అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే బిజెపి లక్ష్యం : ఎంపీ చామల
Bhuvanagiri, Telangana:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బిజెపి ప్రవర్తిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.మూసి ప్రక్షాళనను రాజకీయం చేయకుండా,గంగా నది, సబర్మతి నది ప్రక్షాళన కోసం మోడీకి సహకరించిన విధంగానే ఇక్కడ మూసీ నదికి కూడా సహకరించి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.మిమ్ములను ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మీరు పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Tirumala VIPs: తిరుమల శ్రీవారి సేవలో మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ
Tirupati Urban, Andhra Pradesh:IMD Weather Alert: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
Hyderabad, Telangana:IMD Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 7 రోజుల పాటు విస్తారంగా వర్షాలు, పిడుగులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి
జూలై 29, 30 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో పాటు ఈదురు గాలులు వీయనున్నాయి. జూలై 30 రాత్రి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 31న స్వల్పంగా వర్షాలు పడగా, ఆగస్టు 1 నుండి 4 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తొలి రెండు రోజులు మోస్తరు వర్షాలు, పిడుగులు, ఈదురు గాలుల ఉధృతి ఉంటుంది. జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ఒకటిరెండు చోట్ల మాత్రమే వర్షాలు పడినప్పటికీ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
అలాగే రాయలసీమలో జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వరుసగా ఐదు రోజుల పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. జూలై 29 రాత్రి నుంచి జూలై 30 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
జూలై 30 నుంచి జూలై 31 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మరోసారి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.
ఆగస్టు 1 నుండి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఐఎండీ వర్షపాత ప్రమాద హెచ్చరికల వర్గీకరణ
తేలికపాటి: 2.5 - 15.5 మి.మీ.
మోస్తరు: 15.6 - 64.4 మి.మీ.
భారీ: 64.5 - 115.5 మి.మీ.
చాలా భారీ: 115.6 - 204.4 మి.మీ.
అత్యంత భారీ: 204.5 మి.మీ.కు పైగా (రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్ అలర్ట్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు).
ప్రజలకు అధికారుల సూచనలు
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు విద్యుత్, తాగునీటి సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రజలు బలహీనమైన గోడలు, పాత చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలవొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ALso Read: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala VIPs: తిరుమలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:YSRCP MLA Virupaksha Visits Tirumala Temple And Other VIPs Break Darshanరాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు.. తృటిలో తప్పిన ప్రమాదం!
Hyderabad, Telangana:Sircilla Rains: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ముసురు వర్షాల కారణంగా జిల్లా ప్రజల సాధారణ జీవనం స్తంభించిపోవడమే కాకుండా.. పలు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం సిరిసిల్ల పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే.. పెద్ద బజార్ ప్రాంతంలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేల తడిసి ముద్దయి.. రహదారి పక్కన ఉన్న ఒక భారీ వేప చెట్టు వేర్లు బలహీనపడడంతో ఒక్కసారిగా నేలకొరిగింది. కారు వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న వ్యాపారులు, బాటసారులు తీవ్ర భయాందోళనకు గురయిన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో కారు పైభాగం స్వల్పంగా దెబ్బతినగా.. వాహనం లోపల ఉన్న వ్యక్తికి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. వేప చెట్టు నేరుగా పడకుండా కొమ్మల వైపు కూలడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులతో పాటు దారినపోయే వాహనదారులు అత్యంత సమయస్ఫూర్తితో స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు తలుపులు తెరిచి.. లోపల చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. తక్షణమే ప్రాథమిక చికిత్స అందించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు చూపిన చొరవను పలువురు అభినందించారు.
రంగంలోకి దిగిన యంత్రాంగం..
సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ, కటింగ్ మిషన్ల సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు కొమ్మలను వేగంగా తొలగించారు. చెట్టు కూలిపోవడంతో పెద్ద బజార్ ప్రాంతంలో నిలిచిపోయిన ట్రాఫిక్ను అధికారులు క్లియర్ చేసి.. వాహనాల రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించారు.
వర్షాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణ ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు.. పాతబడిన భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, పురాతన భవనాల సమీపంలో వాహనాలు నిలిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Google Pixel 11 Pro డిజైన్ ఇదే.. కొత్త పిక్సెల్ గ్లో ఫీచర్తో అదిరిపోయే లుక్!
