icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Elnino Effect: ఏపీ, తెలంగాణ ఎల్‌నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!

Vijayawada, Andhra Pradesh:

Elnino Effect In Andhra Pradesh Telangana: ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఎల్‌ నినో ప్రభావం కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం, రుతుపవనాలు సైతం తీవ్రంగా నిరాశపరచడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నెలలో కూడా వర్షాలు పడటం కష్టమేనని అందరూ భావించారు.

అయితే, వాతావరణంలో ఊహించని మార్పులు సంభవించి, గతకొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.

వాతావరణ శాఖ తాజా సూచనలు, హెచ్చరికలు
వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ శాఖ అధికారుల వివరాల మేరకు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

అటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టుల వద్ద లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. మరోవైపు తెలంగాణలోనూ వాతావరణ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలక అప్‌డేట్ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న వర్షపాత లోటు గణనీయంగా తగ్గినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5 శాతం మాత్రమే లోటు వర్షపాతం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
మొదట్లో ఎల్‌ నినో ప్రభావం, రుతుపవనాల మందగమనం వల్ల పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు అన్నదాతలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. 

ఈ వర్షాల జోరు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు కూడా మెరుగై తాగు, సాగు నీటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి, వాతావరణంలో వచ్చిన ఈ సానుకూల మార్పులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఊరటనిచ్చాయి.

Also Read: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్

ALso Read: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

కరిగిపోతున్న బంగారం ధర...ఆగస్టు 2వ తేదీ, ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే..?

BBhoomi58m ago
Lakshmapur, Telangana:

Gold Rate Today: మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు, ఆగస్టు 2వ తేదీ ఆదివారం, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,420 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,468గా ఉంది. మరోవైపు, ఒక కేజీ వెండి ధర రూ.2,18,150 పలుకుతోంది.

పసిడి ధరలు మార్కెట్లో గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రస్తుతం స్థిరంగా ఉంచినప్పటికీ, సెప్టెంబర్‌లో వాటిని పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

దీనికి ప్రధాన కారణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ విలువ బలపడే అవకాశం ఉండటమే. అదే సమయంలో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. ఫలితంగా గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మరోవైపు, దేశీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని చెప్పవచ్చు. గత త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు తగ్గాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో పాటు ధరలు కూడా అధికంగా ఉండటమేనని పేర్కొంది. అయితే, ఆభరణాల రూపంలో మాత్రం బంగారానికి ఇంకా మంచి డిమాండ్ కొనసాగుతోందని అంచనా వేసింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహ ముహూర్తాలు ఉండవు. అయితే, ఆషాఢం ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని నగల దుకాణాల వారు పేర్కొంటున్నారు.

మరోవైపు, బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా? లేక పెరుగుతాయా? అనే అంచనాలు కూడా ఇప్పుడు వెలువడుతున్నాయి. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయితో పోలిస్తే ఇప్పటికే గణనీయంగా తగ్గాయి. దీంతో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో మాత్రం బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?

Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల

Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

6000 ఏళ్ల పురాతన చెట్టులో బార్‌.. అబ్బబ్బ భలే ఉండేది..

Hyderabad, Telangana:

6,000-year-old Tree Bar: ప్రపంచంలో టూరిస్టులను ఆకర్షించేందుకు అనేక వినూత్నమైన థీమ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే, వాటన్నింటికీ భిన్నంగా.. ప్రకృతి ప్రసాదించిన ఒక భారీ వృక్షంలో నడిచిన ఓ వింత బార్ చరిత్రలోనే అత్యంత అరుదైనదిగా నిలిచింది. దక్షిణాఫ్రికాలోని లింపోపో (Limpopo) ప్రావిన్స్‌లో ఉన్న సన్‌ల్యాండ్ బావోబాబ్ (Sunland Baobab) అనే చెట్టు లోపల ఈ అద్భుతమైన బార్‌ను ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ బార్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చెట్టు తొర్రలోనే బార్ స్పెషాలిటీ..
ఈ బావోబాబ్ వృక్షం దాదాపు 6,000 ఏళ్ల పురాతనమైనదిగా పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా బావోబాబ్ చెట్లు వెయ్యి సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత వాటి కాండం లోపలి భాగం సహజంగానే తొర్రగా మారుతుంది. ఈ సహజ సిద్ధమైన అవకాశాన్ని ఉపయోగించుకుని.. కొంతమంది ఆ చెట్టు తొర్ర లోపల బిగ్ బావోబాబ్ ట్రీ బార్ (Big Baobab Tree Bar)ను నిర్మించారు.

