சரியான நேரத்தில் சென்று வர போதுமான போக்குவரத்து வசதிகள் இல்லாதது ஒரு முக்கிய குறையாகவே பார்க்கப்படுகிறது. அதனை நிவர்த்தி செய்யும் வகையில், இந்தியாவில் பல்வேறு முக்கிய நகரங்களுக்கு வந்தே பாரத் ரயில் சேவை கொண்டு வரப்பட்டது. இந்த சேவையான நாளடைவில் தமிழ்நாட்டில் சென்னை, கோவை, மதுரை, ஓசூர், சேலம், ஈரோடு, திருப்பூர், திருச்சி போன்ற முக்கிய நகரங்கள் வழியாக வந்தே பாரத் ரயில் சேவை கொண்டுவரப்பட்டது. பெங்களூருவில் இருந்து தமிழகத்தில் வழியாக செல்லும் வந்தே பாரத் ரயில்களின் முழு விவரங்களைக் காண்போம்.

மேலும் படிக்க: சென்னை புல்லட் ரயில் திட்டத்தின் நிலைமை என்ன? 6 திட்டங்களை மாற்றிய மத்திய அரசு!

பெங்களூரு - கோவை வந்தே பாரத்:

கோவையில் இருந்து காலை 7.25 மணிக்கு புறப்படும் இந்த ரயில் மதியம் 1.45 மணிக்கு பெங்களூரு கன்டோன்மென்ட் ரயில் நிலையத்தை சென்றடைகிறது. அங்கிருந்து மறுமார்கமாக கன்டோன்மென்ட் ரயில் நிலையத்திலிருந்து மதியம் 2.20 மணிக்கு புறப்பட்டு ஓசூர், தர்மபுரி, சேலம், ஈரோடு மற்றும் திருப்பூர் வழியாக இரவு 8.40 மணிக்கு கோயம்புத்தூரை சென்றடைகிறது. சுமார் 380 கிலோ மீட்டர் தூரத்தை இந்த ரயில் 6 மணி நேரம் 20 நிமிடங்களில் கடக்கிறது. பெங்களூரு-கோவை இடையிலான ரயில் சேவை வியாழக்கிழமை மட்டும் செயல்படாது என்பது குறிப்பிடத்தக்கது. 

மேலும் படிக்க: தேசிய அளவில் முந்தும் வந்தே பாரத் ரயில்கள்... முழு விவரம்..

சென்னை - மைசூரு வந்தே பாரத்:

தெற்கு ரயில்வேயின் கீழ் சென்னை-மைசூரு வந்தே பாரத் எக்ஸ்பிரஸ் ரயில் கடந்த 2022 நவம்பர் 11 அன்று தொடங்கி வைக்கப்பட்டது. 16 பெட்டிகள் அடங்கிய இந்த ரயில் 496 கிலோ மீட்டர் தூரத்தை சுமார் 6 மணி 30 நிமிடங்களில் கடக்கிறது. சென்னையில் இருந்து அதிகாலை புறப்படும் இந்த ரயில் (வண்டி எண்:20607) அதிகாலை 5.50 மணிக்கு புறப்பட்டு நண்பகல் 12.20 மணிக்கு மைசூரு சென்றடைகிறது. மறுமார்கமாக மைசூரிலிருந்து மதியம் 1.05 மணிக்கு புறப்படும் இந்த ரயில் (வண்டி எண்:20608) இரவு 7.20 மணிக்கு சென்னை சென்ட்ரலை சென்றடைகிறது. இவ்வாறு சென்னை-பெங்களூரு இடையே இயக்கப்படும் வந்தே பாரத் ரயில் காட்பாடி, கே.எஸ்.ஆர் பெங்களூரு ஆகிய ரயில் நிலையங்களில் நின்று செல்கிறது.

