బోయినపల్లి మండలంలో బిజెపి నేతల సమావేశం
Rudrangi, Telangana:రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచి సత్తా చాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రేగుల మళ్లీ కార్జున్ అన్నారు.రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండల బిజెపి మండల కార్యవర్గ సమావేశం ను మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Video: రోప్ జంప్లో ఇన్స్ట్రక్టర్ల ఘోర తప్పిదం.. భద్రతా తాడు కట్టకుండానే యువతిని తోసేయడంతో దుర్మరణం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Hyderabad, Telangana:Brazil Woman Dies After Thrown Without Rope Video: సాహస క్రీడలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తుల నిర్లక్ష్యం లేదా నిర్వాహకుల అజాగ్రత్త వల్ల పరిస్థితులు చేయిదాటి ప్రాణనష్టం జరుగుతోంది. రోప్ జంపింగ్ లేదా బంజి జంపింగ్ వంటి క్రీడల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రాణాంతకంగా మారుతోంది. బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం కూడా అలాగే జరిగింది. భద్రతా తాడు సరిగ్గా కట్టకపోవడంతో ఒక యువతి సుమారు 100 అడుగుల ఎత్తు నుండి పడి అక్కడికక్కడే మరణించింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బ్రెజిల్లోని లిమేరలో ఉన్న పోంటే డోస్కోలేటో ట్రైల్ వద్ద రోప్ జంపింగ్ చేయడం చాలా సాధారణం. పర్యాటకులు ఇక్కడ ఎంతో ఆసక్తిగా ఈ సాహసాలు చేస్తుంటారు. శనివారం రోజు 21 ఏళ్ల ఎడ్వర్డా అనే యువతి జంపింగ్ కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కానీ, ఆమెకు సేఫ్టీ తాడు కట్టకుండానే పైనుంచి తోసేశారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు ఆర్గనైజర్లు భయంతో అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు గాలింపు జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించినందుకు వారిని విచారిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత సంబంధిత అడ్వెంచర్ కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగిస్తోంది.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక యువతిని పైనుంచి కిందకు తోసేయడం కనిపిస్తుంది. సాధారణంగా బంజీ లేదా రోప్ జంపింగ్ చేసేటప్పుడు రక్షణ తాడు కడతారు. కానీ ఇక్కడ సిబ్బంది ఆమెకు తాడు కట్టకుండానే నిర్లక్ష్యంగా తోసేశారు. దీంతో ఆమె కిందపడి మరణించింది. దీంతో పక్కనే ఉన్న మరికొంత మంది అరుపులు కేకలు వేశారు. పోలీసుల ప్రకారం.. మృతురాలితో పాటు మరో ఇద్దరు కూడా ఆమెతో వచ్చారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించినా, పోలీసులు వారిని పట్టుకున్నారు. భద్రతా తనిఖీలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రాణనష్టాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రాకపోకలను నియంత్రించే, నిర్వహించే పూర్తి బాధ్యత మున్సిపాలిటీకి ఉందని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది.
READ ALSO: సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. హైవేపై కంట్రోల్ తప్పిన కారు, ఇంటి ముందు కూర్చున్న ముగ్గురు మహిళలు దుర్మరణం!
READ ALSO: రక్షించాల్సిన పోలీసే రాక్షసుడయ్యాడు.. హన్మకొండలో వివాహితపై ఎస్ఐ అత్యాచారం, అసలేం జరిగిందంటే?
JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/ceqniPJkUs
— Rapid Report (@RapidReport2025) June 13, 2026
సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ వీడియోలు ఎన్నో గతంలో కూడా చూశాం. రోప్ లేదా బంగీ జంప్ల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. సరైన భద్రత చర్యలు లేకపోవడంతో అమాయకులు ఎంజాయ్ చేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయి శవాలుగా వెళ్తున్నారు. టూరిస్ట్ ప్రాంతాలలో నిర్వాహకులు నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. కానీ ఏమాత్రం వ్యక్తులు కూడా ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలు కోల్పోతున్నారు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Paddy: వరిలో ఆల్టైమ్ రికార్డు.. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ
Baddipadaga, Telangana:Telangana Paddy Procurement: తెలంగాణ విభజనకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంది. విభజనకు ముందు కరువు నేల.. వలస ప్రాంతం.. గంజికి దిక్కు లేని ప్రాంతంగా తెలంగాణ గుర్తింపు పొందింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. అన్నీ రంగాల్లో అద్భుతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందుతున్న తెలంగాణ రాష్ట్రం... వ్యవసాయంలో ఆల్టైమ్ రికార్డులు నమోదు చేస్తోంది. పంటల్లో సరికొత్త రికార్డులు సాధిస్తోంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసి నంబర్వన్గా నిలిచింది.
స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ వ్యవసాయంలో అద్బుతాలు చేస్తోంది. అన్నమో రామచంద్ర అనే స్థాయి నుంచి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఈ ఏడాది కూడా తెలంగాణ వరి ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో సాధించని వరి ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరిగింది. 2025-26 సంవత్సరంలో 150 లక్షల టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో వరి కొనుగోళ్లను చకచకా పూర్తి చేసింది. వర్షాకాలం కూడా ప్రారంభమవడంతో వరి సేకరణను వేగం పెంచింది. వరి కొనుగోలు చేసిన అనంతరం రవాణా, నిల్వ, మిల్లింగ్, డబ్బుల చెల్లింపు వరకు ప్రభుత్వం ప్రతి దశలో సమన్వయంతో పనిచేసింది.
రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 150 లక్షల కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా.. దీనికి గాను రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్ల డబ్బును జమ చేసింది. 26.43 లక్షల చెల్లింపులను ప్రభుత్వం చేసింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆలస్యంగా చేయడంతో కొందరు రైతులు ప్రైవేటుగా ధాన్యం అమ్ముకున్నారు. ఆ ధాన్యం కూడా దాదాపు ఒక లక్ష టన్నులకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అంటే 152 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ ఉత్పత్తి చేసి ఉంటుంది. గతంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వరి ఉత్పత్తిలో నంబర్వన్గా ఉండగా.. ఇప్పుడు తెలంగాణ ఆ రెండు రాష్ట్రాలను వెనక్కి నెట్టేసింది.
నీరు, పెట్టుబడి సహాయం
వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రభాగంలో ఉండడానికి కారణం అనుసరించిన వ్యూహాలే. తెలంగాణ ఏర్పడిన తొలి నుంచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై దృష్టి సారించారు. వ్యవసాయ అభివృద్ధికి అన్నీ చర్యలు తీసుకున్నారు. సాగునీటి పారుదల వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ స్వరూపాన్ని మార్చేసింది. కృష్ణ, గోదావరి నీళ్లను ఒడిసిపట్టుకోవడమే కాకుండా వాన నీటిని కాపాడుకోవడంతో ఆ నీరంతా పొలాలకు మళ్లింది. దీనికితోడు వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించేలా రైతు బంధు పథకం ప్రవేశపెట్టడం తెలంగాణ వ్యవసాయ గతినే మార్చింది. బీడు బడ్డ భూములు కూడా వ్యవసాయ పొలాలుగా మారాయి. యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచడం.. నాణ్యమైన విత్తనాలు అందించడం.. వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో తెలంగాణ వ్యవసాయంలో రారాజుగా నిలుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినట్టు వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు తెలంగాణ నమోదు చేస్తుంది.
Tuni Girl Missing: తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ట్విస్ట్.. అపరిచితుడు ఎత్తుకెళ్తుంటే కుక్క అడ్డుకుందా? తండ్రి వెళ్లిన ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
Hyderabad, Telangana:What Really Happened in tuni girl missing In 15 Minutes: ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టిస్తున్న తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ, తుని అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారు. దట్టమైన అడవుల్లో కూడా వెతకడానికి అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ సిబ్బందిని తీసుకుని వెతకాలని ఆదేశించారు. ఈ గాలింపు కోసం సుమారు 400 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో, ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులు గడిచిపోతున్నందున కేసును మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఆ 15 నిమిషాల సమయమే అత్యంత కీలకం...
పాపతో పాటు అదృశ్యమైన కుక్క కూడా నిన్న చనిపోవడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఈ నెల 6వ తేదీన ఈ కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చినప్పుడు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్క పాప వద్దకు వెళ్తుందేమో అని అనుకున్నారు.. అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నిన్న ఆ కుక్క కూడా చనిపోవడంతో ఒక ఆశ కూడా పోయింది. అయితే, 6వ తేదీ ఉదయం 11:50కి భర్త పాపను భార్యకు ఇచ్చి వెళ్ళాడు. జ్ఞానేశ్వరి మరో పాపను చూస్తూ ఉండటంతో ఆ సమయంలో పాపను గమనించలేకపోయింది. తండ్రి వెళ్ళిన దారిలో ఒక వ్యక్తి పాపను చూసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా, కుక్క తనను కరవబోయిందని ఒకరు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినా పాప దొరకలేదు. మధ్యాహ్నం 12:00-12:15 లోపు పాప కనిపించకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు.
Tuni: తుని చిన్నారి ఎక్కడ?.. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా దొరకని ఆచూకీ, వీడని మిస్టరీ!
రక్షించాల్సిన పోలీసే రాక్షసుడయ్యాడు.. హన్మకొండలో వివాహితపై ఎస్ఐ అత్యాచారం, అసలేం జరిగిందంటే?
కుక్క అడ్డుకోలేదా?
ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? ఆ అపరిచితులు ఎవరు? కిడ్నాప్ చేసే ప్రయత్నంలో కుక్క అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాప కనిపించకుండా పోయిన వెంటనే వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఒక రోజు తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చితే అది కొండ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి ఇంటికే చేరుకుంటోంది. చివరకు నిన్న ఆ కుక్క చనిపోయింది. కొండ ప్రాంతాల్లో తిరగడం వల్ల దానికి అనారోగ్యం వచ్చిందా? లేక ఎవరైనా విషం పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో కేసు త్వరగా పరిష్కారం అవుతుందని అందరూ ఆశపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Earthquake: భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు..!!
