icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Bhogapuram Airport: ప్రధాని మోదీ పర్యటనకు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు

Bhogapuram, Andhra Pradesh:

PM Modi AP Tour: భోగాపురం అల్లూరి సీతారామారాజు ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం రేపు అట్టహాసంగా జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి చేసిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. మొత్తం ఏడు వేల మందితో భద్రతా ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

విమానాశ్రయ ప్రాంతాన్ని ప్రధానంగా 13 విభాగాలుగా విభజించాలని, వాటిని  89 సెక్టార్లుగా చేసి, ప్రతి సెక్టార్‌కూ 80 నుంచి 100 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ బందోబస్తు విధుల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బలగాలను రప్పించగా, వారిలో 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు డీజీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. అత్యంత ప్రశాంతంగా జరిగేలా దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు.

సభా ప్రాంగణం, ఎయిర్‌పోర్ట్ జోన్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఔటర్ పెరిఫెరల్ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు, మెటల్ డిటెక్టర్లతో కూడిన క్రైమ్ టీమ్స్ వారం రోజుల నుంచే తనిఖీలు చేపట్టాయని జిల్లా ఎస్పీ తెలిపారు. నేరాలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించామని, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే సభ, ఎయిర్ పోర్ట్ ప్రాంగణంను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి.

ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాలను, గ్రామాలను సందర్శించి భద్రతా దళాలు పూర్తి పట్టు సాధించాయి. ప్రధాని  సభలో ప్రముఖులు పాల్గొననున్న కారణంగా భద్రత కట్టుదిట్టం చేసి, నాలుగంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సభ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు, 5,000 బస్సులు, ద్విచక్ర వాహనాలతో సహా 7,000 వరకు వీఐపీ, ఇతర ప్రైవేటు వాహనాలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.

పార్కింగ్ స్థలాలు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం సందర్భంగా తీవ్ర ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనాలు దారి మళ్లించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలు: జాతీయ రహదారి-16 పైన ఆనందపురం జంక్షన్ మీదుగా రాజాపులోవ జంక్షన్‌కు చేరుకుని.. అక్కడ కొత్తగా నిర్మించిన ట్రంపెట్ బ్రిడ్జ్ వద్ద కుడివైపునకు మళ్లి పార్కింగ్ స్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది.

శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలు: జాతీయ రహదారి-16 మీదుగా వచ్చి భోగాపురం పరిధిలోని ముంజేరు జంక్షన్ లేదా కంచేరు-రావివలస జంక్షన్ల వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లి పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి.
వీఐపీల పార్కింగ్‌: వీఐపీల వాహనాలు నేరుగా వీఐపీ పార్కింగ్‌కు చేరేలా సవరవల్లి జంక్షన్ నుంచి సన్ రే రిసార్ట్స్ సర్వీస్ గేటు మీదుగా ఎయిర్ పోర్టు ప్రాంతంలోకి చేరుకొనే విధంగా రహదారి ఏర్పాటు

సభా ప్రాంగణానికి కేవలం 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించారు. మార్గమధ్యంలో వాహనాలు నిలిపివేస్తే వెనుక వచ్చే వాహనాలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉండడంతో ప్రతిఒక్కరూ కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకొనేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

అత్యవసర సర్వీసులు, నిబంధనలు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు 'నో ఫ్లైయింగ్ జోన్' ప్రకటించారు. డీజీసీఏ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు డ్రోన్లు ఎగరవేస్తే వాటిని జప్తు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు.

అత్యవసర ప్రయాణాలు వాయిదా
రేపు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అత్యవసరం అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్‌ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు
ఎమర్జెన్సీ పరిస్థితుల ఎదురైతే తక్షణ వైద్యం అందించేందుకు పలుచోట్ల మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేకంగా ఒక కారిడార్‌ను ఖాళీగా ఉంచినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

0
0
Report
Advertisement
Advertisement

PM Modi Bhogapuram Visit: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధానమంత్రి మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే!