ఈ బార్‌లో ఒకేసారి 15 మందికి పైగా కూర్చుని డ్రింక్స్ తాగుతూ హాయిగా ముచ్చటించుకునేలా సీటింగ్, డ్రింక్ కౌంటర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. చెట్టు కాండం గోడలు చాలా మందంగా ఉండటం వల్ల బయట ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా.. లోపల వాతావరణం ఎప్పుడూ సహజ సిద్ధంగా చల్లగా (Nature's AC) ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

ప్రపంచ పర్యాటకులకు హాట్ స్పాట్..
ఈ చెట్టు చుట్టుకొలత దాదాపు 33 మీటర్లు, ఎత్తు 19 మీటర్లకు పైగా ఉండేది.. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేవారు. చెట్టు తొర్రలో కూర్చుని గడపడం ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చేదని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెబుతూ ఉండేవారు. దురదృష్టవశాత్తు, వేల సంవత్సరాల వయస్సు కలిగిన ఈ వృక్షం వృద్ధాప్యంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా 2017తో బాగా దెబ్బతిన్నది. చెట్టు ప్రధాన కాండం రెండుగా పగిలిపోవడంతో ఈ బార్‌ను శాశ్వతంగా మూసివేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఈ బార్‌కి సంబంధించిన వివిధ ఫోటోస్‌తో పాటు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

NEET PG అభ్యర్థులకు కేంద్రం బిగ్ గుడ్‌న్యూస్‌.. పరీక్ష విధానంలో మార్పులు!

Hyderabad, Telangana:

Big Relief For NEET Pg Candidates: కష్టపడి చదువుతూ.. దేశ ఆరోగ్య భవిష్యత్తును నిలబెట్టేందుకు సిద్ధమవుతున్న వేలాది మంది యువ వైద్యులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత అద్భుతమైన శుభవార్తను అందించింది.. ఆగస్టు 30న జరగబోయే అత్యంత కీలకమైన NEET PG పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు అనుకూల (Student Friendly) మార్పులను ప్రకటించింది. సుదీర్ఘకాలంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి, ప్రయాణ కష్టాలకు ఈ నిర్ణయంతో స్వస్తి పలికినట్లయింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గతంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్థులు తీవ్ర నరకాన్ని చూసిన సంగతి తెలిసిందే.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండే జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక చదువుకోవాల్సిన సమయంలో ప్రయాణాల గురించి ఆలోచిస్తూ నరకయాతన అనుభవించేవారు. కానీ, ఈసారి ప్రభుత్వం చారిత్రాత్మక మార్పు చేసింది.. 

ఇకపై ప్రతి అభ్యర్థి తమకు అనుకూలమైన 3 రాష్ట్రాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతటితో ఆగకుండా, అభ్యర్థుల ఇళ్లకు వీలైనంత దగ్గరలోని సెంటర్లనే కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ప్రయాణ ఏర్పాట్లు ముందే చేసుకునేందుకు వీలుగా ఎగ్జామ్ జరిగే సిటీల జాబితాను ముందస్తుగానే విడుదల చేయబోతోంది. ఇవే కాకుండా అనేక మార్పులు చేసిన్నట్లు తెలుస్తోంది.

విద్యార్థుల ప్రతిభకు సరైన న్యాయం జరిగేలా.. ఏ ఒక్కరూ గందరగోళానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను సింగిల్ షిఫ్ట్ (ఒకే విడత) లోనే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 180 మొత్తం ప్రశ్నలు ఉండగా.. 3 గంటల 30 నిమిషాల సమయం కూడా కేటాయించిన్నట్లు కేంద్ర వెల్లడించింది. సమయాన్ని పెంచడం వల్ల అభ్యర్థులు ప్రశాంతమైన మనస్సుతో, ఎలాంటి కంగారు లేకుండా ప్రశ్నలకు సమాధానాలు రాసే అవకాశం లభించింది.

ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏకంగా 2,73,183 మంది వైద్య విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పగలు రేయి తేడా లేకుండా శ్రమిస్తున్న తమ బిడ్డలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొండంత అండగా నిలిచింది. కేంద్రం నిర్ణయంతో మాపై ఉన్న సగం మానసిక ఒత్తిడి తగ్గిపోయిందని.. సెంటర్ ఎక్కడ పడుతుందో అన్న భయం లేకుండా.. ఇప్పుడు ప్రశాంతంగా చదువుపైనే దృష్టి పెట్టగలుగుతున్నామని.. అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hardik Pandya Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనానికి హార్దిక్ పాండ్య..తలనీలాలు ఇచ్చి, లవర్‌తో కలిసి ఆలయంలో..

Tirupati Urban, Andhra Pradesh:

Hardik Pandya Tirumala Visit: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో వెలసిన ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీమ్ఇండియాలోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆయన తిరుపతిని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనానికి ముందు తలనీలాలు సమర్పించిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ప్రేయసి మహికా శర్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. 

ప్రత్యేక ఆకర్షణగా గుండు, సాంప్రదాయ లుక్
తిరుమల ఆలయంలో జరిగిన ప్రసిద్ధ సుప్రభాత సేవలో హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన తలనీలాలు సమర్పించి.. సాంప్రదాయ తెల్లటి కుర్తా-పైజామా ధరించి కనిపించారు. నుదుటిపై తిలకంతో ఆయన పూర్తిగా భక్తిభావంతో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆయనతో పాటు ఈ తిరుమల సందర్శనలో హార్దిక్ పాండ్యా ప్రేయసి మహికా శర్మ కూడా తెల్లటి సాంప్రదాయ దుస్తులలో మెరిశారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపిస్తుండగా, తాజా తిరుమల పర్యటన మరోసారి చర్చనీయాంశమైంది.

గాయంతో విరామం.. రీఎంట్రీకి సిద్ధం!
వెన్నునొప్పి, ఆ తర్వాత తలెత్తిన తొడ కండరాల గాయం కారణంగా హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ 2026తో పాటు పలు సిరీస్‌లను ఆయన మిస్ అయ్యారు.

అయితే, ప్రస్తుతం ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్దేశించిన 'రిటర్న్-టు-ప్లే ప్రోటోకాల్'ను విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే జరగనున్న వైట్-బాల్ సిరీస్ ద్వారా ఆయన తిరిగి టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ తిరుమల ఆధ్యాత్మిక పర్యటన తన కొత్త క్రికెట్ ప్రయాణానికి మంచి ఆరంభం కావాలని అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్‌ ఖాతాలో 39

Also Read: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

న్యూజెర్సీ సూపర్‌మార్కెట్‌లో కూలిన పైకప్పు.. అందరూ ఎలా తప్పించుకున్నారో చూడండి..

Hyderabad, Telangana:

Club Roof Collapses Video: సరుకుల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళ్లి.. హాయిగా షాపింగ్ చేస్తున్న సమయంలో.. హఠాత్తుగా నెత్తిపైన ఉన్న పైకప్పు కూలిపోతే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఇలాంటి విచిత్ర సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

న్యూజెర్సీలోని మోన్‌మౌత్ కౌంటీకి చెందిన ఓషన్ టౌన్‌షిప్‌లో ఉన్న బిజెస్ హోల్‌సేల్ క్లబ్ (BJ's Wholesale Club) సూపర్‌మార్కెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. రోజూలాగే కస్టమర్లు తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేస్తూ..  సందడిగా ఉన్నారు. అయితే, ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉదయం సుమారు 11:15 గంటల సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. సూపర్‌మార్కెట్ పైకప్పులోని ఒక పెద్ద భాగం అకస్మాత్తుగా కస్టమర్ల మీదికి కూలిపోయింది.

