icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

భద్ర రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, వ్యాపారంలో భారీ లాభాలు..

Hyderabad, Telangana:

Bhadra Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో ఒక ముఖ్యమైన గ్రహాల మార్పు జరగబోతోంది. ఈ మార్పు కారణంగా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడబోతోంది.. జూలై 7వ తేదీ నుంచి బుధ గ్రహం ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడడం కారణంగా ఈ రాజయోగం మొదలవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని బుద్ధి, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్‌తో పాటు ఆలోచనలకు కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు జూన్ చివరలోనే మిథునరాశిలోకి ప్రవేశించగా.. జూలై 7 నుంచి దీని ప్రభావం మరింత బలంగా మారబోతోంది.. బుధుడు తన సొంత రాశిలో లేదా ఉచ్ఛ రాశిలో మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి, నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై సానుకూల ప్రభావం పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది 3 రాశుల వారు ఈ యోగం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఆ అదృష్టాన్ని పొందే రాశుల వారు వీరే..
కర్కాటక రాశి (Cancer)
భద్ర రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఉద్యోగ, ఉపాధి రంగాలలో అద్భుతమైన సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు నిర్ణయాత్మక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల కార్యాలయంలో పైఅధికారుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కెరీర్‌లో కొత్త లాభదాయకమైన అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది..

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ సమయం వ్యాపార పరంగా ఎంతో లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Businesses) చేసే వారికి భారీ విజయాలు కలిగే అవకాశాలు కూడా కనిసిస్తున్నాయి. మార్కెట్లో ధనుస్సు రాశివారికి సంబంధించిన పరపతి విపరీతంగా పెరుగుతుంది. లాభదాయకమైన ఒప్పందాలు లేదా పెద్ద ప్రాజెక్టులు మీ ముందుకు వచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు ఇది అత్యంత అనుకూలంగా మారుతుంది.

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఈ భద్ర రాజయోగం వల్ల కుటుంబ, ఆస్తి పరమైన విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి వివాదాలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతి  లేదా కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి..

ఈ రంగాల వారికి గోల్డెన్ పీరియడ్!
జ్యోతిష్య నిపుణుల అందించిన సమాచారం ప్రకారం.. ఈ రాజయోగం వల్ల సమాజంలో వ్యక్తుల ఆలోచనా విధానంతో పాటు జ్ఞానం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, రచనా రంగం, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌తో పాటు క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలను అందిస్తాయి.

(నోట్‌: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య నమ్మకాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రాలతో పాటు గ్రహాల స్థితులను బట్టి రాశులవారి జీవితాల్లో ఫలితాలు, మార్పులు ఉంటాయి.)

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Liquor Prices: ఇక్కడ 2 లీటర్ల విస్కీ బాటిళ్ల ధరలు చూస్తే షాక్ అవుతారు!

Hyderabad, Telangana:

2 Litre Whisky Bottle Price In Goa Telugu: భారత్‌లోని అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశం, సుందర తీరప్రాంతాల నిలయమైన గోవా అంటే కేవలం బీచ్‌లు, ప్రకృతి అందాలు మాత్రమే కాదు.. మద్యం ప్రియులకు ఇది ఒక స్వర్గం. సాధారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా మంది మద్యం ప్రియులు సంవత్సరంలో ఒక్కసారైనా గోవాకు వెళ్లాలనుకుంటూ ఉంటారు. అయితే, ప్రస్తుతం అక్కడ లభిస్తున్న 2 లీటర్ల విస్కీ బాటిళ్ల ధరలు మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అందరూ ఎంతగానో ఇష్టపడే బ్రాండ్ల 2 లీటర్ల బాటిళ్లు ఊహించని రీతిలో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఎగబడి మరి కొనుగోలు చేస్తున్నారు.

