వచ్చే కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Hyderabad, Telangana:వచ్చే కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత బడ్జెట్ లో బీసీలకు రూ.2000 కోట్లు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అధానీలకు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, బీసీలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|