Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Yadadri Bhuvanagiri508115

మూసి పైన బిజెపి నేతలు కొత్త డ్రామాలు : బీర్ల ఐలయ్య

Nov 17, 2024 10:43:21
Yadagirigutta, Telangana
మూసి పైన బిజెపి నేతలు బిఆర్ఎస్ నాయకులతో కలిసి కొత్త డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తాననడం సిగ్గుచేటని, ఒక్కరోజు నిద్రలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం కిషన్ రెడ్డి వెళ్తున్నారని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా అనేక బాధలను అనుభవిస్తూ నిరుపేదల నివసిస్తున్నారని తెలిపారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 30, 2026 12:40:10
Huzurabad, Telangana:

Sammakka Sarakka Jatara 2026: సమ్మక్క సారక్క జాతరలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డితో పోలీసులు వ్యవహరించిన తీరు తెలంగాణలో తీవ్ర వివాదాస్పదమైంది. ఒక ఎమ్మెల్యేను పట్టుకుని లాగిపడేయడం.. ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. అయితే తోపులాట సమయంలో తాను పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులకు క్షమాపణలు చెప్పారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

తన హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక సమ్మక్క సారక్క జాతరలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఉద్దేశ్యపూర్వకంగా చేసిన మాటలు కాదు. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం. కానీ కొందరు మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆవేశంలో, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారా. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన మాటలు కావు' అని పాడి కౌశిక్‌ రెడ్డి స్పష్టత ఇచ్చారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నా' అని హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని మాత్రం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తీవ్రంగా తప్పబడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ప్రివిలేజ్‌ మోషన్‌ దాఖలు చేసి తనపై అనుచితంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. ఒక ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వలేరా? అని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కోరారు.

Also Read: DK Aruna: ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా: డీకే అరుణ

కాగా ఈ ఘర్షణ సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీస్‌ ఉన్నత అధికారుల సంఘం తప్పుబట్టింది. పోలీసులను అలా దూషించడం తగదని పేర్కొంది. ఈ మేరకు పోలీస్‌ అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డితో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాత్రం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వారిపై చర్యలు తీసుకునేదాకా ఉపేక్షించే అవకాశం లేనట్టు కనిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 12:19:56
Mahbubnagar, Telangana:

Municipal Elections: 'ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారింది. ఫోన్ ట్యాపింగ్‌లో సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమే' అని మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ కొట్టిపారేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఏం ఉండదని చెప్పారు. సిట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చిందని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read: TTD: హిందూ సమాజానికి వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ క్షమాపణ చెప్పాలి: టీటీడీ

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల స్టంట్‌లకు ప్రజలు మోసపోవద్దని ప్రజలకు సూచించారు. 'గద్వాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నాడని స్పీకర్ చెబుతుంటే అతడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి నిలబడి గెలవండి' అని సూచించారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

స్పీకర్ కూడా కోర్టులను మోసం చేయడం, ఇంతకన్నా దారుణం ఇంకా ఏం ఉంటుంది? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఫిరాయింపులపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి వాటివల్లే రాజకీయాలకు విలువలు లేకుండా మారిపోతుందని తెలిపారు. విద్య, వైద్యం, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేవలం కేంద్రం నుంచి మాత్రమే వస్తున్నాయని ఎంపీ అరుణ చెప్పారు.

Also Read: AP Assembly Session: నెల రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు?

'మహబూబ్‌నగర్ చుట్టుపక్కల బైపాస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి  కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యం. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నా' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్‌నగర్ మేయర్‌గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికలు రాగానే.. శంకుస్థాపనలు చేయడం కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 12:00:15
Hyderabad, Telangana:

Varanasi Movie Release Date: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ సినిమా రిలీజ్‌పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. 

సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ప్రకటించిన వివరాల ప్రకారం, 'వారణాసి' చిత్రం ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది 2027లో రాబోయే అతిపెద్ద అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

అద్భుతమైన తారాగణం
ఈ సినిమాలో భారతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నటీనటులు నటిస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా 'రుద్ర' పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్ 'మందానికి'గా.. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర 'కుంభ'గా వెండితెరపై కనిపించనున్నారు. 

