icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన సుజీత్ హీరోయిన్!

Hyderabad, Telangana:

Seerat Kapoor Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా, ఆశగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచింగ్ సెప్టెంబర్ మొదటి వారంలోనే అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే సాధారణ ప్రజలకు (కామన్ పీపుల్) బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టే సువర్ణావకాశం కల్పించేందుకు షో మేకర్స్ 'అగ్నిపరీక్ష' సీజన్ 2 పేరుతో ప్రత్యేక ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ హల్‌చల్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.

మరోవైపు, ఈ క్రేజీ సీజన్‌లో సందడి చేయబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనే అంశంపై ప్రేక్షకులలో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారాల ప్రకారం పల్లవి గౌడ, తేజస్విని గౌడ, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్, బుల్లితెర గ్లామర్ డాల్ వర్ష, పవిత్ర, గ్లామరస్ యాంకర్ వర్షిణి, యూట్యూబ్ సెన్సేషన్ నందూస్ వరల్డ్ నందు, యంగ్ హీరో చంద్రహాస్, సీనియర్ నటి జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, ఒకప్పటి లవర్ బాయ్ హీరో అబ్బాస్, నూకరాజు, టెంపర్ వంశీ వంటి పలువురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ క్రేజీ సెలబ్రిటీల జాబితాలోకి తాజాగా టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సీరత్ కపూర్ పేరు కూడా వచ్చి చేరింది. ఆమె ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతోందంటూ వార్తలు రావడంతో, సీరత్ కపూర్ స్పందించి ఇన్‌స్టా/సోషల్ మీడియా వేదికగా తన అభిమానుల కోసం స్పష్టత ఇచ్చింది.

"నేను 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10'లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నేను కూడా చూశాను. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను. లేదంటే నా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తాను. దయచేసి అంతవరకు ఎలాంటి తప్పుడు రూమర్లను నమ్మవద్దు" అని హీరోయిన్ సీరత్ కపూర్ గట్టిగా పేర్కొంది.

'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్‌లో మంచి విజయం అందుకొని తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన సీరత్ కపూర్.. ఆ తర్వాత 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా', 'భామా కలాపం', రీసెంట్ మూవీ 'మనమే' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఫాలోయింగ్ ఉన్న సీరత్ కపూర్ ఇచ్చిన ఈ అధికారిక వివరణతో ఆమె ఎంట్రీపై వస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎట్టకేలకు పూర్తిగా తెరపడింది.

Also Read: బిగ్‌బాస్ 10 హంగామా షురూ.. ఈసారి హౌస్‌లోకి ఆ టాలీవుడ్ స్టార్ విలన్?

Also REad: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్‌ చేసిన ఉప్పల్ బాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Yashasvi Jaiswal Asitha: శ్రీలంకతో టెస్టులో ఉద్రిక్తత..లంక బౌలర్‌తో యశస్వి జైస్వాల్ రణరంగం..వీడియో వైరల్!

Colombo, Western Province:

Yashasvi Jaiswal Asitha Fernando: టీమ్ఇండియా, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ జైస్వాల్ వికెట్ తీసిన ఉత్సాహంలో బౌలర్ అసిథా ఫెర్నాండో, జైస్వాల్‌కు ఘాటైన శైలిలో వీడ్కోలు పలికాడు. పెవిలియన్ వైపు వెళ్ళిపోతున్న జైస్వాల్, ఫెర్నాండో నుండి ఏదో మాట వినపడటంతో వెనక్కి తిరిగాడు.

ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కొంటూ ముఖాముఖిగా నిలబడ్డారు. మాటల యుద్ధం తీవ్రమవడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తల అసిథా ఫెర్నాండో తలకు స్వల్పంగా తగిలింది. పరిస్థితి మరింత చేయి దాటక ముందే తోటి శ్రీలంక ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని వీరిద్దరినీ విడదీసి ఘర్షణను శాంతింపజేశారు.

ఈ మ్యాచ్ ద్వారా సరన్ష్ జైన్ తన టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అందువల్లే అతడిని జట్టు నుండి తప్పించాల్సి వచ్చిందని గిల్ తెలిపారు.

