Back
Hyderabad500028blurImage

కార్వాన్: ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కార్పొరేటర్

Manohar
Jun 20, 2024 13:13:10
Hyderabad, Telangana
విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కూల్సుంపుర ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కడుపులో నులిపురుగులను చంపడానికి ఆల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు తప్పకుండా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com