మూసి పైన బిజెపి నేతలు కొత్త డ్రామాలు : బీర్ల ఐలయ్య
Yadagirigutta, Telangana:మూసి పైన బిజెపి నేతలు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్త డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తాననడం సిగ్గుచేటని, ఒక్కరోజు నిద్రలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం కిషన్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా అనేక బాధలను అనుభవిస్తూ నిరుపేదల నివసిస్తున్నారని తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
విదేశీ గడ్డపై భారత్కు తొలి విజయం.. ఇంగ్లండ్ వన్డే సిరీస్లో టీమిండియా అద్భుత ప్రదర్శన
England:IND vs ENG 1st One Day Highlights: విదేశీ పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు వరుసగా ఎదురవుతున్న వైఫల్యాల నుంచి బ్రేక్ లభించింది. విదేశీ పర్యటనలో భారత జట్టు అద్భుతం చేసి తొలి విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లో వాషౌట్ అయిన టీమిండియా వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లోనే ఇంగ్లండ్పై భారీ విజయాన్ని సాధించి ఊరట పొందింది. జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న ఆటగాళ్లు సత్తా చాటి విమర్శకులకు చెక్ పెట్టారు. ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై భారత్ గెలిచింది.
మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 28 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను సొంతం చేసుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ గిల్ 51 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. శుభ్మన్ గిల్ అద్భుత ప్రదర్శనకు తోడు అక్షర్ పటేల్ చక్కగా సహకరించడంతో సునాయాసంగా మ్యాచ్ భారత్ వశమైంది. 75 బంతులు ఆడిన గిల్ 80 పరుగులు చేసి కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ అయి మైదానం వీడాడు. అక్షర్ పటేల్ 52 బంతుల్లో 57 పరుగులతో అర్ధ శతకం చేసి మ్యాచ్ను ముగించాడు. చాలా రోజుల తర్వాత వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకం నమోదు చేశాడు. 63 బంతుల్లో 52 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులతో రాణించాడు. అక్షర్, సుందర్ నిలకడగా ఆడుతూ పరుగులు తీస్తూ 102 పరుగుల చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (1) తక్కువ పరుగులతో తీవ్ర నిరాశపర్చారు. లక్ష్యాన్ని కాపాడేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు పోరాడినా చేదు ఫలితం దక్కింది. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరన్ తలా ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 47.5 ఓవర్లలో 258 పరుగులకు కుప్పకూలింది. టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన ఉత్సాహంతో ఆడిన ఇంగ్లండ్ బోల్తా పడింది. జో రూట్, లియామ్ డాసున్ అర్ధశతకాలు పూర్తి చేశారు. బెన్ డకెట్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. జాకబ్ బెతెల్, విల్ జాక్స్, ఆర్చర్ తక్కువ స్కోరు చేశారు. హ్యారీ బ్రూక్ (1), జోస్ బట్లర్ (5), సామ్ కరన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. టీ20 సిరీస్ కోల్పోయినప్పుడు బాధపడిన భారత బౌలర్లు ఈ మ్యాచ్లో విజృంభించారు. అక్షర్ పటేల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు.
ముద్రగడ పద్మనాభం మృతికి తెలంగాణ ప్రముఖులు దిగ్భ్రాంతి.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సంతాపం
Baddipadaga, Telangana:Mudragada Padmanabham: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసిన ఏపీలో సామాజిక ఉద్యమాలు నడిపిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతితో తెలంగాణ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ముద్రగడ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ముద్రగడ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ సంతాపం
ముద్రగడ పద్మనాభం మరణంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నమ్మిన సిద్దాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడ అని కొనియాడారు. ముద్రగడ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగా పనిచేసిన ముద్రగడ గొప్ప ప్రజా నాయకుడు. ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి గొప్పది' అని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొనియాడారు.
'భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులు, అనుబంధ కులాలకు అందించాలనే తపనతో.. తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితకాలం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్న్యాయ రాజకీయ వేత్త ముద్రగడ పద్మనాభం. వారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. ఈ సమయంలో శోకతప్తులైన కుటుంబసభ్యులు, ముద్రగడ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.
కేటీఆర్ సంతాప ప్రకటన
'కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారు. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాప ప్రకటన విడుదల చేశారు.
