Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Yadadri Bhuvanagiri508277

కోతుల భయంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

Nov 18, 2024 02:42:23
Mothkur, Telangana
మోత్కూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజల బెంబేలెత్తిపోతున్నారు. కోతులు గుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. బయటికి వెళ్లాలంటే కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 14, 2026 11:54:36
Rajasthan:

LPG Cylinder Shortage: ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం వేళ దేశీయంగా వంటగ్యాస్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ లోడ్ వెళ్తున్న మినీలారీ బోల్తా కొట్టింది. జైపూర్ నుంచి అజ్మేర్ వైపు వెళ్తున్న నేషనల్ హైవే-48పై గ్యాస్ లారీ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అయితే గ్యాస్ సిలిండర్లు పడిన వెంటనే ఏం జరిగింది? దీని వెనుక కారణం ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

రాజస్థాన్‌ లోని కిషన్‌గఢ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది.  జైపూర్ నుంచి అజ్మేర్ నేషనల్ హైవే-48పై గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి పల్టీలు కొట్టింది. కిషన్‌గఢ్ టోల్ సమీపంలోని చిడియా బావడి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడున్న స్థానిక ప్రజలు అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు.. జాతీయ రహదారి-48పై వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా టైర్ పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ బోల్తా కొట్టిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. లారీ బోల్తా కొట్టడం వల్ల అందులోని గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే అవి పేలుతాయేమో అని స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. అయితే ఈ ఘనటలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. 

అయితే లారీ డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే డ్రైవర్‌ను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడిన కారణంగా అవి పేలుతాయనే భావనతో రోడ్లపై వాహానాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను చెల్లాచెదురుగా పడిన వాటిని సేకరించడంలో స్థానికులు సహాయం చేశారు. అయితే సిలిండర్లన్నింటిన హైవే పక్కనే ఉన్న సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి.. వాటిలో లీకు జరిగిందా లేదా అని చెక్ చేశారు. అయితే వాటిలో ఎలాంటి లీకేజీ లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read: Train Fight Viral Video: చెప్పు చూపించిందని ఆంటీని చావగొట్టిన యువకుడు..రైల్లో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్నారు!

Also Read: Airtel 365 Days Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్..రోజుకు కేవలం రూ.6 లకే అపరిమత కాలింగ్, ఉచిత ఇంటర్నెట్..ఎన్నో బెనిఫిట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

114
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 11:20:21
Chitradurga, Karnataka:

Govt Teacher Swallows Snake Poison: తల్లిదండ్రుల తర్వాత గురువుకు భారతదేశంలో విశేష ప్రాధాన్యం ఉంది. గురువును దేవుడిగా కొలుస్తారు. తరగతి గదిలో బోధన చేసి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే ఉపాధ్యాయుడు.. ఓ స్కూల్‌లో ప్రాణదాతగా మారాడు. పాపకు పునర్జన్మ ఇచ్చి నిజంగా దేవుడిగా మారాడు. పాఠశాలలో ఓ విద్యార్థినికి పాము కాటు వేయగా.. ఆ పాపను రక్షించేందుకు టీచర్‌ ప్రథమ చికిత్సలో భాగంగా పాము విషాన్ని తన నోటితో తీశాడు. విషం తీసి పాప ప్రాణం రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకాలో హుణసేకట్టే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్న రవిశంకర్ విద్యార్థులకు చక్కటి విద్యాభ్యాసం చేస్తూ పిల్లలకు ఇష్టమైన టీచర్‌గా మారాడు. ఒక రోజు పాఠశాలలో ఉండగా ఓ నాగుపాము ప్రవేశించింది. మధ్యాహ్న భోజన సమయంలో పాము సంచరించడంతో విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని సృష్టి మాబ్‌ను నాగుపాము కరిచింది. పాము కరవడంతో బాలిక విలవిలాడిపోయింది. నొప్పితో బాధపడుతూ రోదించింది.

