Back
Hyderabad500003blurImage

సికింద్రాబాద్: భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలి

Manohar
Jun 27, 2024 08:48:48
Hyderabad, Telangana

అంగరంగ వైభవంగా ఆషాడమాస బోనాల జాతర నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అధికారులు సమన్వయంతో పనిచేయాలని భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలిపారు. బోనాల జాతర కోసం ఏడాది 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com