Home
Web Stories
Become a News Creator
Your local stories, Your voice
Join as Creator
Follow us on
Download App from
Advertisement
Back
Vidya Sagar Reddy
Follow
500018
సాయిరాం మోటార్స్ ఆధ్వర్యంలో వార్షిక మెకానిక్ సమావేశం
Vidya Sagar Reddy
Follow
Nov 10, 2025 02:03:18
Hyderabad, Telangana:
వ్యవసాయ పారిశ్రామిక, మరియు గృహ అవసరాలకు వినియోగించే నీటి పంప్ లో అగ్రగామిగా ఉన్న సముద్ర పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి వై జంక్షన్ లో ఆథరైజ్డ్ డీలర్ సాయిరాం మోటార్స్ నిర్వాహకుడు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో వార్షిక మెకానిక్ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ మధు, సంస్థ టెక్నికల్ సర్వీస్ మేనేజర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక రంగంలో నీటి పంపుల సమర్థవంతమైన పనితీరు పై మెకానిక్లు పోషించే పాత్ర కీలకమైనదని అన్నారు అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి తమ కొత్త ఉత్పత్తులు మరియు సాంకేతిక విధానాలపైన అవగాహన కల్పించామని అన్నారు. కూకట్ పల్లి ఏరియా ఆథరైసేడ్ డీలర్గా వ్యవహరిస్తున్న సాయిరాం మోటార్స్ నిర్వాహకులు విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ఏడు ఏళ్లుగా తమతో ప్రయాణం సాగిస్తున్నారని ఎంతోమంది కస్టమర్ల ఆనందాన్ని కలుపుకొని ముందుకు వెళుతున్నామన్నారు
0
0
Share
Report
500072
కూకట్ పల్లిలో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా.. విద్యార్థుల అరెస్ట్
Vidya Sagar Reddy
Follow
Sept 16, 2025 07:29:41
Hyderabad, Telangana:
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్మెంటు చెల్లింపు విషయంలో విఫలం అయిందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కూకట్ పల్లి లోని ముంబై జాతీయ రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రెటరీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు . రెండు విడుదల లో 1200 కోట్లను రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థినేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 6000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
0
0
Share
Report
500072
తులసి వనం వద్ద భారీగా చేరిన వర్షపు నీరు..
Vidya Sagar Reddy
Follow
Aug 04, 2025 12:29:19
Hyderabad, Telangana:
నాలుగు గంటల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషా ముల్లపూడి ప్రధాన రహదారి తో పాటు తులసి వనం వద్ద భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో విషయం తెలుసుకున్న ఆల్బం కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని జిహెచ్ఎంసి, మాన్సూన్ సిబ్బందితో నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
0
0
Share
Report
500072
రోడ్డు విస్తరణ పనులను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్యే గాంధీ
Vidya Sagar Reddy
Follow
Jun 18, 2025 13:49:31
Hyderabad, Telangana:
హైదర్నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి నేడు పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్కు వివరించారు. సాధ్యమైనంత త్వరగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని గాంధీ సూచించారు
0
0
Share
Report
Advertisement
500072
TELANGANA - ఉద్యోగం కోల్పోవడంతో యువకుడి ఆత్మహత్య
Vidya Sagar Reddy
Follow
Jun 18, 2025 13:43:40
Hyderabad, Telangana:
ఉద్యోగం కోల్పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన గోపికృష్ణ (26) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నెల రోజుల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. దీనితో మనస్థాపానికి గురై రెండు రోజులు ఊరికి వెళ్లి వచ్చిన తర్వాత బుధవారం తాను నివసిస్తున్నారు ఫ్యానుకూరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను భయంతో చనిపోవట్లేదు బాధ భరించలేక చనిపోతున్నానంటూ సూసైడ్ లెటర్ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పైన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టారు
0
0
Share
Report
Advertisement
Top Cities
New Delhi
Gurugram
Pune
Ahmedabad
Bengaluru
Back to top