ముద్రగడ పద్మనాభం మరణం పట్ల కేసీఆర్ సంతాపం
నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడ
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత… pic.twitter.com/tZoWFNQfzU
— BRS Party (@BRSparty) July 14, 2026
హరీశ్ రావు సంతాపం
'మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ప్రజా జీవితంలో ఆయన తనదైన ముద్ర వేసి.. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైనది. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా'
- హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి
తెలంగాణ సీఎం సంతాపం
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణించడం తీవ్ర విచారం. శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
డిప్యూటీ సీఎం ప్రకటన
'ముద్రగడ మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ప్రజా జీవితంలో ముద్రగడ పాత్ర చిరస్మరణీయం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతర పోరాటం చేశారు. సామాజిక న్యాయం కోసం ముద్రగడ కృషి ఎప్పటికీ గుర్తుంటుంది. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. ముద్రగడ పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'
- భట్టి విక్రమార్క, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
'కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'
- కవిత, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు
ముద్రగడ పద్మనాభం మృతికి చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ సంతాపం
Nuzendla, Andhra Pradesh:Mudragada Padmanabham: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతితో ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన పద్మనాభం ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, హరీశ్ రావు, కేటీఆర్, కవిత తదితరులు సంతాపం ప్రకటించారు.
సీఎం చంద్రబాబు సంతాపం
'మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్త విచారం కలిగించింది. పద్మనాభం కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా' అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.
తీవ్రంగా కలచివేసింది: వైఎస్ జగన్
'మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభం మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 'ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు' అని వైఎస్సార్సీపీ అధినేత గుర్తుచేశారు.
'ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి.. వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడేతత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం' అని ముద్రగడ పద్మనాభం సేవలను మాజీ సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు అని ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.
కుటుంబానికి వైఎస్ జగన్ ఫోన్
ముద్రగడ పద్మనాభం మృతితో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ఫోన్లో పరామర్శించారు. ముద్రగడ మరణం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని పద్మనాభం కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం ముద్రగడ సేవలు చిరస్మరణీయమని మాజీ సీఎం వైఎస్ జగన్ కొనియాడారు.
పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
'మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నా. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. 1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ముద్రగడ పద్మనాభం సతీమణికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబసభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా' అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
వైఎస్ షర్మిల సంతాప ప్రకటన
'కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. కాపుల హక్కులకోసం జీవితాంతం పోరాడిన వ్యక్తిగా, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా పద్మనాభం రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. పద్మనాభం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా' అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు.
Singarayakonda Suicide: రైలు కింద కుటుంబం మొత్తం ఆత్మహత్య..బావ హత్య కేసులో నిందితుడు దారుణం..అసలు నిజం ఇదే?
Singarayakonda, Andhra Pradesh:Singarayakonda Suicide News: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఆత్మహత్యల వెనుక ఒక ఘోరమైన హత్య, కోట్ల రూపాయల ఆస్తి వివాదం, పోలీసుల భారీ అవినీతి నెట్వర్క్ దాగి ఉన్నట్లు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన బావను పథకం ప్రకారం హత్య చేయించిన నిందితుడు హరికృష్ణ, పోలీసుల విచారణకు భయపడి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆస్తి వివాదం.. నమ్మించి గొంతు కోసిన బావమరిది
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన శ్రీహరి వ్యవసాయాధికారిగా విధులు నిర్వహించేవారు. ఆయన తన బావమరిది హరికృష్ణను అమితంగా నమ్మి, తనకున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అతని పేరున రాసిచ్చారు. కొంతకాలం తర్వాత శ్రీహరి ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరడంతో, హరికృష్ణ అతడిని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని క్రూరమైన పథకం వేశాడు.
ఇంజెక్షన్ ఇచ్చి దారుణ హత్య
బావను హతమార్చడానికి హరికృష్ణ ఇద్దరు వ్యక్తులకు సుపారీ (డబ్బులు) ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం.. జూన్ 15న శ్రీహరిని కారులో పెంచలకోనకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో ముందుగానే దారిలో కాపు కాసిన సుపారీ గ్యాంగ్ కారును అడ్డుకుంది. శ్రీహరికి బలవంతంగా కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి దారుణంగా ప్రాణాలు తీశారు. అనంతరం శ్రీహరి గుండెపోటుతో చనిపోయాడంటూ హరికృష్ణ నమ్మించే ప్రయత్నం చేశాడు.
వెలుగులోకి రూ.75 లక్షల అవినీతి డీల్
మృతుడు శ్రీహరి శరీరంపై స్పష్టమైన గాయాలు ఉన్నప్పటికీ, స్థానిక పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. హరికృష్ణ ఈ హత్యను పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ఏకంగా రూ.75 లక్షల భారీ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఒక పోలీస్ ఉన్నతాధికారి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.25 లక్షలు లంచంగా తీసుకున్నారు. మిగిలిన రూ.50 లక్షలను కింది స్థాయి పోలీసులకు, స్థానిక రాజకీయ నాయకులకు, మధ్యవర్తులకు హరికృష్ణ పంచిపెట్టాడు.
23 మంది పోలీసులపై వేటు
భర్త మరణంపై అనుమానం వచ్చిన శ్రీహరి భార్య లావణ్య, జూలై 6న జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసుల అవినీతి బట్టబయలు కావడంతో ఎస్పీ తీవ్ర చర్యలు తీసుకున్నారు. కేసును తప్పుదోవ పట్టించినందుకు స్థానిక సీఐతో పాటు స్టేషన్లో ఉన్న 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. సీఐను వీఆర్కు (Vacancy Reserve) పంపుతూ, అతడిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.
