icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Chandrababu YS Jagan: మహిళా బిల్లుపై ఇండి కూటమిని తప్పుబట్టిన చంద్రబాబు, వైఎస్‌ జగన్‌

Wadgaon, Maharashtra:

Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై ఎన్డీయే పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇండి కూటమి వ్యవహార శైలిని కేంద్రంలోని భాగస్వామ్యపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా మహిళా బిల్లు వీగిపోవడంపై ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. ఇండి కూటమి తీరును ఖండించారు.

Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

'కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళా సాధికారత వైపు భారత్‌ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును అడ్డుకుంది. ఇది కేవలం రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కాదు. సమాన హక్కులు, సముచిత ప్రాతినిధ్యం కోరుతున్న కోట్లాది మహిళలకు చేసిన ద్రోహం. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలు చేసిన ద్రోహాన్ని దేశం గుర్తుంచుకుంటుంది' అని సీఎం చంద్రబాబు 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.

Also Read: Women Reservation Bill: ప్రధాని మోదీకి వరుస ఎదురుదెబ్బలు.. నల్ల చట్టాల నుంచి మహిళా రిజర్వేషన్ దాకా

‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు, దానివల్ల తామేం సాధించామనేది గట్టిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గేవనేది వాస్తవం. అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కూడా వాయిదా పడింది. దీంతో అటు దక్షిణాది రాష్ట్రాలకు, ఇటు మహిళలకు న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి  మరింత దారుణంగా మారుతుంది. ఇప్పటికే కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళా శక్తిని దూరం చేశారు
'చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదావకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేది. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుంది. నరేంద్ర మోదీ  ఈ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు' అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Women Reservation Bill: ప్రధాని మోదీకి వరుస ఎదురుదెబ్బలు.. నల్ల చట్టాల నుంచి మహిళా రిజర్వేషన్ దాకా

New Delhi, Delhi:

Women Reservation Bill Falls: బంపర్‌ మెజార్టీతో మూడోసారి అధికారం దక్కించుకున్నా కూడా కీలకమైన బిల్లుల విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. సంపూర్ణమైన మెజార్టీ ఉందని భావించి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఆమోదం పొందుతుందని అందరూ భావించగా ఊహించని విధంగా బిల్లు వీగిపోవడం సంచలనం రేకెత్తుతోంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన తెలంగాణ సెక్రటేరియట్, కలెక్టరేట్

వాస్తవంగా అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి ఉంటే ఆమోదం పొంది ఉండేది. కానీ దీని చాటున డీలిమిటేషన్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టడంతో ఎన్డీయే కూటమి మినహా మిగతా అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళల రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు పలుకుతాం అని ప్రకటించి.. దాని చాటున డీలిమిటేషన్‌ బిల్లును పెట్టడాన్ని ఇండి కూటమితోపాటు మిగతా పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ మూడుసార్లు అధికారం చేపట్టిన తర్వాత కొన్ని కీలక అంశాల్లో ఎదురుదెబ్బ తగిలింది. వాటిలో వ్యవసాయానికి సంబంధించిన మూడు నల్ల చట్టాలు.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.

Also Read: Bandi Sanjay: సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అనలేదా?: బండి సంజయ్‌

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం శుక్రవారం సాయంత్రం ఓటింగ్‌ నిర్వహించగా.. ఊహించని రీతిలో ఆ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్‌ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోవడం ఊహించనిది. ఓటింగ్‌ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా.. వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో ఆ బిల్లు మూడింట రెండొంతుల మెజార్టీ సాధించలేకపోయింది. బిల్లు వీగిపోవడంపై ఇండి కూటమి హర్షం వ్యక్తం చేసింది. జాతీయ విపత్తును అడ్డుకున్నామని ఇండి కూటమి పేర్కొంది.

