Back
Mahabubabad506101blurImage

ప్రభుత్వ పథకాల గురించి డాక్టర్ మురళీ నాయక్ ప్రకటించారు

Srikanth
Jun 17, 2024 11:58:17
Mahabubabad, Telangana

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందజేస్తామని ప్రకటించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రంలో రేషన్‌కార్డు ఉన్న ప్రతి మహిళకు త్వరలో మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com