భయంతో కుటుంబంతో సహా బలవన్మరణం
ఎస్పీ జోక్యంతో కేసు దర్యాప్తు తీవ్రమవ్వడం, సుపారీ ముఠా పట్టుబడటంతో ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారయ్యాడు. చట్టం నుంచి తప్పించుకోలేనని భావించిన అతను, తీవ్ర మనస్తాపంతో మంగళవారం సింగరాయకొండలో తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఆస్తి ఆశ ముగ్గురి ప్రాణాలను బలిగొనడమే కాక, చివరకు నిందితుడి కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేసి అంతమొందించింది.
Also Read: Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!
Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mudragada Political Journey: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..ఆయన రాజకీయ నేపథ్యం ఇదే!
Hyderabad, Telangana:Mudragada Padmanabham Political Journey: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం (78) కన్నుమూశారు. గత నెల రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం నాటికి ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
జననం, కుటుంబ నేపథ్యం
ముద్రగడ పద్మనాభం 1948 మార్చి 7న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత కాకినాడ జిల్లా) కిర్లంపూడిలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే ప్రజా జీవితం వైపు ఆకర్షితులైన ఆయన, ప్రజా సేవలోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
రాజకీయ ప్రస్థానం, నిర్వహించిన పదవులు
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ, అతి తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 1978లో ఆయన మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికై ప్రజా సమస్యలపై గళం విప్పారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా (రాష్ట్ర స్థాయి బాధ్యతలు) కీలక పదవులను నిర్వహించారు.
ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్లోకి మారారు. అనంతరం ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ కాపు ఉద్యమమే శ్వాసగా బతికారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమం, తుని ఘటన..
ముద్రగడ పద్మనాభం పేరు వినబడగానే కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే పోరాటమే గుర్తుకొస్తుంది. కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన ఒక బలమైన గొంతుకగా నిలిచారు. అయితే 2016లో తునిలో ఏర్పాటు చేసిన కాపు రిజర్వేషన్ల కోసం బహిరంగ సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్పై దాడి వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన అనంతరం ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష, ఆయన అరెస్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో చేరిక
2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ముద్రగడ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)లో చేరిన ఆయన, తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీ చేసి రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించారు.
వారసత్వం, గుర్తింపు
ముద్రగడ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్లో ప్రారంభమయ్యి.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి, మళ్లీ కాంగ్రెస్ చేరి మళ్లీ ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర ఉద్యమానికి నాయకుడిగా ఉన్నారు. చివరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతగా చేరారు. ఏ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉండకుండా, తన డిమాండ్ల ఆధారంగానే రాజకీయ వైఖరిని మార్చుకునే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఆయన కుమారుడు ముద్రగడ గిరి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. కాపు ఉద్యమ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. కాపు ఉద్యమానికి ప్రతీకగా, తూర్పు గోదావరి రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చరిత్రలో నిలిచిపోతారు.
Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!
Also Read: "పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.." ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కొండగట్టు ఆలయంలో నిండు అమావాస్య రోజు నాగుపాము మృతి.. దేనికి సంకేతం?
Siddipet, Telangana:Kondagattu Temple: నిండు అమావాస్య.. దీనికితోడు తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. అమావాస్య రోజు ప్రముఖ ఆలయంలో నాగుపాము హల్చల్ చేసింది. కొద్దిసేపు హల్చల్ చేసిన నాగుపాము అకస్మాత్తుగానే చనిపోయింది. ఎలాంటి గాయం.. అనారోగ్యం లేకుండానే పాము ఆలయ ఆవరణలో మృతిచెందడం వైరల్గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజు నాగుపాము మృతి చెందడం కలకలం రేపింది.
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం అమావాస్య రోజున నాగుపాము ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన నాగుపామును భక్తులు ఆసక్తిగా తిలకించారు. అక్కడ ప్రత్యక్షమైన నాగుపాముకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున స్వామివారి సన్నిధిలో నాగుపాము దర్శనం ఇవ్వడాన్ని భక్తులు విశేషంగా భావించారు.
భక్తులు ఆసక్తిగా గమనిస్తున్న సమయంలోనే హఠాత్తుగా నాగుపాము చనిపోయింది. కొద్దిసేపటికే ఎలాంటి గాయాలు లేకుండా, ఎవరూ హాని చేయకపోయినా నాగుపాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయింది. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పాము ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యాదృచ్చికంగా జరిగిందా, లేక ఏదైనా సంకేతమా అనే కోణంలో భక్తులు చర్చించుకుంటున్నారు. అమావాస్య రోజున జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వాస్తవంగా అమావాస్యను ప్రతికూలంగా భావిస్తుంటారు. ఆ రోజు చెడు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. నిండు అమావాస్య రోజు ఇలా నాగుపాము ప్రముఖ పుణ్యక్షేత్రంలో చనిపోవడం వెనుకాల ఏమై ఉంటుందా? అని భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని.. చెడు సంకేతం అలాంటిది ఏమీ లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన నాగుపాము భక్తుల మధ్యకు రావడంతో ఎవరైనా దాడి చేయడంతో పాము మరణించి ఉంటుందని చెబుతున్నారు. దీనికి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు.