பெங்களூரு - மதுரை வந்தே பாரத்:

மதுரையில் இருந்து காலை 5.15 மணிக்கு புறப்பட்டு மதியம் 1.00 மணிக்கு பெங்களூரு கன்டோன்மென்ட் ரயில் நிலையம் சென்றடைகிறது. மறுமார்கமாக கன்டோன்மென்ட் ரயில் நிலையத்திலிருந்து மதியம் 1.30 மணிக்கு புறப்படும் இந்த ரயில் இரவு 9.40 மணிக்கு மதுரையை சென்றடைகிறது. சுமார் 572 கிலோ மீட்டர் தூரம் கொண்ட இந்த வழித்தடத்தை 8 மணி நேரத்தில் கடந்து செல்கிறது. சாதாரணமாக இந்த வழித்தடத்தில் எக்ஸ்பிரஸ் ரயில் அல்லது பேருந்தில் பயணித்தால் சுமார் 10 முதல் 11 மணி நேரம் ஆகும் பட்சத்தில் 8 மணி நேரத்தில் பயணிக்கு இந்த ரயில் சேவை பொதுமக்கள் மத்தியில் பெரும் வரவேற்பை பெற்றுள்ளது.  இந்த ரயில் திண்டுக்கல், திருச்சி, கரூர், நாமக்கல், சேலம், கிருஷ்ணராஜபுரம் ஆகிய இடங்களில் நின்று செல்லும். வாரத்தின் 6 நாள் இயங்கும் இந்த சேவை செவ்வாய்க்கிழமை மட்டும் இயங்காது என ரயில்வெ நிர்வாகம் தெரிவித்துள்ளது. 

பெங்களூரு - எர்ணாகுளம் வந்தே பாரத்: 

பெங்களூரு-எர்ணாகுளம் இடையே இயக்கப்படும் இயக்கப்படும் வந்தே பாரத் ரயில் (வண்டி எண்:26651) பெங்களூரு கே.எஸ்.ஆர் ரயில் நிலையத்திலிருந்து காலை 5.10 மணிக்கு புறப்படும் இந்த ரயில் மதியம் 1.50 மணியளவில் எர்ணாகுளத்தை சென்றடைகிறது. மறுமார்கமாக (வண்டி எண்:26652) எர்ணாகுளத்தில் இருந்து மதியம் 2.20 மணிக்கு புறப்பட்டு இரவு 11 மணியளவில் கே.எஸ்.ஆர் ரயில் நிலையத்தை வந்தடைகிறது. பெங்களூரு - எர்ணாகுளம் இடையேயான 638 கிலோ மீட்டர் தூரத்தை 8 மணி நேரம் 40 நிமிடங்களில் கடந்து கிருஷ்ணராஜபுரம், சேலம், ஈரோடு, திருப்பூர், கோவை, பாலக்காடு, திருச்சூர் ஆகிய இடங்களில் நின்று செல்கிறது. 3 மாநிலங்களை இணைத்து பயணிக்கு இந்த ரயில் சேவை ரயில்  பயணிகளிடையே பெரும் வரவேற்பை பெற்றுள்ளது. இந்த வழித்தடத்திலான வந்தே பாரத் சேவை புதன்கிழமை மட்டும் இல்லை என்று ரயில்வே நிர்வாகம் தெரிவித்துள்ளது.  

மேலும் படிக்க: புதுச்சேரி - மைசூரு வந்தே பாரத் எக்ஸ்பிரஸ்: நீங்கள் தெரிந்துகொள்ள வேண்டிய 5 முக்கிய நன்மைகள்

 

0
0
Report

Explosives in Modi Tour: ప్రధాని మోదీ పర్యటనలో బాంబు కలకలం..నగరం మొత్తం టెన్షన్ టెన్షన్!

HDHarish Darla10 May 2026, 11:34 am
Agara, Karnataka:

Explosives Found in Modi Tour: బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ పేలుడు పదార్థాల లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమ వేదికకు కూతవేటు దూరంలో పేలుడు పదార్థాలు బయటపడటం భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగే వేడుకకు ప్రధాని హాజరుకావాల్సి ఉండగా, ఈ ఘటన వెలుగు చూసింది.

ఏం జరిగింది?
ఆదివారం నాడు ప్రధాని మోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు తనిఖీల్లో ప్రధాన వేదికకు కేవలం 3 దూరంలో ఉన్న కాగలిపుర సమీపంలోని ఫుట్‌పాత్ పక్కన రెండు జిలాటిన్ స్టిక్‌లు లభ్యమయ్యాయి. సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య దళం (BDDS), ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ జిలాటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని క్వారీ పనుల కోసం తెచ్చినవి పొరపాటున అక్కడ పడిపోయాయా? లేదా ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచారా? అనే కోణంలో విచారణ సాగుతోంది.

ఆశ్రమంలో ప్రధాని ప్రసంగం
భద్రతా ముప్పు పొంచి పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్ట్ ఆఫ్ లింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగళూరు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా మారిందని ప్రధాని ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో వాలంటీర్లు కావాలని కోరుతున్నారు.