సృష్టి మాబ్‌ ఏడుస్తుండగా.. తోటి విద్యార్థులు గుమిగూడారు. ఏం జరిగిందా? అని ఉపాధ్యాయుడు రవిశంకర్ హుటాహుటినా అక్కడకు వెళ్లాడు. బాలిక ఏడుపు చూసి ఓదార్చాడు. అయితే బాలిక కాలును చూడగా పాము కాటు వేసినట్టు రెండు చుక్కలు ఉన్నాయి. పాము కాటుతో విలవిలలాడుతున్న బాలికను ఓదార్చిన టీచర్‌ రవిశంకర్‌ వెంటనే కాలిని నోటితో కొరికాడు. పాము కాటు వేసిన చోట నోటితో పీల్చుతూ విషాన్ని బయట ఉమ్మాడు. ఇలా పలుమార్లు చేసిన అనంతరం వెంటనే తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి ఆస్పత్రికి తరలించారు.

పాముకాటుకు గురయిన బాలిక బసవేశ్వర ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ప్రాణాపాయం తప్పింది. విషం పీల్చిన ఉపాధ్యాయుడు రవిశంకర్‌ జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ముందస్తు జాగ్రత్తగా ఆయన ఆస్పత్రిలో చేరగా ఆయన కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. విద్యార్థిని కోసం పాము మింగిన వార్త వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా చూసేయండి. అతడిని చూసి చాలా మంది అలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు. పాము కాటు వేసిన సమయంలో భయాందోళన చెందకుండా కాటు వేసిన ప్రాంతాన్ని కొరికి అందులోని విషాన్ని నోటితో తీస్తే బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడుతారు.

85
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 14, 2026 10:39:00
Raichur, Karnataka:

Snake And Frog Dance: వేసవికాలం కావడంతో వేడిమి తట్టుకోలేక ఆరు బయట నిద్రించడం సాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరు బయట నిద్రిస్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దొంగల భయంతోపాటు క్రిమీ కీటకాలు, పాములతో జాగ్రత్తగా ఉండాలి. అలా ఆరు బయట ఓ పెద్దావిడ నిద్రించగా పాము వచ్చేసింది. అయితే ఆ పాము కప్పను తరుముకుంటూ రాగా.. అక్కడ నిద్రిస్తున్న అవ్వపై ఆ రెండు వెళ్లాయి. ఏం జరిగిందో తెలియక ఉలిక్కిపడి లేచిన అవ్వ వెంటనే ఇంట్లోకి పరుగెత్తింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Richest MLAs: భారతదేశ రిచ్చెస్ట్ టాప్ 10 ఎమ్మెల్యేలు వీరే!.. వీరిలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లాలో జరిగింది. మార్చి 8వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండాకాలం వేడిమి తట్టుకోలేక ఓ అవ్వ ఇంటి బయట నిద్రపోయింది. అయితే అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా పాము దూసుకొచ్చింది. ఆ పాము కప్పను వేటాడుతూ వచ్చింది. ఆ కప్ప అవ్వ పరుచుకున్న చాపపై వచ్చేయగా.. కప్పను పట్టుకునే క్రమంలో పాము అవ్వపై పడింది. పాము, కప్ప పోట్లాడుకుంటుండడంతో ఆమె దుప్పట్లు చెల్లాచెదురయ్యాయి. అలజడి కలగడంతో అవ్వ వెంటనే లేచి చూసింది. పాము, కప్ప కొట్టుకుంటుండడంతో ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు.

Also Read: Harish Rao: గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు సూటిగా 8 ప్రశ్నలు

పాము, కప్పను వెళ్లగొట్టేందుకు చీపురు కట్ట పట్టుకుని వచ్చింది. పామును వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. అవి దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఇంట్లోకి వెళ్లింది. అయితే అంతకుముందు పాము తనను కరిచేందేమోనని ఒకసారి రెండు సార్లు పరిశీలించింది. పాము వచ్చిందని తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులు బయటకు వచ్చి చూడగా అప్పటికే పాము, కప్ప జారుకున్నాయి. అయితే ఇంట్లోకి వెళ్లిన బాధితురాలు లబోదిబోమని ఏడ్చారు. ఆ రాత్రి ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే బాధితురాలి పేరు ఎల్లమ్మ అని తెలిసింది.