అనారోగ్యంతో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూత
Kirlampudi, Andhra Pradesh:Mudragada Padmanabham: కాపు సామాజికవర్గ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ పద్మనాభం కన్నుమూశారు. ఆయన మృతితో కాపు సామాజికవర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. పద్మనాభం మృతికి సీఎం చంద్రబాబుతోపాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నెల రోజులుగా హైదరాబాద్లో కిడ్నీలకు సంబంధించి చికిత్స పొందారు. క్యాన్సర్ బారిన కూడా పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్ నుంచి బుధవారం మృతదేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చే అవకాశం ఉంది.
ముద్రగడ పద్మనాభ రెడ్ది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన కాపు సంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2024 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమయంలో అకస్మాత్తుగా 2024 మార్చి 16వ తేదీన వైఎస్సార్సీపీలో చేరాడు.
ప్రముఖుల సంతాపం
ముద్రగడ పద్మనాభవం మృతితో ఏపీలోని ప్రధాన సామాజికవర్గమైన కాపు వర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. కాపులకు ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నడిపించాడు. కాపులకు సంబంధించిన డిమాండ్లు, సమస్యలపై తీవ్ర పోరాటం చేశారు.
పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. 1977లో తండ్రి హఠాన్మరణం పొందడంతో 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
కాపు ఉద్యమం
కాపుల సామాజికవర్గానికి ముద్రగడ పద్మనాభం కేంద్రంగా నిలుస్తున్నారు. 1994లో కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభతో కాపులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ల సాధనకు పోరాటం చేశారు. రైలు రోకో హింసాత్మకంగా మారింది.
పిఠాపురంలో హోరాహోరీ
కాపులకు ప్రతినిధిగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల్లో హల్చల్ చేశారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేశారు. ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ గెలవడంతో చేసిన మాట ప్రకారం కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు.
Nepal Elephant Attack: పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి.. మ్యాటర్ ఏమిటంటే..?
Hyderabad, Telangana:Dhurbe Elephant attack on same nepali family: సాధారణంగా మనం తరచుగా పాములు పగబడుతాయని వింటు ఉంటాం. దానికి ఎవరైన హనీ తలపెట్టిన లేదా, తోక తోక్కిన కూడా కోపంతో ఆ పనిచేసి వారిపై కాటు వేస్తాయి. కొన్నిసార్లు ఎన్ని రోజులైన కూడా పాములు పగ బడతాయని కొంత మంది నమ్ముతుంటారు. అయితే కొన్నిసార్లు ఇతర జంతువులు సైతం తమ పిల్లలకు అపకారం తలపెడితే దాడులు చేస్తాయి. మరీ నేపాల్ లో జరిగిన ఒక ఘటన స్థానికంగా అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తుంది.
నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో 'ధ్రుబే' అనే ఏనుగు సంచరిస్తుంది. ఈ ఏనుగు అక్కడ నివసించే వారి మీద దాడి చేసి వారిని పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో 2012 డిసెంబర్లో మాడి అనే పట్టణంలో ధ్రుబే ఏనుగు దాడి చేయడంతో శనిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి శనిచర ఈ ఏనుగు ప్రమాదం నుంచి బైటపడేందుకు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, రాప్తి నది దాటి దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్పూర్కు చేరుకున్నారు.
ఇంత దూరం వస్తే ఆ 'ధ్రుబే' ఏనుగు తమను ఏమిచేయదని భావించారు . కానీ వారు అనుకున్నదానికి రివర్స్ లో జరిగింది. 'ధ్రుబే' ఏనుగు దాదాపు.. 14 సంవత్సరాల తర్వాత, అదే ధ్రుబే ఏనుగు వాసన పసిగట్టి ... జగత్పూర్లోని శనిచర ఇంటిపై దాడి చేసింది. అతని 25 ఏళ్ల కోడలు ఆషికా బోటేను, 4 ఏళ్ల మనవడు భరత్ బోటేను అతి కిరాతకంగా కాళ్లతొ తొక్కి చంపింది. నార్మల్ గా ఈ ఏనుగు వారిపై ఎందుకంత పగను పెంచుకుందో మాత్రం విషయం బైటపడలేదు.
'ధ్రుబే' అత్యంత ప్రమాద కర ఏనుగు అని 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఒక్క ఏనుగే 25 మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో అసలు ఆ ఏనుగు అక్కడి వారిని ఎందుకంత టార్గెట్ చేసుకుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Read more: Agra Ice shivling in Fridge: వావ్ అద్భుతం.. ఫ్రిజ్లో అమర్ నాథ్ లింగంలా ఏర్పడిన మంచు ప్రతిరూపం.. వీడియో వైరల్..
