పటాన్ చెరు ముత్తంగి ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం
Sangareddy, Telangana:సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు ఓఅర్అర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం. ముత్తంగి జంక్షన్ వద్ద ఆగి వున్న మిని పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొన్న డీసీఎం వాహనం. ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో డీసీఎం వాహనం క్యాబిన్లో ఉన్న ఇద్దరు కూలీలు మృతి. డ్రైవర్ కు తీవ్ర గాయాలు. మృతదేహాలు డీసీఎం క్యాబిన్లో ఇరుక్కునీ వున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తమై మృతుదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|