Bhogapuram, Andhra Pradesh:

PM Modi Bhogapuram Schedule: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో గత వారం రోజులుగా అధికార యంత్రాంగం విశాఖపట్నంలోనే ఉంటూ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు కార్యక్రమంలో గడపనున్నట్లు షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది. అయితే ప్రధాని రాకకు సంబంధించిన మినిట్-టూ-మినిట్ షెడ్యూల్ వివరాలను తెలుసుకుందాం.

ఉదయం 10:45: ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వస్తారు.

10:45 - 10:50: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతారు.

10:50 - 10:55: రోడ్డు మార్గాన ప్రయాణికుల టెర్మినల్ భవనానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.

10:55 - 10:58: 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు.

11:00 - 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలన.

11:17 - 11:25: టెర్మినల్ భవనం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.

11:30 - 12:55: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత శిలాఫలక ఆవిష్కరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, బహిరంగ సభలో ప్రసంగం.

మధ్యాహ్నం 1:05 - 1:10: భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.

రవాణా, భారీ జనసమీకరణ ఏర్పాట్లు
ప్రధాని పర్యటన, బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో రవాణా శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మొత్తం 5,000 వాహనాలను సిద్ధం చేశారు. ఇందులో 2,000 ఆర్టీసీ బస్సులు, 3,000 ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. ప్రజలు అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకునేలా రవాణా అధికారులు అన్ని మార్గాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు దాదాపు 3 లక్షల మందితో భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

Also Read: IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!

Also REad: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..భారీ వర్షాలు, బోనాల సందడి..వరుసగా 4 రోజులు సెలవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rega Kantha Rao: యువతిపై లైంగిక వేధింపులు..? మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు

Hyderabad, Telangana:

Rega Kantha Rao Case: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పార్టీ అగ్ర నాయకత్వంపై కేసులు నమోదవుతుండడం.. విచారణ సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటుండగా తాజాగా మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. యువతిపై లైగింక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కాంతారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బీఆర్ఎస్ పార్టీ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవడం సంచలనంగా మారింది. కాంతారావు తనను లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం. ఆమె ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి మోసం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్ చానెల్ పేరుతో తన ఫ్లాట్‌కు పిలిపించి వేధించారని సంచలన ఆరోపణలు చేశారు.

పెళ్లి విషయమై ప్రశ్నిస్తే కాంతారావు తన ప్రైవేటు ఫొటోలతో బ్లాక్ మొయిల్ చేస్తున్నారని యువతి తీవ్ర ఆరోపణలు ఫిర్యాదులో చేశారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని పోలీసులకు వివరించారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈనెల 26వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా బయటకు వచ్చింది. అయితే ఈ కేసు విషయమై కాంతారావు కానీ ఆయన వర్గం నుంచి ఎలాంటి స్పందన లేదు. యువతి చేసిన ఆరోపణలు నిజమా కాదా? అనేది కాంతారావు విచారణకు వస్తే.. లేదంటే బయటకు వచ్చి విషయాలు చెబితే తెలిసేది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రేగా కాంతారావు
తనపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ కాకుండా న్యాయస్థానాన్ని రేగా కాంతారావు ఆశ్రయించారు. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. లైంగిక ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని రేగా కాంతారావు కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానం విచారించి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.

విచారణకు కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేసులో మాజీ ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ను ఏసీబీ విచారణ చేస్తోంది. గురువారం విచారణకు హాజరవగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25వ తేదీకి విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా కేటీఆర్‌ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

0
0
Report

స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. 185Hz డిస్‌ప్లే, Bose స్పీకర్లతో Redmi K100 Pro ఎంట్రీ..