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 'ఈ బిల్లులు రాజ్యాంగంపై దాడి చేయడమే. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను ఓడించాం' అని ప్రకటించారు. ఇది మహిళా బిల్లు కాదని తాము స్పష్టం చెప్పామని.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని చెప్పినట్లు గుర్తుచేశారు. 'మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కాదు' అని తెలిపారు. ఇది దేశ రాజకీయ నిర్మాణంపై దాడి.. ఈ కుట్రను అడ్డుకున్నామని వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Strait Of Hormuz Open: ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్ కీలక ప్రకటన..ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించినట్టేనా? ఏం జరుగుతోంది?

Strait Of Hormuz Open News: పశ్చిమాసియాలో ఇటీవలే యుద్ధానికి బ్రేక్ పడింది. అయితే యుద్ధం తాలూకా కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ దేశాలు ఒప్పందాలు చేసుకోగా.. ఆనాటి నుంచి 15 రోజుల వరకు హోర్ముజ్ జలసంధి 'పూర్తిగా తెరిచి ఉంటుందని' ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ప్రపంచంలోని అన్ని వాణిజ్య నౌకల కోసం ఈ మార్గం తెరిచే ఉంటుందని ఆయన 'X' (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.

లెబనాన్‌లో కాల్పుల విరమణకు అనుగుణంగా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చేసిన ఒప్పందం ప్రకారం.. కాల్పుల విరమణలో మిగిలిన రోజులకు గానూ హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి 'పూర్తిగా తెరిచి ఉందని' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియాలో ధృవీకరించారు. "హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని, పూర్తి రాకపోకలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ఇప్పుడే ప్రకటించింది. ధన్యవాదాలు!" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

అయితే మరో పోస్ట్‌లో ట్రంప్ స్పష్టం చేస్తూ, జలసంధి తెరుచుకున్నప్పటికీ, ఇరాన్‌తో 'లావాదేవీ' పూర్తయ్యే వరకు అమెరికా నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ముడి చమురు ధరలు 10 శాతం పడిపోయాయి.

లెబనాన్‌, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ గురువారం ప్రకటించారు. ఇరు దేశాల నాయకుల మధ్య మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందానికి రావాలనే అమెరికా ప్రయత్నాలలో భాగంగానే ఈ రెండు యుద్ధ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఏ ఒప్పందంలోనైనా లెబనాన్ కాల్పుల విరమణ తప్పనిసరిగా ఉండాలని టెహ్రాన్ పట్టుబట్టింది.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌లతో జరిపిన ఫోన్ సంభాషణల తర్వాతే ఈ ఘర్షణలను నిలిపివేసే ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. రాబోయే నాలుగు లేదా ఐదు రోజుల్లో నెతన్యాహు, ఔన్ వైట్ హౌస్‌ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన ఆ తర్వాత చెప్పారు.

మరోవైపు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించడాన్ని ఫ్రాన్స్, యూకే నాయకులు స్వాగతించారు. కానీ అది శాశ్వతం కావాలని వారు ఆశించారు. సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి ఒక అంతర్జాతీయ మిషన్‌ను ప్లాన్ చేస్తూనే ఉంటామని, వచ్చే వారం లండన్‌లో సైనిక ప్రణాళికల నిపుణులతో సమావేశం కానున్నామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు.

Also Read: GT Vs KKR Match Preview: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్..గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడితే అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

Also Read: Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Monkey saves child Video: అరెవావ్.. బాల్కనీలో వేలాడుతున్న బాలుడ్ని కాపాడిన వానరం.. సంచలనంగా మారిన వీడియో..

Hyderabad, Telangana:

Monkey saved a child from falling off a balcony Video: ప్రస్తుతం ఏఐ జనరేషన్ నడుస్తుంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్గా మారుతున్నాయి. దీనిలో ఏవి నిజమైనవి మరీ ఏవి అసత్యమైనవి  అని తెలుసుకొవడం పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారుతున్న వీడియోలను చూస్తుంటే కొన్ని చాలా డౌటానుమానం కల్గేలా  ఉంటున్నాయి.  కొంత మంది కావాలని పబ్లిసిటీ కోసం, ఫెక్ ప్రచారాంలు, వ్యూస్ కోసం ఏఐతో వీడియోలను జనరేట్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త తెలియని అమాయక జనాలు వైరల్ అవుతున్న వాటిని చూసి నిజమనుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట బాగా వైరల్గా మారింది.