భారత ఇన్నింగ్స్ ప్రారంభం
ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైస్వాల్ మంచి పట్టుదలతో ఆడుతూ ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చే బంతులను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా మొదట కాస్త జాగ్రత్తగా ఆడి, ఆ తర్వాత కుదురుకున్నాడు. అయితే, లహిరు కుమార వేసిన ఒక వైడ్ బంతిని ఎడ్జ్ చేసి రాహుల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ అవుటైన తర్వాత దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో పడిక్కల్ స్లిప్ ఫీల్డర్ల పక్కగా బంతిని ఎడ్జ్ చేసి కాస్త ఆందోళన చెందాడు.

మరోవైపు యశస్వి జైస్వాల్ క్రీజులో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతను ఎదుర్కొన్న 53 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో వేగంగా 45 పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లు లైన్ లేదా లెంగ్త్ తప్పినప్పుడల్లా జైస్వాల్ బౌండరీలు బాదుతూ వారిపై ఒత్తిడి పెంచాడు. ఆ ఓవర్‌లో అంతకుముందు మూడు బౌండరీలు సమర్పించుకున్న శ్రీలంక పేసర్ అసిథా ఫెర్నాండో చివరకు చివరి బంతికి విజయం సాధించాడు.

తొలి సెషన్ ముగిసేసరికి భారత్ పరిస్థితి
యశస్వి జైస్వాల్ అవుట్ కావడంతో భారత్ తొలి సెషన్ ముగిసేసరికి ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి 66 పరుగుల స్కోరుకు చేరుకుంది. అప్పటివరకు బలంగా సాగిన భారత ఇన్నింగ్స్‌లో జైస్వాల్ వికెట్ పడటంతో శ్రీలంక తిరిగి మ్యాచ్‌లోకి పుంజుకోగలిగింది. కొలంబో పిచ్ కూడా భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకు శ్రీలంక బౌలర్లకు తగినంత సహకారాన్ని అందిస్తోంది.

Also Read: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్‌ చేరాలంటే భారత్‌ ఇలా చేయాలి!

Also Read: శ్రీలంకతో తొలిటెస్టులో భారత్ ఘన విజయం..10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ మానవ్ సుతార్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Abhijeet Dipke Case: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!

Badapur, Maharashtra:

Abhijeet Dipke Case In Maharashtra: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కేతో పాటు ఆయన బృందంలోని మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించి, తరగతులకు అంతరాయం కలిగించి, ఉపాధ్యాయులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు ఈ తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వివాదాస్పద ఘటనకు సంబంధించి లాతూర్ పరిధిలోని ఆసా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.

ఘటన నేపథ్యం..
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను బహిర్గతం చేయడం కోసం "స్కూల్ ఠీక్ కరో" అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిజీత్ దీప్కే, ఆయన సహచరులు లాతూర్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, అక్కడ ఉన్న లోటుపాట్లను సామాజిక మాధ్యమాలలో ప్రస్తావిస్తున్నారు.

అయితే, ఈ పర్యటనల సాకుతో ఆసా సమీపంలోని జవళి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో వీరు తీవ్రమైన అరాచకానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఉపాధ్యాయురాలి ఫిర్యాదు..
జవళి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ షమ్షద్‌బానో ఖైరతాలీ (53) ఆసా పోలీస్ స్టేషన్‌లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆమె సమర్పించిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. అభిజీత్ దీప్కే బృందం ఎటువంటి ముందస్తు అనుమతి కానీ, కనీస సమాచారం కానీ లేకుండా అక్రమంగా పాఠశాల ప్రాంగణంలోకి చొరబడింది. ఆ తర్వాత తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చుని, వారిని రకరకాల ప్రశ్నలు వేయడం ద్వారా తరగతులు, పాఠశాల అధికారిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు.

సస్పెన్షన్ బెదిరింపులు..
పాఠశాలలో జరిగిన ఈ పరిణామాలను దీప్కే బృందం వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించడం కోసం పక్కనే ఉన్న మరో పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి తరగతి గదుల్లో కూర్చోబెట్టారని దీప్కే ఉపాధ్యాయులపై ఆరోపణలు చేశారు. ఈ విషయమై అక్కడి ఉపాధ్యాయులను విధుల్లోంచి సస్పెండ్ చేయిస్తామని అభిజీత్ దీప్కే నేరుగా బెదిరింపులకు దిగడంతో పాఠశాల సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు.