Hyderabad, Telangana:

Redmi K100 Pro Price: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) త్వరలోనే మార్కెట్లోకి దిమ్మతిరిగే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. రెడ్‌మి K100 ప్రో (Redmi K100 Pro) పేరుతో ఈ ఫోన్ విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాలు స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఎంతగానో ఆకర్శిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఫీచర్స్‌తో పాటు డిజైన్‌ టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, లీక్‌ అయిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

విడుదలైన పోస్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత అద్భుతమైన చేరీ రెడ్ (Cherry Red) కలర్ వేరియంట్‌లో విడుదల కాబోతోంది. దీని ప్రీమియం ఫినిషింగ్ యూజర్లను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ ఫోన్ ప్రధాన హైలైట్లలో మొదటిది దీని డిస్‌ప్లేగా భావించవచ్చు. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అరుదైన 185Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్‌ను ఇందులో అందిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనివల్ల హై-ఎండ్ గేమింగ్, యాప్స్ స్క్రోలింగ్‌తో పాటు వీడియోలు చూసేటప్పుడు అత్యంత స్మూత్ అనుభూతిని అందిస్తుందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

200MP ప్రధాన కెమెరా..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ (200MP) ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనితో పాటు ఆల్ట్రా-వైడ్‌తో పాటు టెలిఫోటో లెన్స్‌లు కూడా అందుబాటులో ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.. ఆడియో లవర్స్ కోసం Bose (బోస్) ట్యూన్ చేసిన స్పీకర్లను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది..

గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత వేగవంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది.. మల్టీటాస్కింగ్ కోసం ఏకంగా 16GB RAMను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. బెంచ్‌మార్క్ పరీక్షల్లో సింగిల్ కోర్‌లో 3,429 పాయింట్లతో పాటు మల్టీకోర్‌లో 10,461 పాయింట్లు సాధించి తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను నిరూపించుకున్నట్లు కూడా సమాచారం..

భారీ బ్యాటరీ..
యూజర్లు ఎక్కువ సమయం ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా వాడేందుకు ఇందులో 8000mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు సమాచారం. సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, నీరు, ధూళి నుంచి ప్రొటక్షన్ పొందేందుకు IP68, IP69 రేటింగ్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

చైనాలో జరగనున్న ప్రముఖ ChinaJoy ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది శక్తివంతమైన కెమెరాతో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, విప్లవాత్మక డిస్‌ప్లేతో రాబోతున్న ఈ Redmi K100 Pro స్మార్ట్‌ఫోన్‌, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని కనిపిస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

AP Electoral Roll: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదా విడుదల..44 లక్షల ఓట్ల తొలగింపు..మీ పేరు ఉందో లేదో ఇప్పుడే చూసుకోండి!

Vijayawada, Andhra Pradesh:

AP Electoral Roll Draft: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో సరైన సమాచారం లభించకపోవడంతో సుమారు 44.71 లక్షల ఓట్లను 'అన్‌కలెక్టబుల్' (సేకరించలేనివి) వర్గంలో చేర్చి తొలగించారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 71 లక్షల 38 వేల 206 మందితో ముసాయిదా జాబితాను ఖరారు చేశారు.

ముఖ్యమైన తేదీలు, గడువులు
అభ్యంతరాలు, పేర్ల నమోదుకు చివరి తేదీకి గడువుగా వచ్చే నెల (ఆగస్టు) 31 వరకు అవకాశం కల్పించారు. అయితే ఆ అభ్యంతరాల గడువును సెప్టెంబరు 28 వరకు ఎన్నికల సంఘం అధికారులు వీటిని పరిశీలిస్తారు. ఫైనల్ బాబితాను అక్టోబరు 3న విడుదల చేయనున్నారు.

మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఎలా?
తాజా పరిణామాల నేపథ్యంలో మీ ఓటు ముసాయిదా జాబితాలో ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించడం ముఖ్యం. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLOs) ద్వారా లేదా అధికారిక ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా పరిశీలించవచ్చు.

ఒకవేళ తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించించారని భావించేవారు, లేదా 2002 ఓటర్ల జాబితాలో ఉండి మ్యాపింగ్ చేసుకోలేని వారికి నోటీసులు జారీ అవుతున్నాయి. ఆధార్‌తో పాటు ఈసీ సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవచ్చు.

కొత్త ఓట్ల నమోదు, మార్పులు: ఓటు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవడానికి, అడ్రస్ మార్పు లేదా ఇతర సవరణల కోసం తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల రోజుల పాటు గడువు ఇచ్చారు.

మీ ఓటు గైర్హాజరైతే లేదా జాబితాలో మార్పులు చేర్పులు ఉండాలనుకుంటే, నిర్ణయించిన గడువులోగా (ఆగస్టు 31 లోపు) సంబందిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలా చేసుకోని పక్షంలో అక్టోబరులో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో మీరు పేరును శాశ్వతంగా తొలగించవచ్చు.

Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

Also REad; ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OnePlus ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ.20 వేల లోపే OnePlus N6x లాంచ్!

Hyderabad, Telangana:

OnePlus N6x India Launch: వన్ ప్లస్ ప్రియులకు అద్భుతమైన గుడ్‌న్యూస్‌.. భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని.. OnePlus కంపెనీ మార్కెట్‌లోకి దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ OnePlus N6x స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ చేయబోతోంది. ముఖ్యంగా ఇది ఎన్నో రకాల పవర్‌ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం డిజైన్‌ సెటప్‌తో విడుదల కాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
వన్‌ప్లస్‌ లవర్స్ కలలో కూడా ఊహించని విధంగా.. ఏకంగా 7,000mAh డిస్ట్రక్టివ్ బ్యాటరీ పవర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రాబోతోంది.. కంపెనీ సమాచారం ప్రకారం.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 2.5 రోజుల పాటు ఫోన్ తిరుగులేకుండా పనిచేస్తుంది. ఒక్క సింగిల్ ఛార్జ్‌తో 20 గంటలకు పైగా నాన్‌స్టాప్ వీడియో ప్లేబ్యాక్, 133 గంటలకు పైగా మ్యూజిక్ ఎంజాయ్‌మెంట్, 25 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా 11 గంటల నిరంతర వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. ఇది వింటుంటేనే టెక్ ప్రియుల్లో పూనకాలు తెప్పిస్తోంది..

కళ్లు చెదిరే లుక్స్.. 
కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. ఫోన్ లుక్స్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇక దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన స్మూత్ అండ్ ప్రీమియం ఫ్లాట్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ ఐస్ బ్లూ (Ice Blue), బర్గుండీ రెడ్ (Burgundy Red)తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు టెక్స్చర్డ్ ఫ్లాట్ రియర్ ప్యానెల్, మెరుపులు మెరిపించే LED ఫ్లాష్ లైట్‌తో ఎంతో స్టైలిష్‌గా డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

యూజర్ల అనుభవాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు పవర్‌ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఇందులో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లో ప్రత్యేక మైక్రోసైట్ కూడా రన్‌ అవుతుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. గతేడాది విడుదలైన వన్‌ప్లస్ N6 రూ.22,999 ప్రారంభ ధరతో ఆకట్టుకోగా.. ఈ కొత్త N6x మోడల్ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా అత్యంత రీజనబుల్ అండ్ అఫర్డబుల్ ప్రైస్‌లో రాబోతున్నట్లు సమాచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

శ్రావణ మాసంలో 3 శక్తివంతమైన గ్రహాల కదలిక.. ఈ 5 రాశుల వారికి అపార ధన లాభం!

Hyderabad, Telangana:

Sravana Masam Horoscope: శ్రావణ మాసంలో అరుదైన గ్రహాలు కదలికలు చేయబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో దేవగురు బృహస్పతి, బుధుడు, శని గ్రహాల కదలికల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి.. జులై 19న గురుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించగా.. జులై 25న బుధ గ్రహం కదలికలు చేసింది.. అలాగే జులై 27న శని దేవుడు మీన రాశిలో వక్రగమనం ప్రారంభించాడు.

ఈ మూడు శక్తివంతమైన గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఏర్పడిన రాజయోగం ఫలితంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా 5 రాశుల వారికి పరమశివుడి ప్రత్యేక ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి.. వీరి ఆర్థిక పరిస్థితులు కూడా రెట్టింపు అవుతాయి.. కెరీర్, వ్యాపారాలలో ఊహించని విజయం సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:

కర్కాటక రాశి (Cancer)
శ్రావణ మాసంలో గురుడు పుష్య నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా తప్పకుండా జరుగుతాయి.. కొత్త ఇళ్లతో పాటు వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.

మేష రాశి (Aries)
గురుగ్రహ సంచారంతో పాటు బుధుడి ప్రభావంతో మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తువుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెంపుతో పాటు కొత్త ఉద్యోగావకాశాలు కూడా సులభంగా లభిస్తాయి.. ఆఫీసులో ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది..