మరోవైపు శనిచర అక్కడి నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలని స్థానికులు సూచించారు. ఇక ఫారెస్ట్ అధికారులు.. ధ్రుబే కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి దానికి ట్రాకింగ్ కాలర్ కూడా అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్ను మార్చినప్పటికీ, దానిని పూర్తిగా నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో ఏనుగు కూడా పగబడుతుందా అని జనాలు తలలు పట్టుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
ధర్మపురిలో వెలిసిన నరసింహ స్వామి.. నదిలో విగ్రహాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు..
Hyderabad, Telangana:Dharmapuri Latest News: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి గోదావరి నది తీరంలో పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం లభ్యమైంది. నదిలో లభించిన ఈ దివ్య మంగళ విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అస్సలు ఈ విగ్రహం ఎక్కడిది? ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చింది.? మొదట ఎవరు చూశారు? దీనికి సంబంధించని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇసుక తిన్నెల్లో లక్ష్మీనరసింహస్వామి..
గోదావరి నది దిగువ ప్రాంతంలో నిత్యం చేపల వేట సాగించే.. స్థానిక జాలర్లకు ఈ విగ్రహం తొలుత కనిపించింది. నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో.. ఇసుక కింద ఏదో విగ్రహం ఉన్నట్లు వారు గమనించారు. దగ్గరికి వెళ్లి ఇసుకను తొలగించి చూడగా.. సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం బయటపడింది. జాలర్లు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ విగ్రహాన్ని నది నుంచి సురక్షితంగా బయటకు తీసి.. నదీ తీరానికి చేర్చారు.
వరద ఉధృతికి కొట్టుకొచ్చిందా?
ఈ పురాతన విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందనే అంశంపై స్థానికంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందని సమాచారం. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు.. గోదావరి నది ఉధృతంగా ప్రవహించిన సమయంలో ఏదైనా ఆలయం నుంచి ఈ విగ్రహం కొట్టుకువచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. నదిలో వరద నీరు తగ్గి.. ఇసుక మేటలు వేయడంతో ఈ విగ్రహం బయటపడిందని అంచనా తెలుస్తోంది. అయితే, శతాబ్దాల చరిత్ర కలిగిన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విగ్రహం లభించడం వెనుక ఏదో దైవ సంకల్పం ఉందంటూ భక్తులు బలంగా నమ్ముతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
తులసి మాలలతో ప్రత్యేక పూజలు..
విగ్రహం బయటపడిన వార్త వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్నారు. స్వామివారి విగ్రహానికి పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి.. తులసి మాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ నామస్మరణతో గోదావరి తీరం మార్మోగిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించిన్నట్లు తెలుస్తోంది. దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని అంచనా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
KCR సోయి లేని నిర్ణయాల వల్లే సింగరేణికి ఈ దుస్థితి: ఈటల
Hyderabad, Telangana:Eatala Rajender Latest News: ఒకప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థగా ఉన్న సింగరేణి.. నేడు బ్యాంకుల నుంచి అప్పులు తెస్తే.. తప్ప కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయిందని BJP MP ఈటల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రామగుండంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత BRS ప్రభుత్వంపై, మాజీ CM కేసీఆర్పై ఈటల విమర్శల వర్షం కురిపించారు. సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
సభను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతు.. తాను సింగరేణి కార్మికులతో చాలా దగ్గరగా బతికారని.. వారి కష్టసుఖాలు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చేసిన సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోందని.. మీరు సమ్మె చేస్తే రాష్ట్రానికి కరెంటు ఎలా వస్తుందని అప్పట్లో చాలామంది విమర్శించారు.. బెదిరించారు. కానీ, కార్మికులు వేటికీ లొంగకుండా.. తెగించి పోరాడారని.. తెలంగాణ వస్తే సింగరేణికి పూర్వవైభవం వస్తుందని నమ్మి పోరాటం చేశారని.. కానీ, స్వరాష్ట్రంలో పూర్వవైభవం దేవుడెరుగు.. ఉన్న పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సోయి లేని నిర్ణయాల వల్లే..
గతంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సానుకూలంగా ఉంటూ.. సింగరేణి ప్రయోజనాలను కాపాడాయని.. కానీ కేసీఆర్ మాత్రం కక్షసాధింపు ధోరణితో.. కనీస సోయి లేకుండా ప్రవర్తించారని ఈటల విమర్శించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండకపోవడం వల్లే సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
అయితే, ప్రస్తుత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకప్పుడు బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో కొట్లాడిన నాయకుడని గుర్తు చేశారు. నేడు ఆయనే కేంద్రమంత్రిగా ఉండటం వల్ల సింగరేణిని నిర్వీర్యం కాకుండా కాపాడుతున్నారని కొనియాడారు.. సంస్థ పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల - 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని.. తద్వారా సంస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కార్మికుల సమస్యలన్నింటినీ కిషన్ రెడ్డి సానుకూలంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ఇతర రాజకీయ పార్టీలకు కేవలం ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతే... ప్రధాని నరేంద్ర మోడీ రూ. 6,300 కోట్లు కేటాయించి.. దానిని పునరుద్ధరించి తెలంగాణ రైతులకు అంకితం చేశారని ఈటల గుర్తు చేశారు. రాష్ట్రంలో నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, అత్యాధునిక రైల్వేస్టేషన్లతో పాటు కొత్త రైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి దాగి ఉందని నమ్మే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ తీవ్రంగా కాంక్షిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
గోడదూకి వచ్చి అఘాయిత్యం.. కళ్లముందే కన్నకూతురిని ఎత్తుకెళ్లిన POCSO కేసు నిందితుడు..
Hyderabad, Telangana:Addagudur Pocso Case: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.. షాబాద్ నరహంతకుడి అరాచక మారణకాండ సృష్టించిన భీభత్సం ఇంకా మరవక ముందే.. తాజాగా అడ్డగూడూరులో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.. ఓ వైపు మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు తెస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.. ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన పోక్సో కేసు నిందితుడు.. ఏకంగా అదే బాలికను కిడ్నాప్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గోడదూకి వచ్చి..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నిందితుడు అర్ధరాత్రి వేళ బాధితురాలి ఇంటి గోడదూకి లోపలికి ప్రవేశించాడు.. ఇంట్లో నిద్రిస్తున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు.. బాలిక అప్రమత్తమై కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. ఈ ఘోరంపై బాలిక కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి.. స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల నిర్లక్ష్యమే శాపమైందా?
కేసు నమోదైనప్పటికీ.. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (SI) వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.. పోక్సో చట్టం కింద అత్యంత కఠినమైన సెక్షన్లు నమోదైనప్పటికీ.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని.. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. SI నిందితుడిని రిమాండ్కు పంపకుండా.. స్టేషన్ నుంచే వదిలేశారని.. ఆ అండతోనే నిందితుడు మరింత బరితెగించాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
కళ్లముందే బాలికను ఎత్తుకెళ్లిన నిందితుడు..
పోలీసుల చల్లని చూపుతో స్వేచ్ఛగా తిరిగిన నిందితుడు.. తనపై ఫిర్యాదు చేశారన్న కక్షతో పగ పెంచుకున్నాడు.. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో బాలికను ఎత్తుకెళ్లాడు. చట్టం తనను ఏమీ చేయలేదనే.. ధీమాతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ రోజే నిందితుడిని జైలుకు పంపి ఉంటే.. ఈ రోజు మా బిడ్డ మా కళ్లముందే ఉండేది.. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయికి ఈ గతి పట్టింది.. అంటూ బాధితురాలి కుటుంబం సభ్యులు ఆందోళనకు దిగిన్నట్లు తెలుస్తోంది.
ఉలిక్కిపడ్డ స్థానికులు..
ఈ ఘటనతో అడ్డగూడూరు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. షాబాద్ ఘటన మరవక ముందే మరో బాలికకు ఇలాంటి అన్యాయం జరగడంపై మహిళా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని తక్షణమే పట్టుకుని బాధితురాలిని సురక్షితంగా తలిదండ్రుల చెంతకు చేర్చాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన SIపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు KTR, హరీష్ రావు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
Hyderabad, Telangana:KTR, Harish Rao are Brand Ambassadors for Lies: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండటం ఇష్టం లేని వీరిద్దరూ.. స్పైడర్ సినిమా విలన్లలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ లోయర్ మానేరు డ్యాం (LMD) సందర్శనను ఒక విహారయాత్రగా అభివర్ణించిన సత్యం.. రైతులపై ఆయన చూపిస్తున్నదంతా కపట ప్రేమేనని విమర్శించారు.
కరవు రావాలని కోరుకుంటున్నారు..
సాధారణంగా లోయర్, మిడ్ మానేరు డ్యాంలు జూలై ఆఖరు లేదా ఆగస్టు మాసాల్లో నిండుతాయని.. ఈ ఏడాది కూడా వర్షదేవుడి కటాక్షంతో ప్రాజెక్టులు సమృద్ధిగా నిండుతాయనే నమ్మకం తమకుందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, రాష్ట్రంలో కరవు రావాలి, పంటలు పండకూడదు.. ప్రజలు విలవిలలాడాలి.. తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనేదే కేటీఆర్, హరీష్ రావుల కుట్రపూరిత ఆలోచన అని ధ్వజమెత్తారు.. ఉద్దేశపూర్వకంగానే ప్రజలను, రైతులను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ వర్షాలు పడకపోతే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర పక్కా ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
హిట్లర్ పాలన పోయింది..