కేసు నమోదు చేసిన పోలీసులు..
బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు ఆధారంగా ఆసా పోలీసులు అభిజీత్ దీప్కే, ఇతర నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

సెక్షన్ 132 - ప్రభుత్వోద్యోగి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడం.
సెక్షన్ 329(3) - ప్రభుత్వ పాఠశాల అధికారిక పనులకు తీవ్ర ఆటంకం కలిగించడం.
సెక్షన్ 351(2) - పాఠశాల సిబ్బందిని నేరపూరితమైన రీతిలో బెదిరింపులకు గురిచేయడం.
సెక్షన్ 356(2) - శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ అలజడి సృష్టించడం.
ఈ సంఘటన సామాజిక మాధ్యమాలు మరియు స్థానిక ప్రభుత్వ విద్యా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: Sonia Gandhi Vande Mataram: సోనియా గాంధీ వందేమాతరం వివాదం..కాంగ్రెస్‌ పార్టీపై మరింత పెరిగిన రాజకీయ రగడ!

Also Read: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాలకు మళ్లీ E10 పెట్రోల్ అందుబాటు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Karimnagar News: హాస్టల్‌కు పోవడం ఇష్టం లేక.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

Hyderabad, Telangana:

Karimnagar Student News: హాస్టల్ జీవితం నచ్చలేక.. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ఇష్టం లేక.. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడిన విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన విద్యార్థిని స్ఫూర్తి పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి..

కుటుంబ సభ్యులతో పాటు పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. రంగ పేటకు చెందిన స్ఫూర్తి ఇంటర్మీడియట్ చదువుతోంది.. చదువుల కోసం హాస్టల్లో ఉండాల్సి రాగా.. అక్కడి వాతావరణంలో ఉండటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేక పోయింది.. మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. సుమారు వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాలల్లో పురుగుల మందు కలుపుకొని తాగింది..

తాను పురుగుల మందు తాగినని విషయాన్ని స్ఫూర్తి తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పకుండా అలాగే ఉండిపోయింది.. అయితే.. శరీరంలోని విష ప్రభావం తీవ్రం కావడంతో కొన్ని రోజుల తర్వాత ఆమె తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.. కడుపునొప్పితో పాటు వాంతులతో బాధపడుతున్న ఆమెని కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ప్రశ్నించగా.. పురుగుల మందు తాగినట్లు విషయాన్ని బయట పెట్టేసింది.. 

 Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. 

విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బాధితురాలిని కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే విషం శరీరమంతటా వ్యాపించడంతో.. ఆమె పరిస్థితి విషమంగానే మారింది.. ఐసీయూలో అత్యవసర చికిత్సను అందించినప్పటికీ పరిస్థితి.. మెరుగుపడక శనివారం రాత్రి స్ఫూర్తి చికిత్స పొందుతూ మరణించింది..చేతికి అంది వచ్చిన కూతురు కళ్ళముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు..

 Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

తాతయ్యలు, బామ్మల బ్యాగుల్లో గంజాయి.. స్మగ్లర్ల మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్!

Hyderabad, Telangana:

Senior Citizens Turned Drug Carriers: వృద్ధాప్యం అనగానే ఎవరికైనా జాలితో పాటు గౌరవం కలుగుతుంది.. కానీ కొందరు మాఫియా కేటుగాళ్లు ఇదే సానుభూతిని అడ్డం పెట్టుకొని అక్రమ వ్యాపారానికి ఆయుధంగా మలుచుకుంటున్నారు.. ప్రయాణాల్లో వయస్సు పైబడిన వారిని ఎవరు పెద్దగా చెక్ చెయ్యరని భావించి.. డ్రగ్ క్యారియర్లుగా మార్చిన ఓ భారీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ CCS ప్రత్యేక క్రైమ్ బృందం, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో భాగంగా 38 కిలోల గంజాయితో.. ఐదుగురు నిందితులు పట్టుపడ్డారు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఈ మారకద్రవ్యాల విలువ మార్కెట్లో సుమారు పది లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు..

