అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే బిజెపి లక్ష్యం : ఎంపీ చామల
Bhuvanagiri, Telangana:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బిజెపి ప్రవర్తిస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.మూసి ప్రక్షాళనను రాజకీయం చేయకుండా,గంగా నది, సబర్మతి నది ప్రక్షాళన కోసం మోడీకి సహకరించిన విధంగానే ఇక్కడ మూసీ నదికి కూడా సహకరించి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.మిమ్ములను ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మీరు పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
IPL 2026: ఉప్పల్లో ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. రాజస్థాన్ను చిత్తు చేసిన సన్రైజర్స్.. హైదరాబాద్ ఖాతాలో గ్రాండ్ విక్టరీ..!!
Lakshmapur, Telangana:SRH vs RR: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో చెలరేగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ గట్టిషాకిచ్చింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ఓటమి రుచి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. డొనావన్ ఫెరీరా 69 బాల్స్ లో 7 ఫోర్లు 3 సిక్సులు తీయగా.. రవీంద్రా జడేజా 45 బంతుల్లో 5 ఫోర్లతో పోరాటం చేశారు. ప్రఫుల్ హింగే 4 వికెట్లు తీసుకుని 34 పరుగులు ఇచ్చాడు. సకీబ్ హుస్సేన్ 4 వికెట్ల కు 24 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా రాజస్థాన్ ఓటమి రాసారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సాక్షిగా సోమవారం ఆరెంజ్ ఆర్మీ శివాలెత్తిపోయింది. బౌండరీల మోత.. వికెట్ల వేటతో రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ మట్టికరిపించింది. వేలాది మంది అభిమానులు ఆరేంజ్ కేరింతల మధ్య హైదరాబాద్ జట్టు పాత రాజస్థాన్ ను గుర్తు చేస్తూ రాయల్స్ గాలి తీసింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ నవాబులు.. ఈ విజయంతో పాయింట్ల పట్టికతో తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు.
మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కెప్టెన్ నిర్ణయం 100 శాతం కరెక్ట్ అని ప్రఫుల్ హింగే నిరూపించాడు. రూ. 30 లక్షల బేస్ ప్రైస్ కుర్రాడు.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అరంగేట్రం ఓవర్లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నుముక విరిచేశాడు. తొలి ఓవర్ ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 1/3 అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధ్రువ్ జురెల్ వంటి స్టార్ ప్లేయర్ క్లీన్ బౌల్డ్ అవ్వడం ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
ప్రఫుల్ వేసిన దెబ్బ నుంచి రాజస్థాన్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మిడిల్ ఓవర్లలో కమిన్స్ తన వ్యూహాలతో బ్యాటర్లను కట్టడి చేయగా.. స్పిన్నర్లు పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎస్ఆర్హెచ్ బౌలర్లు వికెట్లు తీస్తూనే ఉన్నారు. నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ ఒక గౌరవప్రదమైన స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.
లక్ష్యం పెద్దది కాకపోయినా.. అభిషేక్ శర్మ తొలి బంతికే డకౌట్ అవ్వడం ఫ్యాన్స్ను కాస్త టెన్షన్ పెట్టింది. కానీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు క్లాస్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను వన్ సైడ్ చేసేశారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ట్రెంట్ బౌల్ట్, ఆర్చర్ వంటి దిగ్గజ బౌలర్లను కూడా లెక్కచేయకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ప్రతి బంతిని బౌండరీకి పంపుతూ రన్ రేట్ను ఎక్కడా తగ్గనివ్వలేదు.
మ్యాచ్ క్లైమాక్స్కు వచ్చేసరికి ఉప్పల్ స్టేడియం ఒక పండుగలా మారిపోయింది. గెలుపుకు చేరువవుతున్న కొద్దీ అభిమానుల నినాదాలతో గ్రౌండ్ దద్దరిల్లిపోయింది. చివరకు మరో కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
ఈ విజయం సన్రైజర్స్ హైదరాబాద్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అటు బౌలింగ్లో ప్రఫుల్ హింగే సంచలనం, ఇటు బ్యాటింగ్లో సమిష్టి కృషి హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాయి. రాజస్థాన్ రాయల్స్కు ఇది ఒక పీడకల లాంటి మ్యాచ్ అయితే, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు మాత్రం ఇది కన్నుల పండుగగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kcr Mega public Meeting: కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు.. ఇన్ చార్జీల ప్రకటించిన బీఆర్ఎస్..
