పటాన్ చెరు ముత్తంగి ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు ఓఅర్అర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం. ముత్తంగి జంక్షన్ వద్ద ఆగి వున్న మిని పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొన్న డీసీఎం వాహనం. ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో డీసీఎం వాహనం క్యాబిన్లో ఉన్న ఇద్దరు కూలీలు మృతి. డ్రైవర్ కు తీవ్ర గాయాలు. మృతదేహాలు డీసీఎం క్యాబిన్లో ఇరుక్కునీ వున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తమై మృతుదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెల్లాపూర్ నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు నియోజకవర్గం తేల్పూరు మున్సిపాలిటీలో రూ.8 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సముదాయంలో జాతీయ జెండా స్తంభాన్ని, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియంకు శంకుస్థాపన చేశారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరగడం సంచలనం సృష్టించింది. పటాన్ చెరు నగరంలో ఉదయం నుంచి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 40 మంది అధికారుల బృందం ఉదయం 6 గంటలకు పటాన్ చెరు చేరుకుని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడి నివాసంలో తనిఖీలు నిర్వహిస్తోంది.