గత పదేళ్ల BRS పాలన హిట్లర్, ఫాసిస్ట్ పద్ధతుల్లో సాగిందని.. అందుకే ప్రజలు విసిగిపోయి.. ఆ పార్టీని బండకేసి కొట్టారని మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు. మీది ఫాసిస్ట్ పాలన అయితే.. మా సీఎం రేవంత్ రెడ్డిది హ్యుమనిస్ట్ పాలన అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ స్కీమ్ పెట్టినా అందులో స్కామ్ తప్ప తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని.. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని ఆరోపించారు. CM రేవంత్ రెడ్డి దూరదృష్టి ఉన్న నాయకుడని.. ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటారని భరోసా ఇచ్చారు.
అబద్ధాల పోటీలో నెంబర్ వన్ స్థానం..
అప్పట్లో హిట్లర్ పక్కన అబద్ధాలు ప్రచారం చేయడానికి గోబెల్స్ ఉన్నట్లు.. ఇప్పుడు కేసీఆర్ పక్కన KTR, హరీష్ రావు చేరారు. వీరిద్దరూ గోబెల్స్ను మించిపోయి అబద్ధాల పోటీల్లో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారని.. భవిష్యత్తులో వీరు నిజాలు చెప్పినా ప్రజలు నమ్మలేని స్థాయికి దిగజారిపోయారని.. పిల్లి శాపనార్థాలు, కుట్ర రాజకీయాలు ఇప్పటికైనా ఆపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కాళేశ్వరం ప్రాజెక్టుపై BRS నేతలు మాట్లాడుతుంటే .. హంతకుడే సంతాప సభ.. పెట్టినట్లు ఉందని సత్యం ఎద్దేవా చేశారు. కేవలం ధనదాహంతో.. కమీషన్ల కోసమే కాళేశ్వరాన్ని నిర్మించారని.. వారి హయాంలోనే.. వారి అవినీతి వల్లే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని గుర్తుచేశారు.. తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులని.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని.. BRs నేతల డ్రామాలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!
Bengaluru, Karnataka:Namma Metro Lovers Kissing: ఇంతకాలం ఢిల్లీ మెట్రోలో యువతీ యువకుల ప్రేమాయణాలు, రీల్స్ హంగామా, వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవ్వడం అడపాదడపా చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు ఐటీ హబ్ బెంగళూరులోని 'నమ్మ మెట్రో' లోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. మెట్రో రైలులో ఒక యువ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
సిలికాన్ సిటీ బెంగళూరులోని కేఆర్ పురం మెట్రో స్టేషన్కు వస్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులతో ఉండగానే, ఒక యువకుడు, యువతి చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అదే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీరి ప్రవర్తనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నిబంధనలు బేఖాతర్..
మెట్రోలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అనేక కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయినప్పటికీ, కొందరు యువతీ యువకులు వాటిని బేఖాతర్ చేస్తూ బహిరంగ ప్రదేశాలను పార్కులుగా భావిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కొంతకాలం క్రితం కూడా బెంగళూరు మెట్రోలో ఒక జంట కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్న వీడియో హల్చల్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహిరంగ రవాణా వ్యవస్థల్లో ఇలాంటి అసభ్య ప్రవర్తనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వస్తున్నాయి.
Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!
Also Read: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
స్టూడెంట్స్ కోసం iQOO సరికొత్త సంచలనం.. iQOO Z11 Lite లాంచ్!
Hyderabad, Telangana:Iqoo Z11 Lite Launching On July 24: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) భారత స్మార్ట్ఫోన్ కస్టమర్స్ను, ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ సరికొత్త మొబైల్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ iQOO Z11 Lite పేరుతో జూలై 24న భారతదేశంలో గ్రాండ్గా విడుదల చేసేందుకు సిద్ధమైంది.. కాలేజ్ స్టూడెంట్స్ రోజువారీ అవసరాలతో పాటు ఆన్లైన్ క్లాసులు, ప్రాజెక్ట్ అసైన్మెంట్లను దృష్టిలో ఉంచుకుని నాన్-స్టాప్.. నో లిమిట్ (Non-Stop. No Limit.) అనే కాన్సెప్ట్తో ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన్నట్లు వెల్లడించింది.
స్టూడెంట్స్ కోసం పవర్ఫుల్ AI ఫీచర్స్..
ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ సాధారణ ఫీచర్స్ కంటే.. ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ విద్యార్థుల చదువుకు ఎంతో సహాయపడే పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో AI క్రియేషన్ ఫీచర్ సహాయంతో విద్యార్థులు పెద్ద పెద్ద డాక్యుమెంట్లను సులభంగా సమ్మరైజ్ చేస్తుంది. అంతేకాకుండా అసైన్మెంట్లను ఎడిట్ చేయడమే కాకుండా.. కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్తో పాటు రైటింగ్ ఐడియాలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా AI క్యాప్షన్ ఫీచర్ కూడా లభిస్తోంది. ఇందులో రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్, ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్తో పాటు వన్-టాప్ సమ్మరీ వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. దీనివల్ల ఆన్లైన్ లెక్చర్స్, వర్క్షాప్స్ జరిగే సమయంలో నోట్స్ రాసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
6500mAh భారీ బ్యాటరీ..