ఏ బ్రాండ్ ఎంత? 
గోవా లిక్కర్ మార్కెట్‌లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల 2 లీటర్ల బాటిళ్ల తాజా ధరల వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బడ్జెట్ బ్రాండ్ల నుంచి ప్రీమియం స్కాచ్ విస్కీల వరకు భారీ ఎక్కువ మోతాదులో లభించే ఈ బాటిళ్ల ధరల వివరాల్లోకి వెళితే.. మెక్‌డొవెల్స్ (McDowell's 2L) ఇక్కడ కేవలం రూ. 880లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా గోవా స్పెషల్ ఫెని (Goa Special Feni 2L) రూ. 1,000 ధరలో మాత్రమే లభించడం విశేషం. ఇక సిగ్నేచర్ (Signature 2L) రూ. 1,850కే లభిస్తోంది. దీంతో పాటు బ్లెండర్స్ ప్రైడ్ (Blenders Pride 2L) రూ. 1,850 ధరలో మాత్రమే అందుబాటులో ఉంది.  ఇక బ్లెండర్స్ రిజర్వ్ (Blenders Reserve 2L) రూ. 2,100 ధరతో లభిస్తోంది. బ్లాక్ డాగ్ గోల్డ్ స్కాచ్ విస్కీ (Black Dog Gold 2L) రూ.4,900 ధరలో మాత్రమే లభించడం విశేషం..

అరుదైన కలెక్షన్లు.. 
సాధారణ మార్కెట్‌లో చాలా అరుదుగా లభించే  బ్లెండర్స్ రిజర్వ్ (Blenders Reserve) వంటి ప్రీమియం వేరియంట్ 2 లీటర్ల బాటిల్ కూడా గోవాలో కేవలం రూ.2,100లకే అందుబాటులో ఉండడం విశేషం.. అంతేకాకుండా రాయల్ లుక్‌తో పాటు అద్భుతమైన రుచి కలిగిన స్కాచ్ విస్కీ  బ్లాక్ డాగ్ గోల్డ్ (Black Dog Gold) 2 లీటర్ల ప్రీమియం గ్లాస్ బాటిల్ కేవలం రూ. 4,900 లకే లభిస్తోంది. ఈ భారీ గ్లాస్ బాటిల్స్ కేవలం తాగడానికే కాకుండా.. కలెక్షన్లుగా దాచుకోవడానికి కూడా చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు గోవా సాంప్రదాయ డ్రింక్‌గా భావించే.. స్పెషల్ ఫెని 2 లీటర్ల బాటిల్ వెయ్యి రూపాయలకే లభించడం విశేషం..

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

ఈ 2 లీటర్ల బాటిళ్ల ధరలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా గోవా వెళ్లాలనుకుంటున్న మందుబాబులు ఈ ధరలను చూసి పండగ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దాదాపు సగానికి పైగా ధరలు తక్కువగా ఉండడంతో పాటు మంది ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి గోవా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report

సమసప్తక యోగం ఎఫెక్ట్.. జూలై 4 నుంచి ఈ 5 రాశుల వారికి ఊహించని ధనలాభం, ఇక సువర్ణ కాలమే!

Hyderabad, Telangana:

Venus-Ketu Samasaptaka Yoga 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారాలకు, వాటి కలయికలు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇదిలా ఉంటే జూలై 4వ తేదీన శుక్రుడు, కేతువుల కలయిక కారణంగా అత్యంత అరుదైన, శక్తివంతమైన సమసప్తక యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడిని రాక్షస గురువు అని పిలుస్తారు.. అలాగే రాహు, కేతువులను కూడా కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ అద్భుతమైన యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా.. విపరీతమైన ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారు ఈ కాలంలో సువర్ణ కాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారికి ఈ సమయంలో అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు:
మేష రాశి (Aries) 
మేష రాశి వారికి శుక్ర, కేతువుల కలయిక ఐదవ స్థానంలో జరగడం కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని శుభ ప్రభావంతో వీరు తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కలగడం కారణంగా కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. తల్లిదండ్రులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉద్యోగ రంగంలో మీ సృజనాత్మకతకు పైఅధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమసప్తక యోగం నాల్గవ స్థానంలో ఏర్పడింది.. దీని వల్ల వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లేదా భూములపై పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. తల్లితో ఉన్న బంధం మరింత మెరుగుపడుతుంది.