Hyderabad, Telangana:Huge arrangements for jagtial kcr mega public meeting: తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరుతానని ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జీవన్ రెడ్డి సైతం కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వెళ్లి కలిసిన తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తన ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో..జీవన్ రెడ్డి లాంటి నిజాయితీ, నిబద్దత గల నాయకులు పార్టీలో ఉంటే మరింత పట్టుదలతో ముందుకు వెళ్లవచ్చని బీఆర్ఎస్ యోచిస్తుంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పట్టు బిగించే విధంగా నేతలు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే ఏప్రిల్ 20న బీఆర్ఎస్ బహిరంగ సభకు బీఆర్ఎస్ నాయకులతో పాటు, జీవన్ రెడ్డి కూడా బహిరంగ సభఎక్కడ నిర్వహించాలో పలు ప్రదేశాలను సందర్శించారు . ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఇన్ చార్జీలను ప్రకటించింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జీలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్చార్జీలను కేటీఆర్ ఖరారు చేశారు.
నియోజకవర్గాల వారీగా ఇన్చార్జీలు:
జగిత్యాల: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే, జనగామ)
కోరుట్ల: ప్రశాంత్ రెడ్డి (ఎమ్మెల్యే, బాల్కొండ)
ధర్మపురి: ఎల్. రవీందర్ రావు (ఎంఎల్సీ)
వేములవాడ: బాల్క సుమన్ (మాజీ ఎమ్మెల్యే)
చొప్పదండి: పెద్ది సుదర్శన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో జగిత్యాలలో నిర్వహించబోయే సభపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇదే సభ వేదికగా బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా ప్రకటిస్తారని తెలంగాణ రాజకీయాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్! ఏప్రిల్ 22 నుంచి బస్సులు బంద్? పోరాట గంట మోగించిన జేఏసీ చైర్మన్ వెంకన్న..!!
Lakshmapur, Telangana:RTC Strike Alert: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ సమ్మె సెగ రాజుకుంటోంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సమస్యలు విన్నవిస్తున్నా... పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు.
కార్మికుల సమస్యలపై మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చామని.. నెల గడువు ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని జేఏసీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలను తీర్చాల్సింది పోయి.. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి మమ్మల్ని సమ్మె చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు ఉందని వెంకన్న అసహనం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ విలీనం, యూనియన్లకు ఎన్నికల నిర్వహణపై కమిటీ వేశామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్న మాటలపై జేఏసీ నేతలు నిలదీశారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆ కమిటీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వెంటనే బహిర్గతం చేయండి అని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామని, కొత్తవేమీ కోరడం లేదని వారు గుర్తు చేశారు.
సమ్మెకు మద్దతుగా దాదాపు 40 వేల మంది కార్మికులు జేఏసీ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు ప్రకటించారు.
ఏప్రిల్ 22 నుంచి: రాష్ట్రవ్యాప్తంగా భారీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం.
డిమాండ్లు: ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
బదిలీలు: ఎక్కడి కార్మికులు అక్కడే ఉండాలని, అస్తవ్యస్త బదిలీలు ఆపాలని డిమాండ్ చేశారు.
21 అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపివేత:
ఏప్రిల్ 21 అర్ధరాత్రి మొదటి డ్యూటీ నుంచే మా సమ్మె ప్రారంభం అవుతుంది. జేఏసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వేరే ఆలోచనలు చేస్తే ఊరుకోం అని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. ఈ సమ్మె ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులపై పడే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral News: "జీతం ఎంతిస్తే.. పనంతే చేస్తా".. ఆఫీసులో 5 గంటలు కునుకు తీసిన ఉద్యోగి.. నెట్టింట రచ్చ రేపుతున్న పోస్ట్..!!