Hyderabad, Telangana:Google Pixel 11 Pro Latest News: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సిరీస్ పిక్సెల్ 11 (Pixel 11 Series) ల్యాంచ్కు సిద్ధం చేసింది.. అధికారిక విడుదలకు ముందే కస్టమర్స్లో ఆసక్తిని పెంచేందుకు గూగుల్ పిక్సెల్ 11 ప్రొ (Google Pixel 11 Pro) కి సంబంధించిన టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఆగస్టు 12న అమెరికాలోని న్యూయార్క్లో జరిగే Made by Google 2026 కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది..
ప్రీమియం డిజైన్..
లాంచ్ అయిన టీజర్లో పిక్సెల్ 11 ప్రొ డిజైన్ స్పష్టంగా కనిసిస్తోంది.. ఈ ఫోన్ వెనుక భాగంలో క్లాసిక్ హారిజాంటల్ కెమెరా మైక్రో-మోడ్యూల్ సెటప్ను అందిస్తోంది.. అయితే, ఈసారి ఇందులో కంపెనీ పిక్సెల్ గ్లో (Pixel Glow) అనే కొత్త డిజైన్ ఎలిమెంట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కెమెరా చుట్టూ పిన్విల్ (Pinwheel) గుండ్రంగా తిరిగే అద్భుతమై లైటింగ్ యానిమేషన్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్లో వివిధ నోటిఫికేషన్లతో పాటు కాల్స్ లేదా AI ఫీచర్స్ వినియోగించినప్పుడు ఇది విజువల్ ఇండకేటర్గా పనిచేస్తుందని సమాచారం..
గూగుల్ ఈకోసిస్టమ్..
గూగుల్ గతేడాది ప్రారంభించిన ఆస్క్ మోర్ ఆఫ్ యువర్ ఫోన్ (Ask More Of Your Phone) క్యాంపెయిన్ ఆధారంగా ఈ టీజర్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. నాస్ (Nas) అద్భుతమైన పాట ఐ క్యాన్ (I Can) ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దీనిని రూపొందించిన్నట్లు సమాచారం.. ప్రతి రోజు ప్రపంచంలోని ప్రజలు గూగుల్ సేవలు ఎంత మొత్తంలో వినియోగిస్తున్నారని తెలుపుతూ.. Gemini AI, Gmail, Google Maps, Search, Photos, Calendar, Docs వంటి ప్రముఖ అప్లికేషన్లను పిక్సెల్ 11 ప్రొ ఎంత వేగంగా.. ఎలా పని చేస్తుందో చూపించే ప్రయత్నం చేశారు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఆగస్టు 12న విడుదల..
ఆగస్టు 12న జరిగే ఈ కార్యక్రమంలో గూగుల్ కేవలం పిక్సెల్ 11 ప్రొ మాత్రమే కాకుండా.. పిక్సెల్ 11 (Pixel 11)తో పాటు పిక్సెల్ 11 ప్రొ ఎక్స్ఎల్ (Pixel 11 Pro XL) మోడళ్లను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. వీటితో పాటు అద్భుతమైన జెమిని AI ఫీచర్లు, గూగుల్ ఎకోసిస్టమ్కు సంబంధించిన మరిన్ని హార్డ్వేర్ పరికరాలను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
ఈ టెక్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. టెన్సర్ G6 ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సెన్సార్లు, అద్భుతమైన డిస్ప్లే క్వాలిటీతో రాబోతున్న ఈ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
Ajinkya Rahane Captaincy: రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి జట్టు నుంచి పక్కన పెట్టారు!
Hyderabad, Telangana:Ajinkya Rahane Captaincy Record: భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా.. ప్రామిసింగ్ బ్యాటర్గా నిలిచిన అజింక్య రహానే తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రోజు నుంచి తాను క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు రహానే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. అయితే ఆయన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన టెస్టు, వన్డే మ్యాచ్ల్లో ఒక్కటి కూడా భారత్ ఓడిపోకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఆయన టెస్టు కెప్టెన్సీ రికార్డులను పరిశీలిద్దాం.