Secunderabad, Telangana:Telangana Earthquake: తెలంగాణలో అర్థరాత్రి భూమి కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామును 2.26 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.8గా నమోదు అయ్యింది. భూప్రకంపనలతో జనాలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచలో ఈ భూప్రకంపనలు వచ్చాయి. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నిద్రిస్తున్న వేళ ప్రకంపనలు గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా.. ప్రకంపనలు స్పష్టంగా కనిపించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, తీవ్రత 6 కంటే ఎక్కువగా ఉండి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది.
జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గురించింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ లేదా ఆధునిక మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్పై కొలుస్తారు. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్. ప్రతి 1 పాయింట్ పెరుగుదలకు, ప్రకంపనల బలం 10 రెట్లు, శక్తి సుమారుగా 31-32 రెట్లు పెరుగుతుంది. 3.8 తీవ్రత గల భూకంపం సురక్షిత పరిధిలోకి వస్తుంది. కానీ భవనాలు కూలిపోవడం లేదా పెద్ద నష్టం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
3.0 కంటే తక్కువ: చాలా తేలికైనది, చాలా వరకు తెలియదు.
3.0–3.9: స్వల్పం : తరచుగా ప్రకంపనలు అనుభూతి చెందుతాయి, కానీ నష్టం చాలా తక్కువగా లేదా అసలు ఉండదు.
4.0–4.9: స్వల్పం నుండి మధ్యస్థం: కొన్ని బలహీనమైన భవనాలలో పగుళ్లు ఏర్పడవచ్చు.
5.0–5.9: మధ్యస్థం: మంచి భవనాలకు స్వల్ప నష్టం, బలహీనమైన భవనాలకు గణనీయమైన నష్టం.
6.0–6.9: తీవ్రం: విశాలమైన ప్రాంతంలో నష్టం, వందల కిలోమీటర్ల వరకు ప్రభావం.
7.0–7.9: భారీ భూకంపం: తీవ్రమైన నష్టం, వేలాది మరణాలు సంభవించే అవకాశం.
8.0 లేదా అంతకంటే ఎక్కువ: అతి భారీ భూకంపం : తీవ్ర విధ్వంసం, లక్షలాది మంది ప్రభావితం, సునామీ ముప్పు.
భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?
భూపటలం అనేక టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించి ఉంటుంది. ఈ ఫలకాలు ఏడాదికి కొన్ని సెంటీమీటర్ల వేగంతో తిరుగుతాయి. ఈ ఫలకాలు ఢీకొన్నప్పుడు, రాసుకున్నప్పుడు లేదా విడిపోయినప్పుడు, వాటి మధ్య ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు, ఫలకాలు అకస్మాత్తుగా పక్కకు జరుగుతాయి. ఈ మార్పు వల్ల విడుదలయ్యే శక్తి భూకంప తరంగాల రూపంలో వెలువడుతుంది. వీటినే మనం భూకంపాలుగా చెబుతుంటాము. భారతదేశం ప్రధానంగా ఇండియన్ ప్లేట్పై ఉంది. ఇది యురేషియన్ ప్లేట్తో ఢీకొంటోంది. ఇదే హిమాలయాల ఏర్పాటుకు కారణమవుతోంది. తెలంగాణ వంటి ప్రాంతాలలో భూకంపాలు తక్కువగా సంభవిస్తాయి. , కానీ అప్పుడప్పుడు చిన్నపాటి ప్రకంపనలు సంభవించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hanamkonda: రక్షించాల్సిన పోలీసే రాక్షసుడయ్యాడు.. హన్మకొండలో వివాహితపై ఎస్ఐ అత్యాచారం, అసలేం జరిగిందంటే?
Hyderabad, Telangana:Hanamakonda SI Assaults Woman: నాకు కొడుకు లేడు, నా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హనుమకొండ ఎస్ఐ గోదారి రాజకుమార్ నమ్మించి, ఒక మహిళను లొంగదీసుకున్నాడు. దీనివల్ల ఆమె గర్భవతి కూడా అయ్యింది. అయితే బలవంతంగా ఆమెకు అబార్షన్ మాత్రలు వేయించాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకున్నాక పెళ్లి చేసుకోమని సదరు చేయడంతోనే అసలు నిజం బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం.. గతంలో హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గోదారి రాజకుమార్ పనిచేస్తున్న సమయంలో 2022లో ఒక మహిళ తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఆమెను అదనపు అవకాశంగా భావించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరుచుకున్నాడు. తనకు తెలిసిన న్యాయవాది సహాయంతో ఆమె భర్తకు విడాకులు ఇప్పించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మి ఆమెను రెండుసార్లు గర్భవతిని చేశాడు. ఇటీవల బలవంతంగా అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. మళ్లీ పెళ్లి చేసుకోమని అడగగా, ఫోటోలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేశాడు.
READ ALSO: సీఐ రాజు బాగోతం.. భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను గర్భవతిని చేసి, టాబ్లెట్లు మింగించి ఘోరం!
READ ALSO: ఇన్స్టాగ్రామ్ లవ్.. భర్తను నిద్రమాత్రలిచ్చి చంపిన భార్య, 3 నెలల తర్వాత ప్రియుడు పంపిన ఒక్క మెసేజ్తో కథ అడ్డం తిరిగింది!