Also Read: SVSN Varma: పవన్ కల్యాణ్ ఫొటోపై దుమారం.. మళ్లీ అలిగిన పిఠాపురం వర్మ

విషం మింగిన గురువు
కర్ణాటకలోని చిత్రదుర్గ తాలూకా హుణసేకట్టే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలికను నాగుపాము కాటేయగా విలవిలలాడింది. బాలిక ఏడుపును విని పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్‌ తరలివచ్చి చూశాడు. బాలికను పాము కాటేయడంతో కాటు వేసిన ప్రాంతాన్ని కొరికి విషాన్ని పీల్చి ఉమ్మివేశాడు. చివరకు హుటాహుటినా ఆస్పత్రికి తరలించడంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

173
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 10:26:38
Hyderabad, Telangana:

Airtel Cheapest 365 Days Plan: నెలనెలా పెరిగిపోతున్న రీఛార్జ్ ప్లాన్స్ చూసి విసిగిపోయారా? మీరు ఎయిర్‌టెల్ సిమ్ వినియోగదారులు అయితే మీకో గుడ్‌న్యూస్‌ ఉంది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్స్‌ను ప్రవేశపెట్టింది. రోజుకు కేవలం 6 రూపాయలకే ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిడెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు రానున్నాయి. 

365 రోజులు (ఒక సంవత్సరం కాలం) వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను కస్టమర్ల ముందుకు తెచ్చింది. అయితే ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం రూ.2,500 కంటే తక్కువ ధరకే లభిస్తుండడం గమనార్హం. ఎయిర్‌టెల్ ఏడాది చెల్లుబాటుతో అందిస్తున్న రెండు రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  వీటిలో అన్‌లిమిటెడ్ కాల్స్, అన్‌లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్‌లు అందజేయనున్నారు. అయితే కస్టమర్లకు రోజుకు 6 రూపాయలకే అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.2,249 రీఛార్జ్ ప్లాన్..
ఎయిర్‌టెల్ సంస్థ ప్రవేశపెట్టిన అతితక్కువ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో రూ.2,249 ఒకటి. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, ఏడాది పొడవునా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్‌లిమిటెడ్ డేటా, ఎస్ఎంఎస్‌లు వస్తాయి.  

అయితే ఈ ప్లాన్ కొనుగోలు చేసిన అదనంగా మరో 30GB హై-స్పీడ్ డేటాను అందివ్వనున్నారు. ఈ డేటా ఏడాది పొడవునా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం 3,600 SMSలను కూడా అందిస్తుంది. ఈ లెక్కన ఈ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా రోజుకు రూ.6 ఖర్చుతో ఈ రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు. 

ఈ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలు..
ఈ ఏడాది ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అదనపు డిజిటల్ ప్రయోజనాలు కూడా అందుతాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా ఉచితంగా పొందుతారు. ఇందులో అనేక రకాల ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్‌లో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందుతోంది. అయితే ఇది విడిగా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే రూ.4,000 ఖర్చు అవుతుంది. ఇది ఈ కస్టమర్లు ఫొటో ఎడిటింగ్, డిజైనింగ్ వంటి వర్క్‌ను ఈజీగా చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. 

వార్షిక ప్లాన్ రూ.1849 ధరకే..
ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన మరో వార్షిక ప్లాన్ రూ.1849 ధరకే అందుబాటులో ఉంది. ఇది రూ.2,249 ప్లాన్ కంటే ఎంతో చౌకగా ఉంటుంది. ఇది కూడా ఏడాది పొడవునా అంటే 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు వస్తాయి. అయితే ఇందులో అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో రాదు. ఇది కేవలం అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

Also Read: Train Fight Viral Video: చెప్పు చూపించిందని ఆంటీని చావగొట్టిన యువకుడు..రైల్లో సీటు కోసం పొట్టుపొట్టు తన్నుకున్నారు!

Also Read: Plants To Avoid In Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి.. డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

199
comment0
Report
IPInamdar Paresh
Mar 14, 2026 09:55:06
Hyderabad, Telangana:

Pet cats eats died elderly woman flesh in mancherial: సమాజంలో మానవ సంబందాలు మొత్తం కనుమరుగైపోయి. కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉన్నాయి. డబ్బులు ఉంటేనే ఎవరితోనైన మాటలు మాట్లాడతారు. ఒకవేళ డబ్బులు లేకుండా మన వాళ్లు కూడా పరాయి వాళ్లే అవుతారు . కొన్నిచోట్ల తమ పిల్లలు సైతం కన్నవాళ్లను ఆస్తులు పంచేవరకు బాగాఉండి ఆ తర్వాత తమ అసలు రంగును బైటపెడుతున్నారు. తమ వాళ్లను అనాథలుగా వదిలేస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  మంచిర్యాలలో  అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. 
 