రూఫ్ కూలిపోవడమే కాకుండా.. పైకప్పు నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు లోపలికి వరదలా దూసుకురావడంతో స్టోర్‌లోని వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో సూపర్‌మార్కెట్‌లో దాదాపు 27 మంది కస్టమర్లతో పాటు సిబ్బంది ఉన్నారు. పెను శబ్దంతో పైకప్పు పడటంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనాలు కేకలు వేస్తూ సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. శిథిలాల కింద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నప్పటికీ.. సురక్షితంగా బయటకు రాగలిగారని సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో తెలుసుకోవడానికి న్యూజెర్సీ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా భవనం లోపలికి నేరుగా వెళ్లడం ప్రమాదకరంగా మారడంతో.. అత్యాధునిక ఇండోర్ డ్రోన్‌లు, శిక్షణ పొందిన కే-9 డోగ్ స్క్వాడ్ (K-9 Dog Squad) బృందాలను ఉపయోగించి అంగుళం అంగుళం తనిఖీ చేసిన్నట్లు సమాచారం.

భారీ స్థాయిలో పైకప్పు కూలిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పాటు ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టోర్‌లోని మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడటం ఓ అద్భుతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన భవనాన్ని మూసివేసి.. అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, కూలుతున్న సమయంలో రికార్డ్‌ అయిన CC టీవీ రికార్డ్స్‌ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

TV వేస్తేనే పాలిస్తా.. లేదంటే NO.. స్మార్ట్ గేదె స్టైలే వేరబ్బా!

Hyderabad, Telangana:

 Smart Buffalo Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో వింతలతో పాటు విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఎవరైనా సరే పడిపడి నవ్వుకోవడం ఖాయం.. సాధారణంగా పాడి పశువుల నుంచి పాలు పిండేటప్పుడు వాటికి పశువుల మేత లేదా తవుడు పెడుతూ ఉంటారు.. కానీ, ఇక్కడొక గేదె మాత్రం చాలా డిఫరెంట్.. తన ముందుకు వచ్చి టీవీ ఆన్ చేసి.. నచ్చిన ప్రోగ్రామ్ పెడితేనే పాలు ఇస్తానంటోంది. లేదంటే పాలు పిండడానికి అసలు సహకరించదట.. అవును ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఘటనే సోషల్ వీడియోను షేక్ చేస్తోంది. దీనిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. 

అసలు ఏం జరిగింది?
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ గేదె యజమాని ప్రతిరోజూ పాలు పిండే సమయంలో టీవీ ఆన్ చేయడం అలవాటుగా మారింది. అయితే, చాలా రోజుల నుంచి అలాగే టీవీ పెట్టడంతో.. ఆ గేదెకు కూడా TV చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు పాలు పిండే సమయంలో టీవీలో పాటలతో పాటు మంచి ప్రోగ్రామ్స్‌ ప్లే అవుతుంటేనే అది ప్రశాంతంగా నిలబడి పాలు ఇస్తోంది. TV ఆపివేస్తే లేదా స్క్రీన్ దూరంగా ఉంటే పాలు పిండనివ్వకుండా మొండికేస్తోంది.

 
 
 
 
 

ఈ దృశ్యాన్ని గేదె యజమాని తన ఫోన్‌లో చిత్రీకరించి..  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. గేదె ఎంతో శ్రద్ధగా టీవీ స్క్రీన్‌వైపు చూస్తూ పాలు ఇస్తుండటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే కరెంట్‌ లేని సందర్భాల్లో టీవీ ఆన్ కాకపోతే.. అప్పుడప్పుడు ఆ గేదె పాలు అస్సలు ఇవ్వదట.. దీనికి సంబంధించిన దృశ్యాలను కూడా గతంలో సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసిన్నట్లు సమాచారం. అయితే, ఈ వీడియోలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పదిస్తున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ గేదెకు కూడా మనలాగే టీవీ సీరియల్స్.. స్పోర్ట్స్‌ ఛానెల్స్‌ చూడడం.. అలవాటైపోయిందేమో.. అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది మామూలు గేదె కాదు సామీ.. ఫుల్లీ అప్‌డేటెడ్ స్మార్ట్ గేదె.. అని మరొకరు సరదాగా స్పందించారు. మరికొందరైతే రిమోట్ కంట్రోల్ సహాయంతో మరికొన్ని రోజుల్లో ఈ గేదె టీవీ ఆన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