ALso Read: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్‌డ్రా..తాజాగా అప్‌డేట్ ఇదే..

Also Read: Pooja Hegde Photos: జిమ్ డ్రస్సులో సెగలు పుట్టిస్తున్న పూజా హెగ్డే..కెవ్వుకేక అంతే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

RCB Vs GT Preview 2026: గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్..ఆర్సీబీలోకి విధ్వంసకర బ్యాటర్? ప్లేయింగ్ 11 పై లీక్ న్యూస్!

HDHarish Darla24 Apr 2026, 07:09 am
Bengaluru, Karnataka:

RCB Vs GT Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు (ఏప్రిల్ 24) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పరాజయం పాలవ్వగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ముంబై ఇండియన్స్‌పై ఓటమి పాలైంది. 

ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. రొమారియో షెపర్డ్, వికెట్ కీపర్ జితేష్ శర్మ ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా కేవలం 39, 52 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, కొంతమేర దేవదత్ పడిక్కల్ మినహా, డిఫెండింగ్ ఛాంపియన్ల మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. షెపర్డ్ స్థానంలో ఈ యువ ఆటగాడిని ఆర్సీబీ ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 ప్రస్తుత సీజన్ కోసం ఆర్సీబీ జట్టు బెథెల్‌ను రూ.2.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 97 టీ20 మ్యాచ్‌లలో, బెథెల్ 141.98 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 1843 పరుగులు సాధించాడు.

అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో 99 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు వరుసగా 49, 67, 28 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్‌లో రాణించడంలో విఫలమయ్యారు.

వెస్ట్ ఇండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ గుజరాత్ జట్టు ఫిలిప్స్‌ స్థానంలో అతడిని తుది 12 మందిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో హోల్డర్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేసిన ఎం.షారుఖ్ ఖాన్ స్థానంలో యువ కుమార్ కుశాగ్రాను జట్టులోకి తీసుకునేందుకు ఆలోచన చేసే అవకాశం ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్/జాకబ్ బెథెల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ దర్.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా.. 
శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్ / కుమార్ కుషాగ్రా, జాసన్ హోల్డర్ / గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అశోక్ శర్మ.

Also Read: Foxconn Pregnant Incident: ఆఫీస్ టాయిలెట్‌లో ప్రసవించిన టీనేజ్ యువతి..వెంటనే బిడ్డ గొంతు కోసి చంపేసింది! కటకటాల్లోకి కసాయి తల్లి!

Also Read: Composite Salary Account: ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్..ఉచితంగా రూ.కోటిన్నర..సులభంగా లోన్స్, క్యాష్‌బ్యాక్‌లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

RCB Vs DC Preview: ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు..ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందా? ఆర్సీబీ ఆధిపత్యం చలాయిస్తుందా?

HDHarish Darla18 Apr 2026, 04:52 am
Bengaluru, Karnataka:

RCB Vs DC Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిగకగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గతేడాది నుంచి ఆర్సీబీ ఉన్న భీకర ఫామ్‌ను కంటిన్యూ చేస్తుంది. అలాగే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచి.. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచి, 2 ఓటమి పాలయ్యి పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానానికి పరిమితమైంది. 

ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపిస్తూ.. ఆయన ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 228 పరుగులు రాబట్టడం విశేషం. అదే విధంగా ఆర్సీబీ కెప్టెన్ కూడా పటిదార్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తుండగా.. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ దళంగా బలంగా ఉంది. 

అలాగే ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నారు. చెరో ఏడు వికెట్లు పడగొట్టి జట్టు బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచారు. కొత్తగా జట్టులోకి వచ్చిన జాకబ్ డఫీకి ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు. ఈ న్యూజిలాండ్ పేసర్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 1/20 ప్రదర్శన చేసినందుకు జోష్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అదే మ్యాచ్‌లో, రైట్ హ్యాండ్ మీడియం పేసర్ రసిఖ్ సలాం 4 వికెట్లు పడగొట్టాడు.

ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఆటుపోట్లు లోనయ్యింది. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఈ జట్టు రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. లక్నో, ముంబై టీమ్స్‌లో గెలుపుతో ప్రారంభంమైనా.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై జరిగిన మ్యాచ్‌ల్లో తేలిపోయింది. గడిచిన నాలుగు మ్యాచ్‌లను బట్టి చూస్తే, ఢిల్లీ జట్టు ఇప్పటివరకు సమీర్ రిజ్వీ ప్రదర్శించిన ఫామ్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ యువ ఆటగాడు వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ జట్టులో లుంగీ ఎంగిడి, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ టర్న్ చేసే సత్తా కలిగిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకు వెళ్తోంది.