అంతేకాదు.. ఎస్ఐ రాజకుమార్ ఆ మహిళను తీవ్రంగా వేధించినట్లు సదరు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకోమని చెబితే న్యూడ్ ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. అంతేకాదు, ఆమె చేసే పనిచోట ఫోన్ నంబర్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేసి, ఆమెను బలవంతంగా హోటల్స్కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను వదిలేయమని అడిగినా, తనతోనే ఉండాలని, లేదంటే నగ్న చిత్రాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమె ఇబ్బంది సరిపోలేదన్నట్లు, అదే పోలీస్ శాఖలో ఉన్న ఆమె తమ్ముడు రవికుమార్ అంతు కూడా చూస్తానని ఎస్ బెదిరించాడు. చివరికి వేధింపులు తాళలేక న్యాయం కోసంరెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఐజీ ఆఫీసులో ఆమె ఫిర్యాదు చేయడంతో, హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్నాడు. గతంలో కూడా ఆయన అవినీతి కేసులో సస్పెండ్ అయ్యారని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఉంటే బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడాల్సిందే. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Zee Media: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ప్రసార హక్కులు 'జీ మీడియా' సొంతం
Leopard, Midlands Province:India Tour Of Zimbabwe: మీడియా రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న జీ మీడియా క్రీడా రంగంలోనూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ క్రీడా టోర్నీల ప్రసార హక్కులను వరుసగా జీ మీడియా సంస్థ సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఫిఫా ప్రపంచకప్ 2026తో సత్తా చాటిన జీ మీడియా తాజాగా క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్ ప్రసార హక్కులను జీ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ సిరీస్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
క్రీడా రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2026 జూలైలో జరగబోయే భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు సంబంధించిన ప్రత్యేక అధికారిక ప్రసార హక్కులను జీ మీడియా సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంతో జీ నెట్వర్క్ స్పోర్ట్స్ విభాగం యునైట్8 స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రసారాలు జరగుతాయి. ట్వంటీ20 ఇంటర్నేషనల్ సిరీస్ను దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది వీక్షకులు ప్రత్యేకంగా వీక్షించనున్నారు.
సిరీస్ ఎప్పుడు
భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ జూలై 2026లో జరగనుంది. ఈ మ్యాచ్లు 'యునైట్8 స్పోర్ట్స్' ఛానెళ్లలో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద అంతర్జాతీయ సిరీస్లలో ఒకటైన ఈ టూర్ను టీవీ ద్వారా కోట్ల మంది ప్రేక్షకులకు సంస్థ అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే IL T20, ఫిఫా వరల్డ్ కప్ 2026 వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉన్న జీ మీడియా ఇప్పుడు భారత్-జింబాబ్వే సిరీస్తో క్రీడా విభాగంలో మరింత పటిష్టం చేసుకుంది.
ప్రసారాలు ఎక్కడ?
నిరంతరం వార్తా ప్రసారాలు చేస్తున్న జీ మీడియా క్రీడా రంగానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. యునైట్ 8 స్పోర్ట్స్ చానల్స్తో జింబాబ్వే సిరీస్ మ్యాచ్లు తెరపైకి రానున్నాయి. క్రికెట్ అభిమానుల వినోదాన్ని రెట్టింపు చేస్తూ ఈ మ్యాచ్లు వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీంతోపాటు ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ లు కూడా చూసే అవకాశం లభిస్తోంది.
హిందీ
యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ చానల్స్లో ప్రత్యక్షప్రసారం
ఇంగ్లీష్ భాష: యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2,
ఇదొక కీలక అడుగు
జింబాబ్వే, భారత్ టీ20 సిరీస్ దక్కించుకోవడంపై జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (యునైట్8 స్పోర్ట్స్) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భవేష్ జనావ్లేకర్ స్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'భారత్-జింబాబ్వే పర్యటనను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషాన్ని ఇస్తోంది. యునైట్8 స్పోర్ట్స్ను ప్రపంచస్థాయి ప్రీమియం క్రీడలకు ఒక ప్రధాన వేదికగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఇదొక కీలక అడుగు' అని భవేష్ జనావ్లేకర్ తెలిపారు. విభిన్నమైన క్రీడా కంటెంట్ను ప్రేక్షకులకు అందించాలనే తమ వ్యూహానికి ఈ ఒప్పందం అద్దం పడుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మా ప్లాట్ఫారమ్ల ద్వారా సరికొత్త, ఆకట్టుకునే క్రీడా వినోదాన్ని అందిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. జింబాబ్వే క్రికెట్తో సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Pawan Kalyan: తుని చిన్నారి అదృశ్యంపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వెంటనే ఆచూకీ కనిపెట్టండి
Tuni, Andhra Pradesh:Tuni Girl Missing Case Search Operation: తల్లిదండ్రులు పొలం వద్ద కాపలా కాస్తుండగా.. తమ పెంపుడు కుక్కతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పొలంలోకి వెళ్లి అదృశ్యమైంది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన బాలిక ఆచూకీ వారమైనా లభించలేదు. మూడు రోజుల కనిపించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మృతి చెందడంతో ఈ ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న బాలిక అదృశ్యంపై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే బాలిక ఆచూకీ తెలుసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
తుని ప్రాంతంలో చిన్నారి అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. కాకినాడ జిల్లా, తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల కిందట అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యల్లో ఉన్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. దట్టమైన అడవుల్లోకి కూడా వెళ్లే సత్తా ఉన్న అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిపుణుల సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని ఆదేశించారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై శనివారం మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో సమీక్షించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్టు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్టు తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
పెంపుడు కుక్క మృతి
అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో కీలకమైన పెంపుడు కుక్క కొద్ది సేపటి కిందట చనిపోయింది. ఉన్న ఒక్క సాక్ష్యం కనుమరుగైపోయింది. దానిపైన ఆశలు పెట్టుకున్న చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, భవాని కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పాప పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరాటే కల్యాణి పరామర్శ
అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని సినీ నటి కరాటే కల్యాణి పరామర్శించారు. అమావాస్య సందర్భంగా బాలికను బలిచ్చేందుకు ఎవరో అపహరించి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉందని.. దీనిని ఛేదించాలని కరాటే కల్యాణి పోలీసులను కోరారు.