సాధారణంగా జంతువులకు సంగీతం వింటే మనసు ప్రశాంతంగా మారి.. ఎక్కువ పాలు ఇస్తాయని శాస్త్రీయంగానూ కొన్ని పరిశోధనలు చెబుతుంటాయి. అయితే, ఇలా విజువల్స్‌తో కూడిన టీవీ స్క్రీన్‌ను చూస్తూ.. పాలు ఇవ్వడం మాత్రం నిజంగానే అత్యంత అరుదైన, ఆసక్తికరమైన విషయమని చెప్పవచ్చు. డిజిటల్ యుగంలో మనుషులకే కాదు.. మూగజీవాలకు కూడా స్క్రీన్ టైమ్ అలవాటైపోతోందని ఈ ఘటన నిరూపిస్తోంది..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

నెటిజన్లను ఫిదా చేస్తున్న తండ్రీకూతుళ్ల డాన్స్.. వీడియో ఇదే చూడండి..

Hyderabad, Telangana:

 Father Daughter Dance Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నెటిజన్స్‌ మనసును హత్తుకుని.. పెదవులపై చెరగని చిరునవ్వులు అందిస్తూ ఉంటాయి.. తాజాగా ఇంటర్నెట్‌లో అలాంటి ఒక అద్భుతమైన డ్యాన్స్ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది.. తండ్రి, కుమార్తెల మధ్య ఉండే పవిత్రమైన చెదరని స్నేహాన్ని చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలోని బద్తమీజ్ దిల్ పాటకు తండ్రితో పాటు కుమార్తె పోటీపడి వేసిన డ్యాన్స్ స్టెప్పులు వేశారు.. ఇప్పుడు ఈ డ్యాన్స్‌ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. పాట ప్లే కాగానే వారిద్దరి పర్‌ఫార్మెన్స్, పర్‌ఫెక్ట్ టైమింగ్, ముఖంలో ఎక్ప్‌స్ప్రెషన్స్‌ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వీడియో మొదటి నుంచే తండ్రీకూతుళ్ల ఎనర్జీ.. ఉత్సాహం నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఇద్దరూ కలిసి ఒకరికొకరు పోటీగా వేసిన డాన్స్ స్టెప్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. వీరి డాన్స్ స్టెప్పుల్లోని సమన్వయం చూస్తుంటే.. ఈ పర్‌ఫార్మెన్స్ వారికి ఎంతో ఇష్టమై ఉంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, డాన్స్ పర్‌ఫెక్షన్ కంటే కూడా ఇద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్‌ చేసిన ఆ మధురమైన క్షణాలే.. ఈ వీడియోకు అసలైన ప్రాణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 
 

డాన్స్ చేస్తున్నంత సేపూ వారిద్దరి ముఖాల్లో కనిపించే.. ప్రసన్నమైన చిరునవ్వు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని భావించవచ్చు.. ప్రతి స్టెప్పులోనూ వారి మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తండ్రి అంటే కేవలం కుటుంబ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తి మాత్రమే కాదు.. కూతురు జీవితంలో అద్భుతమైన స్నేహితుడు, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్.. అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో ఆకాంక్ష సెహగల్ (@akku_sehgal_) అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ రీల్ వైరల్ చార్ట్స్‌ను తిరగరాసింది. దీనిని ఇప్పటి వరకు 14 కోట్లకు (140 మిలియన్లు) పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. దీనికి ఇప్పటి వరకు 77 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు బెస్ట్ ఫాదర్-డాటర్ డుయో.. క్యూటెస్ట్ డాన్స్ వీడియో.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report
Advertisement

TSGLI లోన్ ఎలా పొందాలో తెలుసా? దరఖాస్తు విధానం, నిబంధనలు, పూర్తి వివరాలివే..!

BBhoomi3h ago
Lakshmapur, Telangana:

TSGLI loan: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర సమయాల్లో అండగా నిలిచేందుకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (TSGLI) పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగులు తమ TSGLI ఖాతాలో జమ అయిన మొత్తం ఆధారంగా సులభంగా లోన్ పొందవచ్చు. ఈ బీమా స్కీమ్ కింద ఉద్యోగి లేదా పెన్షనర్ సహజ మరణం కానీ.. ప్రమాదవశాత్తు మరణించినా. బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమును జూన్ 25న ప్రారంభించారు. ఈ స్కీమును సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం 14 ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకుల సహకారంతో బీమా ప్రయోజనాలు అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు సులభంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది. 

