icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
500072
Vidya Sagar ReddyVidya Sagar ReddyFollow31 Mar 2026, 05:38 am

వివేకానంద నగర్ లో ఏప్రిల్ 1వ తేదీన లక్ష్మీ యాగం

Hyderabad, Telangana:లోక కల్యాణం, ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ, లక్ష్మీ అమ్మవారి తిరు నక్షత్రం సందర్భంగా కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో ఉన్న చిత్తారమ్మ దేవాలయంలో ఏప్రిల్ 1వ తేదీన భారీ ఎత్తున శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.ఏప్రిల్ 1వ తేదీ, ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా యాగం కొనసాగుతుంది.ఈ యాగాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా అర్చకులు విచ్చేస్తున్నారు.ఐదు క్వింటాళ్ల పసుపుతో భారీ రాశిని ఏర్పాటు చేసి, దానిపై లక్ష్మీ యంత్రాన్ని ప్రతిష్టించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, భారీ స్థాయిలో ఈ మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించేందుకు సంకల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
0
0
Report
Advertisement
Pinewz
500018
Vidya Sagar ReddyVidya Sagar ReddyFollow10 Nov 2025, 02:03 am

సాయిరాం మోటార్స్ ఆధ్వర్యంలో వార్షిక మెకానిక్ సమావేశం

Hyderabad, Telangana:వ్యవసాయ పారిశ్రామిక, మరియు గృహ అవసరాలకు వినియోగించే నీటి పంప్ లో అగ్రగామిగా ఉన్న సముద్ర పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి వై జంక్షన్ లో ఆథరైజ్డ్ డీలర్ సాయిరాం మోటార్స్ నిర్వాహకుడు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో వార్షిక మెకానిక్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ మధు, సంస్థ టెక్నికల్ సర్వీస్ మేనేజర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక రంగంలో నీటి పంపుల సమర్థవంతమైన పనితీరు పై మెకానిక్లు పోషించే పాత్ర కీలకమైనదని అన్నారు అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి తమ కొత్త ఉత్పత్తులు మరియు సాంకేతిక విధానాలపైన అవగాహన కల్పించామని అన్నారు. కూకట్ పల్లి ఏరియా ఆథరైసేడ్ డీలర్గా వ్యవహరిస్తున్న సాయిరాం మోటార్స్ నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ఏడు ఏళ్లుగా తమతో ప్రయాణం సాగిస్తున్నారని ఎంతోమంది కస్టమర్ల ఆనందాన్ని కలుపుకొని ముందుకు వెళుతున్నామన్నారు
0
0
Report
Advertisement
Back to top