Back
Medchal-Malkajgiri500013blurImage

తెలంగాణ ముదిరాజ్ ఐకాస అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు

Vishwaroopa
Jul 02, 2024 05:30:51
Hyderabad, Telangana

ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజ్ ఐకాస అధ్యక్షుడు పొల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాంకోటి బీసీ సాధికారత్ భవన్‌లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి పదవితోపాటు ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏగా మార్చాలని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ కు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలి. కోకాపేటలో ముదిరాజ్ భవన్ ట్రస్టు నిర్మాణంపై సమీక్షించి నిధులు విడుదల చేయాలి.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com