అడిలైడ్లో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసిన తరుణంలో.. ప్రధాన ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతున్న జట్టును విజయవంతంగా నడిపించి, ఆస్ట్రేలియా గడ్డపై అజరామరమైన చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించిన అజింక్య రహానె కెప్టెన్సీ ఎప్పటికీ చిరస్మరణీయమే. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో రహానె కెప్టెన్సీ ప్రస్థానం స్వల్పకాలమే అయినప్పటికీ, అది అత్యంత అద్భుతమైన, విజయవంతమైన అధ్యాయంగా నిలిచింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ విజయం
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నటీ సెలవులపై స్వదేశానికి తిరిగి వెళ్లినప్పుడు, 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రహానె కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన కెరీర్లోనే అత్యంత కీలకమైన మలుపు.
36 పరుగులకే కుప్పకూలి తీవ్ర నైపుణ్య, మానసిక ఒత్తిడిలో ఉన్న జట్టుకు మెల్బోర్న్ (MCG) వేదికగా జరిగిన రెండో టెస్టులో రహానె తన అద్భుతమైన ప్రశాంతతతో ఒక అసాధారణ శతకం బాది జట్టును విజయపథంలో నిలిపారు. ఆ తర్వాత, కీలక ఆటగాళ్లు గాయాలపాలై బలహీనంగా మారిన జట్టును ఆస్ట్రేలియాలోని కంచుకోట అయిన గబ్బాలో అపూర్వ విజయానికి నడిపించి, 2-1 తేడాతో చారిత్రాత్మక సిరీస్ను కైవసం చేసుకునేలా చేశారు.
అజేయ రికార్డు, ప్రత్యేకత
ఐదు లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించి, ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా ఓడిపోని అతికొద్దిమంది భారత కెప్టెన్లలో రహానె ఒకరు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సవాలుతో కూడిన విదేశీ పర్యటనలలో, ఆయన ప్రదర్శించిన ప్రశాంతమైన కూడిన నాయకత్వ శైలి.. దేశంలోని అత్యుత్తమ తాత్కాలిక కెప్టెన్లలో ఒకరిగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది.
రహానే కెప్టెన్సీ రికార్డు..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే కెప్టెన్సీలో భారత జట్టు 6 టెస్టు మ్యాచ్లు ఆడింది. వాటిలో 4 విజయాలను నమోదు చేయగా.. రెండు మ్యాచ్లు డ్రాగా నిలిచాయి. అయితే రహానే కెప్టెన్గా వ్యవహరించిన మ్యాచ్ల్లో భారత జట్టు ఓటమి పాలవ్వలేదు. దీంతో అజింక్య రహానే విజయాల శాతం 66.67గా నమోదైంది. దీంతో పాటు ఆస్ట్రేలియా వేదికగా 2020-21లో జరిగిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీని భారత జట్టు గెలుపొందింది. అలాగే 3 వన్డేల్లో మూడు విజయాలు.. టీ20ల్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడింది.
Also REad: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్..ఎమోషనల్ వీడియో వైరల్!
Also Read: వన్డేల్లో రారాజుగా శుభ్మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ajinkya Rahane Retires: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్..ఎమోషనల్ వీడియో వైరల్!
Hyderabad, Telangana:Ajinkya Rahane Retirement: భారత క్రికెట్లో అత్యంత నమ్మకమైన బ్యాట్స్మెన్లలో ఒకరిగా నిలిచిన అజింక్య రహానే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్నీ ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. జూలై 30 నుంచి తన రిటైర్మెంట్ అమలులో ఉంటుందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు.
అజింక్య రహానే గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్గా వ్యవహరించారు. అయితే ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడడం లేదు. ఈ క్రమంలో తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు రహానే స్పష్టంగా పేర్కొన్నారు.
38 ఏళ్ల రహానే, "క్యాప్ నంబర్ 278, ఇక సెలవు. ఇన్నేళ్లుగా మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు" అని రాశారు. "నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను." ఈ సందేశంతో అతను తన అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్లకు, భారత క్రికెట్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతను తెలియజేశాడు.
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో అజింక్య రహానే ఒకరు. అతని కెప్టెన్సీ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది. టెస్ట్ క్రికెట్లో, అతను భారత్కు ఆరు మ్యాచ్లలో నాయకత్వం వహించగా, వాటిలో నాలుగు గెలిచి, రెండు డ్రా చేసుకున్నాడు. ముఖ్యంగా అతని కెప్టెన్సీలో భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వన్డే క్రికెట్లో రహానే మూడు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా, ఆ మూడూ విజయాలతో ముగిశాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో, అతను జట్టుకు రెండు మ్యాచ్లలో నాయకత్వం వహించగా, ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోయాడు.
