Back
Sangareddy502001blurImage

సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయనున్నారు

Gajjala Nagesh Goud
Jun 15, 2024 13:07:23
Sangareddy, Telangana

ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి మాట్లాడుతూ నులిపురుగు సోకిన చిన్నారుల్లో బలహీనత, పోషకాహార లోపం, ఎత్తు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. 

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com