icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Ashwagandha: రోజుకు ఒక చెంచా అశ్వగంధ.. మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష!

Hyderabad, Telangana:

Ashwagandha Benefits: ఆధునిక జీవనశైలితో పాటు పని ఒత్తిడి, సరిగ్గా నిద్రలేని రాత్రులు.. ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.. వీటన్నింటికీ వంటిట్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అదే మన పూర్వీకులు కాలం నుంచి వినియోగిస్తున్న అశ్వగంధ.. ఆయుర్వేదంలో దీనిని మూలికల రాజు(King of Herbs)గా కూడా భావిస్తారు. ప్రతిరోజూ కేవలం ఒక చెంచా అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో ఊహించని ఆరోగ్య మార్పులు వస్తాయని పరిశోధనల్లో సైతం స్పష్టమైంది.

ఒత్తిడి, ఆందోళనలకు చెక్..
అశ్వగంధ ప్రాథమికంగా ఒక శక్తివంతమైన అడాప్టోజెన్ (Adaptogen)గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంటే ఇది శరీరం మానసిక, శారీరక ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడిని పెంచే  కార్టిసోల్ (Cortisol) అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడానికి అశ్వగంధ తిరుగులేని పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారి..  తీవ్రమైన ఆందోళనతో పాటు డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నిద్రలేమి సమస్యకు చెక్‌..
రాత్రంతా బెడ్‌పై అటు ఇటు దొర్లుతూ.. నిద్రకోసం చూసేవారికి అశ్వగంధ ఒక వరప్రసాదంగా భావించవచ్చు.. ఇది మనస్సును ప్రశాంత ఉంచి.. సహజమైన, గాఢమైన నిద్ర (Restful Sleep) అందించేందుకు సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పావు లేదా అర చెంచా అశ్వగంధ పొడి కలిపి తాగడం వల్ల నిద్రలేమి (Insomnia) శాశ్వతంగా దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడుతుంది..
అశ్వగంధలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా ఎంతగానో రక్షిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు ఆలోచనా శక్తి గణనీయంగా మెరుగుపడతాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి ప్రమాదకరమైన నరాల బలహీనత వ్యాధుల బారిన పడకుండా ఇది మెదడును రక్షిస్తుంది.

READ Also:   వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!

రోగనిరోధక శక్తి..
శరీరంలో రోగనిరోధక కణాల (Immune Cells) క్రియాశీలతను పెంచి.. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి అశ్వగంధ ఎంతగానో రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నీరసం, అలసటగా అనిపించే వారికి ఇది తక్షణ శక్తి అందించడమే కాకుండా.. శారీరక దృఢత్వాన్ని (Stamina) అందిస్తుంది.. ముఖ్యంగా గేమ్స్‌ అడేవారికి శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతకు..
మగవారి ఆరోగ్యానికి అశ్వగంధ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్ స్థాయిలను సహజంగా ఎంతో సులభంగా పెంచుతుంది.. సంతానలేమి సమస్యలతో బాధపడే పురుషులలో వీర్యకణాల సంఖ్యను, నాణ్యతను పెంచడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుందని పలు వైద్య అధ్యయనాలు క్లుప్తంగా తెలిపాయి..

READ Also:   వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

వయానాడ్‌లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

Wayanad, Kerala:

Kalladi Tunnel Project: కేరళలో భారీ వర్షాలు పడుతుండడంతో బీభత్సం జరిగింది. కుండపోత వర్షాలతో భారీ ఎత్తున ప్రాణనష్టం.. ఆస్తినష్టం సంభవించింది. వయానాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం ఏర్పడింది. కొండలు విరిగిపడడంతో భారీ ఎత్తున ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదు మంది కార్మికులు మృతి చెందినట్లు.. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం సహాయ చర్యలకు ఆదేశించింది.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలోని కల్లాడి, మెప్పాడి ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో భయపడిన ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే వర్షం తగ్గాక పరిస్థితి మరింత భయానకంగా మారింది. బురదలో పెద్ద ఎత్తున కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం.

మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే ప్రతిష్టాత్మకంగా 'అనక్కోంపోయిల్-మెప్పాడి' సొరంగ ప్రాజెక్టు జరుగుతోంది. ఈ సొరంగ ప్రాజెక్టు పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగం పనులతోపాటు రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వందలాది మంది కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. కొండచరియ విరిగిపడిన తీవ్రతకు కార్మికులు బస చేస్తున్న తాత్కాలిక షెడ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. అనేక వాహనాలు బురద కింద కూరుకుపోయాయి.