అయితే ఈ స్కీము కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిమితం చేయాలని ప్రభుత్వం మొదట భావించినప్పటికీ.. ఆ తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ జీతం అందుకునే ప్రతి ఉద్యోగికీ ఈ బీమా రక్షణ లభిస్తుంది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఈ బీమా స్కీమ్ కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణించినట్లయితే.. వారికి రూ. 60లక్షల నుంచి రూ. 2కోట్ల వరకు బీమా పరిహారం అందిస్తుంది. గతంలో సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే 45 మంది ఉద్యోగుల కుటుంబాలకు 1కోటి చొప్పున పరిహారం అందించింది ప్రభుత్వం. అయితే ఈ లోన్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏంటి.. నిబంధనలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

లోన్ అర్హతలు – ఎంత వస్తుంది?
TSGLI విధానం ప్రకారం, ఉద్యోగి ఖాతాలో బోనస్‌తో కలిపి జమ అయిన మొత్తం సంచిత నిధి (Surrender Value) నుంచి దాదాపు 80శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం స్వల్ప వడ్డీ రేటును వసూలు చేస్తుంది.  

దరఖాస్తు విధానం (Step-by-Step Process):
అప్లికేషన్ ఫారమ్: 
ముందుగా తెలంగాణ ఇన్సూరెన్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ (tsgli.telangana.gov.in) నుంచి TSGLI లోన్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.  

వివరాల నమోదు: 
ఫారమ్‌లో పాలసీ నంబర్, ఉద్యోగి ఐడీ, ప్రాథమిక వేతనం (Basic Pay), బ్యాంక్ ఖాతా వివరాలు, ఎంత రుణం కావాలో స్పష్టంగా పూరించాలి.  

పత్రాల జతపరిచే విధానం: 
పూర్తి చేసిన అప్లికేషన్‌కు బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జీరాక్స్ ప్రతిని జత చేయాలి. ఫారమ్‌పై రూ. 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకం చేయాలి.  

DDO ధ్రువీకరణ: పూరించిన అప్లికేషన్‌ను సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) ఆమోదం పొంది, సంతకం, కార్యాలయ ముద్ర వేయించాలి.  

సమర్పణ: అనంతరం ఈ దరఖాస్తును జిల్లా TSGLI ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి.  

తిరిగి చెల్లించే విధానం:తీసుకున్న రుణ మొత్తాన్ని ఉద్యోగి తన సౌకర్యాన్ని బట్టి 12, 24, 36 లేదా 48 నెలవారీ వాయిదాలలో (Instalments) తిరిగి చెల్లించవచ్చు. ఈ వాయిదా మొత్తాన్ని ప్రతి నెలా జీతం నుంచి DDO ద్వారా కట్ చేస్తారు.  ఆత్యయిక పరిస్థితుల్లో బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు చేయకుండా, తక్కువ వడ్డీకే లభించే TSGLI లోన్ సౌకర్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవచ్చు.

50శాతం చెల్లింపుల నిబంధన: మొదటిసారి తీసుకున్న రుణంలో కనీసం 50శాతం మొత్తం తిరిగి చెల్లించిన తర్వాతే రెండోసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది.  డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్  విచక్షణాధికారం మేరకు మిగిలిన బకాయిలను మినహాయించుకుని మిగతా మొత్తాన్ని రెండోసారి రుణంగా మంజూరు చేస్తారు. అయితే TSGLI కింద ప్రతి నెలా చెల్లించే ప్రీమియం మొత్తానికి ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?

Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల

Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం.. ట్రంప్ సంచలన నిర్ణయం!

Hyderabad, Telangana:

US-Iran Peace Talks: గతకొద్ది కాలంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇరాన్ యుద్దంలో అనూహ్య మలుపు తిరిగింది. ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Military Action Halted) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం (Peace Deal)కుదిర్చే దిశగా చర్చలు ముమ్మరమయ్యాయని.. అతి త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే సాగుతుంది. ఘర్షణల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడంతో.. నౌకల రాకపోకలు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. దీనివల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాలో పెద్ద ఉపశమనం లభించనుంది.