పోలీసులు విచారణలో భాగంగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. అరెస్ట్ అయిన వారిలో 78 ఏళ్ల రాజారాం స్వామి.. 65 ఏళ్ల సంతోష్.. 66 ఏళ్ల విజయలక్ష్మి లాంటి వృద్ధులతో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారట.. వీరంతా సాధారణ హౌస్ హెల్పర్స్ గా.. కూలీలుగా పనిచేస్తూ సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశతో ఈ ఊబిలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు..

స్మగ్లర్ల హైటెక్ స్కెచ్..
ఏజెన్సీ ప్రాంతమైన అరకులు నాణ్యమైన గంజాయిని కొనుగోలు చేసి.. వాసన రాకుండా బ్రౌన్ కలర్ కవర్లలో ప్యాక్ చేశారని పోలీసులు గుర్తించారు.. వృద్ధుల బ్యాగుల్లో.. వారి సాధారణ బట్టల మధ్య ఈ ప్యాకెట్లను దాచిపెట్టి.. ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ చేరుకొని.. ఎవరికి అనుమానం రాకుండా నగరాల్లోని లాడ్జిల్లో బస చేసి.. అనంతరం ప్రైవేట్ బస్సుల్లో ముంబాయి వెళ్లి.. అక్కడ గంజాయి విక్రయించే వారికి సరుకులు అప్పగిస్తూ ఉంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.. అంతేకాకుండా ఈ ప్రయాణానికి గాను ఒక్కొక్క డెలివరీకి.. దాదాపు పదివేల నుంచి 12 వేల వరకు వీరికి కమిషన్ మూడుతోందని అధికారులు వెల్లడించారు.

DCP చైతన్య కుమార్ మార్గదర్శకత్వంలో.. ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, ఎస్సై దేవేందర్ గౌడ్ ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. పట్టుబడిన నిందితులకు గతంలోనూ గంజాయి రవాణా చేసే నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. అసలు అరకులో సరుకు ఇస్తుంది ఎవరు? ముంబైలో తీసుకున్న డాన్ ఎవరు? అనే కోణంలో పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తును కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
0
Report

1984లో హత్య.. 2026లో అరెస్ట్.. 42 ఏళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన హంతకుడు..

Hyderabad, Telangana:

1984 Delhi Murder Case: నేరం చేసిన వాడు ఎప్పటికైనా చట్టానికి దొరకక తప్పదు అని నానుడి నిజమైంది.. ఢిల్లీ పోలీసులు ఓ సంచలన కేసును చేదించారు.. ఏకంగా నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో పోలీసులకు కళ్ళను కప్పి.. తిరుగుతున్న నిందితుడిని 42 ఏళ్ల తర్వాత ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.. ఇన్నాళ్ల పాటు అతను ఎక్కడున్నాడు? ఎలా జీవించాడు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఒక క్రైమ్ సినిమాను తలపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1984లో జరిగిందేంటో తెలుసా? 
రాజధాని ఢిల్లీలో 1984వ సంవత్సరంలో ఓ దారుణ హత్య జరిగింది.. అయితే ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులు ఉండగా.. అప్పట్లోనే పోలీసులు ఒకరిని పట్టుకొని.. కోర్టు ముందు హాజరు పరిచి.. శిక్ష విధించారు. కానీ ఇందులో మరో నిందితుడైన నాథులాల్ ఏ మాత్రం పోలీసులకు దొరకకుండా కళ్ళుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం అప్పట్లో తీవ్రంగా గాలించినప్పటికీ.. ఎలాంటి ఆచూకీ లభించలేకపోయింది. దీంతో కేసు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండిపోయింది..

నాథులాల్ వ్యూహం చాలా పకడ్బందీగా ఉందని భావించవచ్చు. పోలీసులు తమను ఎప్పటికైనా పట్టుకుంటారనే భయంతో అతను ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ ప్రాంతానికి పారిపోయినట్లు తెలిపారు. అక్కడ ఎవరికి అనుమానం కలగకుండా.. తన గతం తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడట.. తనకంటూ ఒక కుటుంబం ఉంటే పోలీసులకు సులభంగా దొరికిపోతానని భావించి.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడట.. స్థానికంగా ఉండే కూరగాయల మార్కెట్లో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ.. ఎవరి దృష్టిలో పడకుండా అది సాధారణంగా జీవించేవాడట..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..
పాత ఫైళ్లను తిరగేసిన పోలీసులు..