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్ సింగ్ నగర్ కు  చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) సింగిల్ గా ఉంటుంది. ఆమె తన బిడ్డలకు అందరికి ఆస్తులు రాసిచ్చింది. ఇంకా ఆమెను అందరు  దూరం పెట్టారు . కానీ చిన్న కొడుకు సమేందర్ మాత్రం తల్లిని తన  వద్ద ఉంచుకున్నాడు.  అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.

ఇటీవల రాత్రి పూట ఇంట్లో నుంచి ఎలాంటి  అలికిడి రాకపోవడంతో అనుమానంతో కిటిలో నుంచి చూశారు.ఆమె అపస్మారకంగా పడిపోయి ఉంది. వెంటనే కొడుకుకు సమాచారం ఇచ్చారు.  అతను వచ్చిచూడగా ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమె గడప తగిలి కింద పడిపోయినట్లు గుర్తించారు. ఆమె ఇంట్లో రెండు పిల్లుల్ని పెంచుకునేది.

Read more: Video Viral: ద్యావుడా.. సిలిండర్ సాధించిన భర్తకు ఆరతితో గ్రాండ్ వెల్ కమ్.. ఫన్నీ వీడియో వైరల్..

ఆమె చేతి మాంసంను రెండు పిల్లులు పీక్కుతిన్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. దీనిపై పోలీసులు ఘటన ప్రదేశంకు చేరి విచారణ చేపట్టారు.  కిందపడిపోయి గాయంతో ఆమె చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా తెల్చారు.ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

142
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 09:32:54
Hyderabad, Telangana:

Train Fight Viral Video News: భారత రైళ్లలో జనరల్ బోగీలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే చాలా సార్లు సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు సహజంగా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ ఆంటీ చెప్పు చూపించిందని ఓ యువకుడు ఆమెను చావకొట్టాడు. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ సంఘటన గుర్తుతెలియని రైలులోని ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో జరిగింది. సీటు విషయంలో ఓ వ్యక్తితో మరో మహిళకు మధ్య జరిగిన వాగ్వాదం ఇది. అది మొదట్లో వాగ్వాదంగా ఉన్నా.. ఆ తర్వాత తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ వీడియోలో ఓ మహిళ యువకుడ్ని అవమానిస్తూ, చెప్పు చూపిస్తూ బెదిరించడం మొదలుపెట్టింది. ఆ యువకుడు తొలుత ఎంతో ప్రశాంతంగా మాట్లాడాడు. 

సీటు విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువకుడు ఎన్నోసార్లు చెప్పు కిందికి దించి మాట్లాడండి అని చెప్పినా.. ఆమె వినకుండా రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లింది. ఎంతో సమయమనంతో అతడు మరో సీటుకు వెళ్లి కూర్చున్నా.. ఆ చెప్పుతో మహిళ మరింత బెదిరింపులకు దిగింది. ఆ వెంటనే ఉన్న ఓ మహిళతో కూడా ఆమె వాగ్వాదినికి దిగింది. ఆ మహిళ "నా కొడుకు ఇంజనీర్, నా భర్త సూపర్‌వైజర్" అని చెప్పడం మీరు వినవచ్చు. 

అయితే ఆమె ఆ యువకుడి బంధువో లేదా భార్యో తెలియడంలేదు. కానీ, సీన్‌లోకి ఆ మహిళపై వాగ్వాదానికి రాగానే.. చెప్పు చూపిన ఆంటీపై యువకుడు దూసుకొచ్చాడు. ముఖంపై గ్యాప్ లేకుండా చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నాడు. ఆమె బెదిరింపులకు తాళలేకపోయిన ఆ వ్యక్తి దాడి చేసినట్లు చెబుతున్నాడు. 

ఆంటీపై తీవ్రంగా దాడి చేసిన యువకుడ్ని వారించేందుకు ప్రయాణికులు ఎంతో ప్రయత్నించారు. అయితే మహిళను కొట్టడం మంచి పద్ధతి కాదంటూ కొందరు అంటుంటే.. ఆమె చేసిన వ్యాఖ్యలకు తగిన శాస్తి జరిగిందని కొందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Plants To Avoid In Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి.. డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పదు!