 

దీనిలో ఒక బాలుడు బాల్కనీ నుంచి వేలాడుతున్నాడు. మరీ ఆడుకుంటూ అక్కడ వేలాడుతున్నాడో లేదా నిజంగానే అక్కడ దిగలేక ఇబ్బంది పడుతున్నాడో గానీ ఆ సమయంలోనే రెప్పపాటులో ఒక కొండెంగ అక్కడకు వచ్చింది. వెంటనే ఒక్క ఉదుటున దూకీ బాలుడ్ని బాల్కనీ నుంచి పట్టుకుని మరో చోట దూకి అతడి ప్రాణాలు కాపాడింది.

ఈ ఘటనను కొంతమంది వీడియో తీశారు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఆ వానరం అచ్చం హనుమాన్ లో అక్కడకు వచ్చి ఆ బాలుడి ప్రాణాలు కాపాడింది.

Read more: Video Viral: అరె వావ్.. బైక్ ఎక్కి బుసలు కొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన నాగు పాము.. వీడియో వైరల్..

పొరపాటున అతను లేకుంటే ఏమయ్యేది అని అందరు షాక్ అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కొంత మంది దీన్ని ఏఐ అని కొట్టిపారేస్తుండగా , మరికొంత మంది మాత్రం కొండెంగకు ఏదైన ట్రైనింద్ ఇచ్చుంటారని కూడా అంటున్నారు. 
 

0
0
Report
Advertisement

Bandi Sanjay: సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అనలేదా?: బండి సంజయ్‌

New Delhi, Delhi:

Bandi Sanjay Supports To Tejasvi Surya: విద్వేష ప్రసంగం చేసిన తేజస్వి సూర్యపై తెలంగాణ సమాజం మండిపడగా.. అతడికి కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ నాయకత్వం అండగా నిలుస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందిస్తూ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అనలేదా? సోనియా చేసిన నీచ పనులతో తెలంగాణలో వెయ్యి మంది బలిదానమయ్యారని చెప్పలేదా? తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన తెలంగాణ సెక్రటేరియట్, కలెక్టరేట్

తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వివాదం చేయడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఆనాడు తుపాకీ పట్టుకు వెళ్లలేదా? అలాంటి సీఎం మంత్రివర్గంలో మీరు మంత్రులుగా ఎందుకు ఉన్నారు? 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ కాదా? తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులుగా పోల్చుతూ తేజస్వీ దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే వివాదం చేస్తారా? దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల తప్పిదాలవల్లే లక్షల మంది చనిపోయింది నిజం కాదా? 2009లో తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవడంతోనే 1,400 మంది యువకులు బలిదానమైంది నిజం కాదా?' అని రేవంత్‌ రెడ్డిపై బండి సంజయ్‌ తెలిపారు.

Also Read: Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం

'మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై బీజేపీకి క్రెడిట్ వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు. నిన్న రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడుకునే ఈ కుట్రలకు తెరదీశారు. తెలంగాణ ప్రజలెవరూ మోసపోవద్దని కోరుతున్నా' అని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ బీజేపీయే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అంటూ తూలనాడిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీ చేసిన నీచమైన పనులతో ఆనాడు వెయ్యి మందికిపైగా తెలంగాణ యువకులు చనిపోయారని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందనే భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలకు తెరదీశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. 'బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలతో వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానం చేశారని చెబుతూ దేశ విభజన అంశాన్ని ప్రస్తావించారే తప్ప ఆయన  తెలంగాణను అవమానించలేదు' అని వివరించారు. 

'తెలంగాణపై పిల్లిమొగ్గలు వేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రకటనలతో 1,400 మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసింది నిజం కాదా? కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారు?' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి సోనియాగాంధీని బలిదేవత అనలేదా? సోనియాగాంధీ చేసిన నీచమైన పనులతో తెలంగాణలో వందల మంది చనిపోయారని అనలేదా?' అని నిలదీశారు.

