Back
Hyderabad500060blurImage

గడ్డిఅన్నారం: హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి

Manohar
Jul 04, 2024 12:29:47
Hyderabad, Telangana
హిందూ సమాజానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం డివిజన్ పరిధిలోని కోణార్క్ థియేటర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. లోక్ సభలో హిందూ సమాజంపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ హిందూ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com