సింహ రాశి (Leo) 
సింహ రాశిలోనే ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల వీరికి సమాజంలో మరింత గుర్తింపు లభిస్తుంది.. వీరికి ఈ సమయంలో తప్పకుండా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. తెలివితేటలు, నైపుణ్యంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీపై మీరు శ్రద్ధ వహించడానికి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు.

తులా రాశి (Libra) 
తులా రాశి వారికి ఈ యోగం పదకొండవ స్థానంగా భావించే.. లాభ స్థానంలో ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో ఊహించని మార్గాల ద్వారా మీకు భారీగా ఆదాయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా లభిస్తారు. అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల నుంచి ఆశించిన సపోర్ట్ కూడా లభిస్తుంది.. మీ మనస్సులో చాలా కాలంగా నెరవేరని కోరికలు ఈ సమయంలో పూర్తివుతాయి.

కుంభ రాశి (Aquarius) 
కుంభ రాశి వారికి ఏడవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల అవివాహితులకు అనుకూలమైన వివాహ సంబంధాలు కుదురుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివాహితుల జీవితంలో ప్రేమ, పరస్పర అవగాహన, ఆనందం కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Business) చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో లేదా ప్రియమైన వారితో కలిసి ఆహ్లాదకరమైన ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

మీ వంటగదిలోని ఈ 3 వస్తువులతో.. ముఖంపై అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టండి!

Hyderabad, Telangana:

DIY Facial Hair Removal: చాలామంది మహిళలు ముఖం మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని ఫేషియల్ హెయిర్‌ను తరచూ తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం థ్రెడ్డింగ్, వాక్సింగ్ వంటి పద్ధతులను వాడుతుంటారు.. దీనివల్ల సెలూన్‌లకు వెళ్లి ఖర్చు చేయడమే కాకుండా కొందరిలో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ, మన పూర్వీకులు వాడే ఒక చక్కని ఇంటి చిట్కాతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మన భారతీయ సంప్రదాయ సౌందర్య సాధనాల్లో శనగపిండికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనగపిండితో పాటు గోధుమపిండి , చక్కెరను కలిపి వాడటం వల్ల ఫేషియల్ హెయిర్ సమస్య క్రమంగా తగ్గుతుంది.

దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. కేవలం వెంట్రుకలను తొలగించడమే కాకుండా ముఖానికి కొత్త కళను, కాంతిని కూడా అందిస్తుంది. సెలూన్‌కు వెళ్లే బదులు 10 రోజులకు ఒకసారి ఇంట్లోనే ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. ఇది ఒక మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది.

ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువులు థ్రెడ్డింగ్, వాక్సింగ్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవి సహజమైనవి కాబట్టి ముఖానికి మంచి కాంతిని ఇస్తూ వెంట్రుకలను తొలగిస్తాయి. భారతీయ సంప్రదాయాల్లో వాడే ఈ పద్ధతి వెంట్రుకల మూలాల నుండి వాటిని తొలగించడమే కాకుండా, అవి మళ్ళీ పెరగకుండా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉన్న మృతకణాలను (dead skin cells) తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

ఫేషియల్ హెయిర్ మాస్క్ తయారీ విధానం..
ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ శనగపిండి, అర చెంచా చక్కెర తీసుకోవాలి. ముందుగా గోధుమపిండిని, శనగపిండిని పెనంపై దోరగా వేయించాలి). పిండి మాడిపోకుండా జాగ్రత్త వహించి, గోల్డెన్ రంగు వచ్చాక చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు పోసి అందులో చక్కెరను కరిగించి, వేయించిన పిండిని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.

READ Also:   వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!

READ Also:   ఒత్తయిన పొడవాటి జుట్టు మీ సొంతం.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే హెయిర్ ఫాల్‌కి శాశ్వతంగా బైబై!