Lakshmapur, Telangana:Low salary sleep at work viral: సాధారణంగా ఆఫీసుల్లో జీతం పెంచలేదని.. లేదంటే తక్కువ జీతం ఉందని ఏం చేస్తారు? బాస్ ను రిక్వెస్ట్ చేస్తారు.. లేదంటే.. గొడవపడుతుంటారు. లేదంటే ఇంక్రిమెంట్ అది కూడా కాదంటే రిజైన్ చేసి వేరే కంపెనీకి మారుతుంటారు. కానీ చైనాలోని హెనాన్ ప్రాంప్తం, షాంగ్ క్యూ నగరానికి చెందిన ఓ మహిళ ఉద్యోగిని మాత్రం చాలా వెరైటీగా ఆలోచించింది. "నువ్వు నాకు ఇచ్చే జీతానికి.. నేను చేసే పనంతే" అంటూ ఏకంగా ఆఫీసులోనే తన డెస్కులో కుర్చీలో 5గంటల పాటు మాంచిగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఆ తర్వాత జరిగిన డ్రామా చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.
సదరు మహిళా ఉద్యోగి నిద్రపోయిన విషయాన్ని గమనించిన బాస్.. ఏంటీ రోజంతా ఆఫీసులోనే నిద్రపోయావా? అని నిలదీశారు. ఆ అమ్మడు ఏమాత్రం తగ్గలేదు..పైగా ఓ కన్నీటి వీడియో పోస్ట్ చేస్తూ.."నువ్వు ఎంతిస్తే పనంతే చేస్తా (You get what you pay for)" అంటూ కొత్త లాజిక్ తీసింది. రోజుకు 8 గంటల డ్యూటీలో 5 గంటలు నిద్రపోతే.. ఇక లంచ్ బ్రేక్.. టీ బ్రేక్ పోను ఆమె పనిచేసేది కేవలం గంటన్నర మాత్రమేనని నెటిజన్లు లెక్కలు వేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఆమె నిరసన నిద్రతో అక్కడికే.. ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ.. 5 గంటల నిద్ర తర్వాత లేవగానే మన ఆవిడకు ఆకలి వేసింది. పక్కనే బాస్ టేబుల్ మీద ఉన్న ఒక చాక్లెట్ కనిపిస్తే టక్కున నోట్లో వేసుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ బాస్ పాపం గ్లూకోజ్ ఇంటోలరెన్స్ తో బాధపడుతూ, షుగర్ లెవల్స్ పడిపోయినప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆ చాక్లెట్లను దగ్గర పెట్టుకున్నాడు. తీరా టైమ్కు చాక్లెట్ లేకపోయేసరికి ఆయన నీరసించి దాదాపు కుప్పకూలిపోయారు.
దీంతో బాస్ సీరియస్ అయ్యి వార్నింగ్ ఇస్తూ.. "నన్ను చంపేయాలనుకున్నావా అని బాస్ అరుస్తున్నాడు.. నన్ను ఆఫీసులో నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడు" అంటూ ఆ మహిళ వీడియోలో రచ్చ రచ్చ చేసింది.
ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. మన నెటిజన్లు ఊరుకుంటారు. ఎవరికి నచ్చిన విధంగా వారు పంచ్ లతో సెటైర్లతో ఉతికారేశారు.
"అలారం పెట్టుకోమ్మా..!"
సాధారణంగా సోషల్ మీడియాలో అందరూ బాస్లనే తిడుతుంటారు. కానీ ఈసారి మాత్రం నెటిజన్లు కూడా బాస్కే సపోర్ట్ చేస్తున్నారు.
"ఏ బాస్ అయినా ఇలాంటి ఉద్యోగిని భరిస్తాడా?" అని ఒకరు..
"ఓరి దేవుడో.. నా జీవితంలో ఒక బాస్కు సపోర్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు" అని మరొకరు సెటైర్లు వేశారు.
ఇంకో నెటిజన్ అయితే.. "అమ్మా.. వచ్చేసారి నిద్రపోయే ముందు అలారం పెట్టుకో.. లేదంటే ఆఫీసు టైమ్ అయిపోయినా అక్కడే నిద్రపోతావు" అంటూ చురకలు వేశాడు.