మిథున రాశి (Gemini)
మిథున రాశికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో గురు గ్రహ శుభ ఫలితాల వల్ల వీరి ఆర్థిక స్థితి అత్యంత సానుకూలంగా మారుతాయి.. పాత బాకీలు, నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఖరారవుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.

తులా రాశి (Libra)
శని వక్రగమనం, గురు, బుధుల అనుకూల స్థితి తులా రాశి వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది.. విదేశీ వ్యాపారాలు లేదా విదేశీ సంబంధిత ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. 

మీన రాశి (Pisces)
మీన రాశిలోనే శని వక్రించినప్పటికీ.. గురు, బుధ గ్రహాల అనుకూలత వల్ల పాత సమస్యలు, మానసిక ఒత్తిడుల నుండి విముక్తి కలుగుతుంది.. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. గతంలో చేసిన పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కలుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

ఆగస్టులో వీరికి పట్టిందల్లా బంగారమే.. ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది!

Hyderabad, Telangana:

August Horoscope:  ఆగస్టు నెల ప్రారంభంతోనే గ్రహాల కదలికలు జరగబోతున్నాయి. శ్రావణ మాసపు సమయంలో, అరుదైన గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా శుక్రుడు, అంగారక గ్రహాలు సంచారం చేయడంతో పాటు, దానికి తోడు సూర్య భగవానుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల విశ్వంలో అద్భుతమైన ధనయోగం, సానుకూల ప్రభావం ఏర్పడబోతోంది.. ఈ ఆగస్టు నెల ముఖ్యంగా 4 రాశుల వారికి సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని, ఆనందం లభిస్తుంది. అంతేకాకుండా ఊహించని అదృష్టం కూడా పొందుతారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే కాబోతోంది.. ఆగస్టు నెల మొత్తం అదృష్టం వీరికే లభించబోతోంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు శుభవార్తలు కూడా పొందుతారు.. అంతేకాకుండా వ్యాపారాలు చేస్తున్నవారు చేసే ప్రయాణాలు విశేష లాభాలను కూడా పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఆగస్టు నెల ఎంతో అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులతో పాటు చట్టపరమైన చిక్కుల నుంచి పూర్తీ విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భూములతో పాటు ఆస్తుల వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు పొందే ఛాన్స్‌లు కనిసిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది..

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ నెల ఎంతో అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తుంది. అపారమైన విజయాలు కూడా సులభంగా పొందుతారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా ప్రతిభకు తగిన గుర్తింపు కూడా సులభంగా లభిస్తుంది. పైఅధికారుల నుంచి అద్భుతమైన మద్దతు లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలనుకునే వారి కల ఈ నెలలోనే నెరవేరబోతోంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ ఆగస్టు నెల అద్బుతంగా ఉంటుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయాలు కూడా సులభంగా లభిస్తాయి. ఆదాయ మార్గాల నుంచి కూడా అద్భుతమైన ధన లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు, కార్యాలయంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాల్లో మధురమైన క్షణాలు చోటుచేసుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Harish Rao: ఇంజనీర్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

Siddipet, Telangana:

Harish Rao vs Revanth Reddy: 'కాంగ్రెస్ మేనిఫెస్టోను సమాధి చేశారా.. 32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవి? ప్రశ్నించే గొంతులపై ఏసీబీ, సీఐడీ అక్రమ కేసులు.. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, ఎవరూ భయపడొద్దు' అని ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు భరోసా ఇచ్చారు. 'చాక్‌పీస్ కొనేందుకు పైసల్లేవు, స్కావెంజర్లకు జీతాల్లేవు.. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కంప్లీట్ ఫెయిల్' అని రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే.. ఉద్యోగుల ఓపీఎస్, డీఏల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలో పాల్గొని మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగుల అంశాలతోపాటు రేవంత్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు స్పందించారు. 'సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మీరు అడుగుతున్నది ఎలాంటి గొంతెమ్మ కోరిక కాదు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ నాయకులు చేతులు జోడించి తాము అధికారంలోకి రాగానే ఓపీఎస్ తెస్తామని ఆపద మొక్కులు మొక్కి నమ్మబలికారు' అని గుర్తుచేశారు. 