ఢిల్లీ పోలీసులు ఇటీవలే పెండింగ్లో ఉన్న పాత కేసులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారట.. అయితే ఇందులో భాగంగా దశాబ్దాల నాటి పాత ఫైలు బయటకు తీశారు.. అయితే ఇదే క్రమంలో ప్రత్యేకమైన దర్యాప్తును కూడా ప్రారంభించారట. టెక్నాలజీ తో పాటు పాత రికార్డులను పరిశీలించి.. స్థానికుల నుంచి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని తలదాచుకుంటున్న నాథులాల్ ను పక్క పకడ్బందీతో గుర్తించారట. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేకమైన బృందాలు ఆగస్టు 18న అతడిని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. నేరం చేసి ఎక్కువ కాలం దాగున్నప్పటికీ.. చట్టం చేతికి చిక్కక తప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

 Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Konda Surekha: రేవంత్‌ రెడ్డి టార్గెట్‌గా కొండా సురేఖ.. కాంగ్రెస్‌ పార్టీకి సంచలన లేఖ

Baddipadaga, Telangana:

TPCC Disciplinary Committee: తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తన కుటుంబంపై.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా కమిటీకి విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు.

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ.. తనను, తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండడాన్ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. వారి వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి.. వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. 

పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం తగదని కొండా సురేఖ హితవు పలికారు. క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని కోరారు. 'కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే సమయంలో, ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది' అని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. 

'నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం పరిశీలించాలి' అని లేఖలో మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని క్రమశిక్షణా కమిటీకి గుర్తుచేశారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు.

0
0
Report

School Bus Accident: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులతో కాలువలోకి దూసుకెళ్లి!

Vijayawada, Andhra Pradesh:

AP School Bus Accident: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఇబ్రహీంపట్నానికి చెందిన శ్రీచైతన్య పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రతిరోజూ లాగే విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. అయితే, కట్టుబడిపాలెం సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా డ్రైవర్ అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న తారకరామ కాలువలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లడంతో లోపల ఉన్న చిన్నారులు ప్రాణభయంతో కేకలు వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టారు. 

జి.కొండూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక ప్రజలతో కలిసి బస్సు అద్దాలు, ద్వారాల ద్వారా లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను అత్యంత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో సహాయక చర్యలు అందడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

మొన్న విశాఖలో విషాదం..
విశాఖ వన్‌టౌన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పాఠశాల అయిన 'లిటిల్ గార్డెన్ స్కూల్' లో అత్యంత హృదయవిదారకమైన ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఆరేళ్ల అమాయకపు బాలుడు ప్రణయ్ తేజ యూకేజీ (UKG) చదువుతున్నాడు. ఘటన జరిగిన రోజు తరగతి గదిలో ఉపాధ్యాయురాలు విద్యార్థులందరి హోంవర్క్‌లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజ తన హోంవర్క్ పూర్తి చేయలేదని గుర్తించిన ఆ టీచర్ తీవ్ర ఆగ్రహంతో బాలుడిని బెదిరించారు.

దాంతో భయపడిపోయిన ఆ పసివాడు "నన్ను కొట్టొద్దు" అని వేడుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించినా, ఆ ఉపాధ్యాయురాలు కించిత్ కూడా కనికరం లేకుండా బాలుడి చెంపపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు తీవ్ర భయాందోళన చెందిన చిన్నారి అక్కడికక్కడే తరగతి గదిలోనే కుప్పకూలిపోయి, స్పృహ కోల్పోయాడు. ఈ అత్యంత బాధాకరమైన దృశ్యాలన్నీ క్లాస్‌రూమ్‌ లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