మొత్తానికి "తక్కువ జీతం ఇస్తే ఆఫీసులోనే నిద్రపోతా" అన్న ఈమె నిరసన ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. కార్పొరేట్ లోకంలో నిద్ర కూడా ఒక నిరసన ఆయుధం అని ఈ చైనా వనిత నిరూపించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Haemophilia In Pregnancy: తల్లి గర్భం నుంచే బిడ్డకు ప్రాణాంతక ప్రమాదం?! గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Hyderabad, Telangana:Haemophilia Testing In Pregnancy: గర్భం దాల్చడం అనేది మహిళల జీవితంలో ఓ కీలక దశ. కానీ, ఇది తల్లీబిడ్డలను ప్రభావితం చేసే అనారోగ్య సమస్యల సంక్రమించే సమయం. అనేక అనారోగ్య సమస్యలు గురించి ప్రతి తల్లీ కచ్చితంగా అవగాహన చేసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రోగ నిర్ధారణకు ఎటువంటి ప్రక్రియను ఫాలో అవ్వాలనే విశేషాలను ఫెర్నాండేజ్ ఆస్పత్రికి చెందిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ తారకేశ్వరి సూరపనేని మాటల్లో తెలుసుకుందాం.
గర్భవతులకు కచ్చితమైన అవగాహన అవసరమైన వ్యాధుల్లో హీమోఫిలియా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5,000 మంది మగ శిశువులలో ఒకరికి ఈ అరుదైన రక్తస్రావ వ్యాధి ఉంటుంది. ఇది అనేక కుటుంబాలలో వంశపారంపర్యంగా వస్తుంది. హీమోఫిలియా ఉన్నవారి రక్తం సరిగ్గా గడ్డకట్టదు. కాబట్టి, చిన్న గాయాలు లేదా చర్మంపై గీతలు పడినా కూడా వారికి సాధారణం కంటే ఎక్కువ సేపు రక్తస్రావం అవుతుంది.
ఈ వ్యాధి పురుషులలో ఎక్కువగా కనిపించినా.. మహిళలు కూడా దీనికి వాహకాలుగా (క్యారియర్లుగా) ఉండగలరు. ఒకవేళ మహిళ ఈ జన్యువును కలిగి ఉంటే, ప్రతి గర్భధారణ సమయంలో అది బిడ్డకు సంక్రమించే అవకాశం 50% ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న పురుషులకు హీమోఫిలియా ఉండవచ్చు. అయితే మహిళలు దీనికి వాహకాలుగా (క్యారియర్లుగా) ఉంటూ తమ బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని కలిగి ఉన్న కొందరు మహిళలకు అధిక రుతుస్రావం, సులభంగా కమిలిపోవడం లేదా గాయం లేదా శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం ఆగేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి లక్షణాలతో హీమోఫిలియా ఉంటుంది.
హీమోఫిలియా ఉన్నట్లు నిర్ధారణ అయిన మహిళలు గర్భం ధరించడానికి ముందే వైద్యుడిని సంప్రదించాలి. జన్యు పరీక్ష, ఒక సాధారణ రక్త పరీక్ష, ఎవరైనా క్యారియరా కాదా అని నిర్ధారించడానికి సహాయపడతాయి. కాబోయే దంపతులు తమ బిడ్డకు ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రసవానికి కొన్ని ముందస్తు టెస్ట్లు చేయించుకోవచ్చు. గర్భధారణ సమయంలో ముఖ్యంగా చివరి త్రైమాసికంలో.. రక్తం గడ్డకట్టే కారకాల (క్లాటింగ్ ఫ్యాక్టర్) స్థాయిలు మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యం.
ఇలాంటి పరిస్థితుల్లో క్యారియర్లుగా ఉన్న మహిళలకు గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత రక్తస్రావం అయ్యే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. ఒకవేళ బిడ్డకు హీమోఫిలియా ఉంటే.. ముఖ్యంగా పుట్టినప్పుడు, బిడ్డకు రక్తస్రావం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
చాలా మంది మహిళలు యోని మార్గం ద్వారా ప్రసవించగలరు. అయితే, వాక్యూమ్-సహాయక ప్రసవం వల్ల శిశువుకు మరింత సులభంగా రక్తస్రావం అవుతుంది. కాబట్టి, వైద్యులు ఆ ప్రక్రియను అరుదుగా ఎంచుకుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఏవైనా సాధారణ చికిత్సలు అందించే ముందు శిశువును క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ముందస్తు పరీక్షల ద్వారా నవజాత శిశువుకు హీమోఫిలియా ఉందో లేక క్యారియరా అని నిర్ధారించవచ్చు. ప్రసవం తర్వాత, తల్లులలో అధిక రక్తస్రావానికి సంబంధించిన ఏవైనా సంకేతాల కోసం కూడా పర్యవేక్షిస్తారు.
వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం, ముందుగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మన జీవితాల్లో పెద్ద మార్పు తెస్తుంది. హీమోఫిలియా ఉన్న చాలా మంది వ్యక్తులు సరైన చికిత్స, వైద్య సహాయాన్ని సకాలంలో పొందినట్లయితే, ఆరోగ్యకరమైన పిల్లలను కనేందుకు అవకాశం ఉంది. అలాగే సురక్షితమైన గర్భధారణను కలిగి ఉంటారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్యులు అందించ సలహ, సూచనల మేరకు పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Male Fertility: ఎండలో బైక్ సీటు, ఒడిలో ల్యాప్టాప్.. పురుషుల సంతానోత్పత్తికి పొంచి ఉన్న ముప్పు!
Also Read: Gastric: కడుపులో గడబిడ.. గ్యాస్.. ఉబ్బరానికి కారణమయ్యే 4 రోజువారీ ఆహారాలు, మీరు అస్సలు ఊహించరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Delimitation: తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ప్రకంపనలు..ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ!
Hyderabad, Telangana:Telangana Delimitation Letter: దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల 16 నుంచి 18 వరకు దీనిపై పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ నియోజకవర్గాల పునర్విభజనపై తన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి ఓ లేఖ రూపంలో ప్రధాని మోదీకి పంపారు.Asha Bhosle Last Rites: ఆశా భోస్లే పార్థీవదేహం వద్ద వెక్కివెక్కి ఏడ్చిన సచిన్ టెండూల్కర్..
Hyderabad, Telangana:Sachin In Asha Bhosle Last Rites: దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నేడు సాయంత్రం 4 గంటలకు ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే తుదిసారి ఆమెను చూసిన సచిన్ టెండూల్కర్ కంటతడి పెట్టుకున్నారు.SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్..ఐపీఎల్లో ఈరోజు గెలుపు ఎవరిది? సూర్యవంశీ, అభిషేక్ శర్మ విధ్వంసానికి రెడీనా?
Hyderabad, Telangana:SRH Vs RR Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఆతిథ్య జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో అన్నీ గెలుపొంది టేబుల్ టాపర్గా నిలిచింది. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుత సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒకేఒక్కటి గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 21 సార్లు తలపడగా.. సన్రైజర్స్ 12 సార్లు గెలుపొందగా.. రాజస్థాన్ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే హెడ్-టూ-హెడ్ కౌంట్ లో ఎస్ఆర్హెచ్దే హవా కనిపిస్తుంది.
కానీ, ప్రస్తుతం గడిచిన మ్యాచ్లో ఆధారంగా ఆతిథ్య జట్టుతో పోలిస్తే రాజస్థాన్ అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ మెరుగ్గా కనిపిస్తుంది. అదే విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దళం కూడా ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు ఇదే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 286 అత్యధిక స్కోరు రికార్డును రాజస్థాన్పై నమోదు చేయడం విశేషం.
SRH జట్టు ప్రస్తుతం ఓ ఆసక్తికర పికింగ్ను ఎదుర్కొనే సమస్య వచ్చిపడింది. ప్రఫుల్ హింగే ఎట్టకేలకు తన IPL అరంగేట్రం చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు? పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు ముందే హింగే అరంగేట్రం చేస్తాడని ఇషాన్ కిషన్ ప్రకటించాడు, కానీ టాస్ తర్వాత పిచ్ పరిస్థితిని బట్టి వేరే ఎంపిక అవసరమని గ్రహించి, అతనికి బదులుగా జయదేవ్ ఉనద్కట్ను జట్టులోకి చేర్చుకున్నారు.
ఉప్పల్ స్టేడయంలో వేగవంతమైన పిచ్పై, హింగే అరంగేట్రం ఎట్టకేలకు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో సన్రైజర్స్ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలో దిగింది. తమ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేసేందుకు అనికేత్ వర్మ తీసుకోలేని పక్షంలో బౌలింగ్ ప్రత్యామ్నాయంగా లియామ్ లివింగ్స్టోన్ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరింపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ దాదాపుగా ఈ మ్యాచ్లోనూ కొనసాగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో జట్టులోకి వచ్చిన బ్రిజేష్ శర్మ మిడిల్ ఓవర్లలో 37 పరుగులకు 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అతను అదే స్థానంలో కొనసాగుతాడని భావిస్తున్నారు.
