Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vidya Sagar Reddy
Medchal-Malkajgiri500072

కూకట్ పల్లిలో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా.. విద్యార్థుల అరెస్ట్

Vidya Sagar ReddyVidya Sagar ReddySept 16, 2025 07:29:41
Hyderabad, Telangana:
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్మెంటు చెల్లింపు విషయంలో విఫలం అయిందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కూకట్ పల్లి లోని ముంబై జాతీయ రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రెటరీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు . రెండు విడుదల లో 1200 కోట్లను రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థినేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 6000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
14
comment0
Report
Medchal-Malkajgiri500072

తులసి వనం వద్ద భారీగా చేరిన వర్షపు నీరు..

Vidya Sagar ReddyVidya Sagar ReddyAug 04, 2025 12:29:19
Hyderabad, Telangana:
నాలుగు గంటల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముల్లపూడి ప్రధాన రహదారి తో పాటు తులసి వనం వద్ద భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో విషయం తెలుసుకున్న ఆల్బం కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని జిహెచ్ఎంసి, మాన్సూన్ సిబ్బందితో నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
14
comment0
Report
Medchal-Malkajgiri500072

రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్యే గాంధీ

Vidya Sagar ReddyVidya Sagar ReddyJun 18, 2025 13:49:31
Hyderabad, Telangana:
హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి నేడు పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్‌కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని గాంధీ సూచించారు
0
comment0
Report
Medchal-Malkajgiri500072

TELANGANA - ఉద్యోగం కోల్పోవడంతో యువకుడి ఆత్మహత్య

Vidya Sagar ReddyVidya Sagar ReddyJun 18, 2025 13:43:40
Hyderabad, Telangana:
ఉద్యోగం కోల్పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన గోపికృష్ణ (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నెల రోజుల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. దీనితో మనస్థాపానికి గురై రెండు రోజులు ఊరికి వెళ్లి వచ్చిన తర్వాత బుధవారం తాను నివసిస్తున్నారు ఫ్యానుకూరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను భయంతో చనిపోవట్లేదు బాధ భరించలేక చనిపోతున్నానంటూ సూసైడ్ లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పైన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టారు
0
comment0
Report
Advertisement
Medchal-Malkajgiri500037

వంద పడకల ఆసుపత్రి నిర్మించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ఎమ్మెల్యే

Vidya Sagar ReddyVidya Sagar ReddyJun 18, 2025 13:43:19
Hyderabad, Telangana:
కూకట్ పల్లి కృష్ణారావు KPHB డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యల పైన నేడు స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి డివిజన్ వ్యాప్తంగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నాలుగవ ఫేజ్ లోని వంద పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారని లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే కృష్ణారావు తేల్చి చెప్పారు
0
comment0
Report
Advertisement
Back to top