Also Read: CSK Jailer Jersey: చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో షాక్..ఐపీఎల్ టీమ్‌పై కేసు పెట్టిన 'జైలర్' నిర్మాత..రూ.కోటి పరిహారం కోసం డిమాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

175
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 08:09:34
Hyderabad, Telangana:

Vastu Shastra Plants To Avoid: జ్యోతిషశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రకాల మొక్కలను ఇంట్లోకి అస్సలు రానివ్వకూడదట. వాటిని పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు పెరగడమే కాకుండా కష్టాలు వస్తాయట. ఇంతకీ ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చింతకాయల చెట్టు 
వాస్తు శాస్త్రం చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇంటి ప్రాంగణంలో ప్రధాన ద్వారం వద్ద చింత చెట్టు ఉంటే అది ఇంటికి చేటు, ఎంతో అశుభమని అంటున్నారు. ఈ చెట్టు ఉండడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందట. అంతే కాకుండా ఇది ఇంటి సభ్యులను అనారోగ్యానికి గురిచేస్తుంది.

మర్రి చెట్టు
వాస్తు శాస్త్రం చెప్పినట్లు ఇంట్లో మర్రి చెట్టు ఉండటం అస్సలు మంచిది కాదు. దీన్ని పెంచడం వల్ల అనేక దోషాలు ఇంటిని చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు. మర్రిచెట్టును పెంచడం వల్ల ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని జోతిష్య్కులు చెబుతున్నారు. ఇంట్లో మర్రిచెట్టును పెంచడం ముమ్మాటికి అశుభమే అని అంటున్నారు. 

జిల్లెడు చెట్టు 
ఇంట్లో జిల్లెడు చెట్టు పెంచడం అశుభం. అంతేకాకుండా మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయట. అందుకే ఈ మొక్కను ఇళ్లలో పెంచకూడదు. 

నల్లతుమ్మ చెట్టు 
ఇంటి ముందు లేదా లోపల నల్లతుమ్మ చెట్టు ఉంటే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక తగాదాలు ఉంటూనే ఉంటాయట. అనవసరమైన వాదనలు, ఆర్థిక సమస్యలను చుట్టుముడతాయట. కుటుంబసభ్యుల మధ్య పొతపత్యాలు వంటి అనేక సమస్యలు వస్తాయట. 

కాక్టస్ (బ్రహ్మ జెముడు, నాగజెముడు) 
ఇంట్లో కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు ఉండటం ఎంతో అశుభం. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులలో ఉద్రిక్తత, ఒత్తిడి వంటి సమస్యలను కలిగిస్తాయి. అలాగే అవి జీవితంలో అడ్డంకులను తెచ్చిపెట్టి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.  

ALso Read: Salman Ali Agha Run Out: అండగా నిలిచిన పాకిస్థాన్‌ను దెబ్బకొట్టిన బంగ్లాదేశ్..రెండో వన్డేలో పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

Also Read: Sadhvi Prachi Monalisa: "మోనాలిసా 35 ముక్కలుగా మారిపోతుంది..జాగ్రత్త!" 'లవ్ జిహాద్' పై సాధ్వీ ప్రాచీ కీలక వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

97
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 08:07:20
Hyderabad, Telangana:

Kodada Oil Mafia Exposed: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం కల్తీ మాఫియా కు అడ్డాగా మారుతూ వస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి నగరాలకు వెళ్లే వంటనూనె ట్యాంకర్లే లక్ష్యంగా ఇక్కడ భారీ ఎత్తున కల్తీ వ్యాపారం సాగుతోంది. గుంటూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు మధ్య మార్గంలో కోదాడలో ఆగి.. అందులో అసలైన నూనెను దించి.. కల్తీ మిశ్రమాలను కలిపి తరలిస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, ఈ నూనెలను ఆయా ప్రాంతాల్లో అత్యంత తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం 

ఈ అక్రమ దండ ఎవరికి అనుమానం రాకుండా పక్క ప్లాన్‌తో కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. అర్ధరాత్రి సమయాల్లో జనసంచారం లేని ప్రదేశాల్లో ట్యాంకర్లను రహస్యంగా ఒకచోట ఉంచి.. సీల్లను తొలగించి నూనెను దొంగలిస్తున్నారు.. బయట చూస్తే అచ్చం పామ్ ఆయిల్ లాగే కనిపించే.. ఒక ద్రవాన్ని వివిధ రకాల రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలను కలిపి తిరిగి బ్యాక్ చేస్తున్నారు. ఈ నకిలీ నూనెను హైదరాబాదులోని కొంతమంది దళారుల ద్వారా మార్కెట్లోకి పంపిస్తూ అక్రమార్కులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు..

మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలకు ఈ నూనెను లభించడంతో హోటళ్లతో పాటు రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్లు, బేకరీ యజమానులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ నకిలీ నూనెలు చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి నకిలీ నూనెలో తినడం వల్ల రక్తనాళాల్లోని పూడికలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more:  Rajendra Prasad Video: ఉద్దేశపూర్వకంగా అనలేదు.!. ఎంజీఆర్ పై వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో..

కోదాడ కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతున్న.. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.. అధికారుల పర్యవేక్షణ లోపం కల్తి రాయులకు ఒక అద్భుతమైన వరంగా మారుతోందని అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న ఈ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని.. తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మున్ముందైన అధికారులు ఈ కల్తీ రాయుళ్లపై చర్యలు  తీసుకుంటారో లేదో చూడాల్సిందే..

Read more:  Rajendra Prasad Video: ఉద్దేశపూర్వకంగా అనలేదు.!. ఎంజీఆర్ పై వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

92
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 07:56:50
Hyderabad, Telangana:

Instagram Encryption Removal News: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మేటర్ తన ఇంస్టాగ్రామ్ వినియోగదారులకు ఊహించని షాకింగ్ వార్తను వెల్లడించింది. ఇంస్టాగ్రామ్ ఫ్లాట్ ఫామ్ లో చాటింగ్ కోసం అందుబాటులో ఉన్న అత్యంత కీలకమైన భద్రతా ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ను మే 8వ తేదీ నుంచి తొలగించుకున్నట్లు సమస్త తెలిపింది. ఈ నిర్ణయంతో ఇంస్టాగ్రామ్ లోని యూజర్లు ప్రైవసీకి ఊహించని స్థాయిలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెటా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరుగుంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మెసేజ్ చేసే వ్యక్తి.. దానిని చదివే వ్యక్తికి తప్ప ఇతరులకు ఆ కంటెంట్ చదివే అవకాశం అస్సలు ఉండదు. చివరికి మెటా కంపెనీకి కూడా ఈ అవకాశం లేకపోవడం విశేషం. కానీ తాజా మార్పులతో ఇకపై యూసర్లు పంపే ఫోటోలతో పాటు వీడియోలు, టెక్స్ట్ మెసేజ్లు మిఠా యాజమాన్యం పర్యవేక్షించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా కంపెనీ ఎలాంటి కారణాలు వెల్లడించ లేకపోయినప్పటికీ.. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ ఫీచర్ ని తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పిల్లల పట్ల లైంగిక దాడులతో పాటు వేధింపులు, హానికరమైన కంటెంట్ వ్యాప్తి జరుగుతుందని పలు దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అశ్లీలమైన కంటెంట్ తో పాటు వేధింపులకు గురి చేసే మెసేజ్లు ఏఐ సహాయంతో ముందుగానే గుర్తించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో నేరాలను అరికట్టేందుకు వీలుకా కంటెంట్ పర్యవేక్షణ అధికారము ఉండాలని బ్రిటన్‌తో పాటు అమెరికా వంటి దేశాలు గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ త్వరలోనే నేరాలకు సంబంధించిన చాటింగ్ చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేకమైన సిస్టం తీసుకురావడమే కాకుండా.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే టీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ఈ నిర్ణయం స్వాగతిస్తున్న.. కొంతమంది మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యక్తిగత సంభాషణలు సంస్థ పర్యవేక్షణలోకి వెళ్లడం సీక్రెట్ దెబ్బతింటుందని వారి భావిస్తున్నారు. ఇది కేవలం అనుమాదాస్పద కంటెంట్‌తో పాటు పిల్లల భద్రత కోసం మాత్రమే పరిమితం అవుతుందా? లేక అందరి డేటా పై మెటా కన్నెస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

140
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 05:34:30
Hyderabad, Telangana:

Is Netanyahu Dead Or Alive Latest News: ఇజ్రాయిల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు అసలు  ప్రాణాలతో ఉన్నారా? లేక ఆయన మృతిని ఆ దేశం సీక్రెట్‌గా ఉంచుతోందా? అసలు ఏం జరిగి ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ ప్రశ్నలను తెర లేపుతూ వస్తోంది.. సాధారణంగా ఏ చిన్న విషయంలోనైనా అత్యంత స్పష్టంగా వివరించి ఇజ్రాయిల్ ప్రధాని.. తాజాగా వీడియోలో కనిపిస్తున్న తీరు అనేక సందేహాలకు దారితీస్తుంది. ఈ వీడియో చూసిన చాలామంది భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వీడియోను స్పష్టంగా పరిశీలిస్తే.. నెతన్యాహు చేతికి సంబంధించిన వేళ్ళు అక్కడక్కడ స్పష్టంగా కనిపించలేకపోవడం.. సాధారణంగా మనిషికి ఉండే ఐదు వేలకు బదులుగా.. ఈ వీడియోలో కొన్నిచోట్ల ఆయనకు 6 వేళ్ళు కనిపించడం చర్చనీయంగా మారింది.. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్సీ రూపొందించిన డీప్ ఫేక్ వీడియోలు ఇటువంటి లోపాలు సహజంగానే కనిపిస్తుంటాయని అంటున్నారు. దీంతో ఇది అసలు నెతన్యాహు చేసిన ప్రసంగమేనా.. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన డిజిటల్ వెర్షన్ అనే చర్చ కూడా ఇప్పటికే మొదలైంది..

అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో యుద్ధ ప్రాంతాల్లో వినిపించే అత్యవసర అలర్ట్ సైరన్ కూడా స్పష్టంగా వినిపిస్తోంది.. సాధారణంగా ఇజ్రాయిల్ ప్రధాని ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే స్పందిస్తారు.. భద్రత కారణాల దృశ్య ప్రసంగాన్ని కూడా నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయి.. కానీ ఈ వీడియోలో ఆయన ఏ మాత్రం భయపడకుండా.. కనీసం కనురెప్ప వేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడం ఇప్పుడు పెద్ద చర్చనీ అంశానికి దారితీసింది. ఇది ముందే రికార్డు చేసిన వీడియో నా లేక ఎడిటింగ్ టేబుల్ పై తయారైన దృశ్యమా అనే అనుమానాలు కూడా బలపడుతున్నట్లు తెలుస్తోంది.

వీడియోలో నెతన్యాహు ఏ వీడియో ప్రతినిధితోను ఇందులో మాట్లాడలేకపోవడం విశేషం.. కేవలం కెమెరా వైపు చూస్తూనే ఏకపక్షంగా మాట్లాడుతూ సందేశాన్ని పూర్తి చేశారు. అంతర్జాతీయ మీడియాలోనూ ఆయన మృతి చెందినట్లు కథనాలు వస్తున్న తరుణంలో.. ఆయన నేరుగా ప్రజల ముందు రాకుండా ఇలాంటి అనుమానస్పద వీడియోలు విడుదల చేయడం వెనక ఏదో పెద్ద మిస్టరీ ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందనే అంశం  మున్ముందు తేలుతుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

100
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 05:12:14
Hyderabad, Telangana:

Trigraha Asthamayam 2026 Effect On Zodiac Telugu: గ్రహాల గమనాలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చెబుతాయి. ఈ క్రమంలో మార్చి నెలలో అత్యంత శక్తివంతమైన ఓ ఘటన చోటు చేసుకోబోతోంది ముఖ్యంగా  ఖగోళంలో ఎంతో శక్తివంతమైన శని బుధ అంగారకర గ్రహాలు చాలా రోజుల తర్వాత అస్తమించబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అస్తమించడం వల్ల సానుకూలమైన ప్రభావం ఏర్పడడమే కాకుండా ప్రతికూల ప్రభావం కూడా ఏర్పడుతుంది. అయితే, మూడు గ్రహాలు అస్తమించడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో త్రిగ్రహ అస్తమయంగా పిలుస్తారు.  ఈ పరిణామం వల్ల మొత్తం వాదశరాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రాబోతోంది. 

అస్తమించడం అంటే మీకు తెలుసా? 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి అతి సమీపంలోకి ఏ  గ్రహం వచ్చినా.. అది తన ప్రభావాన్ని కోల్పోయి.. అస్తమించినట్లు పరిగణిస్తారు. మార్చి 12వ తేదీన శని, బుధ, కుజ గ్రహాలు వరుసగా అస్తమించాయి. సాధారణ గ్రహాల అస్తమయం వల్ల అశుభంగా ఫలితాలు ఉన్నప్పటికీ.. కొన్ని రాశుల వారికి మాత్రం ఇది రాజయోగాన్ని తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ మూడు గ్రహాలు అస్తమించడం వల్ల ఊహించని విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా నీరు ఉద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత పనులు త్వరగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.. దీంతోపాటు ఆర్థికంగా స్థిరపడడమే కాకుండా పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో స్వల్పంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయం స్వర్ణ యుగం కంటే అద్భుతమైనదిగా భావించవచ్చు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు కూడా ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు భారీ విజయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ విద్యా యోగం కలుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సామాజికంగా గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కుంభరాశి 
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు మానసిక ఆందోళన నుంచి ఎంతో సులభంగా విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా శని అస్తమించడం వల్ల వీరికి ఏలినాటి శని ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థిరాస్తులు నుంచి కొన్ని రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు నూతన ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