సన్రైజర్స్ ప్లేయింగ్ 11 అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ లేదా లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఈషన్ మలింగ, ప్రఫుల్ హింగే(డెబ్యూ).
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 అంచనా: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్ హత్య!
Chilakaluripet, Andhra Pradesh:Palnadu Latest Crime News: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో వరుసగా పోలీసులపై వస్తున్న అభియోగాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. చట్టంతో పాటు ప్రజలను కాపాడాల్సిన కొందరు పోలీసులు క్రిమినల్ చర్యలకు పాల్పడతుండడంతో జిల్లా వ్యాప్తంగా రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. స్వయంగా పోలీసులే అలాంటి సంఘ విఘాత చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నిన్న మొన్న మాచర్లలో ఏఎస్సై ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరో హత్య కేసులో పోలీస్ కానిస్టేబుల్ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిణామాలు కనిపిస్తున్నాయి.
తాజాగా చిలకలూరిపేట సమీపంలో 2 రోజులు క్రితం జరిగిన లాయర్ హత్య కేసులో ఇప్పుడు నిజం బయపడింది. ఈ హత్యను తొలుత ప్రమాదంగా చిత్రీకరించాలనే నిందితుల పన్నాగం బయటపడి.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అధికారులు అరెస్టు చేయడం ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య తాజాగా చిలకలూరిపేటలో జరిగిన హత్యకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. మృతుడు లాయర్ భార్యతో సదరు నిందితుడు వివాహేతర సంబంధం ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మృతుడు తన భార్యను తరచూ గొడవ పడుతుండేవాడని.. దీంతో అతనిపై పగ పెంచుకున్న కానిస్టేబుల్, కాపుకాసి లాయర్ హత్యకు పాల్పడ్డాడని సమాచారం.
వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న లాయర్ను చంపాలని పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. అయితే లాయర్ హత్యకు వెంకట కోటయ్యకు సహకరించిన మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అందుకు గాను సదరు వ్యక్తి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో నిందితులుగా విచారణలో తేలడంతో ఇద్దర్ని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే పల్నాడు జిల్లాలో పోలీసులుపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే మాచర్లకు చెందిన ఓ మేజర్ యువతి హత్య కేసులో రూరల్ సీఐ సస్పెండ్ అవ్వగా.. వివాహేతర సంబంధం కారణంగా మరో సీఐ సస్పెండ్.. మహిళలను, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి ఆపై వీడియోలు చిత్రీకరించిన కేసులో మాచర్ల ఏఎస్సై సస్పెండ్కు గురవ్వగా..ఇప్పుడు చిలకలూరిపేటలో లాయర్ హత్యకు కేసులో మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. ఇలా పోలీస్ శాఖ నుంచి ఒక్కో ఘటనలు బయటపడుతున్న వేళ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిన పోలీసులే స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం మాయని మచ్చగా మారాయి. అయితే ఇలాంటి చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని..ఇలాంటివి మళ్లీ పునరావృత్తం కాకుండా ముందస్తు జిల్లా పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేపట్టి.. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వరుస ఘటనల దృష్ట్యా హోంమంత్రి అనిత కూడా జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. శాఖలో తప్పులను క్రమబద్ధీకరించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీలైతే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి జిల్లాలో పోలీసు అధికారుల చర్యల పట్ల నిఘా పెట్టడమే కాకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లాలోని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?
Mumbai, Maharashtra:Rohit Sharma Virat Kohli Injury: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. చేధనలో ముంబై జట్టు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓపెనర్ రోహిత శర్మ కేవలం 13 బంతుల్లో 19 పరుగులు రాబట్టి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే రోహిత్ శర్మ ఎందుకు పెవీలియన్ చేరాడు అనే ప్రశ్న అనేక మంది అభిమానుల్లో నెలకొంది. దాని వెనుక పెద్ద కారణమే ఉందట.
బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. కండరాల గాయం (హ్యామ్స్ట్రింగ్) కారణంగా రోహిత్ శర్మ అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ నుండి నిలకడైన ఇన్నింగ్స్ అవసరమైనా.. గాయం కారణంగా వైదొలగడం అతని ముందు జాగ్రత్త చర్యగా అభివర్ణించవచ్చు. డాట్ బాల్ ఆడిన తర్వాత రోహిత్ ముఖంలో బాధకరమైన భావోద్వేగాలు కనిపించాయి. తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ లాంటి స్టార్ ఆటగాడు కేవలం చిన్న గాయంతో మైదానాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు.
మరోవైపు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా చీలమండ గాయంతో ఫీల్డింగ్కు దూరమయ్యాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు వాంఖడే స్టేడియంలో కోహ్లీ అదే రకమైన ఫామ్ను కొనసాగించి.. అర్ధశతకంతో చెలరేగాడు. ముంబై జట్టుపై 1,000 పరుగులు రాబట్టిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు రాబట్టింది. ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లీ (50) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. అలాగే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజిత్ పటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
చివర్లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరి ఓవర్లో విజృంభించినా.. అప్పటికే లేట్ అయిపోయింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో టిమ్ డేవిడ్ ఆడిన ఫామ్.. అదే విధంగా కంటిన్యూ చేసి ఉంటే ముంబైతో జరిగిన మ్యాచ్లో 250+ రన్స్ వచ్చేవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Gas Shortage: భారత్లో మరోసారి వార్ టెన్షన్..LPG గ్యాస్ సిలిండర్లపై కేంద్రం మరో సంచలన నిర్ణయం..ఏం జరుగుతోంది!
Hyderabad, Telangana:India Boosts LPG Gas Supply: పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలపై కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇంధనం, గ్యాస్ కొరత.. ఆపై వాటి ధరలు అమాంతం పెరిగి పోవడం వల్ల అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దేశానికి అనేక ఓడలు ఎల్పీజీ గ్యాస్ను తీసుకొచ్చినా.. నేటికి మార్కెట్లో గ్యాస్ కొరత కనిపిస్తూనే ఉంది.
అయితే తాజాగా ఇరాన్-అమెరికాల మధ్య జరిగిన చర్చలు విఫలం అవ్వడం వల్ల మరోసారి యుద్ధం తిరిగి ప్రారంభమయ్యేందుకు ఇరు దేశాలు కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ కొరతను ఏవిధంగా తగ్గించాలనే సమాలోచనలో మునిగిపోయింది.
ఇటీవలే జరిగిన ఇరాన్-అమెరికా చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు 'డీల్ కుదర్లేదు' అని చెప్పిన ఒకేఒక్క మాట ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇరాన్పై దాడి చేయడం సహా హోర్మూజ్ జలసంధిని పూర్తిగా నిలిపేస్తామని ఇరు దేశాలు ప్రకటిస్తున్న తరుణంలో ప్రపంచదేశాల భవిష్యత్తు ప్రణాళికలను మొదలుపెట్టాయి. రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుందనే వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నాయి.
అయితే తాజాగా ఇరాన్తో చర్చలు విఫలమైన కారణంగా అమెరికా అధ్యక్షుడు హోర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని హెచ్చరిస్తున్నాడు. అంతటితో ఆగకుండా చైనాపై కూడా ట్రంప్ సీరియస్ అవ్వడం ఇప్పుడు మరింత తీవ్రతను పెంచేసింది. ఆ జలసంధిపై ఇరాన్, అమెరికా ఆధిపత్యం చలాయించాలనే తత్వంతో ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులను దిగజారుస్తున్నాయి. దీంతో మరోసారి ముడిచమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో అవసరమైన మేర గ్యాస్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అని తెలుస్తోంది. అయితే భారతదేశానికి హోర్మూజ్ జలసంధి నుంచి కేవలం 50 శాతం మాత్రమే దిగుమతులు జరుగుతున్నాయి. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారితే రష్యా నుంచి మరింతగా ముడిచమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తగిన చొరవ తీసుకుంటుంది. ఒకవేళ పరిస్థితి మరింత దిగజారకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ.. ఇంధనం, గ్యాస్ కొరతల ఆధారంగా ప్రజలు పడుతున్న కష్టాలు ఎన్నికల ఫలితాలపై పడకుండా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5 కేజీల సిలిండర్లను భారీగా సరఫరా చేస్తుండగా.. ఇప్పుడు వాటిని మరింతగా సప్లై పెంచాలని యోచిస్తోంది. అదే విధంగా నేచురల్ గ్యాస్ PNG కనెక్షన్లను మరింతగా పెంచే దిశగా కేంద్రం అడుగులువేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
Mumbai, Maharashtra:MI vs RCB Match 2026 Result: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరిగిన రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపొందింది. 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. లీగ్లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది ఆర్సీబీ. ఇన్నాళ్లుగా ముంబై ఇండియన్స్ కంచుకోటగా వస్తున్న వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 240 పరుగులు రాబట్టింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో 36 బంతుల్లో 78 పరుగులు రాబట్టాడు. ఇందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఇతనితో పాటు బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీతో అలరించాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కూడా అర్ధశతకంతో చెలరేగాడు.