IND vs AFG: దంచికొట్టిన గుర్భాజ్.. అఫ్ఘానిస్థాన్పై చెలరేగిన భారత బౌలర్లు
mathura, Dharamshala, Himachal Pradesh:Rahmanullah Gurbaz Record Century: టెస్టుల్లో భారీ విజయం సాధించిన భారత జట్టు అఫ్ఘానిస్తాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించగా.. పూర్తి ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేశారు. అఫ్ఘాన్ బ్యాటర్లపై బౌలర్లు ప్రతాపం చూపించారు. ఆరంభ మ్యాచ్ లోనే యువ బౌలర్లు మూడేసి వికెట్లతో అదరగొట్టారు. భారత బౌలింగ్ను తట్టుకుని నిలబడిన రహహ్మనుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడి తక్కువ బంతుల్లోనే రికార్డు సెంచరీ నమోదు చేశాడు.
ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు శాంతించిన అనంతరం రిఫరీలు 25 ఓవర్లకు కుదించారు. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన అఫ్ఘానిస్థాన్ 24.5 ఓవర్లకు 194 పరుగులు చేసి ఆలౌటైంది. అఫ్ఘాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా మినహా ఎవరూ ఝుళిపించలేకపోయారు. బ్యాటర్లు బ్యాట్ కదిలించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఇబ్రహీం జద్రాన్ (1), సిద్దీఖుల్లా అటల్ (0), రహ్మత్ షా (3), మహ్మద్ నబీ (9), రషీద్ ఖాన్ (9), అల్లా ఘజాన్ఫర్ (0), జియార్ రహ్మన్ (4) డబుల్ డిజిట్ పరుగులు కూడా సాధించలేకపోయారు. వరుసగా బ్యాటర్లందరూ ఔటవుతున్న వేళ రహ్మనుల్లా గొప్పగా ఆడాడు. మైదానంలో నిలబడి అతి తక్కువ బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. బ్యాట్తో దూకుడుగా ఆడి 51 బంతుల్లో వేగంగా 102 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 8 సిక్సర్లు నమోదు చేశాడు. మైదానంలోకి వచ్చిన ప్రతి ఆటగాడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. టెస్టుల్లో పరువు పోవడంతో వన్డేలో అయినా నిలకడగా ఆడాలనే తపనతో గుర్బాజ్ పోరాడాడు. గుర్బాజ్ ఔటయిన తర్వాత వరుసగా ఔటవడంతో ఒక బంతి మిగిలుండగానే ఆలౌటైంది.
బౌలర్ల ప్రతాపం
అఫ్ఘానిస్థాన్పై భారత బౌలర్లు అద్భుతంగా వేశారు. టెస్టుల్లో మాదిరి వన్డేలో కూడా చెలరేగి బంతులు వేశారు. హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్తోపాటు మిగతా బౌలర్లు పొదుపుగా వేసి వికెట్లు పడగొట్టారు. అరంగేట్ర మ్యాచ్లోనే హర్ష్ దూబే, గుర్నూర్ మూడు వికెట్లు తీసి ఔరా అనిపించారు. సీనియర్ బౌలర్లు అర్ష్దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు తీసి రాణించారు. ఫీల్డింగ్లోనూ ఆటగాళ్లు అదరగొట్టారు.
రోహిత్ శర్మ రికార్డు
ఈ వన్డే మ్యాచ్తో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. భారత జట్టు తరపున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. రోహిత్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాల 44 రోజులు. గతంలో మాజీ ప్లేయర్ మోహిందర్ అమర్నాథ్ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.
Govt Scheme: ప్రధాని MODI అదిరిపోయే Scheme... జేబులో పైసా లేకున్నా రూ. 20 లక్షల Loan పొందే ఛాన్స్.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే..?