స్పృహ తప్పి పడిపోయిన చిన్నారి ప్రణయ్‌ను పాఠశాల సిబ్బంది వెంటనే సమీపంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి (KGH) తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధ్యులైన ఉపాధ్యాయురాలితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ రెండు దారుణ ఘటనలు పాఠశాలల్లో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. క్లాస్‌రూమ్‌లలో ఉపాధ్యాయుల ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు పాఠశాల రవాణా వాహనాల కండిషన్, డ్రైవర్ల డ్రైవింగ్ తీరుపై ప్రభుత్వం నిరంతర నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఏ విద్యార్థికీ ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రతి పాఠశాలలో విద్యార్థుల భద్రతను పటిష్టం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలపై అత్యంత సీరియస్‌గా తీసుకుని కఠిన నిర్ణయాలు అమలు చేయాలని తల్లిదండ్రుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Also Read: ఏపీ విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. 'తల్లికి వందనం' నిధుల విడుదల తేదీ ఖరారు!

Also Read: AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..ఎన్నికలు ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Job Calendar: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. భారీ పోస్టులతో 'జాబ్‌ క్యాలెండర్‌' విడుదల

Nuzendla, Andhra Pradesh:

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. డీఎస్సీ, గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీపై వివాదం కొనసాగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరోసారి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్‌లో నాలుగు దశల్లో 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్‌ క్యాలెండర్‌లో తొలి దశలో 1,523 పోస్టులకు ఇప్పటికే ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 15వ తేదీన రెండో దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

రెండో దశలో గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీపీఎస్‌సీ గ్రూప్‌1కు సంబంధించి 149 పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయనుంది. ఇక పోలీస్‌ విభాగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో పోలీస్‌ కానిస్టేబుల్‌ 542, సివిల్‌ ఎస్‌ఐ 182 పోస్టుల భర్తీ ఏపీ ప్రభుత్వం చేయనుంది. అక్టోబర్‌ 15వ తేదీన దసరా, దీపావళి కానుకగా నిరుద్యోగులకు మూడో దశలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 2,311 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

మూడో దశలో గ్రూప్‌-2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నట్లు.. వాటిలో డిప్యూటీ తహశీల్దార్‌ 200 పోస్టులు ఉన్నాయి. మూడో దశలో ఇంజినీరింగ్‌ సహా ఇతర విభాగాల్లో 1,638 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. అక్టోబర్‌ 15న నాలుగో దశలో 2,995 పోస్టులు భర్తీ చేయాలని జాబ్‌ క్యాలెండర్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇదే జాబ్‌ క్యాలెండర్‌లో స్కూల్‌ ఎడ్యుకేషన్‌లోనే 2,991 పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదలతో ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీపడుతున్న అభ్యర్థులు ఇక పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించనున్నారు.

0
0
Report
Advertisement

Thalliki Vandanam 2026: ఏపీ విద్యార్థుల తల్లులకు గుడ్ న్యూస్.. 'తల్లికి వందనం' నిధుల విడుదల తేదీ ఖరారు!

Vijayawada, Andhra Pradesh:

Thalliki Vandanam 2026 Status: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల, ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థుల కుటుంబాలకు విద్యా పరంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత పొందిన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోకి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా జమ చేయనున్నారు.

అర్హులు, లబ్ధిదారులు..
ఈ విద్యాసంవత్సరం నూతనంగా పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన చిన్నారులతో పాటు, జూనియర్ కళాశాలల్లో చేరిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. గత నెలలో లబ్ధి పొందలేకపోయిన అర్హులకు కూడా ఈ విడతలో నగదు జమ కానుంది. దాదాపు 2.78 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నట్లు సమాచారం.

విడుదల తేదీ, చివరి గడువు..
తాజా అధికారిక నివేదికల ప్రకారం.. ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనుంది. అయితే, విభిన్న సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి, అలాగే ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్ ఉన్నవారికి ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. కొత్త దరఖాస్తుల సమర్పణకు, వివరాల సవరణకు ఆగస్టు 25వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది.

తల్లిదండ్రులు చేయాల్సిన పనులు
అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందని విద్యార్థుల తల్లులు వెంటనే తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈ కొద్దిపాటి సాంకేతిక ప్రక్రియలను ఆగస్టు 25 లోపు పూర్తి చేసుకుంటే, ఆగస్టు 30న ఎటువంటి అంతరాయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.13,000 జమ అవుతాయి.