కథా నేపథ్యం - ఖండాలు దాటే అడ్వెంచర్
ఈ సినిమా కథ వేల సంవత్సరాల నాటి పురాతన రహస్యాల చుట్టూ అల్లుకుంది. కథ అంటార్కిటికా మంచు ఖండం నుండి ఆఫ్రికా అడవుల వరకు, చివరకు భారతీయ పుణ్యక్షేత్రమైన వారణాసి వరకు అనేక దేశాలు, ఖండాలను దాటుతున్నట్లు ఇటీవలే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో తెలిసింది. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఐమ్యాక్స్ కోసం స్పెషల్‌గా చిత్రీకరిస్తున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. "నాటు నాటు" తర్వాత రాజమౌళి-కీరవాణి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2022లో విడుదలైన "RRR" ప్రపంచవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఇది ఐదవ స్థానంలో నిలిచింది. ఆ సినిమా సాధించిన ఆస్కార్ విజయం, ఇప్పుడు 'వారణాసి'పై ప్రపంచ మార్కెట్ దృష్టి పడేలా చేసింది.

మహేష్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రం. నవంబర్‌లో విడుదలైన ఫస్ట్ లుక్ ఫుటేజ్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తుండగా, 2027 ఏప్రిల్ కోసం సినీ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

Also Read: T20 World Cup 2026 Schedule: T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..ఫిబ్రవరి 7 నుంచి సమరం షురూ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 11:32:56
Tirupati Urban, Andhra Pradesh:

YS Jagan Apology: 'వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుమలలో వేల అరాచకాలు చేశారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్సార్‌సీపీ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అబద్దాలు చెబుతున్న వారికి బుద్ది ఉండాలి. యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? హిందూ సమాజానికి వైఎస్‌ జగన్‌తో పాటు మిగిలిన వారు క్షమాపణ చెప్పాలి' టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డిమాండ్‌ చేశారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో హిందువులపై దాడి జరిగిందని ఆరోపించారు. టీటీడీ నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

Also Read: Janasena Party: జనసేన పార్టీ కీలక పరిణామం.. పిఠాపురం నుంచే ప్రారంభం

తిరుమల లడ్డూ వ్యవహారం సిట్‌ నివేదికపై రాజకీయ దుమారం రేపడంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' సామర్థ్యం లేని డైరీలకు నెయ్యి సరఫరా చేయమని చెప్పారు. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారు. జంతు కొవ్వు లేదని చెప్పడం చెప్పడం సిగ్గుచేటు' అని మండిపడ్డారు. 'కెమికల్స్‌తోనే నెయ్యి సరఫరా చేశారని స్పష్టంగా సిట్ చార్జ్‌షీట్‌లో ఉంది. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను నెయ్యి తయారీకి వాడారు. హిందువుల ప్రాణాలు తీసేలా వ్యవహరించారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: AP Assembly Session: నెల రోజుల పాటు ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు?

'కల్తీనెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మహాపాపం చేశారు. జంతుకొవ్వు ఉందని ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చింది. సిట్ నిర్థారించింది. నెయ్యిని ల్యాబ్‌లకు పంపించి తమకు అనుకూలంగా రిపోర్ట్‌లు తెప్పించుకున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డారు' అని వైఎస్సార్‌సీపీ నాయకులపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మండిపడ్డారు. ఏ నిబంధనల ప్రకారం బోలేబాబా డైరీకి టెండర్‌ అప్పగించారు? జగన్, వైవీ సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండానే పీఏ చిన్నప్పన్న ఇదంతా చేస్తాడా? అని నిలదీశారు.

Also Read: Child Missing: మేడారం జాతరలో పిల్లల అదృశ్యం.. రిస్ట్‌ బ్యాండ్‌తో 2 గంటల్లో ఆచూకీ లభ్యం

'వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఎందుకు సిట్‌కు బ్యాంకు వివరాలు ఇవ్వలేదు? తిరుమల వాటికన్ సిటీని దాటిపోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రణాళిక ప్రకారమే తిరుమలపై స్కెచ్ వేశారు. టీటీడీలో ప్రతి విషయంలోను నిబంధనలను తూట్లు పొడిచారు. టీటీడీని భ్రష్టుపట్టించి కోట్లు సంపాదించాడు' అని వైవీ సుబ్బారెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. 'తల వెయ్యి ముక్కలు అవుతుందని భూమన మృత్యుంజయ యాగం చేస్తున్నాడు. భూమనకు అంత ప్రాణభయం ఎందుకు? తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటే సాధ్యం కాదు భూమన' అని హెచ్చరించారు. 