Secunderabad, Telangana:pradhan mantri mudra yojana: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్ గా ముద్ర యోజన స్కీమ్ ఆదరణ పొందింది. ముఖ్యంగా ముద్ర యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండానే బ్యాంకుల నుంచి లోన్ పొందుతున్నారు. ముద్రా యోజన స్కీం ద్వారా కొత్తగా వ్యాపారం చేసేవారు కావచ్చు.. అలాగే ఉన్న వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి అనుకునే వారు కూడా ఈ స్క్రీన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన స్కీం ఏదైనా ఉందంటే అది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ అనే చెప్పాలి. ఈ స్కీం కింద ఇప్పటికే దాదాపు 50 కోట్లకు మంది పైగా లబ్ధిదారులు దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్క్రీన్ గా ఈ ముద్రా యోజన స్కీమ్. భావిస్తున్నారు. ముఖ్యంగా ముద్రా యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. ముద్ర యోజన స్కీం ద్వారా కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలనుకునేవారు కావచ్చు ఈ లోన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
ముద్ర యోజన స్కీం ద్వారా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు నుంచి కూడా లోన్స్ ఎలాంటి తాకట్టు లేకుండానే పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీకు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు లోన్ అందిస్తారు. దీనిలో మొత్తం మూడు కేటగిరీలో లోన్స్ అందిస్తారు. కొత్తగా చిన్న వ్యాపారం ప్రారంభించే వారికి శిశు రుణాల కేటగిరిలో భాగంగా 50 వేల రూపాయల వరకు లోన్ పొందవచ్చు. కిషోర్ కేటగిరీలో 5 లక్షల వరకు లోన్స్ పొందవచ్చు. దీనిలో ముఖ్యంగా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి.
ఇక తరుణ్ కేటగిరి విషయానికి వచ్చినట్లయితే 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా 10 లక్షల లోపు రుణాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది స్థిరపడిన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయాలనుకునే వారికి ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే తరుణ్ ప్లస్ స్కీం కింద 10 లక్షల కంటే ఎక్కువగా అంటే 20 లక్షల వరకు లోన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. గతంలో తరుణ్ లోన్స్ తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి ఈ లోన్స్ ఈజీగా అందిస్తారు. అయితే ఇప్పటివరకు గమనించినట్లయితే దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు ఈ లోన్స్ కింద మంజూరు అయ్యాయి. దీనిలో దాదాపు 70% మంది మహిళలే ఉండటం విశేషమని చెప్పాలి.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి సుమారు 50% వరకు లోన్స్ అందిస్తున్నారు. సుమారు 12 కోట్ల మంది మొదటిసారిగా వ్యాపారంలో ప్రవేశించేందుకు ఈ లోన్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. లోన్స్ తిరిగి చెల్లించే స్కీములో ఇది అగ్రస్థానంలో ఉందని చెప్పాలి. కేవలం 2.3 శాతం మొండి బాకీలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ముద్ర లోన్స్ పొందేందుకు మీ సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా వెళ్ళవచ్చు.
మీరు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉద్యమ్ మిత్ర పోర్టల్ లేదా జన సమర్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు శాఖను సందర్శించి ముద్ర లోన్ అప్లికేషన్ ఫారం సమర్పించడంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే బిజినెస్ ప్లాన్ కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాల్సి ఉంటుంది. లోన్ మంజూరైన తర్వాత మీకు ముద్రకార్డు రూపంలో డిబేట్ కార్డ్ అందిస్తారు. దీని ద్వారా మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత డబ్బు వాడుకుంటారో దానిపై మాత్రమే వడ్డీ పడుతుంది.
Also Read: చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేస్తున్న ఈ క్రేజీ బిజినెస్
Also Read: Business Ideas 2026: ఉద్యోగం వెతుక్కోవడంలో విసిగిపోయారా?
Also Read: Business Ideas: మోదీ సర్కార్ అందిస్తున్న రూ.5 లక్షల లోన్ తీసుకుని
Also Read: కేంద్రంలోని మోదీ సర్కార్ అందించే రూ. 10లక్షలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Students Jackpot: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్ల ప్రారంభం రోజే అద్భుత పథకానికి శ్రీకారం
Baddipadaga, Telangana:Telangana Govt Breakfast Scheme: పాఠశాల విద్యార్థులతోపాటు కళాశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ విద్యాలయాలకు వచ్చే పేద విద్యార్థుల కోసం ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని విద్యాలయాల పునఃప్రారంభం రోజు నుంచి ప్రారంభించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 15వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది.
విద్యా వ్యవస్థ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండడంతో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. విద్యార్థులకు పాఠశాల, కళాశాలల ఆవరణల్లో ఉదయం టిఫిన్ అందించడమే కాకుండా మధ్యాహ్న భోజనం అందించనుంది. అంతేకాకుండా పాలు లేదా రాగిజావ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే అందించేవారు. ఇప్పుడు టిఫిన్ కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. దాంతోపాటు పాలు లేదా రాగిజావ ఇవ్వనున్నారు.
కళాశాలల్లో మూడు.
ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం అంటూ ఏమీ లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో మధ్యాహ్న భోజనం అందించాలని చర్యలు తీసుకున్నా కార్యరూపం దాల్చలేదు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్తోపాటు డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభించనుంది. దీంతోపాటు టిఫిన్ కూడా ప్రారంభించబోతున్నది. ఇక పాలు లేదా రాగిజావ అందించనుంది.
విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై ప్రజల్లో నమ్మకం కోల్పోతుండడంతో వాటి ఉనికి ప్రమాదకరంగా మారింది. రోజురోజుకు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునే వారి సంఖ్య తగ్గిపోతున్నది. డ్రాపౌట్స్ సంఖ్య పెరిగిపోతున్నది. విద్యార్థులు లేక కొన్ని పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతం కోసం కొన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. విద్యార్థులు తిరిగి విద్యా సంస్థకు ఉత్సాహంగా వచ్చేందుకు ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్తోపాటు లంచ్ అందించనుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం కలిగించడమే కాకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. వాటితోపాటు పోషకాహారం అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం చెప్పబోతున్నది.