హెడ్-టూ-హెడ్ మ్యాచ్‌లు..
M చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌లు చాలా సందర్భాలలో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌ను ఆశించవచ్చు. ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 33 సార్లు తలపడగా.. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 మ్యాచ్‌ల్లో నెగ్గి పూర్తి ఆధిక్యాన్ని చలాయిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  కేవలం 12 మాత్రమే విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌ డ్రాగా నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రషిక్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్.
 
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు అంచనా..
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్విబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లియుంగి ఎన్గిడి, టి.నటరాజన్.

Also Read: Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!

Also Read: Dhoni Re-Entry Match: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 'తలా' దూరం! రీఎంట్రీ మ్యాచ్ ఫిక్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

LSG vs RCB: ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు జోరు.. లక్నో బేజారు

RKRavi Kumar Sargam15 Apr 2026, 06:45 pm
Bengaluru, Karnataka:

RCB Beat LSG By 5 Wickets: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ 2026లో ఆధిపత్యం చలాయిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరు జోరు కనపడుతోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించి మొత్తం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి లక్నోను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR On Delimitation: దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఊరుకోం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 146 పరుగులు చేసి ఆలౌటైంది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ స్కోర్‌ సాధించలేకపోవడంతో తక్కువ స్కోర్‌కు పరిమితమైంది. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లన్నింటిని తీసేశారు. తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు బ్యాటర్లు 15.1 ఓవర్‌లలో 5 వికెట్లు కోల్పోయి సాధించారు. విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. తక్కువ స్కోర్‌ను లక్నో బౌలర్లు ఏమాత్రం కాపాడలేకపోయారు.

Also Read: Raghav Chadha In To BJP: వదులుకుంటున్న ఆమ్‌ ఆద్మీ.. రాఘవ్‌ను రా రమ్మంటున్న బీజేపీ

లక్నో తరఫున మిచెల్‌ మార్ష్‌ 32 బంతుల్లో 40 పరుగులు చేయగా.. మార్‌క్రమ్‌ (12), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (1), అబ్దుల్‌ సమద్‌ (0), జార్జ్‌ లిండే (7), మహ్మద్‌ షమీ (0), అవేశ్ ఖాన్‌ (1) ఇలా అందరూ అతి తక్కువ స్కోర్‌ నమోదు చేశారు. ఆయూశ్‌ బదౌనీ 24 బంతుల్లో 38 పరుగులతో రాణించగా.. ముకుల్‌ చౌదరి మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. 28 బంతుల్లో 39 పరుగులు సాధించి ప్రత్యర్థికి గౌరవ ప్రదమైన లక్ష్యం ఇచ్చాడు. బెంగళూరు బౌలర్లు మ్యాజిక్‌ చేశారు. లక్నో బ్యాటర్లను ఏమాత్రం ఆడకుండా చేసి తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. రసిక్‌ సలామ్‌ 4 వికెట్లతో లక్నో నడ్డి విరవగా.. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన బంతులతో మూడు వికెట్లు తీశాడు. కృనాల్‌ పాండ్యా రెండు, జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Bike Stunts: నిబంధనలు బేఖాతర్‌.. ఔటర్‌ రింగురోడ్డుపై ప్రేమజంటల హల్‌చల్‌

తక్కువ లక్ష్యాన్ని బెంగళూరు పది ఓవర్లకు పూర్తి చేస్తుందని భావించగా.. కొంత గట్టిగానే పోరాడాల్సి వచ్చింది. ఫిల్‌ సాల్ట్‌ 7 పరుగులకే పరిమితమవగా.. విరాట్‌ కోహ్లీ మరోసారి బ్యాట్‌తో సత్తా చాటాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. ఆరు ఫోర్లు బాదగా.. ఒక సిక్సర్‌ నమోదు చేశాడు. దేవదత్‌ పడిక్కల్ తక్కువ స్కోర్‌ (10) చేయగా.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (27), జితేశ్‌ శర్మ (23) పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌, రొమారియా షెఫర్డ్‌ సమాన స్కోర్‌ (14) నమోదు చేసి విజయం అందించారు. తక్కువ స్కోర్‌ను కాపాడేందుకు లక్నో బౌలర్లు ఏమాత్రం శ్రమించలేదు. మొదట దూకుడుగా కనిపించినా బెంగళూరు బ్యాటర్ల ధాటికి అది ఏమాత్రం సరిపోలేదు. అయినా కూడా ప్రి్స్‌ యాదవ్‌ అద్భుతమైన 3 వికెట్లు తీయగా.. అవేశ్‌ ఖాన్‌ దూకుడు మీద ఉన్న కోహ్లీతోపాటు మరొకరిని ఔట్‌ చేశాడు.

ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక ఓటమితో బెంగళూరు అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. ఓటమితో లక్నో 3 ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి ఉనంచి నాలుగో స్థానానికి పరిమితమైంది. రేపు ముంబై, పంజాబ్‌ మధ్య కీలక పోరు నడవనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

RCB Vs LSG Preview: బెంగళూరు Vs లక్నో మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! ముందే తెలిసిపోతుందా? సాక్ష్యం ఇదే..ప్లేయింగ్ 11 ఇదే!

HDHarish Darla15 Apr 2026, 06:39 am
Bengaluru, Karnataka:

RCB Vs LSG Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు, విజయ పరంపర, పిచ్ రిపోర్ట్, బెంగళూరు వాతావరణ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐపీఎల్‌లో నేడు జరగనున్న 23వ లీగ్ మ్యాచ్‌లో లక్నోతో బెంగళూరు జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌తో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఇరుజట్లు ప్లాన్ చేస్తున్నాయి. పాయింట్ల పట్టిక ఆధారంగా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడోస్థానంలో ఉంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 గెలుపొంది టేబుల్‌లో 7వ స్థానంలో కొనసాగుతోంది. 

ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌పై గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ మంచి ఊపు మీద ఉంది. వరుసగా మరో గెలుపుతో పాయింట్ల పట్టికలో ఎగబాకాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు, లక్నో జట్టు కూడా ఇటీవలే తమ హోమ్ గ్రౌండ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై పరాజయం పాలయ్యి.. ఇప్పుడు విజయం కోసం పోరాడుతోంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్లు అంచనా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ ప్లేయర్).

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, ఎం. సిద్ధార్థ్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మొత్తంగా 6 సార్లు తలపడ్డారు. అందులో ఆర్సీబీ 4 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. లక్నో జట్టు 2 సార్లు విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తే లక్నో జట్టుపై ఆర్సీబీ తీవ్రంగా పైచేయి సాధించింది. 

చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్..
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో చిన్న బౌండరీలు మంచి బౌన్స్‌తో మరోసారి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ను అందిస్తుందని అంచనా. అది స్ట్రోక్‌ప్లేకి చాలా అనువైనదిగా ఉండబోతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంతిని సరైన టైమింగ్‌తో కొట్టే బ్యాటర్లు మరోసారి ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేస్తున్నారు.

ఈ మైదానంలో ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో ఫాస్ట్ బౌలర్లు 43 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు కేవలం 15 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఈ వేదిక క్రమం తప్పకుండా అధిక స్కోరింగ్‌కు వేదికగా మారింది. దీనికి నిదర్శనం తొలి ఇన్నింగ్స్‌లో నమోదయ్యే భారీ సగటు స్కోరు 206 ఉండనుందని తెలుస్తోంది.

వాతావరణం ఎలా ఉందంటే?
బెంగళూరులో వాతావరణం ప్రస్తుతం సాధారణంగానే ఉంది. ఆకాశం నిర్మలంగా.. తక్కువ తేమతో క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. వర్షం వచ్చే అవకాశాలు లేవు.

Also Read: SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్..ఐపీఎల్‌లో ఈరోజు గెలుపు ఎవరిది? సూర్యవంశీ, అభిషేక్ శర్మ విధ్వంసానికి రెడీనా?