'కల్తీనెయ్యిలో పెద్దవారి పాత్రను సిట్‌ పూర్తిగా వెలికితీయాలి. సిట్ గతంలో ఇచ్చింది చివరి ఛార్జ్‌షీట్ కాదు. ఇంకా ఉంది' అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. దుర్మార్గుల నుంచి తిరుమలను కాపాడుకోవాలని.. హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కల్తీ కేటుగాళ్లపై కేసులు పెట్టాలి.. జైలుకు పంపించాలని సూచించారు. 'వైఎస్సార్‌సీపీ పెద్దలకు హిందువులంటే చులకన భావం. హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను తరిమి తరిమి కొట్టే సమయం దగ్గరపడింది' అని తెలిపారు. నూటికి నూరు శాతం నెయ్యి కల్తీ అయ్యిందని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 10:45:58
Hyderabad, Telangana:

T20 World Cup 2026 New Schedule: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త! T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీ నుండి వైదొలగడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చుతూ ఐసీసీ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ సరికొత్త షెడ్యూల్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్, శ్రీలంకలోని ప్రముఖ నగరాలైన ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, కొలంబో వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

కీలక మార్పులు..
బంగ్లాదేశ్ నిష్క్రమణతో స్కాట్లాండ్‌కు అవకాశం దక్కింది. స్కాట్లాండ్ జట్టు తన మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికల్లో ఆడనుంది. మిగిలిన గ్రూపుల్లో ఎటువంటి మార్పులు లేవు.

భారత్ ప్రస్థానం..
టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న అమెరికాతో (ముంబైలో) టోర్నీని ఆరంభిస్తుంది. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది.

టోర్నీ ముఖ్య తేదీలు..
ప్రారంభం: ఫిబ్రవరి 7, 2026.
సూపర్ 8: ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం.
సెమీ-ఫైనల్స్: మార్చి 4, 5 తేదీల్లో.
ఫైనల్: మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో.

ముఖ్యమైన మ్యాచ్‌ల షెడ్యూల్..

తేదీ మ్యాచ్ వేదిక సమయం
ఫిబ్రవరి 7 ఇండియా vs అమెరికా ముంబై రాత్రి 7:00
ఫిబ్రవరి 12 భారత్ vs నమీబియా ఢిల్లీ రాత్రి 7:00
ఫిబ్రవరి 15 ఇండియా vs పాకిస్తాన్ కొలంబో రాత్రి 7:00
ఫిబ్రవరి 18 భారత్ vs నెదర్లాండ్స్ అహ్మదాబాద్ రాత్రి 7:00
మార్చి 4 & 5 సెమీ-ఫైనల్స్ కోల్‌కతా/ముంబై రాత్రి 7:00
మార్చి 8 ఫైనల్ అహ్మదాబాద్/కొలంబో రాత్రి 7:00

మొదటి సెమీ-ఫైనల్, ఫైనల్ వేదికలు పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరుకోలేకపోతే, ఆ మ్యాచ్‌లు భారతదేశంలోనే నిర్వహిస్తారు.

టీ20 వరల్డ్ కప్ పూర్తి మ్యాచ్ షెడ్యూల్
గ్రూప్ దశ
శనివారం, ఫిబ్రవరి 7

నెదర్లాండ్స్ vs పాకిస్తాన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – కొలంబో

స్కాట్లాండ్ vs వెస్టిండీస్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

భారతదేశం vs USA: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

ఆదివారం, ఫిబ్రవరి 8
ఆఫ్ఘనిస్తాన్ vs న్యూజిలాండ్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – MA చిదంబరం స్టేడియం, చెన్నై

ఇంగ్లాండ్ vs నేపాల్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

శ్రీలంక vs ఐర్లాండ్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – R ప్రేమదాస స్టేడియం, కొలంబో

సోమవారం, ఫిబ్రవరి 9
స్కాట్లాండ్ vs ఇటలీ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

ఒమన్ vs జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – SSC, కొలంబో

కెనడా vs దక్షిణాఫ్రికా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

మంగళవారం, ఫిబ్రవరి 10
నమీబియా vs నెదర్లాండ్స్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

న్యూజిలాండ్ vs యుఎఇ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై

పాకిస్తాన్ vs యుఎస్ఎ: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – SSC, కొలంబో

బుధవారం, ఫిబ్రవరి 11

ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

ఆస్ట్రేలియా vs ఐర్లాండ్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

గురువారం, ఫిబ్రవరి 12
శ్రీలంక vs ఒమన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ

ఇటలీ vs నేపాల్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) - వాంఖడే స్టేడియం, ముంబై

భారతదేశం vs నమీబియా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) - అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

శుక్రవారం, ఫిబ్రవరి 13

ఆస్ట్రేలియా vs జింబాబ్వే: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

కెనడా vs యుఎఇ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

నెదర్లాండ్స్ vs యుఎస్ఎ: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై

ఫిబ్రవరి 14 శనివారం
ఐర్లాండ్ vs ఒమన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – SSC, కొలంబో