అజింక్య రహానే భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 35.95 సగటుతో 8414 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రహానే కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో రాయల్స్, రైజింగ్ పూణే సూపర్జైంట్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. రహానే 212 ఐపీఎల్ మ్యాచ్లలో 30.15 సగటుతో 5367 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం
అజింక్య రహానే కెరీర్లో అత్యంత ఆశాజనకమైన అధ్యాయం 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో కనిపించింది. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత విరాట్ కోహ్లీ లేని సమయంలో, అతను జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మెల్బోర్న్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో అతను భారత్ను తిరిగి సిరీస్లోకి తీసుకువచ్చాడు.
దీని తర్వాత, యువ జట్టు బ్రిస్బేన్లోని గబ్బాలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన విజయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రహానే కెప్టెన్సీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
టెస్ట్ కెరీర్
> 85 మ్యాచ్లు, 5077 పరుగులు, 38.46 సగటు
> 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు, 49.50 స్ట్రైక్ రేట్
> 578 ఫోర్లు, 35 సిక్సర్లు
వన్డే కెరీర్
> 90 మ్యాచ్లు, 2962 పరుగులు, 35.26 సగటు
> 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు, 78.63 స్ట్రైక్ రేట్
> 293 ఫోర్లు, 33 సిక్సర్లు
టీ20 కెరీర్
> 20 మ్యాచ్లు, 375 పరుగులు, 20.83 సగటు
> 1 హాఫ్ సెంచరీ, 113.29 స్ట్రైక్ రేట్
> 32 ఫోర్లు, 6 సిక్సర్లు.
Also REad: వన్డేల్లో రారాజుగా శుభ్మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!
Also Read: హార్దిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబై ఇండియన్స్..కొత్త ఆటగాళ్ల లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఇన్ఫ్లుయెన్సర్గా బాగా చేస్తున్నారు.. ప్రధాని కుర్చీ ఖాళీ చేయండి.. మోదీపై అభిజీత్ దీప్కే సెటైర్లు..!!
Secunderabad, Telangana:Abhijit Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్ పేపర్ లీక్ కాంట్రవర్సీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ.. విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా మారితే బాగుంటుందని సెటైర్లు వేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మహారాష్ట్రలోని తన స్వస్థలానికి చేరుకున్న దీప్కే మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ ఇప్పుడు ఇన్ ఫ్లుయెన్సర్ గా మారాలని భావిస్తున్నాను. ఆయన ఆ పనిని చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని కుర్చీని ఖాళీ చేస్తే.. దేశాన్ని నడిపే బాధ్యతను మరో నాయకుడు చూసుకుంటారని ఆయన అన్నారు. ఆందోళన విరమించిన తర్వాత కూడా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని అభిజీత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ నిరసన విరమించిన తర్వాత ప్రభుత్వాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఆ వేధింపులు ఆపనట్లయితే.. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేవలం కేంద్ర మంత్రి రాజీనామాతో యువతలో ఆగ్రహం చల్లారలేదని..వారి కోపమంతా ప్రభుత్వం పైనే ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థులపై వేధింపులు అలాగే కొనసాగినట్లయితే.. ఆందోళనను మళ్లీ ప్రారంభిస్తామని దీప్కే హెచ్చరించారు. నిరసన ముగిసిందని భావించకూడదు.. ఈ విద్యార్థులు టెర్రరిస్టులు కాదు.. ఈ దేశ భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే..రేపు మేమే ప్రభుత్వాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. అవసరం అయితే తదుపరి ఆందోళన చాలా పెద్దెత్తున ఉంటుందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్ గన్ ఉపయోగించడంపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన అమిత్ షా అయినా.. మరెవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చినా.. తొలి విచారణే సీబిఐ న్యాయవాది హాజరవ్వకపోవడంతో వాయిదా పడిందని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయన్ను పార్లమెంటులో సన్నానించడంపై బీజేపీని ప్రశ్నించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ప్రధాన్ ను సన్మానించడానికి బీజేపీకి సిగ్గు అనిపించలేదా అని నిలదీశారు. కాక్రోచ్ పార్టీ నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన విమర్శలపై స్పందించారు. ఆమెను పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలిగా అభివర్ణించారు దీప్కే. సీరియస్ నాయకుల కామెంట్స్ కే తాను స్పందిస్తాను అన్నారు.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు..నెరవేరబోతున్న చిరకాల కోరిక..!!
