Back
Gajjala Nagesh Goud
Medak502255blurImage

రెండు లారీలు ఢీకొని ఐదుగురు మృతి చెందారు

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 28, 2024 09:35:41
Chegunta, Telangana:

మెదక్ జిల్లా చేగుంట వడియారం బైపాస్‌లో వెనుక నుంచి మరో లారీ వచ్చి ముందు లారీని ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక లారీలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా... మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

0
Report
Sangareddy502001blurImage

నిమ్జ్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 26, 2024 13:05:21
Sangareddy, Telangana:

సంగారెడ్డి జిల్లా: జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి-నిమ్జ్ రాకతో జహీరాబాద్ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక రూపురేఖలు మారుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి ఝరాసంఘం ఎల్గోయి, ముంగి గ్రామాల్లోని 500 ఎకరాల భూమికి చెందిన 269 మంది నిమజ్ భూమి నిర్వాసితులకు రూ.22 కోట్ల 75 లక్షల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్ కల్, రాయికోడ్, సదాశివపేటలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు.

0
Report
Sangareddy502220blurImage

జహీరాబాద్ ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 26, 2024 09:42:48
Zaheerabad, Telangana:

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులలో కలియతిరిగి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి వైద్యులు సకాలంలో వస్తున్నారు లేదో అని పరిశీలించారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.

0
Report
Siddipet502103blurImage

మైనర్ బాలుడిని వేధించిన మహిళ.. పోక్సో చట్టం కింద అరెస్ట్

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 16, 2024 11:31:17
Siddipet, Telangana:

సిద్దిపేట జిల్లాలో మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన మహిళపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అతడిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఇన్ స్పెక్టర్ ఉపేంద్ర తెలిపారు. ఆ యువకుడు గత మూడేళ్లుగా సిద్దిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే యజమాని కుమారుడు తన మాటలతో మైనర్ బాలుడిని ప్రలోభపెట్టాడు. బాలుడిని జనవరి 22న చెన్నైకి తీసుకెళ్లారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కొడుకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు సాంకేతిక సహాయంతో చెన్నైలో అరెస్టు చేశారు.

1
Report
Sangareddy502001blurImage

సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయనున్నారు

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 15, 2024 13:07:23
Sangareddy, Telangana:

ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి మాట్లాడుతూ నులిపురుగు సోకిన చిన్నారుల్లో బలహీనత, పోషకాహార లోపం, ఎత్తు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 4 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. 

0
Report
Sangareddy502285blurImage

కలెక్టర్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 15, 2024 04:55:46
Kandi, Telangana:
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. కంది గ్రామంలో జిల్లా కలెక్టర్ క్రాంతి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు.కంది లోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యస కార్యక్రమంలో పాల్గొని 14 మంది చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ చేశారు.
1
Report
Medak502110blurImage

కెసిఆర్ కు ఈడి నోటీసులు :రఘునందన్

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 14, 2024 10:46:59
Medak, Telangana:
తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్. గొర్రెల స్కాం లో కెసిఆర్ కు ఈ డి అధికారులు నోటీసులు ఇచ్చారని బాంబ్ పేల్చారు. త్వరలో హరీష్ రావు, వెంకట్ రామిరెడ్డి కి చుక్కలు కనిపిస్తాయని హెచ్చరించారు.
0
Report
Medak502110blurImage

ఇంటింటి సర్వేను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్

Gajjala Nagesh GoudGajjala Nagesh GoudJun 14, 2024 10:44:00
Medak, Telangana:
మిషన్ భగీరథ కనెక్షన్ల కోసం చేస్తున్న ఇంటింటి సర్వేను చిన్న శంకరం పేట లో స్వయంగా పరిశీలించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహల్ రాజ్. సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తాగునీటి అవసరాలు అనుగుణంగా పది రోజులపాటు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. మంచినీటి కనెక్షన్లు కుటుంబ సభ్యుల వివరాలు, నీటి అవసరాలు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభివృద్ధి చేసిన ప్రత్యేక యాప్ లో నమోదును స్వయంగా పరిశీలించి నమోదు చేశారు. ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.
1
Report