మిలిటరీ స్థావరాలతో పాటు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులను నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశించడంతో, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ భయం తగ్గిన్నట్లు తెలుస్తోంది. దౌత్యపరమైన సంప్రదింపుల వల్ల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరాన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో గ్లోబల్ షేర్ మార్కెట్లు, ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరా యథావిధిగా సాగితే.. త్వరలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

అమెరికా-ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ శాంతి ఒప్పందాన్ని భారత్ సహా పలు ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఇంధన భద్రతతో పాటు గ్లోబల్ సప్లై చైన్ స్థిరత్వానికి ఈ నిర్ణయం అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైనిక ఘర్షణల కంటే దౌత్యపరమైన పరిష్కారాలే ప్రపంచ శాంతికి క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉగ్ర కుట్ర ప్లాన్.. పోలీసు యూనిఫాంలో దాడికి జైషే ఉగ్రవాది స్కెచ్!

Hyderabad, Telangana:

Jaish Terrorist Plan: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పథకం రచించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు అరెస్టు చేసిన జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాది హమీమ్ మౌండల్‌ను సుదీర్ఘంగా విచారించగా ఈ కుట్ర కోణం బయటపడింది. ఇప్పుడు ఈ క్రుట అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

ఎస్టీఎఫ్ అధికారుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల సమయంలో ఖాకీ యూనిఫాం ధరించి చొరబడాలని ఉగ్రవాదులు భావించారు. పోలీసు దుస్తుల్లో ఉన్నట్లయితే ఎవరికీ అనుమానం రాదని.. సులువుగా జనం మధ్యలోకి వెళ్లి వినాశనం సృష్టించవచ్చని భావించి ఈ కుట్ర పన్నారు.

హమీమ్ మౌండల్‌కు కేవలం ఢిల్లీ దాడి బాధ్యత మాత్రమే కాకుండా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల కదలికలపై రెక్కి బాధ్యతలను కూడా జైషే మహమ్మద్ అధినాయకత్వం అప్పగించినట్లు విచారణలో తేలింది. పశ్చిమ బెంగాల్‌లోని ఒక బిజెపి ఎమ్మెల్యే కుమారుడి కిడ్నాప్‌, రూం డిమాండ్‌కి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు ఈ ఉగ్రవాద నెట్‌వర్క్ జాడ దొరికిన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ కేసును తవ్వేకొద్దీ దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలు, దాడుల ప్రణాళికలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి.

ప్రస్తుతం బెంగాల్ ఎస్టీఎఫ్ దర్యాప్తును వేగవంతం చేసింది. హమీమ్ మౌండల్ స్వయంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి రెక్కి నిర్వహించాడా? లేక అతని అనుచరులు ఎవరైనా ఢిల్లీలో ఈ కుట్రకు సహకరించారా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు, కేంద్ర నిఘా వర్గాలకు కూడా ఈ సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

సర్పంచ్‌కి ఓటెయ్యలేదని పగ.. ఇల్లు కూలుస్తానని బెదిరింపులు..!

Hyderabad, Telangana:

Kamareddy Latest News: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కేలూరు గ్రామంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కక్షతో.. కొన్ని ఏళ్ల క్రితం తాను నిర్మించుకున్న ఇల్లు కూల్చివేస్తానని సర్పంచ్ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక నిరుపేద బాధితురాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది.. బాధితురాలి నిరసనకు పెద్ద ఎత్తున గ్రామస్తుల సపోర్ట్ రావడంతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలోనే నివాసముంటున్నానని.. తన కష్టార్జితంతో ఆ ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. అయితే, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గడ్డివర్ లక్ష్మణ్‌కు ఓటు వేయలేదనే నెపంతో.. ఆయన తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి తన ఇల్లు కూల్చివేస్తానంటూ.. సర్పంచ్ లక్ష్మణ్ తీవ్ర బెదిరింపులకు దిగుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.