స్కాట్లాండ్ vs ఇంగ్లాండ్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

ఫిబ్రవరి 15 ఆదివారం
నేపాల్ vs వెస్టిండీస్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

నమీబియా vs యుఎస్ఎ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై

భారతదేశం vs పాకిస్తాన్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

సోమవారం, ఫిబ్రవరి 16

ఆఫ్ఘనిస్తాన్ vs యుఎఇ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

ఇంగ్లాండ్ vs ఇటలీ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

ఆస్ట్రేలియా vs శ్రీలంక: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ

మంగళవారం, ఫిబ్రవరి 17

కెనడా vs న్యూజిలాండ్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – MA చిదంబరం స్టేడియం, చెన్నై

ఐర్లాండ్ vs జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ

స్కాట్లాండ్ vs నేపాల్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

బుధవారం, ఫిబ్రవరి 18
దక్షిణాఫ్రికా vs యుఎఇ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

నమీబియా vs పాకిస్తాన్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – SSC, కొలంబో

భారతదేశం vs నెదర్లాండ్స్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

గురువారం, ఫిబ్రవరి 19
ఇటలీ vs వెస్టిండీస్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

శ్రీలంక వర్సెస్ జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై

శుక్రవారం, ఫిబ్రవరి 20
ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

సూపర్ 8
శనివారం, ఫిబ్రవరి 21

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

ఆదివారం, ఫిబ్రవరి 22
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

సోమవారం, ఫిబ్రవరి 23
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

మంగళవారం, ఫిబ్రవరి 24
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

బుధవారం, ఫిబ్రవరి 25
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

గురువారం, ఫిబ్రవరి 26
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై

శుక్రవారం, ఫిబ్రవరి 27
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

శనివారం, ఫిబ్రవరి 28
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ

ఆదివారం, మార్చి 1
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ

TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

నాకౌట్‌లు
బుధవారం, మార్చి 4

మొదటి సెమీఫైనల్ సాయంత్రం 7 గంటలకు (13:30 (GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా లేదా ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో

గురువారం, మార్చి 5
రెండో సెమీఫైనల్ రాత్రి 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై

ఆదివారం, మార్చి 8
ఫైనల్ రాత్రి 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ లేదా ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో.

Also Read: Virat Kohli Net Worth: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సంపాదిస్తాడో తెలుసా? ఒక్క పోస్ట్ పెడితే కోట్లు అకౌంట్లో వచ్చి పడతాయి!

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 09:59:05
Hyderabad, Telangana:

Virat Kohli Instagram Earning: ప్రపంచ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, కేవలం మైదానంలోనే కాదు, డిజిటల్ దునియాలోనూ రికార్డుల రారాజుగా దూసుకుపోతున్నారు. 2026 నాటికి ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం అమాంతం పెరిగి, గ్లోబల్ స్టార్లకు గట్టి పోటీనిస్తోంది. క్రీడలకు అతీతంగా ఒక పవర్‌ఫుల్ డిజిటల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కోహ్లీ, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తున్నారు.

భారతీయ సెలబ్రిటీలలో అగ్రస్థానం
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్‌కు సుమారు రూ.11 కోట్ల నుండి రూ.14 కోట్ల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. భారతీయ సినీ, క్రీడా రంగాల్లో మరే ఇతర సెలబ్రిటీ కూడా ఈ స్థాయిలో ఆదాయం పొందడం లేదు. దీనితో ఆయన ఇండియాలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీగా నిలిచారు.

గ్లోబల్ టాప్-20 క్లబ్‌లో ఏకైక భారతీయుడు
ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-20 వ్యక్తుల జాబితాలో కోహ్లీ స్థిరంగా కొనసాగుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో (ఒక్కో పోస్ట్‌కు సుమారు రూ.26 కోట్లు), లియోనెల్ మెస్సీ (రూ.21 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ తన రూ.12-14 కోట్ల ఫీజుతో వారికి గట్టి పోటీ ఇస్తున్నారు.

274 మిలియన్ల ఫాలోవర్లు..
కోహ్లీకి ఉన్న 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు బ్రాండ్‌లకు తక్షణమే గ్లోబల్ విజిబిలిటీని అందిస్తారు. రొనాల్డో కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, కోహ్లీ పోస్ట్‌లకు వచ్చే 'లైక్స్', 'కామెంట్స్' (Engagement Rate) ప్రపంచ స్థాయి స్టార్లకు సమానంగా ఉంటాయి. దీనివల్ల బ్రాండ్‌లు ఆయనకు భారీ మొత్తంలో చెల్లించడానికి మొగ్గు చూపుతాయి.