Also Read: హెల్త్ కార్డులు, పీఆర్సీ కోసం రోడ్డెక్కిన పెన్షనర్లు..!!
Also Read: బ్రిక్స్ వేదికపై మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుకు రైతుల పూజలు
Tallagadda, Telangana:Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా గురు పౌర్ణమి గరుడ సేవ
Dharmavaram, Andhra Pradesh:TTD Done Garuda Seva In Tirumala Temple For Guru Pournami Watch VideoBonalu: బోనాల వేడుకల్లో జోగిని శ్యామల డ్యాన్స్
Secunderabad, Telangana:Jogini Shymala Theenmaar Dance In Secunderabad Bonalu WatchTirumala: తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఫేక్ సైట్లు, సైబర్ నేరాలపై కీలక ప్రకటన
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Fake News: తిరుమల భక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ టీటీడీ వెబ్సైట్లు, యాప్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ల ద్వారా దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇటీవల ttddevasthanam.online పేరుతో నకిలీ వెబ్సైట్ ద్వారా తప్పుడు ప్రచారం జరిగినట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్తో కలిసి తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ ఇప్పటివరకు 32 నకిలీ వెబ్సైట్లను తొలగించారు. అయితే కొత్త పేర్లతో మళ్లీ నకిలీ వెబ్సైట్లు వచ్చే అవకాశం ఉండడంతో భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్లు చేసుకోవాలని సూచించారు. భక్తులు అధికార సైట్లను మాత్రమే సందర్శించాలని.. ఏ ఇతర వ్యక్తులు, సంస్థలను సంప్రదించవద్దని టీటీడీ విజెలెన్స్ అధికారులు సూచనలు చేశారు.
సైబర్ మోసాలపై ప్రతి భక్తుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు లేదా టీటీడీ విజిలెన్స్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల అప్రమత్తతే సైబర్ మోసాలకు అడ్డుకట్ట అని పోలీసులు స్పష్టం చేశారు.
పెరిగిన భక్తులు
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. నిన్న బుధవారం 74,471 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 31,319 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కరోజుకు రూ.4.68 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. లడ్డూ విక్రయాలు 4.09 లక్షలు జరగ్గా.. అన్నప్రసాదాలు 2.59 లక్షల మంది భక్తులు స్వీకరించారు. కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉండడంతో సర్వదర్శనానికి (ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా) 12 గంటలు సమయం పడుతుంది.
Kaleshwaram: కాంగ్రెస్ సన్నాసులు ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు: బీఆర్ఎస్ పార్టీ
Kistampalli, Telangana:Gayatri Pumphouse: కాళేశ్వరం కూళేశ్వరం అని చెప్పిన సన్నాసులకు ఇదిగో నీళ్లు అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చూపించారు. గాయత్రి పంప్ హౌస్లో మీటర్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తుండడంతో ఆ నీటిని కాంగ్రెస్ నాయకులు చూడాలని సూచించారు. కాళేశ్వరం నీళ్లతోనే రైతులకు ఊరట అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, నీళ్లు రావని ప్రచారం చేసిన వారికే ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు సమాధానం చెబుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని.. దాని ఫలితమే మోటార్లు ఆన్ చేయడం అని వివరించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గాయత్రి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా కుంకుమ, పూలు చల్లి నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు వరి వేయొద్దని, నీటి పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పారని గుర్తుచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ప్రభుత్వంలోని అయోమయాన్ని బయటపెడుతోందని విమర్శించారు.
కళ్లు బాగా పెద్దవి చేసి చూడండి…. ఇగో ఇదే కాళేశ్వరం గాయత్రి పంప్ హౌజ్ కూడా కాళేశ్వరం లోని భాగమే…. కులేశ్వరం అన్న సన్నాసులకు ఇంతకు మించిన సమాధానం చూపెట్టలేము….