Also Read: AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..ఎన్నికలు ఎప్పుడంటే?

Also REad; Vizag School Tragedy: విశాఖలోని ప్రైవేట్ స్కూల్లో చిన్నారి మృతి..అసలు కారణం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Autos Bandh: ప్రయాణికులకు అలర్ట్‌.. రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆటోలు బంద్

Baddipadaga, Telangana:

Telangana Autos Bandh: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో మరో వర్గం కూడా భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. తమ జీవనాధారంపై పొట్టకొట్టేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగనున్నారు. గతంలో పలమార్లు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో ఆటోలు నిలిచిపోనున్నాయి.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో ఏడున్నర లక్షల ఆటోలు పాల్గొనున్నాయి. రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు ఇచ్చి నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆటో కార్మికులు ఈ బంద్‌ చేపడుతున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంచాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందించకపోవడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనలకు స్కూల్‌ వాహనాల కార్మికులు కూడా తోడయ్యారు. ఆటో కార్మికులతోపాటు తాము బంద్‌లో పాల్గొంటామని స్కూల్‌ వ్యాన్ల యజమానులు ప్రకటించారు.

ఈసీఐఎల్‌లో ర్యాలీ
తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్‌ వ్యాన్‌ల బంద్‌ సందర్భంగా బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుంచి మల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దాదాపు 300 ఆటోలలో 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. ఆటో మోటారు రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈవీ వాహనాలను  ఆర్టీసీకి అనుసంధానం చేసి తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని విమర్శించారు. అన్ని కులాలకు చెందినవారు నేడు ఆటో రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. రేపటి నుంచి చేపట్టనున్న సమ్మెకు ప్రభుత్వం దిగిరాక తప్పదని హెచ్చరించారు.

ఆటో డ్రైవర్ల బంద్‌కు కవిత మద్దతు
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టిన బంద్‌కు మాజీ ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆటో కార్మికుల బంద్‌కు తాము మద్దతునిస్తున్నట్ఉల తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలిపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) సహా పలు ఆటో యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఆటో కార్మికులు బంద్ పోస్టర్ ఆవిష్కరించారు.

0
0
Report

Train Fuel Consumption: రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందో తెలుసా? నమ్మలేని నిజం!

Hyderabad, Telangana:

Train Fuel Consumption Per KM: భారతీయ రైల్వే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. మనందరం ఎప్పుడో ఒకప్పుడు రైలు ప్రయాణం చేసే ఉంటాం కానీ, ఒక భారీ రైలు కేవలం ఒక కిలోమీటర్ దూరం సాగడానికి ఎంత డీజిల్ లేదా విద్యుత్ ఖర్చవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

రైలు మైలేజీ అనేది కారు లేదా బైక్ లాగా ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదు. రైలు రకం, బోగీల సంఖ్య, మొత్తం బరువు, ప్రయాణించే వేగం, మార్గంలో అది ఆగే స్టాపుల సంఖ్య వంటి అనేక అంశాలపై ఈ ఇంధన వినియోగం ఆధారపడి ఉంటుంది.

ప్యాసింజర్ రైళ్ల మైలేజీ, ఇంధన వినియోగం..
డీజిల్ ఇంజిన్‌తో నడిచే, సుమారు 12 బోగీలు కలిగిన ఒక సాధారణ ప్యాసింజర్ రైలు ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి దాదాపు 6 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. దీని ప్రకారం చూస్తే, కేవలం ఒక లీటర్ డీజిల్‌తో ఈ రైలు సుమారు 170 మీటర్ల దూరం మాత్రమే ముందుకు సాగగలదు. ప్యాసింజర్ రైళ్లు చిన్న, పెద్ద స్టేషన్లలో తరచుగా ఆగుతూ ఉంటాయి. ఇలా పదే పదే బ్రేకులు వేయడం, మళ్లీ రైలు వేగాన్ని పెంచడం వల్ల ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.

ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల పరిస్థితి ఏమిటి?
మరోవైపు 12 బోగీలు ఉండే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక కిలోమీటర్ దూరం వెళ్లడానికి సుమారు 4.5 లీటర్ల డీజిల్ సరిపోతుంది. అంటే ఒక లీటర్ డీజిల్‌తో ఇది దాదాపు 220 మీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇంధన వినియోగం ప్యాసింజర్ రైళ్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. అయితే 24 బోగీలు ఉండే భారీ సూపర్‌ఫాస్ట్ రైలుకు మాత్రం కిలోమీటర్‌కు సుమారు 6 లీటర్ల డీజిల్ అవసరం కావచ్చు. బోగీల సంఖ్య పెరగడంతో రైలు మొత్తం బరువు కూడా పెరుగుతుంది, అదే ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతుంది.

ఎలక్ట్రిక్ రైళ్లకు ఎంత ఖర్చవుతుంది?
ప్రస్తుతం భారత రైల్వేలో విద్యుదీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగం పెరుగుతోంది. ఒక ఎలక్ట్రిక్ రైలు కిలోమీటర్ ప్రయాణానికి సుమారు 20 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. గత ఏడాది ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.6.50 గా ఉన్నప్పుడు, కిలోమీటర్‌కు విద్యుత్ ఖర్చు సుమారు రూ.130 గా ఉండేది. ప్రస్తుత ధరల ఆధారంగా చూస్తే, ఈ ఖర్చు దాదాపు రూ. 150 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

అయితే ఇందులో కేవలం విద్యుత్ ఖర్చు మాత్రమే లెక్కించినట్లు. నిర్వహణ, సిబ్బంది తదితర ఖర్చులు ఇందులో ఉండవు. చివరగా చెప్పాలంటే, రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చు కేవలం ఇంధనం లేదా విద్యుత్ వినియోగంతో మాత్రమే నిర్ణయించలేము. రైలు బరువు, బోగీల సంఖ్య, వేగం, స్టాపులు, మార్గ పరిస్థితులు వంటి అనేక అంశాలు దాని ఇంధన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

Also Read: వర్షాకాలంలో కూడా ఏసీ వాడుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టే!

ALso Read: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాలకు మళ్లీ E10 పెట్రోల్ అందుబాటు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Snake Video: ఇదెందిరా సామి.. తాగుబోతులా తూలుతున్న నాగు పాము.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

Cobra behaves like drunk man funny video: సోషల్ మీడియాలో ఇటీవల పాముల వీడియోలు ఎక్కువగా వైరల్గా మారుతున్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోబ్రాల వీడియోలకు ఇటీవల ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఎక్కడ పాములు కన్పించిన భయంతో పారిపోకుండా వాటితో స్టంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది అయితే పాములను కొరికి తమప్రతాపం వాటి మీద చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. పాములు కొన్నిసార్లు చాలా వెరైటీగా ప్రవర్తిస్తాయి.  ప్రస్తుతం ఒక పాము చాలా తాగినట్లు ప్రవర్తించింది. ఈ వీడియో వైరల్గా మారింది.

 

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పాము తప్పతాగిన వ్యక్తిలా ప్రవర్తించింది. తాగిన వ్యక్తి ఏవిధంగా అయితే తూలుతాడో అచ్చం నాగు పాము అదే విధంగా చేసింది. బ్యాలెన్స్ తప్పినట్లు ముందుకు, వెనక్కు తూలుతు రోడ్డుపక్కన  పడగ విప్పింది. కోబ్రా ప్రవర్తన చూసి అందరు షాక్ అయ్యారు. ఇదెంటీ ఇలా చేస్తుందని అక్కడి వారు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.

ఆ తర్వాత దాన్ని కాస్త నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ పాము మాత్రం అచ్చంతాగిన వాళ్లుఎలా బ్యాలెన్స్ తప్పి తూలుతారో అలా తూలుతూ రచ్చ చేసింది. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Read more: Kerala bride Video: పెళ్లిలో డాక్టర్‌గా మారిన నవవధువు.. వీడియోపై నెట్టింట ప్రశంసలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?.

ఇలా చేస్తుందేంట్రా అంటూ షాక్ తో నోరెళ్ల బెడుతున్నారు. మరోవైపు పాములతో జాగ్రత్తగా ఉండాలని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాటు వేస్తాయని కొంత మంది చెబుతున్నారు.  కానీ పాములను చంపడం చేయోద్దని, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వాలనిచెబుతున్నారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top