ఫేషియల్ మాస్క్ వేసుకునే విధానం..
ఈ మాస్క్ వేసుకునే ముందు ముఖంపై ఉన్న మేకప్ లేదా మాయిశ్చరైజర్‌ను పూర్తిగా తొలగించాలి. శుభ్రమైన ముఖంపై ఈ మాస్క్‌ను అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత, మృదువుగా సర్క్యులర్ మోషన్‌లో రుద్దాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బలహీనపడి ఊడిపోతాయి. క్రమం తప్పకుండా వాడటం వల్ల వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది.
సెలూన్ వెళ్లకుండా ప్రత్యామ్నాయం కోరుకునే వారు ఈ పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇది తక్షణమే ఫలితాలను ఇవ్వకపోయినా, సహజంగా వెంట్రుకల పెరుగుదలను ఆలస్యం చేస్తుంది. మంచి ఫలితాల కోసం ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ మాస్క్‌ను వాడాలి. అప్పుడు రాను రాను వెంట్రుకలు తగ్గుతాయని మీరు గమనిస్తారు.

అయితే, ఇది తక్షణ ఫలితాల కోసం వాడే ప్రత్యామ్నాయం కాదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖంపై ఏదైనా దురద అనిపిస్తే దీనిని వాడకండి. మన భారతీయ సంప్రదాయంలో చిన్న పిల్లలకు కూడా శనగపిండిని వాడుతుంటారు, కాబట్టి ఇది వెంట్రుకల తొలగింపుకు చాలా సురక్షితమైన, మంచి రెమెడీ.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Shadashtak Yog 2026: శుక్ర, శనుల అరుదైన కలయిక.. ఈ 4 రాశుల తలరాతలు మారబోతున్నాయి!

Hyderabad, Telangana:

Shadashtak Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వాటి కలయికలు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని అరుదైన గ్రహాల స్థితులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 23, గురువారం ఉదయం 9 గంటల 46 నిమిషాలకు ఒక అత్యంత శక్తివంతమైన, అరుదైన ఖగోళ మార్పు సంభవించబోతోంది. శుక్రుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన, అరుదైన షడష్టక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి తలరాతలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా 4 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. కాసుల వర్షం కురవడమే కాకుండా.. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్..
మేష రాశి: 
అరుదైన షడష్టక యోగం వల్ల మేష రాశి జాతకులకు గోల్డెన్ డేస్ మొదలు కాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, ఊహించని గుర్తింపు లభిస్తుంది.. సమాజంలో మీ వ్యక్తిత్వానికి ప్రత్యేక గౌరవం పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే ఛాన్స్‌ కూడా లభిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి.. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కర్కాటక రాశి: 
శుక్ర, శనుల ఈ ప్రత్యేక కలయిక కర్కాటక రాశి వారికి కొత్త వెలుగులను ప్రసాదించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి.. సానుకూలత మరింత పెరుగుతుంది. జీవితంలోని అనేక సంక్లిష్ట సమస్యలకు సులభమైన పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది.. వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు విపరీతంగా పెరుగుతాయి. భౌతిక సుఖాలు, విలాసాలు విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులా రాశి: 
ఈ షడష్టక యోగం తులా రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయం గోల్డెన్ టైమ్‌గా భావించవచ్చు. అంతేకాకుండా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశివారికి ఇది అద్భుతమైన సమయంగా మారవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారికి పెద్ద పెద్ద డీల్స్ ఫైనల్ అవుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మిథున రాశి: 
మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సమయాన్ని తీసుకు రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో సహాయపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల నుంచి వీరు తప్పకుండా విజయవంతంగా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా ప్రేమ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది.

(నోట్‌: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అంచనాలు, ఇంటర్నెట్‌లో సమాచారం ఆధారంగా రాయబడింది. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో టేలర్ స్విఫ్ట్ గ్రాండ్ వెడ్డింగ్..మూడేళ్ల ప్రేమాయణానికి శుభం కార్డు..!!