Also Read: Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

RCB vs CSK: ఐపీఎల్‌ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి

RKRavi Kumar Sargam5 Apr 2026, 07:15 pm
Bengaluru, Karnataka:

CSK Hattrick Defeat In IPL 2026: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ 2026లో జోరు కనబరుస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లో కూడా విజయం సాధించగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటముల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసింది. 3 వికెట్ల నష్టానికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 250 భారీ స్కోర్‌ సాధించగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 19.4 ఓవర్లకు 207 పరుగులు చేసి పోరాటం ముగించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బెంగళూరు అదరగొడితే.. చెన్నై అన్నింటిలో విఫలమై హ్యాట్రిక్‌ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Also Read: Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్‌లతో తుడుచుకున్న ప్రేక్షకులు

చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 250 పరుగులు సాధించింది. టిమ్‌ డేవిడ్‌ బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. టాపార్డర్‌ గొప్ప ప్రారంభం చేయగా.. డేవిడ్‌ చెలరేగి ఆడి 25 బంతుల్లోనే 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫోర్లు 3 మాత్రమే కొట్టగా.. 8 సిక్సర్లతో స్ట్రైక్‌ రేట్‌ 280తో తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 28 పరుగులకే ఔటవగా.. ఫిల్‌ సాల్ట్‌ 30 బంతుల్లో 46 పరుగులు చేసి రాణించాడు. దేవదత్‌ పడిక్కల్‌ 29 బంతుల్లో 50 స్కోర్‌ చేసి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రజత్‌ పాటిదార్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. చెన్నై బౌలర్లు మరోసారి తేలిపోయారు. చెన్నై బౌలింగ్‌ చూస్తే అసలు బౌలర్‌ వికెట్‌ తీయాలనే విషయాన్ని మరచినట్టు కనిపిస్తోంది. అన్షుల్‌ కంబోజ్‌, జేమీ ఓవర్టన్‌, శివమ్‌ దూబే తలా ఒక్కో వికెట్‌ తీసినా పరుగులు మాత్రం భారీగా ఇచ్చారు.

Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌

బౌలర్లు విఫలమవడంతో బెంగళూరు విధించిన భారీ లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు ఛేదించలేక 19.4 ఓవర్‌కు చేతులెత్తేశారు. 207 పరుగులు చేసి సూపర్‌ కింగ్స్‌ ఆలౌటైంది. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమవగా.. ఆఖరులో ఆల్‌రౌండర్‌ నిలదొక్కుకోవడంతో ఓటమి అంతరం తగ్గింది. సంజూ శామ్‌సన్‌ 9 పరుగులకే మళ్లీ నిరాశపర్చగా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా 7 పరుగులకే ఔటయ్యాడు. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఆయుశ్‌ మాత్రమే ఈసారి ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. క్లిష్ట సమయంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతంగా ఆడి 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఆశలు రేకిత్తించాడు. కార్తీక్‌ శర్మ (6), శివమ్‌ దూబే (18) తక్కువ పరుగులు చేయగా.. ప్రశాంత్‌ వీర్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓటమి ఖాయం చేసుకున్నా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జేమీ ఓవర్టన్‌ కూడా 37 పరుగులు చేసి గెలుపు ఆశలను సజీవం చేశాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు అన్షూల్‌ కంబోజ్‌ (19), నూర్‌ అహ్మద్‌ (8), మ్యాట్‌ హెన్రీ (2) కొన్ని పరుగులు జోడించినా విజయానికి కావాల్సిన స్కోర్‌ రాలేదు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మూడో ఓటమి తప్పలేదు. బ్యాటర్ల మాదిరి బెంగళూరు బౌలర్లు కూడా నిప్పులు చెరిగారు. భారత సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేసి 3 వికెట్లు తీశాడు. జాకోబ్‌ డఫ్పీ, అభినందన్‌ సింగ్‌, కృనాల్‌ పాండ్యా తలా రెండేసి వికెట్లు తీయగా.. సుయాష్‌ శర్మ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Klassen Innings: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 156/9.. ఉప్పల్‌ స్టేడియంలో క్లాసెన్‌, నితీశ్‌ రికార్డ్‌ ఇన్నింగ్స్‌

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు.. రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. రెండు విజయాలతో రాయల్‌ చాలెంజర్స్‌ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవగా.. వరుసగా మూడు ఓటములతో చెన్నై చివరి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఒకప్పటి అగ్ర జట్టు ఈ సీజన్‌లో కూడా ఇంతటి పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మాజీ కెప్టెన్‌ ధోనీ లేకపోవడం.. అతడి సలహాలు, వ్యూహం కరువవడంతోనే ఇలా జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Auto LPG Price Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఎల్పీజీ ధరలు..లీటరు రూ.106కి అమ్ముతున్న ఫిల్లింగ్ స్టేషన్లు!