164
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 16:32:56
Chennai, Tamil Nadu:

Chennai Super Kings Vs Sun TV: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. 'ది హండ్రెడ్' లీగ్ కోసం వేలంలో పాక్ ఆటగాడ్ని సన్‌రైజర్స్ లీడ్స్ (కావ్యామారన్ యజమాని) కొనుగోలు చేయడం వల్ల SRH టీమ్‌పై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో రాబోయే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి సంబంధించిన మ్యాచ్‌లను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

ఇప్పుడీ గందరగోళం నడుమ మద్రాస్ హైకోర్టు మరో ఐపీఎల్ టీమ్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. తమకు సంబంధించిన సినిమా సాంగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనుమతి లేకుండా వినియోగించిందంటూ సన్ నెట్‌వర్క్ కోర్టును ఆశ్రయించింది. రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్', 'జైలర్ 2', 'కూలీ' సినిమాలకు సంబంధించిన కొన్ని మ్యూజిక్ బిట్లను చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు వినియోగించినట్లు ఫిర్యాదులో ఆరోపించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జెర్సీ ఆవిష్కరించిన వీడియోలో సోషల్ మీడియాలో వ్యాప్తంగా ఈ మ్యూజిక్‌ను వినియోగించినట్లు కోర్టుకు సన్ నెట్‌వర్క్ విన్నవించుకుంది.

అయితే దీనిపై ప్రతిస్పందనగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున న్యాయవాది.. మార్చి 1న కాపీరైట్ ఇష్యూ చేసిన మెటీరియల్‌ను సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ తొలగించిందని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే దాన్ని అనుమతి లేకుండా వినియోగించడం వల్ల అది కాపీరైట్ యాక్ట్ కిందికి వస్తుందని సన్ టీవీ తరఫున వారు వాదించారు. భవిష్యత్తులోనూ తమకు సంబంధించిన మ్యాజిక్ ఆల్బమ్స్‌ను వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సన్ నెట్‌వర్క్ కోరింది. అయితే ప్రస్తుతం అలాంటి వాటిని తొలగించామని.. భవిష్యత్తులో అవసరమైతే ముందస్తు అనుమతి తీసుకుంటామని సీఎస్కే కోర్టుకు విన్నవించింది. 

అయితే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు వినియోగించిన వివాదాస్పదమైన మ్యూజిక్‌ను 'జైలర్', 'జైలర్ 2', 'కూలీ' సినిమాల నుంచి సేకరించింది. రజినీ కాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూడు సినిమాలను సన్‌ టీవీ నెట్‌వర్క్ యాజమాన్యం నిర్మించింది. ఈ సినిమాలుకు సంగీతాన్ని అనిరుథ్ రవిచందర్ అందించారు. అయితే ఈ మ్యూజిక్ హక్కులన్నీ ప్రస్తుతం సన్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. 

అయితే తమకు సంబంధించిన మ్యూజిక్ కాపీరైట్ ఇష్యూ జరగడం వల్ల..చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దాని వినియోగించి ఎంత మేర సంపాదించిందో సన్ నెట్‌వర్క్ వివరణ కోరింది. అందుకు నష్టపరిహారంగా రూ.కోటి పరిహారంగా ఇవ్వాలని కోర్టును కోరింది.

Also Read: Salman Ali Agha Run Out: అండగా నిలిచిన పాకిస్థాన్‌ను దెబ్బకొట్టిన బంగ్లాదేశ్..రెండో వన్డేలో పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

Also Read: IPL 2026 Postponed: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2026 వాయిదా? బీసీసీఐ నుంచి బిగ్ అప్‌డేట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

165
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 13, 2026 16:01:35
Peddadinne, Telangana:
179
comment0
Report
Advertisement
Back to top