కేవలం 20 బంతుల్లో (5 సిక్సర్లు, 4 ఫోర్లు) 53 పరుగులు రాబట్టి ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలాగే మిగిలిన బ్యాటర్లు టిమ్ డేవిడ్ (34), జితేష్ శర్మ (10), రెమారియో షెఫార్డ్ (2) పరుగులతో సరిపెట్టుకున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంటర్న్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 241 లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆది నుంచే తడబడింది. ముంబై ఓపెనర్లు రికెల్డన్ 22 బంతుల్లో 37 పరుగులు రాబట్టగా.. రోహిత్ శర్మ 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. గాయం కారణంగా రోహిత్ మైదానాన్ని వీడినట్లు తెలిసింది. ఆ తర్వాత తొలి నుంచే నెమ్మదిగా సాగిన ముంబై ఇండియన్స్ స్కోర్స్ బోర్డు.. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 22 బంతుల్లో 33 పరుగులు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 40 రన్స్ రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన రూథర్ ఫర్డ్ 31 బంతుల్లో 71 పరుగులు రాబట్టి.. ముంబైను ఓటమి నుంచి తప్పించేందుకు ఎంతో కృషి చేసాడు. అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. మరోవైపు ఆర్సీబీ బౌలర్లలో సయూష్ శర్మ 2 వికెట్లు పడగొట్టగా.. జకోబ్ డఫీ, సలామ్ ధర్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ సాధించారు. దీంతో 20 ఓవర్లలో ముంబై జ్టటు 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి సరిపెట్టుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగులతో ఘనవిజయం సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?
Vijayawada, Andhra Pradesh:Vijayawada Crime News: గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కేటుగాళ్లు దందా మారుస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ దారుణం ఇప్పుడు విజయవాడలో జరిగింది. నగరంలోని భవానీపురంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఓ వ్యక్తి తన నగ్న ఫొటోలతో వేధిస్తున్నాడని.. ఆ ఫొటోలతో తనను బెదిరించి ఎంతో డబ్బు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలిని వేధించిన కేసులో మద్దు బాల వెంకటేశ్వర్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇదే విషయమై నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాల వెంకటేశ్వర్లు గత రెండేళ్లుగా బాధిత మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి నగ్న ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ తనతో పెళ్లి కాదనుకుంటే ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు అంతటితో ఆగకుండా బాధితురాలి భర్తను హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. అతడ్ని చంపి ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ నిందితుడు వేధించసాగాడని వెల్లడించారు. ఈ బెదిరింపుల కారణంగా ఆమె మరింత మానసిక ఒత్తిడి లోనయ్యిందట. బాధితురాల్ని బెదిరించి నిందితుడు బాల వెంకటేశ్వర్లు ఇప్పటికే రూ.21 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
అయితే ఆమె నగ్న ఫొటోలను పూర్తిగా డిలీట్ చేయాలంటే మరో రూ.2 కోట్లు సర్దుబాటు చేయాలని నిందితుడు బెదిరించినట్లు.. దీంతో ఆ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాల వెంకటేశ్వర్లు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణ తెలిసింది. అతడి స్మార్ట్ఫోన్ పరిశీలించగా.. అందులో ఎందరో మహిళల నగ్న ఫొటోలతో పాటు వీడియోలు కూడా ఉండడం చూసి పోలీసులు విస్తుపోయారు. ఇతడు ఇంకెంత మంది మహిళల్ని ఈ విధంగా మోసం చేశాడనే దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