'భారతదేశ చరిత్రలో గుర్తుండుపోయే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదం పొందబోతున్న ఈ అద్బుత ఘడియలను దేశ ప్రజలంతా ఆస్వాదిస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారు. రేవంత్ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇచ్చింది నిజం కాదా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన సెక్రటేరియట్, కలెక్టరేట్

Hyderabad, Telangana:

52 Percent Fitment PRC: '52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలి. హెల్త్ స్కీం అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి' అంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని కోరారు. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు.

Also Read: Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ పరిపాలనా కేంద్రం సచివాలయంతోపాటు హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగులు భారీ ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల మహా ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో నల్ల రిబ్బన్లతో నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన ప్రదర్శన చేశారు.

Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో..
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అబిడ్స్‌లోని భీమా భవన్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరమణ సమయంలో నిరసన ప్రదర్శనకు దిగారు. 52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని జేఏసీ చైర్మన్ మారం జగదీష్ డిమాండ్ చేశారు. 'ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ను తక్షణమే అమలు చేస్తూ , హెల్త్ కార్డులను విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే విడుదల చేయాలి. సెంట్రల్ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాతన పింఛన్‌ పథకం పునరుద్ధరించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లపై జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో , హక్కులను సాధించుకుంటాం' అని జేఏసీ చైర్మన్‌ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు.

Also Read: MI vs PBKS: చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ పోరాటాలు కొనసాగుతాయని తెలంగాణ ఉద్యోగ , ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నాంపల్లిలోని హైదరాబాద్ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్స్‌కు నగదు రహిత చికిత్స, సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్‌ను అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు డీఏల విడుదల తదితర సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్, 61 ఏళ్లు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగులు కల్పించాలని కోరారు. జూన్ 2వ తేదీ వరకు పీఆర్సీ అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Thorium Reserves In India: బంగారం కంటే విలువైన లోహం..భారత్‌లోనే కోట్ల విలువ చేసే భారీ నిల్వలు.."మనల్ని ఎవడ్రా ఆపేది"?!

Vijayawada, Andhra Pradesh:

Largest Thorium Reserves In The World: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ సంక్షోభం నెలకొన్న వేళ.. అనేక దేశాల తమ ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణుబాంబుల తయారీపై దృష్టి సారిస్తున్నారు. ఈ బాంబుల తయారీలో థోరియం కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా బంగారం, ఇనుము వంటి లోహాల మాదిరిగా భూమిలోనే లభిస్తోంది. అయితే ఆ థోరియం నిల్వలు అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. 

ఇది భారత ప్రజలకు ఎంతో గర్వకారణంగా ఈ గనులు నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అణుశక్తి రంగంలో భారత్‌లో ఒక పెద్ద ముందడుగు వేసింది. తాజాగా స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లో చైన్ రియాక్షన్ ప్రారంభంతో భారత్‌లోని థోరియం నిల్వలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఘనత పట్ల భారతదేశ అణు శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోతున్నారు. 

ప్రపంచ అణు సంఘం నివేదిక ప్రకారం.. భారతదేశం వద్ద 8,46,000 టన్నుల థోరియం నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం థోరియం నిల్వల్లో నాలుగో వంతు భారతదేశం వద్దే ఉండడం విశేషంగా భావిస్తున్నారు.