ఆదాయం ఎలా పెరుగుతుంది?
కోహ్లీ ఆదాయం కేవలం ఒక ఫోటో పోస్ట్ చేయడంతోనే ఆగిపోదు. ప్రచారాల కాలపరిమితి, గ్లోబల్ యూసేజ్ హక్కులు, క్రాస్-ప్లాట్‌ఫామ్ ప్రమోషన్ల ఆధారంగా ఈ ఒప్పందాల విలువ మరిన్ని కోట్లకు చేరుకుంటుంది. ఆయన వార్షిక ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ ఇప్పుడు రూ.200 కోట్లు దాటినట్లు అంచనా.

గతంలో (2023లో) తన ఆదాయంపై వచ్చిన వార్తలను కోహ్లీ స్పందిస్తూ.. థర్డ్ పార్టీ నివేదికలు ఇచ్చే అంకెలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చని, అవి కేవలం అంచనాలు మాత్రమేనని గుర్తుచేశారు. అయినప్పటికీ, మార్కెట్ నిపుణుల ప్రకారం ఆయన బ్రాండ్ వాల్యూ నిరంతరం పెరుగుతూనే ఉంది.

క్రికెట్ ఆడుతున్నా లేకపోయినా, కోహ్లీ పర్సనల్ బ్రాండింగ్ మాత్రం స్థిరంగా ఉంది. ఇది క్రీడాకారులు తమ కెరీర్ ముగిసిన తర్వాత కూడా డిజిటల్ రంగంలో ఎలా రాణించవచ్చో నిరూపిస్తోంది.

Also Read: Mood Of The Nation Survey: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరు? తాజా సర్వేలో సంచలన నిజాలు!

Also Read: Free Bus For Men: పురుషులకు ప్రభుత్వం శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు మగాళ్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 09:46:49
Hyderabad, Telangana:

Motorola Signature Offer Price in Flipkart: మోటరోలా కంపెనీ ఇప్పటికీ విడుదల చేసిన అత్యంత ప్రీమియం ఫీచర్స్ మొబైల్స్‌లో Motorola Signature ఒకటి. దీనిని కంపెనీ జనవరి 30వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే, దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై స్పెషల్ ఆఫర్స్ లభించడమే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 

ఈ Motorola Signature స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే, ఇది ఎంతో అద్భుతమైన 6.8 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీన్ని స్క్రీన్ గరిష్టంగా 6200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఇందులో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. దీనిని మార్కెట్‌లోకి కంపెనీ అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కేవలం 6.99mm మందం మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా 186 గ్రాముల బరువుతో చాలా తేలికగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో వచ్చింది.

ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. గేమింగ్ చేసేవారు దాదాపు అన్లిమిటెడ్ గా 12 గంటలు ఎంతో తేలికగా ఆడొచ్చు.  ఇక వెనక భాగంలో మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా సోనీ LYTIA 828 సెన్సార్‌తో 50MPతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా మరో రెండు 50MP కెమెరాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వీటిల్లోని 3x ఆప్టికల్ జూమ్, 100x సూపర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. 

ఫ్రంట్ భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫాస్ట్ చార్జింగ్ కోసం ఇందులో కంపెనీ 90W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 12GB + 256GB రూ.59,999తో.. రెండవ స్టోరేజీ వేరియంట్ 16GB + 512GB రూ.64,999తో, ఇక మూడవ స్టోరేజ్ వేరియంట్  16GB + 1TB రూ.69,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ వేరియంటిపై ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది. 

మార్కెట్‌లో బేస్ వేరియంట్ అసలు ధర రూ.74 వేల రూపాయలు కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి.. 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.59,999కే అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రూ.7,740 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా పేమెంట్ చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.  మీరు యాపిల్ కంపెనీ లేదా సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన హై ఎండ్ మొబైల్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.59,000 వరకు బోనస్ లభిస్తుంది. గరిష్టంగా ఈ బోనస్ను వినియోగించి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి కేవలం ఇది రూ999కే పొందవచ్చు. అయితే, బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 30, 2026 09:04:24
Secunderabad, Telangana:

Telangana High Court Job Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉన్నత న్యాయస్థానం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల కోర్టులో ఖాళీగా ఉన్న 859 పోస్టులను భర్తీ చెయ్యబోతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారానే జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్ వంటి ప్రత్యేకమైన విభాగాల్లో నియామకాలు చేపట్టబోతున్నట్లు అధికారికంగా తెలిపింది. అయితే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 859 పోస్టులకు భర్తీ చేయబోతోంది. ముఖ్యంగా ఆఫీస్  సబార్డినేట్ విభాగంలో 319 ఖాళీలు భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 1509 జూనియర్ అసిస్టెంట్, 95 ప్రాసెస్ సర్వీస్, 63 కాపిస్ట్, 61 ఫీల్డ్ అసిస్టెంట్, 49 ఎగ్జామినేర్ తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు పేర్కొంది. అలాగే ఈ పోస్టుల్లో భాగంగా స్టెనోగ్రాఫర్ గ్రేట్ 3కి సంబంధించిన 35 పోస్టులతో పాటు రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు, టైపిస్టు 42 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ లో భాగంగా వయోపరిమితికి సంబంధించిన వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కొనేవారు 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో వయస్సును కలిగి ఉండాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా పోస్టులను బట్టి అర్హతలు ఉంటాయని ఈ నోటిఫికేషన్ లో హైకోర్టు పేర్కొంది. ఇక విద్యార్హతలో భాగంగా.. పోస్టులను బట్టి ఏడవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వారిని అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థులు ఈ పోస్టులకు నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. హైకోర్టుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ tshc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ అధికారిక నోటిఫికేషన్ను తెలంగాణ హైకోర్టు జనవరి 24వ తేదీన విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫిబ్రవరి 13 వరకు చివరి తేదీ ఉండబోతున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి.. ఏప్రిల్ లో పరీక్షలు కూడా ఉండబోతున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. 

ఇక ఈ పోస్టులకు సంబంధించిన జీతాల వివరాల్లోకి వెళ్తే.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ప్రతినెల రూ.19 వేల నుంచి రూ.96 వేల వరకు వేతనాన్ని అందించబోతున్నట్లు హైకోర్టు అధికారికంగా నోటిఫికేషన్ లో వెల్లడించింది. అయితే, ఈ పోస్టులను అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎంపికవడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షను రాయాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా పరీక్ష రాసిన తర్వాత స్కిల్ టెస్ట్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. వీటిల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే.. జిల్లాకు సంబంధించిన కోర్టుల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఓసి, బీసీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.. ఇక ఇతరులకు రూ.400 పరీక్ష ఫీజు ఉండబోతున్నట్లు అధికారికంగా హైకోర్టు తెలిపింది..

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 09:02:00
Nunna, Vijayawada, Andhra Pradesh:

Mood Of The Nation Survey Andhra: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొద్ది నెలలు గడుస్తున్నా, రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో, ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే దేశవ్యాప్తంగా నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని స్పష్టం చేసింది.

కూటమి హవా కొనసాగుతుందా?
ఇండియా టుడే సర్వే ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, బీజేపీ (BJP) కూటమికే ప్రజలు పట్టం కడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమరావతి పునఃప్రారంభం వంటి నిర్ణయాలు ప్రజల్లో సానుకూలతను పెంచాయని సర్వే వెల్లడించింది.

సీట్ల లెక్కలు (అంచనా)
లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన ఇండియా టుడే వెల్లడించిన అంచనాలు ఇలా ఉన్నాయి.

NDA కూటమి (TDP + JSP + BJP): మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ల శాతం కూడా గత ఎన్నికల కంటే నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

YSRCP: ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో ఓట్ల శాతం పుంజుకుంటున్నట్లు సర్వే సూచించింది.

సర్వేలో తేలిన ప్రధానాంశాలు..
ముఖ్యమంత్రి పనితీరు: చంద్రబాబు నాయుడు అనుభవం, పరిపాలన దక్షతపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ 'సూపర్ సిక్స్' హామీల అమలుపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

పవణ్ కళ్యాణ్ ప్రభావం: ఉప ముఖ్యమంత్రి హోదాలో పవణ్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా పంచాయతీ రాజ్, అటవీ శాఖల్లో ఆయన మార్పులు యువతను ఆకట్టుకుంటున్నాయి.

వైఎస్ జగన్ పరిస్థితి: ఓటమి తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు క్యాడర్‌లో ధైర్యాన్ని నింపుతున్నాయని, అయితే అధికారం చేజిక్కించుకునే స్థాయికి సెంటిమెంట్ ఇంకా పెరగలేదని సర్వే అభిప్రాయపడింది.