బురద, వరదల్లో కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. బురదను తొలగిస్తే అందులో కూరుకున్న కార్మికులను వెలికితీయవచ్చని.. వరదలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవాల్సి ఉంది. కొండచరియలు విరిగిపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వర్షాలు తగ్గాక తక్షణమే స్థానిక పోలీసులు, అధికారులతోపాటు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి సతీశన్‌ వెంటనే స్పందించి ప్రమాదంపై వివరాలు ఆరా తీశారు. ఇక వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ ఘటనపై స్పందిస్తూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వెంటనే ముఖ్యమంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని ప్రియాంక గాంధీ సూచించారు.

0
0
Report

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు..

Jagtial, Telangana:

YTPS Privatization Latest News: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS)లోని కీలక విభాగాలను ప్రైవేటుపరం చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్‌లోని కోల్‌తో పాటు యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ.. జగిత్యాలలో విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ముగింపునకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ మంగళవారం జగిత్యాలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నల్ల బ్యాడ్జీలతో విధులకు.. 
మంగళవారం ఉదయం జగిత్యాలలోని TGNPDCL డివిజన్ కార్యాలయ ఆవరణకు చేరుకున్న విద్యుత్ ఉద్యోగులు, అధికారులతో పాటు కార్మికులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తమకున్న తీవ్ర వ్యతిరేకతను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో అందరూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పెద్ద పెద్ద నినాదాలు చేశారు. 

ప్రభుత్వ రంగ సంస్థల మనుగడకు ముప్పు..
ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి TGPEJAC రాష్ట్రతో పాటు స్థానిక నాయకులు మాట్లాడారు. ఎంతో కష్టపడి లాభాల బాటలో నడుపుకుంటున్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను.. ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం ధారాదత్తం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

యాదాద్రి పవర్ ప్లాంట్‌లో అత్యంత కీలకమైన కోల్.. యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ చేతుల్లో పెడితే.. అది భవిష్యత్తులో మొత్తం సంస్థ మనుగడకే ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఉద్యోగుల హక్కులు కాలరాస్తాయని, ప్రభుత్వ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే ఈ టెండర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

ఒకటో తేదీన జీతాలు.. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తెలంగాణ సీఎం తీపి కబురు

Hyderabad, Telangana:

Telangana Employees: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు.

'డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించండి. పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్' అని సీఎం తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఒక కొలిక్కి తీసుకురాలని రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చెల్లింపులు చేసినా సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మంగళవారం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. 

ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు  ఉండగా.. వాటిలో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని వివరించారు. అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్ పెట్టాలని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం తెలిపారు. హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిలైజ్ చేయాలని చెప్పారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

0
0
Report
Advertisement

దొడ్డిదారిన రాజన్న ఆలయ ఉద్యోగాల నియామకం.. మంత్రుల సిఫార్సులపై చల్మెడ ఫైర్!

Hyderabad, Telangana:

Vemulawada: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాలకు దారితీస్తూ వస్తోంది.. రాజన్న గుడిలోని ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో కేవలం స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. స్థానికేతరుల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని BRS పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దొడ్డిదారిన నియామకాలు..?
రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం గతంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో అర్హులైన స్థానిక అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయాన్ని చల్మెడ ఈ సందర్భంగా గుర్తుచేశారు.. అయితే, గతంలో స్థానికులకు నిర్వహించిన ఇంటర్వ్యూల ప్రక్రియను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టడం దురదృష్టకరమన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేలాది మంది చదువుకున్న, అన్ని అర్హతలు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. అలాంటిది స్థానికులను కాదని.. పలువురు మంత్రుల సిఫారసు లేఖలతో దొడ్డిదారిన ఇతర ప్రాంతాల వారికి పోస్టులు కట్టబెట్టడం తీవ్రంగా ఖండించదగిన విషయమని.. చల్మెడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగాల భర్తీ ఏదైనా సరే.. అందులో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అధికారికంగా గుర్తించి.. ప్రముఖ పత్రికల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. అలా కాకుండా రహస్యంగా.. రిఫరెన్స్‌లతో భర్తీ చేయడం వల్ల ప్రతిభ గల స్థానిక యువత ఉపాధి అవకాశాలను కోల్పోతుందన్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏం చేస్తున్నారు..?
జిల్లా నిరుద్యోగులకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు మౌనంగా ఉన్నారని చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. అక్రమ నియామకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత విప్‌పై లేదా అని నిలదీశారు. జిల్లా యువతపై నిజంగా ఆది శ్రీనివాస్‌కు చిత్తశుద్ధి.. ప్రేమ ఉంటే.. ఇప్పటివరకు మంత్రుల సిఫారసులతో జరిగిన ఔట్ సోర్సింగ్ నియామకాలపై తక్షణమే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

రూ.20,000 బడ్జెట్‌లో బెస్ట్ 5G ఫోన్.. Poco M8 5Gపై ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్!