ప్రభుత్వ విద్యాలయాలకు పూర్వ వైభవం
ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయనుండడంతో మరి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందా? లేదా? అనేది చూడాలి. పాఠశాలలు, కళాశాలల్లో టిఫిన్, భోజనంతో పాటు పాలు లేదా రాగిజావ ఇవ్వనుండగా.. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ పథకాన్ని పక్కాగా.. నాణ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తే ప్రభుత్వ విద్యాలయాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. మరీ ఈ పథకం విజయవంతం కావాలని కోరుకుందాం.
Tirumala Donation: తిరుమల ఆలయానికి అశోక్ లేలాండ్ భారీ విరాళం
Dharmavaram, Andhra Pradesh:Ashok Leyland Donates Heavy Truck To Tirumala Temple Watch VideoTirumala Traffic Jam: అలిపిరిలో ట్రాఫిక్ జామ్.. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
Tirupati, Andhra Pradesh:Tirumala Temple Rush: పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అనూహ్యంగా శనివారం భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ కారణంగా అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. టోల్ గేట్ వద్ద తనిఖీలకు దాదాపు అర్థ గంటకు పైగా సమయం పడుతోంది. సర్వ దర్శనంలో భక్తులకు 18 గంటల సమయం దర్శనానికి పడుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
నిండిన అన్నీ కంపార్ట్మెంట్లు
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు 15–18 గంటల సమయం పడుతుండగా.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్నీ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి. వారం రోజుల్లో రోజుకు 83 వేల నుంచి 93 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 7వ తేదీన ఒక్కరోజే 93,230 మంది దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ శిలాతోరణం ప్రాంతం వరకు విస్తరించిన దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా రద్దీ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తయ్యే దర్శనం మరింత ఆలస్యం అవుతోంది. కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులకు కూడా 6 గంటలకుపైగా నిరీక్షణ తప్పడం లేదు. రద్దీ నియంత్రణ కోసం టీటీడీ ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను వినియోగిస్తోంది. దీంతో గతంలో 24 నుంచి 36 గంటలు పట్టిన దర్శనం సమయం అత్యంత రద్దీ సమయంలో కూడా 8 నుంచి 14 గంటలకు తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు
భారీ విరాళం
తిరుమల శ్రీవారికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ విరాళాన్ని సమర్పించింది. రూ.31 లక్షలకు పైగా విలువైన అధునాతన ట్రక్కును టీటీడీకి విరాళంగా అందజేసింది. శనివారం తిరుమలలో ఈ వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలకు చేరుకున్న సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు నూతన వాహనాన్ని ఉంచారు. రూ.31,72,532 విలువైన ఈ ట్రక్కుకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయగా.. అశోక్ లేలాండ్ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. అశోక్ లేలాండ్ సంస్థ ఇచ్చిన ట్రక్కును శ్రీవారి సేవా కార్యక్రమాలకు, లడ్డూ ప్రసాదాల రవాణాకు లేదా ఇతర అవసరాలకు వినియోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ జామ్
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం, శనివారం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుపతికి తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీగా ఆగిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. టోల్గేట్ నుంచి గరుడ విగ్రహం వరకు ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. తనిఖీ ప్రక్రియ ఆలస్యం కావడం.. ఒకేసారి వందలాది వాహనాలు రావడంతో అలిపిరి మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Union Cabinet: కేంద్ర కేబినెట్లోకి జనసేన ఎంట్రీ.. లింగమనేని రమేష్, వేమిరెడ్డికి ఛాన్స్?
Nuzendla, Andhra Pradesh:Union Cabinet Extension: పన్నెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి విశేష ప్రాధాన్యం లభిస్తుండగా.. తొలిసారిగా జనసేన పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పెట్టిన పుష్కర కాలానికి జనసేన కేంద్ర పదవులను అలంకరించనుంది. టీడీపీ.. జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి మరోసారి ప్రాధాన్యం లభిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరికి ఉద్వాసన పలకడంతో మరికొందరికి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్కు మరోసారి మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీతోపాటు జనసేనకు కూడా అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన లింగమనేని రమేష్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేరు చర్చకు వస్తోంది. నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అతడి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తుండడంతోపాటు పార్లమెంటులో చురుకైన పాత్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో వేమిరెడ్డికి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు కేంద్రంలో బాధ్యతలు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పిస్తారనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్తో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమతుల్యత, మిత్రపక్షాల ప్రాధాన్యత, రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర నాయకత్వం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీని విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా లింగమనేని రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగతుందనేది కాలం సమాధానం ఇస్తుంది.
Vemulawada: రైతు బంధు ఆపేసి.. ఢిల్లీకి రాహుల్ బంధు తెచ్చారు.. కాంగ్రెస్పై KTR ఫైర్!