కేంద్ర రాజకీయాల ప్రభావం..
రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధులు, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు వంటివి కూటమికి ప్లస్ పాయింట్లుగా మారాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా వంటి పెండింగ్ అంశాలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉన్నట్లు కూడా సర్వే పేర్కొంది.

మొత్తానికి ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతోంది. అయితే, అభివృద్ధి పనులు వేగవంతం కాకపోతే భవిష్యత్తులో ఈ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ALso Read: Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!

Also Read: Free Bus For Men: పురుషులకు ప్రభుత్వం శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో పాటు మగాళ్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 08:31:15
Medaram, Telangana:

Free Bus For Men In Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా కేవలం మహిళలకే పరిమితమైన ఉచిత ప్రయాణం, ఇప్పుడు నిర్దేశిత ప్రాంతాల్లో పురుషులకు కూడా అందుబాటులోకి వచ్చింది. మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉచితం?
సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉన్నప్పటికీ, మేడారం పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు పురుషులకు కూడా ఉచిత సౌకర్యం కల్పించారు. ములుగు జిల్లాలోని పస్రా నుండి మేడారం వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.

ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను చింతల్ క్రాస్ వద్ద పార్క్ చేసి, అక్కడి నుండి మేడారం చేరుకోవడానికి ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

4,000 ప్రత్యేక బస్సులు
రాష్ట్రం నలుమూలల నుండి మేడారం చేరుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ మొత్తం 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఫిబ్రవరి 1 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మహాలక్ష్మి పథకం వర్తించే బస్సుల్లో మహిళలు యథావిధిగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.

భక్తుల రద్దీ - ఆర్టీసీ ఏర్పాట్లు
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఈ ఏడాది సుమారు 1.5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. మేడారంలో భక్తుల సౌకర్యార్థం భారీ విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు పార్కింగ్ స్థలాల నుండి జాతర గద్దెల వరకు 'షటిల్' సర్వీసుల రూపంలో ఉచిత బస్సులను నడుపుతున్నారు.

పురుషుల విజ్ఞప్తికి ఊరట
తెలంగాణలో ఉచిత బస్సు పథకాల వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి, టికెట్ కొని ప్రయాణించే పురుషులు సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, జాతర వంటి ప్రత్యేక సందర్భాల్లో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించడంపై సామాన్యుల నుండి హర్షం వ్యక్తం అవుతోంది.

Also Read: Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!

Also Read: Archana Ravichandran Tiruvannamalai: అరుణాచలం కొండపైకి నటి.. శివ భక్తుల ఆగ్రహం! అటవీశాఖ సీరియస్ యాక్షన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 08:05:23
Hyderabad, Telangana:

Petrol Diesel Price Hikes 2026: ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

70 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్
సెప్టెంబర్ నెల తర్వాత మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల మార్కును దాటింది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ ధర 2.4% పెరిగి $70.06 కి చేరగా, అమెరికా బెంచ్‌మార్క్ WTI 2.6% పెరిగి బ్యారెల్‌కు $64.82 కి చేరుకుంది.

ట్రంప్ హెచ్చరికలు - ఇరాన్ ప్రతిస్పందన
డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్‌ను హెచ్చరించారు. అణు కార్యక్రమంపై ఇరాన్ వెంటనే చర్చలకు రావాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. అమెరికా ఏదైనా సైనిక చర్యకు దిగితే తమ స్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

హార్ముజ్ జలసంధిపై నీలినీడలు
ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైనది హార్ముజ్ జలసంధి (Strait of Hormuz). ఒకవేళ యుద్ధ వాతావరణం నెలకొంటే, ఈ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ ట్యాంకర్ల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ రోజువారీ ఉత్పత్తి చేసే సుమారు 3 మిలియన్ బ్యారెళ్ల చమురుపై కూడా ప్రభావం పడవచ్చు. దీనివల్ల మార్కెట్‌లో చమురు కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.

భారతదేశం తన చమురు అవసరాలలో 80% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర పెరిగితే, అది నేరుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఒక రకమైన భయాందోళన నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే, రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడికి ధరల సెగ తప్పదు.

Also Read: Railway Ticket Concession: సామాన్యులకు బడ్జెట్ కానుక..రైల్వే టికెట్లపై 50% రాయితీ.. ఎప్పటి నుంచి ఇస్తారంటే?