BBhoomi2h ago
Secunderabad, Telangana:

Taylor Swift And Travis Kelce Officially Married:  పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ , ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ జంట న్యూయార్క్‌లోని చారిత్రాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు వారి అంగరంగ వైభవమైన వేడుకకు హాజరయ్యారు. సోషల్ మీడియా నుండి మీడియా వరకు.. ఈ మెగా-వెడ్డింగ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. 

వీరి మూడేళ్ల ప్రేమాయణం జూలై 4న న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకతో ముగిసింది. ఈ వార్తను టేలర్ స్విఫ్ట్ పబ్లిసిస్ట్ అధికారికంగా ధృవీకరించారు. మాన్‌హాటన్‌లోని ప్రసిద్ధ క్రీడా వేదిక అయిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెలుపల ఒక పెద్ద తెరపై  జస్ట్ మ్యారీడ్  అని ప్రదర్శించగా.. గ్రామీ అవార్డు గెలుచుకున్న కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ అయిన టేలర్ స్విఫ్ట్, రాయిటర్స్‌కు పంపిన ఒక ఈమెయిల్‌లో వెంటనే ఈ వివాహాన్ని ధృవీకరించారు.

ఎంతో వైభవంగా  జరిగిన వివాహా వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. హాలీవుడ్ హాస్యనటుడు ఆడమ్ శాండ్లర్ ఈ వేడుకను నిర్వహించారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ఘనమైన వివాహానికి ముందు, స్విఫ్ట్ స్వస్థలమైన నాష్‌విల్‌లో కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తమ వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా..  ఈ జంట అమెరికాలోని 20 స్థానిక, జాతీయ స్వచ్ఛంద సంస్థలకు భారీ మొత్తంలో విరాళాలు అందించి తమ ఉదారతను ప్రదర్శించారు.  టేలర్ స్విఫ్ట్  అత్యంత సన్నిహితులు, సంగీత పరిశ్రమ ప్రముఖులైన ఎడ్ షీరన్ , సబ్రినా కార్పెంటర్, ఆరోన్ డెస్నర్ ఈ వివాహానికి హాజరయ్యారు. సుమారు 1,000 నుండి 1,200 మంది అతిథుల సమక్షంలో టేలర్, ట్రావిస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

టేలర్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న మార్క్ సీడ్:
ఈ వైభవోపేతమైన వివాహాన్ని రహస్యంగా.. విలాసవంతంగా జరిపించే బాధ్యతను హాలీవుడ్ ప్రఖ్యాత సెలబ్రిటీ వెడ్డింగ్ ప్లానర్ అయిన మార్క్ సీడ్ అతని బృందానికి అప్పగించారు. సోషల్ మీడియా, ప్రచారానికి దూరంగా..  తన వీఐపీ క్లయింట్లు అత్యంత గోప్యతను పాటించడం మార్క్ సీడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. మార్క్ సీడ్ .. హాలీవుడ్ తారల కోసం అత్యద్భుతమైన విలాసవంతమైన వివాహ ఏర్పాట్లు చేయడంలో ఆయన చాలా ఫేమస్ అని చెప్పాలి.

పెళ్లికి సుమారు 50 మిలియన్ డాలర్లు:
న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఈ అద్భుతమైన వివాహానికి 50 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేశారు. ఈ భారీ బడ్జెట్‌లో అధిక భాగం వేదికను బుక్ చేసుకోవడానికి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడానికి, ఆడంబరమైన అలంకరణలకు,  అతిథులకు ఆహారపానీయాలు అందించడానికి వెచ్చించారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ను అద్దెకు తీసుకోవడానికి, అలాగే అద్భుతమైన వివాహ పెవిలియన్, సెట్‌ను నిర్మించడానికి మాత్రమే సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.