ఈ iQOO Z11 Lite స్మార్ట్ఫోన్లో కంపెనీ అద్భుతమైన బ్యాటరీని కూడా అందిస్తోంది. ఇందులో కంపునీ మోస్ట్ పవర్ఫుల్ 6500mAh బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ (FlashCharge) సపోర్ట్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, ఈ బ్యాటరీ 5 సంవత్సరాల సుదీర్ఘ హెల్త్ లైఫ్తో అందుబాటులోకి రావడం విశేషం..
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ..
విద్యార్థుల చేతుల్లో ఫోన్లు తరచూ కింద పడుతుంటాయి.. అంతేకాకుండా అప్పుడప్పుడు ప్రయాణాలు చేసే క్రమంలో కిందపడి పగిలిపోతూ ఉంటాయి. దీనిని అడ్డుకోవడానికి ఈ ఫోన్కు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని అందిస్తోంది.. అంతేకాకుండా SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా దీనికి లభించడం విశేషం.. అంటే ఫోన్ అనుకోకుండా కింద పడినా ఎలాంటి డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంటుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్టైలిష్ డిజైన్, కలర్స్..
లుక్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా మోడ్రన్గా, స్లీక్గా ఉంటుంది.. ఇందులో మినిమలిస్ట్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్ను కూడా కంపెనీ అందించింది.. అలాగే కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మెరిసే డైనమిక్ లైట్ ఫీచర్ దీనికి మరింత స్టైలిష్ లుక్ను అందిస్తుందని తెలుస్తోంది.. ఈ ఫోన్ లేటెస్ట్ OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది. దీంతో పాటు 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తోంది.
ధర పూర్తి వివరాలు..
iQOO Z11 Lite ఫోన్ సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 24న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ఐకూ అధికారిక వెబ్సైట్తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో అందుబాటులోకి రాబోతున్నాయి. స్టూడెంట్స్ బడ్జెట్కు తగినట్లే.. దీని ధర ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారీ 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 17 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అరాచకం!
Hyderabad, Telangana:Redmi Note 17 Series: టెక్ ప్రపంచంలో తమదైనశైలిలో దూసుకుపోతున్న ప్రముఖ చైనీస్ హ్యాండ్సెట్ తయారీ సంస్థ రెడ్మి (Redmi) మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఎంతో కాలంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్ చైనా మార్కెట్లో జూలై 14న అధికారికంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ సిరీస్కు సంబంధించిన కొన్ని స్పెషల్ స్పెసిఫికేషన్లతో పాటు ఫీచర్లు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సిరీస్లోని ప్రో మోడల్లో ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.
లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త సిరీస్లో భాగంగా రెండు మోడళ్లను కంపెనీ విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఇందులో బేస్ మోడల్ రెడ్మి నోట్ 17 కాగా.. రెండవది హై-ఎండ్ వేరియంట్ రెడ్మి నోట్ 17 ప్రో.. ఈ రెండు స్మార్ట్ఫోన్లు అద్భుతమైన డిజైన్తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్లతో అందుబాటులోకి రాబోతున్నాయి.
రెడ్మి నోట్ 17 ఫీచర్లు..
ఈ ఫోన్లో భారీ 7-అంగుళాల Full HD+ Samsung E4 Pro డిస్ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) చిప్సెట్ సపోర్ట్తో లాంచ్ కాబోతోంది.. సాధారణ మోడల్ స్మార్ట్ఫోన్ అయినప్పటికీ ఇందులో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో పాటు 22.5W రివర్స్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది..
రెడ్మి నోట్ 17 ప్రో స్పెసిఫికేషన్లు..
ప్రో మోడల్లో ఫీచర్లు మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ సపోర్ట్తో అందుబాటులోకి రాబోతోంది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 (Corning Gorilla Glass Victus 2) ప్రొటెక్షన్ను అందించారు. అంతేకాకుండా ఇందులో కంపెనీ స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 (Snapdragon 6s Gen 4) ప్రాసెసర్ను కూడా అందిస్తోంది.
ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 9,000 mAh మెగా బ్యాటరీని కూడా అందించారు. దీనికి తోడు 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో పాటు 22.5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం.. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవ్వడమే కాకుండా.. పవర్బ్యాంక్లా కూడా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని.. భారత్లో బేస్ మోడల్ 6 GB రామ్ (RAM)తో పాటు 128 GB స్టోరేజ్ వేరియంట్తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే.. ఇది బ్లూ (Blue)తో పాటు డార్క్ నైట్ (Dark Night) అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