HDHarish Darla2 Apr 2026, 10:43 am
Bengaluru, Karnataka:

Auto LPG Price Hike News: ఇండియన్ ఆయిల్ (IOCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో బెంగళూరులో కార్యకలాపాలు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఆటో ఎల్పీజీ (Auto LPG) ధరలు లీటరుకు రూ.11.78 పెంచేందుకు నిర్ణయించారు. అయితే ఈ పెంపు అనేది ఏప్రిల్ 1 నుంచి అములులోకి వస్తుందని తెలియజేశారు. దీంతో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు రూ.89.52కు చేరింది. చివరి సవరణ 2026 మార్చి 20న జరగ్గా..అప్పుడు ఎల్పీజీ ధర లీటరుకు రూ.77.74గా విక్రయించారు. అయితే యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరను ఆసరాగా తీసుకోని పలు ప్రైవేట్ ఆటో ఎల్‌పిజి స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు వసూలు చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆటో ఎల్‌పిజి ఫిల్లింగ్ స్టేషన్లు డ్రైవర్లను దోచుకుంటున్నాయని ఆరోపించారు. "ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ (IOCL) నిర్ణయించిన ఆటో ఎల్‌పిజి ధర రూ.89.52 విక్రయిస్తుండగా.. బెంగళూరులోని అనేక ప్రైవేట్ చమురు ఫిల్లింగ్ స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఆటో ఎల్పీజీ కోసం 2 కిలోమీటర్ల వరకు క్యూలో వేచి చూడాల్సి వచ్చేంది." అని ఆటో డ్రైవర్ సంఘాలు తెలిపాయి. ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటగా..ఇప్పుడు ఆటో గ్యాస్ గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంద
చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆటో గ్యాస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ఎలా బ్రతుకుతారు?

పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఆయా దేశాల సమన్వయ దాడులు నేపథ్యంలో ప్రతీకార చర్యలు భారీగా మొదలయ్యాయి. దీంతో ప్రపంచంలోని ఇంధన వాణిజ్య మార్గమైన కీలక హోర్ముజ్ జలసంధి నుంచి నౌకాయానానికి అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలను పెరిగిన క్రమంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించింది.

ఆటో ఎల్పీజీ ఇంధన కొరత కారణంగా ఆటో డ్రైవర్లు కూడా ప్యాసింజర్స్ నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెంచినట్లు ఓ ఆటో ఎల్పీజీ డీలర్ తెలియజేశారు. "గత వారం ఒక టన్ను ఎల్‌పిజి ధర సుమారు రూ.60,000 ఉండేది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ధర దాదాపు రూ. 1.90 లక్షలకు చేరింది. సరఫరా సరిపోవడం లేదు. చాలా ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడుతున్నాయి, ఉన్నవాటిలో కొన్ని ఎక్కువ వసూలు చేస్తున్నాయి," అని ఆ డీలర్ అన్నారు.

అయితే కర్ణాటక రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి 29, 2026 నాటి పత్రికా ప్రకటనలో.. ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలచే నిర్వహిస్తున్న కర్ణాటక వ్యాప్తంగా ఉన్న 72 ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్లలో (ALDS), బెంగళూరులోని 31 స్టేషన్లతో సహా ఆటో ఎల్‌పీజీ సులభంగా అందుబాటులో ఉందని ఆ శాఖ పేర్కొంది.

"గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) రోజుకు సగటున 64.9 మెట్రిక్ టన్నుల ఆటో LPGని పంపిణీ చేశాయి. ఈ యుద్ధానికి ముందు ఈ పంపిణీ 57.6 మెట్రిక్ టన్నులుగా ఉండేది. ఇది సరఫరాలో పెరుగుదలను సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సరఫరా అవుతున్న సుమారు 4 లక్షల గృహ వినియోగ LPG సిలిండర్లు, దాదాపు 18,000 వాణిజ్య LPG సిలిండర్లకు ఇది అదనం" అని అది పేర్కొంది. అన్ని రంగాలకు నిరంతరాయంగా LPG సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని తెలిపింది.

Also Read: Bank Holiday April 2026 List: షాకింగ్ న్యూస్..ఏకంగా 12 రోజులు సెలవులు..బ్యాంకు ఉద్యోగులకు పండగే..ఎందుకంటే?

Also Read: Russia Petrol Export Ban: భారత్‌కు పెట్రోల్ ఎగుమతిపై నిషేధం..ఏప్రిల్ 1 నుంచి అన్నీ బంద్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top