2023లో స్నేహంగా ప్రారంభమైన వారి ప్రయాణం, ఆ తర్వాత ప్రేమగా వికసించింది. ఈ జంట 2025 ఆగస్టు 26న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 సార్లు గ్రామీ అవార్డు విజేత టేలర్ స్విఫ్ట్,  మూడుసార్లు సూపర్ బౌల్ ఛాంపియన్ ట్రావిస్ కెల్సీల వివాహం వారి అభిమానులకు ఒక కల నిజమైన క్షణం అని చెప్పాలి. .

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement

రేపు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌కు రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే!

Midjil, Telangana:

Revanth Reddy Midjil Visit: రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన అనంతరం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రేవంత్‌ రెడ్డి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రాంతానికి రేపు రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు. తన రెండు దశాబ్దాల రాజకీయ వార్షికోత్సవాన్ని చేసుకోనున్నారు. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు తాను ఎదగడానికి కారణమైన గడ్డకు కృతజ్ఞత చెప్పుకునేందుకు మిడ్జిల్‌ ప్రాంతంలో రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నారు.

20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి జన్మనిచ్చిన నేలకు వందనం చెప్పేందుకు రేవంత్ రెడ్డి వెళ్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. రేపు శనివారం ముఖ్యమంత్రి నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్‌ మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లనుండడంతో ఈ పర్యటన రాజకీయంగా, భావోద్వేగంగా ప్రత్యేకత సంతరించుకుంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.

షెడ్యూల్‌ ఇదే!
==> రేపు ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు బయలుదేరుతారు.
==> 12.30 గంటలకు ఉర్కొండపేట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి  ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
==> ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేసి శంకుస్థాపన. అనంతరం ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నాయకులు, ఆనాటి పెద్దలతో మాటామంతీ జరపనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. 
==> మధ్యాహ్నం 2.30 గంటలకు ఉర్కొండపేట నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌కు బయలుదేరుతారు.
==> 2.45 గంటలకు మిడ్జిల్‌ మండలం వెల్జాల క్రాస్‌ రోడ్డు‌కు చేరుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ
==> మధ్యాహ్నం 3 గంటలకు మిడ్జిల్‌ బహిరంగ సభా ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు.
==> సాయంత్రం 3.15 గంటలకు మిడ్జిల్‌లో జరిగే బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం

కృతజ్ఞతా సభ
2006లో మిడ్జిల్‌ జడ్పీటీసీగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రేవంత్‌ రెడ్డి, 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రిగా  ప్రజలకు తన కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రస్థానంలో మిడ్జిల్‌ ప్రజల ఆశీర్వాదం కీలకమని భావిస్తున్నారు.

0
0
Report
Advertisement

ముగ్గురు మంత్రులు వర్సెస్‌ ఒకే ఒక్కడు.. ఆసక్తిగా ఖమ్మం జిల్లా రాజకీయాలు

Khammam, Telangana:

Khammam Politics: బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో పువ్వాడ అజయ్ కుమార్‌ ఖమ్మం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంటయ్యారు. ఓటమిని జీర్ణించుకోకపోవడం.. వ్యక్తిగత కారణాలతో అజయ్ గులాబీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించలేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి జిల్లాలో విసృతంగా ఆయన పర్యటిస్తున్నారు. వారానికి రెండు, మూడు సార్లు జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు చురుగ్గా మారారు.

మరోవైపు రాష్ట్ర పార్టీ కూడా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. ఎందుకంటే ముగ్గురు కీలక మంత్రులు జిల్లాలో ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు వరుస పర్యటనలు చేశారు. దీంతో ఒక్కసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రజల్లో కొంత అసహనం ఉండడంతో దానిని క్యాచ్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. పార్టీ బలోపేతం, కార్యకర్తలకు భరోసా ఇవ్వటానికి మాజీ మంత్రి అజయ్‌కి పార్టీ ఆదిష్టానం కీలక బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పువ్వాడ జిల్లాలో యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్‌తో పువ్వాడ అజయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడం జిల్లాలో పువ్వాడకు కలిసొచ్చింది. కీలక నాయకులు ఉన్నప్పటికీ పువ్వాడపైనే భారం వేసినట్లు సమాచారం.

ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల పనితీరుపై పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా అజయ్‌ కుమార్‌ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో తన హయాంలో ఖమ్మంలో జరిగిన అభివృద్దిని వివరిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అంటూ తుమ్మలపై విరుచుపడుతున్నాడు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తుమ్మల వర్సెస్ పువ్వాడ అనే రీతీలో అజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇటీవల కాలంలో పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అజయ్‌ కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని..  వచ్చే ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ సీట్లు సాధిస్తామనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న క్రమంలో ఇప్పటి నుంచే పువ్వాడ జిల్లాలో వ్యూహాలు అమలు చేస్తున్నారని‌ సమాచారం.

అయితే అజయ్ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్న జిల్లా నాయకులు ఆయనకు సహకరించడం లేదనే ప్రచారం నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్‌తో పాటు పలువురు ఒక జట్టుగా పనిచేస్తున్నారని సమాచారం. వీరంతా అజయ్ పర్యటనలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్న కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికలలో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పువ్వాడ చెబుతున్నారు. చూడాలి పువ్వాడ అజయ్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.

0
0
Report

తెలంగాణ అప్పుల చిట్టా ఇదే! జూపల్లికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

Hyderabad, Telangana:

Telangana Debts: బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ఖడించారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల గురించి వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకి బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు విడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపించారు. అప్పులపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.

'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం' అని కాంగ్రెస్‌ తీరుపై మాజీ మంత్రి హరీశ్‌ రావు అసహనం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపా. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటా. ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించా' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు గుర్తుచేశారు.. 

'మీరు (జూపల్లి) రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు' అని లేఖలో మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రస్తావించారు. '2026 మార్చి 18న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు' అని వీడియోతో సహా హరీశ్‌ రావు వివరించారు.

'మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం. నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే' అని మంత్రులకు మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. 'బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్‌కు పంపిస్తున్నా. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నా' అని లేఖలో జూపల్లికి హరీశ్‌ రావు సూచించారు. ఇకనైనా అప్పుల విషయంలో రేవంత్‌ రెడ్డి, మంత్రులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

0
0
Report

iQOO నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. 6500mAh బ్యాటరీతో iQOO Z11i విడుదల.. ధర ఎంతంటే?

Hyderabad, Telangana:

iQOO Z11i Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ iQOO Z11i స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా మార్కెట్లోకి లాంచ్‌ చేసింది.. వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఫీచర్లతో.. ముఖ్యంగా భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనా మార్కెట్లో అడుగుపెట్టిన్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ధరకి సంబంధించిన వివరాలు..
ఈ iQOO Z11i స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. మొదటి వేరియంట్ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ భారత కరెన్సీలో సుమారు రూ.18,000తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ధర రూ.21,000తో లభించనుంది. ఇక చివరి హైఎండ్‌ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.24,000లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇంక్ షాడో (Ink Shadow), కింగ్‌ఫెంగ్ (Qingfeng)తో పాటు డెసర్ట్ గోల్డ్ (Desert Gold) అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

డిస్‌ప్లే అద్భుతం..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 అంగుళాల LCD ప్యానెల్ డిస్‌ప్లేను అందించినట్లు కంపెనీ తెలిపింది.. ఇది HD ప్లస్ (1600 x 720 పిక్సెల్స్) రెసల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. కంటి రక్షణ కోసం TÜV Rheinlandలో బ్లూ లైట్ సర్టిఫికేషన్, DC డిమ్మింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..
ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (Snapdragon 4 Gen 2) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో రన్ అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఇదిలా ఉంటే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. iQOO Z11i వెనుక భాగంలో ఆటోఫోకస్ లెన్స్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 1080p క్వాలిటీతో వీడియో రికార్డింగ్ చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉండడం విశేషం.. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది.. అలాగే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 6500mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top