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి పుణ్యకాలం సగం దాటిపోయి 32 నెలలు అవుతోంది. విజ్ఞప్తులు చేసినా రేవంత్‌ రెడ్డి స్పందించకపోవడంతో రోడ్డెక్కారు. ఎన్నికల ముందు మాత్రం ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు అన్నీ వెంటనే ఇస్తామని, అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామని, ఓపీఎస్ తెస్తామని మేనిఫెస్టోలో పెట్టి నమ్మించారు' అని కాంగ్రెస్‌ మోసాలు మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. 'మీరు ఇచ్చిన గ్యారెంటీలను సమాధి చేశారా?  ఆ మేనిఫెస్టో ఈ రోజు ఒక చిత్తుకాగితంగా మారిపోయిందా? ఒక్కటైనా అమలు చేశారా?' అని రేవంత్‌ రెడ్డిని నిలదీశారు.

'ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. సరైన సమయంలో వారు మీకు తప్పక గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి' అని కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్ సాధనపై రేవంత్‌ రెడ్డిని నిలదీస్తామని.. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే మీకోసం గళం విప్పుతామని ప్రకటించారు. రేవంత్‌ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని.. అక్రమ కేసులు, విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ ఎంక్వైరీలు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు వివరించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. 'ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా 8 నెలల పాటు ఈ ప్రభుత్వం కట్టలేదు. అసెంబ్లీలో మేము నిలదీస్తే అప్పుడు కట్టడం మొదలుపెట్టారు. కాంట్రిబ్యూషన్ కూడా కట్టకుండా మిమ్మల్ని ఎలా మోసం చేస్తోందో ఒక్కసారి ఆలోచించాలి' సీపీఎస్‌ ఉద్యోగులకు సూచించారు.

'రేవంత్‌ రెడ్డికి ఎక్కడ, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. స్కూల్ పిల్లల ముందు బూతులు మాట్లాడుతారు. ఉపాధ్యాయులను అవమానపరిచేలా మీరు చదువు చెప్పిన ఇంజనీరింగ్ పిల్లలకు కనీసం దరఖాస్తు కూడా రాయరాదు అని హేళన చేశారు. ఇది మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానించడమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. 'ఉపాధ్యాయులు తమ స్కూళ్ల సమస్యలు అడగొద్దట.నేనెందుకు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావా..? నువ్వు బాగా చేశావో లేదో పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజలు మార్కులు వేయాలి' అని పేర్కొన్నారు.

'విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా స్కూల్ గ్రాంట్స్ రాలేదు, స్కూళ్లలో చాక్‌‌పీస్ కొనుక్కునేందుకు కూడా పైసలు లేవు. స్కావెంజర్లకు 7 నెలల జీతాలు లేవు. పిల్లలకు ఇప్పటిదాకా యూనిఫామ్స్ రాలేదు. మన ఊరు  మన బడి ఆపేశారు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి హరీశ్‌ రావు ఏకరువు పెట్టారు. 'మధ్యాహ్న భోజనంలో గుడ్ల ధరలు పెరిగినా, కనీసం పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని ముఖ్యమంత్రి నువ్వు. ఎంఈఓ, డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్కటీ నింపలేదు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అన్నావు, ఉత్తిదే' అని తెలిపారు.

'పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెగా డీఎస్సీ అన్నావు, ఉత్తిదే అయిపోయింది. విద్యాశాఖలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినట్టు?' అని రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రశ్నించారు. 'ఇంతటి వైఫల్యాలు పెట్టుకుని, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా రాణిస్తూ మన రాష్ట్రానికి పేరు తెస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని ముఖ్యమంత్రి 'క్రిమినల్ వేస్ట్' అనడం అత్యంత దారుణం. ఆ పిల్లలను, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించారు' అని వివరించారు. 'అసలు రేవంత్‌ రెడ్డికి మైండ్ సరిగా లేదు. మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు, ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top