Also Read: School Holiday: రేపు శుక్రవారం అన్నీ స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన జిల్లా యంత్రాంగం..విద్యార్థులకు పండగే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 30, 2026 07:02:52
Tiruvannamalai, Tamil Nadu:

Archana Ravichandran Tiruvannamalai News: తమిళ బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ చేసిన పని ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ అటవీశాఖ అధికారులు ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. పరమశివుని స్వరూపంగా భావించే అరుణాచలంలోని 'అన్నామలై గిరి' చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనుమతి ఉంటుంది కానీ, కొండపైకి ఎక్కడం మాత్రం కఠినంగా నిషేధించారు.

ఏం జరిగింది?
తమిళ టీవీ నటి అర్చనా రవిచంద్రన్ తన సహ నటుడు అరుణ్‌తో కలిసి అరుణాచలం సందర్శనకు వెళ్లారు. అయితే, భక్తులు పవిత్రంగా భావించే 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరిపైకి వీరిద్దరూ ఎక్కారు. అటవీశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొండపైకి వెళ్లడమే కాకుండా, అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అటవీశాఖ అధికారుల కొరడా
నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి ఫోటోలు దిగడంపై అటవీశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు అర్చన మరియు అరుణ్‌లకు తలా రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

భక్తుల ఆగ్రహం..
అరుణాచలం కొండను భక్తులు శివుని రూపంగా ఆరాధిస్తారు. కాబట్టి గిరిపైకి ఎక్కడం అంటే దైవత్వాన్ని అవమానించడమేనని స్థానిక భక్తులు మండిపడుతున్నారు. "నిబంధనలు అందరికీ ఒకటే, సెలబ్రిటీ అయితే రూల్స్ వర్తించవా?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఎంత ధైర్యం ఉంటే దైవ స్వరూపంగా భావించే కొండపైకి ఎక్కుతావు?" అంటూ ఆమె పోస్ట్‌లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అరుణాచల గిరి ప్రత్యేకత
అరుణాచలంలో ఉన్న ఆలయం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల మార్గంలో లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా సామాన్యులెవరూ కొండపైకి వెళ్లకూడదని అటవీశాఖ ఎప్పటి నుంచో నిబంధనలు పెట్టింది. అయినా ఈ రూల్ బేఖాతరు చేసి వాళ్లిద్దరూ కొండపైకి ఎక్కడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.

Also Read: Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350..నెలకు రూ.7,600 కడితే చాలు..పూర్తి వివరాలు మీకోసం!

Also Read: Railway Ticket Concession: సామాన్యులకు బడ్జెట్ కానుక..రైల్వే టికెట్లపై 50% రాయితీ.. ఎప్పటి నుంచి ఇస్తారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 30, 2026 06:56:18
Pithapuram, Andhra Pradesh:

Pawan Kalyan: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీలో కీలక మార్పు తీసుకురాబోతున్నారు. జనసేనలో ప్రజాస్వామ్యం బలపడేలా చర్యలు తీసుకుంటున్నారు. సీల్డ్ కవర్‌లో పేరు ఇచ్చి మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గ్రామ, వార్డు, మండల కమిటీలను ఎంచుకునే విధానం కాకుండా పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రత్యక్ష ఎన్నిక విధానంతో ప్రజాస్వామ్యానికి మారుపేరుగా నిలుస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.

Also Read: Medaram Jatara 2026: మేడారం జాతరకు చారిత్రక ఏర్పాట్లు చేశాం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు

ఈ విధానాన్ని తొలుత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో అమలుచేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి పిఠాపురం నియోజవర్గం చేబ్రోలులోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనసేన సభ్యత్వం ఉన్నవారితో ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి ఓటు వేసే విధంగా తీసుకున్న చర్యలతో మరో ఎన్నికల సంగ్రామం ఉత్కంఠంగా కొనసాగుతోంది.

Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక

పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మీడియాతో మాట్లాడుతూ.. 'క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు గత నెలలో 52 గ్రామాలకు ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్‌ని ఎన్నుకున్నాం. గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణానికి వార్డు ఇన్‌చార్జిలు, ఎన్నికల బూత్ కన్వీనర్లను ఎన్నుకునేలా ప్రజాస్వామ్యబద్ధంగా సీక్రెట్ ఓటింగ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ జరుగుతుందని.. 30వ తేదీన మూడు మండలాలకు, గొల్లప్రోలు పట్టణ, పిఠాపురం పట్టణ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాం' అని వివరించారు. ఎన్నికలతో సుమారు 5,867 మంది నాయకులు ఏర్పడతారని.. దీంతో జనసేన పార్టీని బరిష్టంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి జనసేన సభ్యత్వం ఉన్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని.. జనసేన సభ్యత్వం లేని వారికి దానిపై వివరణ ఇస్తామని తాళ్లూరి రామ్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top