ఈ క్రమంలో థోరియం నిల్వల్లో ఉన్న ఆ తర్వాతి స్థానాల్లో 6,32,000 టన్నుల నిల్వలతో బ్రెజిల్ రెండవ స్థానంలో.. 595,000 టన్నుల నిల్వలతో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ వద్ద కూడా దాదాపు ఆస్ట్రేలియాకు సమానమైన థోరియం ఉంది. రష్యా వద్ద 155,000 టన్నులు, చైనా వద్ద సుమారు 100,000 టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం ఏడు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు యురేనియం ఆధారిత రియాక్టర్ల ద్వారా శక్తిని పొందుతాయి. వీటిలో అతిపెద్దది తమిళనాడులోని కుడంకుళం, దీని స్థాపిత సామర్థ్యం 2,000 మెగావాట్లుగా ఉంది. పాత కేంద్రాలలో గుజరాత్‌లోని కాక్రాపర్, రాజస్థాన్‌లోని రావత్‌భట, మహారాష్ట్రలోని తారాపూర్, కర్ణాటకలోని కైగా వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటికీ కలిపి మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారుగా 8.8 గిగావాట్లు అని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచ మొత్తం నిల్వలతో పోలిస్తే భారతదేశంలో కేవలం 1 నుండి 2 శాతం యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల, భారతదేశానికి యురేనియం కంటే థోరియం ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (PHWRలు) యురేనియంను ఇంధనంగా వాడతాయి. ఇది విద్యుత్తును, ప్లూటోనియంను ఉత్పత్తి చేస్తుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు రెండవ దశలో ప్లూటోనియంను ఇంధనంగా వాడతాయి, ఇది విద్యుత్తుతో పాటు యురేనియం-233ను కూడా ఉత్పత్తి చేస్తుంది. మూడవ దశలో థోరియం-యురేనియం-233 ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఇది విద్యుత్తుతో పాటు యురేనియం-233ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో టన్నుల కొద్దీ థోరియం నిల్వలు ఉన్నందున, ఇది వందల సంవత్సరాల పాటు దేశం మొత్తానికి విద్యుత్తును అందించగలదు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా సమాచారం కోసం పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వెబ్‌సైట్‌ను సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Maharashtra Exploitation: 350 అశ్లీల వీడియోలు..180 మంది మైనర్ బాలికలతో శృంగారం..కేటుగాడు అరెస్టు!

Also Read: GT Vs KKR Match Preview: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్..గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడితే అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hyderabad: మాల్టా ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల భారీ స్కామ్.. నిరుద్యోగులే లక్ష్యంగా నకిలీ ముఠా!

Hyderabad, Telangana:

Backdoor Entry Scam Latest News: విదేశీ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి.. వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక భారీ నెట్వర్క్ గుట్టును పోలీస్ అధికారులు రట్టు చేశారు.. మాల్టా దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా గ్యారెంటీ జాబ్స్ ఆశ చూపి.. సుమారు 100 మంది యువకుల నుంచి 5 కోట్ల రూపాయల వరకు దోచుకున్న వైనం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.. ఇంత పెద్ద స్కాం వెనుక ఎవరున్నారు? యువత వారి ట్రాప్ లో చిక్కుకోవడానికి కారణాలు ఏంటో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సికింద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ముఠా.. విదేశాలకు వెళ్లాలని ఆశతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుంది. నమ్మకం కలిగించేందుకు నిందితులు నకిలీ ఆఫర్ లెటర్లతో పాటు వీసా పత్రాలను సృష్టించారు.. ఒక్కొక్కరి నుంచి దాదాపు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లు కాలయాపన చేసి.. చివరకు నకిలీ పత్రాలు చేతిలో పెట్టడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు.

ఈ మోసంపై కరీంనగర్, ఖానాపూర్‌తో పాటు హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మోసం విలువ కోట్లలో ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పోలీసులు ఈ కేసులు అన్నిటిని కలిపి ఒక తీవ్రమైన కేసుగా పరిగణించి దీనిని తదుపరి విచారణ నిమిత్తం సిఐడి కి వదిలి చేశారు. దీనివల్ల బాధితులు అందరికీ త్వరగా న్యాయం చేకూరే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

సిఐడి అధికారులు మెరుపు దాడులు నిర్వహించి ఈ ముఠాకు చెందిన దాదాపు ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కీలక పత్రాలతో పాటు పలు ల్యాప్టాప్ లు, మొబైల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను అధికారులు వెంటనే ఫ్రీజ్ కూడా చేశారు. ఈ దోపిడీలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందని కోణంలో విచారణ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. తక్కువ సమయంలో బ్యాక్ డోర్ మార్గాల్లో విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని నమ్మవద్దు.. ఏదైనా ఏజెన్సీ ఆశ్రయించే ముందు దానిని తప్పకుండా రెండు మూడు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వెళ్లడం మంచిది.