Vemulawada, Telangana:KTR Vemulawada speech Telugu News: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కెసిఆర్ ఒంటరిగా బయలుదేరి.. అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని సాధించారు.. నేడు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది.. దేనికి భయపడకండి. మీ వెనుక నేను.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు, సభ్యత్వ నమోదు ఇన్చార్జి ప్రవీణ్, మాజీ చైర్పర్సన్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో SIR ప్రక్రియ.. బూత్ కార్యకర్తలే సైనికులు..
దేశంలో 13 సార్లు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో లేదా ప్రత్యేక సర్వేల రూపంలో ఓటర్ల పరిశీలన జరిగినప్పుడు వేములవాడ లేదని కేటీఆర్ గుర్తు చేశారు. జూన్ 25 నుంచి జూలై 25 వ తేదీ వరకు నెల రోజులపాటు అధికారికంగా 2002 తో పాటు 2025 ఓటర్ల జాబితాలను పక్క పక్కన పెట్టి ఫ్యామిలీ మ్యాపింగ్ చేయనున్నారని తెలిపారు.. ఇంటికి వచ్చే అధికారులు.. చనిపోయిన వారి ఓట్లను, రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తారని.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుకూల ఓట్లు పోకుండా బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు విజయం పక్కా అని.. అయితే SIR ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు..
రైతు బంధు ఆపేసి.. రాహుల్ బంధు తెచ్చారు..
కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ది నోరా? లేదా మోరా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నూరు రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను దారుణంగా మోసం చేశారని.. ఆనాటి ప్రభుత్వ హయంలో లభించిన రూ.200 పెన్షన్ను రూ.2,000 చేసింది మేమేనని.. కానీ నేడు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడం చేతకాక.. కెసిఆర్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని అన్నారు.. వ్యవసాయానికి ఇచ్చే రైతుబంధు బందు చేసి.. ఢిల్లీకి మూటలు పంపుతూ రాహుల్ బంధును తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు..
త్వరలో సభ్యత్వ నమోదు..
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు విద్య వైద్య రంగాల్లో ప్రజలను ఎలా మోసం చేసిందనేది వివరించడానికి త్వరలోనే నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని.. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని ఈ సభ ముఖంగా కేటీఆర్ ప్రకటించారు.. నేటి యువత అంతా ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లోనే ఉంటున్నారని.. కాబట్టి సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ.. ప్రజల క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. తాము స్వయంగా వేములవాడపై ప్రత్యేక దృష్టి కార్యకర్తను కలుపుకుంటానని భరోసా ఇచ్చారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
TPCC: ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా?: మహేశ్ కుమార్ గౌడ్
Baddipadaga, Telangana:Meenakshi Natarajan Nomination Rejection: 'మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా? అనుమానం కలుగుతుంది. కేసు లేదు ఏమి లేదు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఎఫ్ఐఆర్ లేనపుడు కేసు ఎక్కడిది?' అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. 'పసలేని కేసును పట్టుకొని దుర్బుద్ధితో నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆర్ఓకి తిరస్కరించే అధికారం లేకున్నా తిరస్కరించారు. ఆర్ఓని ఉరి వేసిన తప్పులేదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'రాజ్యసభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారు. గాంధేయ వాది నియయితికి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్. ప్రధానమంత్రి కార్యాలయం చొరవతో కేసును తప్పుదోవ పట్టించారు. ఈ విషయంలో ఉరి వేసిన తప్పులేదు' అని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో ఆర్ఓ ఆఫీసులో కూర్చుని ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయం అని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు అసహనం వ్యక్తం చేశారు.
'బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీనాక్షి నాకు సోదరి లాంటివారు. 24 గంటల్లో ఎన్నికల సంఘం స్పందించకపోవడం విచారకరం. మీనాక్షిని బలి చేశారు. మీనాక్షి విషయంలో కొంత మంది బీజేపీ నాయకులు సానుభూతి తెలిపినట్లు తెలిసింది. బీజేపీ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. లీకు వీరులు, గ్రీకు వీరులు ఉంటే రేవంత్ రెడ్డి సమగ్రంగా విచారిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాపై బురద జల్లుతున్నారు' అని మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు.
'రాజకీయాల్లో విభేదాలు సహజం. అంతమాత్రాన కుట్రకు పాల్పడరు. ఓటు చోరీ చేసి.. ఇప్పుడు సీటు చోరీ చేశారు. ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటు' అని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. 'మీనాక్షికి కేసుకు అసలు సంబంధం లేదు. రాజ్యాంగాన్ని ఇంత దుర్మార్గంగా అవమానిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరిస్తే మోడీ ప్రధాని అయ్యేవారా?ముఖ్యమంత్రి అయ్యేవారా?' అని ప్రశ్నించారు.
'పశ్చిమ బెంగాల్, మహరాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలు చూశారు. 12 ఏళ్లలో మోదీ చేసింది ఏమి లేదు' అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ విమర్శించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన ఆస్తులు, తన వ్యక్తిత్వం ఏమిటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు అని చెప్పారు. 'చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డి సమక్షంలో చేర్పించారు. షబ్బీర్ అలీకి షోకాజ్ ఇచ్చాం' అని వివరించారు. 'ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదు. మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరం. ఏడాది కిందటి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది' అని మహేశ్ కుమార్ వెల్లడించారు.