ఈ అన్యాయాన్ని నిరసిస్తూ.. సర్పంచ్ వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బాధితురాలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధితురాలికి మద్దతుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఓ నిరుపేద మహిళపై ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తి కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఈ సందర్భంగా బాధితురాలు కన్నీటి పర్యంతమవుతూ.. ఎన్నో ఏళ్ల కష్టంతో నిర్మించుకున్న ఇంటిని కూల్చేస్తే మా కుటుంబం రోడ్డున పడుతుంది. అధికారుల నుంచి నాకు న్యాయం జరగకపోతే ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదని వాపోయింది. హండే కేలూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తినట్లు సమాచారం అందుకున్న మద్నూర్ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి.. స్థానిక మద్నూర్ పోలీసులతో కలిసి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ధర్నా స్థలికి వెళ్లి బాధితురాలితో పాటు గ్రామస్తులతో మాట్లాడి.. పరిస్థితిని సమీక్షించారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

సికింద్రాబాద్ మహంకాళికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Hyderabad, Telangana:

Secunderabad Bonalu 2026: తెలంగాణ విశిష్ట సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆషాఢ మాస బోనాల పండగ ఒక ప్రతీక అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా మంత్రి తన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని.. తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలను మంత్రి అధికారికంగా సమర్పించారు.

మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడిపంటలతో పంట పొలాలు పచ్చగా ఉండాలని ఆ మహంకాళి అమ్మవారిని ప్రార్థించాం. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని.. ఎవరి వృత్తుల్లో వారు గొప్ప విజయాలు సాధించాలని వేడుకున్నాం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగడానికి ఆ జగజ్జనని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మన రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించాం.. అని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ నగరం ఆతిథ్యానికి పెట్టింది పేరని గుర్తుచేసిన మంత్రి.. బోనాల ఉత్సవాలలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా అత్యంత ఉత్సాహంతో, భాగస్వామ్యమై పండగను జరుపుకుంటారని అన్నారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికేలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, జిహెచ్ఎంసి, పోలీస్ విభాగాల ఆధ్వర్యంలో అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈసారి ఆలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని.. దానికి తగ్గట్టుగానే రవాణా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంపై అనేక విపత్తులు వచ్చినప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రజలను కాపాడారని మంత్రి పొన్నం అన్నారు. ఎల్ నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా.. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని బోనాల సందర్భంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించమని.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయనే నమ్మకం మాకు ఉందని మంత్రి పొన్నం అన్నారు.

ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mirnalini Ravi Engagement: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ నటి! 'గద్దలకొండ గణేష్' హీరోయిన్ కాబోయే భర్త ఇతనే!

Chennai, Tamil Nadu:

Mirnalini Ravi Engagement News: 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కోలీవుడ్ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ మృణాళిని రవి నిశ్చితార్థం చేసుకుంది. తన ఎంగేజ్‌మెంట్ వార్తలతో ఒక్కసారిగా ఆమె ట్రెండింగ్‌లో నిలిచింది. ఆధ్యాత్మిక ప్రసంగీకుడు మహావిష్ణుతో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించడమే కాకుండా, వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జోడీకి సంబంధించిన పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మృణాళిని రవి నేపథ్యం..
షార్ట్ వీడియో యాప్‌ల ద్వారా పాపులర్ అయిన మృణాళిని.. ఆ తర్వాత 'సూపర్ డీలక్స్' సినిమాతో నటిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఛాంపియన్', 'ఎనిమీ', 'కోబ్రా', 'రోమియో' వంటి పలు తమిళ, తెలుగు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ భామకు భారీ ఫాలోయింగ్ ఉంది.

ఈ మహావిష్ణు ఎవరు?
మధురైకి చెందిన మహావిష్ణు తొలుత ఒక టీవీ ఛానెల్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగీకుడిగా మారారు. అయితే 2024లో చెన్నైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద కలకలమే రేపాయి.

నెట్టింట ఎందుకు హాట్ టాపిక్ అయింది?
గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆధ్యాత్మిక గురువును నటి వివాహం చేసుకుంటుండటంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా స్నేహం ఉందని, అదే ప్రేమగా మారిందని మహావిష్ణు తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ అనూహ్య నిశ్చితార్థం ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!

Also Read: సైమా అవార్డ్స్ 2026 నామినేషన్లు..ఉత్తమ నటుడి విభాగంలో పవన్ కళ్యాణ్‌కు గట్టి పోటీ!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top