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Tirupati Trains: కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ భక్తుల కోసం తిరుపతి రైళ్లు రెడీ!

Karimnagar, Telangana:

Karimnagar To Tirupati Trains Telugu News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే భారీ ఊరటనిచ్చింది.. కరీంనగర్ మీదుగా తిరుమలకు వెళ్లే రైళ్ల సంఖ్య పెంచుతూ.. కీలకమైన రైళ్లను క్రమబద్ధీకరిస్తూ రైల్వే శాఖ ఒక అద్భుతమైన కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి వరుసగా నాలుగు రోజులపాటు కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భక్తుల రాక విపరీతంగా పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో తిరుపతికి వెళ్లాలంటే సికింద్రాబాద్ వెళ్లడం లేదా పరిమితంగా ఉన్న రైళ్లపై ఆధారపడాల్సి వచ్చేది.. కానీ తాజాగా దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంతో ప్రయాణం మరింత సులభతరం కాబోతోంది. గురువారంతో పాటు ఆదివారాలు.. కరీంనగర్ నుంచి తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యధావిధిగా నడుస్తుంది. ఇక శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరం వరకు వెళ్లే ఎక్స్ప్రెస్‌ను రైల్వే శాఖ రెగ్యులర్ చేసింది. ఇది కరీంనగర్ మీదిగా వెళ్తుంది.. శనివారం నాందేడ్ నుంచి తిరుచానూరు వెళ్లే ఎక్స్ప్రెస్ కూడా క్రమబద్దీకరించినట్లు తెలుస్తోంది. ఈ రైలు శనివారం అందుబాటులో ఉండబోతుంది. 

నాలుగు రైళ్లు అందుబాటులోకి రావడం వల్ల.. వారాంతంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ఉద్యోగులతో పాటు కుటుంబాలకు గొప్ప అవకాశం లభించబోతోంది. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన స్టేషన్లో మీదుగా వెళుతూ భక్తులకు సౌకర్యంగా మారబోతున్నాయి. ఈ రైళ్లు ప్రధానంగా కోరుట్లతో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఆగబోతున్నాయి.. దీంతో ఈ పట్టణాలకు ఆనుకొని ఉన్న పరిసరాల గ్రామాల నుంచి తిరుమల వెళ్లే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది..

రైళ్ల క్రమబద్ధీకరణ పట్ల స్థానిక ప్రయాణికులతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాందేడ్ నుంచి వచ్చే రైలు కరీంనగర్ మీదుగా వెళ్లడంతో పాటు వాటిని రెగ్యులర్ సర్వీసులుగా మార్చడం వల్ల రిజర్వేషన్లు సులభంగా దొరికే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బస్సుల్లో ప్రయాణించే వారికి అధిక చార్జీలు తప్పుతాయని.. తక్కువ ఖర్చుతోనే క్షేమంగా తిరుమల చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల.. కొన్ని రిజర్వేషన్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది..

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం

Hyderabad, Telangana:

Shastripuram Flyover: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌ నగరానికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం వస్తుండడంతో ఇక్కడ రోజురోజుకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. రద్దీ పెరుగుతున్న రోడ్డు సదుపాయాలు మెరుగుకాకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఆ ట్రాఫిక్‌ సమస్యకు కొంత ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా పాతబస్తీలో వాహనదారులకు చాలా రిలీఫ్‌ రానుంది. అక్కడ శాస్త్రీపురంలో కీలకమైన ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన ఆ ఫ్లైఓవర్‌ తాజాగా ప్రారంభమైంది.

Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

గత కేసీఆర్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 30కి పైగా ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు అందుబాటులోకి రాగా.. గత ప్రభుత్వంలో నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. పాతబస్తీలోని మైలార్‌దేవ్‌పల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ.71 కోట్లతో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)ని శుక్రవారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

ఫ్లైఓవర్‌ విశేషాలు
వ్యయం రూ.71 కోట్లు
ఎక్కడ: మైలార్‌దేవ్‌పల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి
పొడవు: 490 మీటర్లు, 4 లేన్లు

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

తీరనున్న కష్టాలు
పాతబస్తీలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వట్టేపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ సిగ్నల్స్ ఇబ్బందులు తప్పనున్నాయి. శాస్త్రీపురం ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో మైలార్‌దేవ్‌పల్లి, ఫలక్‌నుమా ఆర్టీసీ డిపో మార్గంలో వాహనదారుల ప్రయాణం సుగమం కానుంది. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో కనీసం 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. వేగంగా వాహనాలు ప్రయాణించడమే కాకుండా రైల్వే బ్రిడ్జి రావడంతో ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. అభివృద్ధికి దూరంగా ఉన్న పాతబస్తీలో వరుసగా ఫ్లైఓవర్లు పడుతుండడంతో ఇక్కడి ప్రజలకు రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగవుతోంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ఊరట లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

GT Vs KKR Match Preview: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్..గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడితే అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

Hyderabad, Telangana:

GT Vs KKR Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇప్పటికే టేబుల్ చివరి స్థానంలో ఉన్న కేకేఆర్ జట్టు ఈ మ్యాచ్‌తో అయినా గెలుపు ఖాయం చేసుకోవాలని చూస్తోంది. లీగ్ ఇప్పటికే సగం చేరుకునే ముందు కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకంగా మారింది. ఒకవేళ ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఓడితే.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఐపీఎల్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు రెండింటిలో గెలిచి రెండింటిలో ఓడింది. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా విజయం (ఒక మ్యాచ్ డ్రా) సాధించకపోవడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపు కోల్‌కతాకు అత్యవసరం. అజింక్య రహానే కెప్టెన్సీలోని KKR ఈ సీజన్‌లో పేలవమైన ఫామ్‌తో సతమతమవుతోంది. ఐదు మ్యాచ్‌ల నుండి కేవలం ఒక పాయింట్ మాత్రమే సాధించిన ఈ జట్టు ఇంకా సరైన సమతుల్యతను సాధించలేదు. ముఖ్యంగా, ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్ వంటి ఖరీదైన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

అదే విధంగా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాటర్లు రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్‌ల బ్యాట్లు విఫలమవడం కూడా జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయోగం బ్యాటింగ్ ఆర్డర్‌లో గందరగోళాన్ని సృష్టించగా, జట్టు పరాజయానికి రహానే కూడా మరో కారణంగా నిలిచాడని కేకేఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. కేకేఆర్ బౌలింగ్ విభాగం మెరుగుపడుతోంది. సునీల్ నరైన్ తన పాత ఫామ్‌లోకి తిరిగి రాగా, యువ బౌలర్లు వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అయితే, జట్టు ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నేటి మ్యాచ్‌లో మ్యాజిక్ చేస్తాడని ఆశిస్తున్నారు. 

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా గత మ్యాచ్‌లతో విజయాలను అందుకొని..తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వరుసలో మూడో గెలుపును ఖాతాలో వేసుకోవాలని గిల్ సేన సిద్ధమవుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో నిలకడను కొనసాగిస్తుండగా.. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫామ్‌లోకి తిరిగి రావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలింగ్‌ లైనప్‌లో ప్రసిద్ధ్ కృష్ణ పేస్, రషీద్ ఖాన్ స్పిన్ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ. (ఇంపాక్ట్ ప్లేయర్: మహ్మద్ సిరాజ్)

కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టు అంచనా..
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలన్/టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్, అనుదు రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి. (ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా).

Also Read: Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!

Also Read: Dhoni Re-Entry Match: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 'తలా' దూరం! రీఎంట్రీ మ్యాచ్ ఫిక్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top