Thankyou @KCRBRSPresident గారు ,@KTRBRS గారు ,@BRSHarish గారు ❤️ కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి గొప్ప… pic.twitter.com/WuaLykJ2BA
— Sunke Ravishankar (@Ravishankar_BRS) July 29, 2026
రేవంత్ రెడ్డి ఒక మాట, మంత్రులు మరో మాట మాట్లాడుతుంటే రైతులు ఎవరిని నమ్మాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదికలో బ్యారేజీల భద్రత మాత్రమే తమ పరిధి అని, నీటి నిర్వహణ, సాగునీటి పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదిక పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. 'కన్నెపల్లి పంపులను ముందుగానే ప్రారంభించి ఉంటే గాయత్రి పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి మిడ్మానేరు, రంగనాయకసాగర్, అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని చేరవేసి చెరువులు నింపే అవకాశం ఉండేది' అని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల నారుమడులు ఎండిపోయాయని, ఇప్పటికే జూలై చివరి దశకు చేరుకున్నా నాట్లు వేసే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయత్రి పంప్హౌస్ ద్వారా నీటి విడుదలను పూర్తి స్థాయిలో కొనసాగించి ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ను నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను గోదావరి జలాలను తెలంగాణ రైతాంగానికి అందించేందుకు కాళేశ్వరం వంటి మహత్తర ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. కేసీఆర్ దూరదృష్టితోనే నేడు రైతులకు నీరు అందుతోందని తెలిపారు. కేసీఆర్పై గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు అసత్యమని తేలిపోయాయని.. తెలంగాణ రైతుల తరఫున కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్పారు.
Tirumala: తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ.. స్వామిసేవలో తరించిన భక్తులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Garuda Seva: ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి.. గురు పౌర్ణమి కావడంతో తిరుమలలో ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. ప్రతి పౌర్ణమికి గరుడ సేవ జరగనుండగా ఈసారి బుధవారం నేత్రానందంగా గరుడ సేవ టీటీడీ అధికారులు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు ఈ పవిత్ర గరుడసేవను భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
తిరుమలలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడసేవ బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య సాగిన ఈ వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గరుడవాహనంపై స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పురాణాల ప్రకారం 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. గరుడవాహనంపై స్వామివారి దర్శనం సర్వపాప ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుందని, జ్ఞాన–వైరాగ్యాలను ప్రసాదిస్తుందని వైష్ణవ సంప్రదాయం చెబుతోంది. గరుడుడు భక్తి, శరణాగతి, జ్ఞానానికి ప్రతీకగా భావించబడతాడు. ఈ పౌర్ణమి గరుడసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విమాన ఛార్జీలకు రెక్కలు
శ్రీవాణి టికెట్లపై ఒక్కసారిగా డిమాండ్ రావడంతో హైదరాబాద్–తిరుపతి విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో విమాన టికెట్ ధర రూ.24 వేల వరకు పెరిగినట్లు భక్తులు వాపోయారు. చివరి నిమిషంలో బుకింగ్లతో విమాన ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. శ్రీవాణి టికెట్ల కోసం విమానాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎయిర్పోర్టులో టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఇలా డిమాండ్ ఏర్పడిందని సమాచారం. భక్తుల ఫిర్యాదులతో టీటీడీ రంగంలోకి దిగింది. విమాన ఛార్జీలపై వరుస ఫిర్యాదులు రావడంతో టీటీడీ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అధిక ఛార్జీలపై కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
AP Job Calender: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Vijayawada, Andhra Pradesh:AP Job Calender 2026: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 'జాబ్ కేలండర్-2026' రూపకల్పన, అమలుపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రులు, అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
నాలుగు దశల్లో 10,060 ఉద్యోగాల భర్తీ
జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 పోస్టులను నాలుగు విడతలుగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
1) మొదటి దశలో భాగంగా మొత్తం 1,523 అధ్యాపక (ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేశారు.
2) రెండో దశలో 3,168 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నోటిఫికేషన్ తేదీలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
3) అదే విధంగా మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
హోంశాఖలోనూ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పోలీస్, భద్రతా విభాగాలలో సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రూప్-1 పెంపు పరిశీలన
నిరుద్యోగ అభ్యర్థులకు మరిన్ని మెరుగైన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచే అంశంపై మంత్రుల బృందం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
ఉద్యోగాల భర్తీలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను మంత్రి లోకేష్ హెచ్చరించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే, జాబ్ క్యాలెండర్-2026కు సంబంధించిన పూర్తి స్థాయి ఖాళీల వివరాలను రాబోయే కేబినెట్ సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