Hyderabad, Telangana:

Poco M8 5G Offers News: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న గోట్ సేల్ (GOAT Sale) కస్టమర్స్‌కి అద్భుతమైన పండగలాంటి ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా రూ.20,000 బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న అద్బుతమైన 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. పోకో M8 5G (Poco M8 5G) స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది ఇప్పుడు చీప్‌ ధరకే లభిస్తోంది. దీనిపై అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారీ డిస్కౌంట్‌..
పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.19,999 కాగా.. ఇప్పడే కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్ బోనస్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ధర కేవలం రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్‌పై రూ.14,550 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ వినియోగించాలనుకునేవారు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ.4,449 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ కండిషన్‌తో పాటు మోడల్‌పై ఆధారపడి ఉంటుంది..

పోకో M8 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వ్డ్ అమోలెడ్ (3D Curved AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. ఇది ఫుల్ HD+ రెజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (Snapdragon 6 Gen 3) ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ అద్భుతమైన ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. ఈ డివైజ్‌లో ఎంతో శక్తివంతమైన 5,520mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

హర్పిక్‌తో భర్త హత్య.. బంటితో కలిసి భార్య సంధ్య పన్నిన కుట్ర ఫోన్‌కాల్‌ లీక్‌

Nizamabad, Telangana:

Harpic Murder Case Phone Call: వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న భార్య తాను ప్రేమించి పెళ్లాడిన భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. దుబాయ్‌ నుంచి వచ్చిన భర్తను మూడు రోజులకే భర్త దారుణ హత్యకు పాల్పడింది. పథకం ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకొని పదేళ్లు కాపురం చేసిన భర్తను ప్రియుడితోపాటు మరో యువకుడి సహాయంతో నాటకీయ పరిణామాల మధ్య ఆమె హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక రచించిన భార్య భర్తకు డాబాపైన పీకలదాకా మద్యం తాగించి అనంతరం భవనంపై నుంచి తోసేసింది. అప్పటికి భర్త చనిపోక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో సెలైన్‌లో హార్పిక్‌ ఎక్కించి హత్యకు పాల్పడడం యావత్‌ సమాజాన్ని విస్తుగొలిపింది. తెలంగాణలోని నిజామాబాద్‌లో జరిగిన ఈ సంఘటనలో భార్య ఆడియో కాల్‌ వైరల్‌గా మారింది.

ఫోన్ కాల్ ఆడియో
నిజామాబాద్‌ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగిన ప్రశాంత్ హత్య కేసులో ఫోన్ కాల్ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. మృతుడి భార్య సంధ్యకు హత్యకు సహకరించి మద్యం తాగించిన వెంకట సాయి అలియాస్ బంటికి మధ్య జరిగిన సంభాషణ వైరలైంది. బంటి సంధ్య మధ్య సంభాషణ ఇలా జరిగింది.

సంధ్య: హలో.. అరేయ్‌ ఎట్ల ఒర్లుతుంది వాడేనా ఒర్లేది.
బంటి: కాదు.
సంధ్య: తాగి ఏది ఏమైనా కానీ తాగి డిచ్చ కావాలి
బంటి: కాదు.. వేరోడు. ఆయన నాతో మంచిగానే ఉన్నాడు.
సంధ్య: కాదు రా. అరేయ్‌ ఏం చేత్తవో నాకు తెల్వదు మొత్తానికి డిచ్చ తాగి పండాలి
సంధ్య: 'అరె బంటి ఎలాగైనా మందు తాగిస్తూనే ఉండురా. అరె వాడు కిందికి వస్తే నాకు బాధ రా. నమ్మినారా నిన్ను. నీదే రా బాధ్యత. మందు తాగించడం సగం వరకు రాగానే మళ్లీ తెప్పించి తాగించురా బంటి: సరే
సంధ్య: డిచ్చ తాగి పండాలి. కిందకు దిగొద్దు.
బంటి: ససరే.. నాకు తాగిపిత్తుండు
సంధ్య: వాడు కిందకు దిగొద్దు. వాడికే తాగిపియి.
బంటి: నీయమ్మ నేను కూడా పండాల్న ఏంది ఈడ్నే. వాడితో పాటు నేను పడుకోవాలా? నా చావుకు వచ్చింది సంధ్య
సంధ్య: ఏమైనా చేయి రా కిందకు రానివ్వకు. అన్నే పండనియ్యి. అబ్బా ప్లీజ్‌ రా. నీకు దండం పెడతా.. కాళ్లు మొక్కుతారా

జరిగింది ఇదే..
నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ దుబాయ్‌లో పనిచేసేవాడు. పదేళ్ల కింద సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. జూన్ 27వ తేదీన గల్ఫ్ నుంచి ప్రశాంత్‌ స్వగ్రామానికి వచ్చాడు. ఇంద్రాపూర్‌కు చెందిన అనిల్‌తో సంధ్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడి హత్యకు భార్య పథకం రచించింది. సంధ్య, అనిల్ కలిసి అదే గ్రామానికి చెందిన బంటి అనే యువకుడి  సహకారంతో కుట్ర పన్నారు.

ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ త్రీ
పథకం ప్రకారం 29వ తేదీన బంటి ప్రశాంత్ ఇంటికి వెళ్లి డాబాపైన అతడితో మద్యం తాగాడు. స్థాయికి మించి ప్రశాంత్‌కు బంటి మద్యం తాగించాడు. తర్వాత అతడిని డాబాపై నుంచి అతడి భార్య సంధ్యతో కలిసి కిందకు నెట్టి వేశారు. కిందపడిన ప్రశాంత్‌ తీవ్ర గాయాలవడంతో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. భర్త తిరిగి బతికితే తమకు కష్టం.. తామే చంపేశామని చెబుతారని భయపడిన సంధ్య, బంటి, ప్రియుడు అనిల్ ముగ్గురు కలిసి సంధ్య మరో పథకం రచించింది. ముందుగా దాచిపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారుచేసిన ఇంజక్షన్, టాయిలెట్ క్లీనర్ (హార్పిక్‌)‌ను ప్రశాంత్ చేతికి ఎక్కించారు. ఆ తర్వాత మంచంపై నుంచి కిందకు తోసివేయడంతో అతడు మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుస్మిత విచారణ చేసి తమదైన శైలిలో విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

0
0
Report
Advertisement

హైడ్రాకు ఓవైసీ కాలేజీలు కనిపించడం లేదా?: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

Hyderabad, Telangana:

Paidi Rakesh Reddy News: రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా (HYDRAA), మజ్లిస్‌ నాయకులకు సంబంధించిన అక్రమ కట్టాల వైపు ఎందుకు వెళ్లడం లేదని ఆర్మూర్‌ MLA పైడి రాకేష్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మజ్లిస్‌ పార్టీ నాయకుల దగ్గరకు వచ్చేసరికి చట్టం ఎందుకు పని చేయడం లేదని ఆయన నిలదీశారు. BJP రాష్ట్ర కార్యాలయంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. 

ఇటీవల అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై MLA రాకేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒకటి కూల్చితే వంద కడతామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. వంద కాకపోతే వెయ్యి కట్టుకో.. కానీ చెరువులను కబ్జా చేసి మాత్రం కట్టొద్దని ఆయన మీడియా ముఖంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. సల్కమ్ చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఓవైసీ కాలేజీని చెరువులోనే కట్టారా లేదా అనే విషయంపై ప్రభుత్వం తక్షణమే బహిరంగ ప్రకటన చేయాలన్నారు. భారత దేశ చట్టాలు ఓవైసీ సోదరులకు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు.

పేదల కన్నీళ్లు కనబడటం లేదా?
ప్రభుత్వ బుల్డోజర్లు కేవలం పేద ప్రజల ఇళ్లను కూల్చడానికే పరిమితమయ్యాయని.. ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి మండిపడ్డారు. పేదలను చూస్తేనే ప్రభుత్వానికి బుల్డోజర్లు గుర్తుకొస్తున్నాయా.. అని ప్రశ్నిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని హిట్లర్‌తో పోల్చారు. పేదల కన్నీళ్లు మీకు కనబడటం లేద హిట్లర్‌ రేవంత్‌ రెడ్డి? అని మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమైనా ఆదేశించారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

సర్ పై అపోహలు వద్దు.. 
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లేనిపోని అబద్ధాలు, అపోహలు ప్రజల్లో సృష్టించవద్దని.. మజ్లీస్ నాయకులకు సర్ అంటే ఎందుకు అంత భయమని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను మజ్లిస్ పార్టీ స్వచ్ఛందంగా తొలగించాలని.. చొరబాటుదారులకు వత్తాసు పలకడం మానుకోవాలని ఈ సమయంలో హితవు పలికిన్నట్లు తెలుస్తోంది. చివరగా ఆయన ప్రభుత్వానికి.. హైడ్రాకు తీవ్రంగా హెచ్చరించారు.. ఓవైసీ కాలేజీల లాంటి పెద్దల అక్రమ కట్టడాలను కూల్చకుండా.. కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తే.. తాము ఊరుకునేది లేదని.. పెద్ద ఎత్తున హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా మొబైల్ ఇస్తున్న మోదీ సర్కార్.. !!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

Fact Check: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన.. ఏం జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. అసలు విషయాలే కాదు ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమా.. కాదా అని ఆలోచించకుండానే చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు.. ఆడియోలను ఎడిట్ చేసి.. వాస్తవానికి విరుద్ధంగా కథనాలను జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఫేక్ న్యూస్ లు మరింత ఎక్కువగా అయ్యాయి. అలా వైరల్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంత.. తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాక్ష్యాత్తూ భారత ప్రధాని మోదీ ఫ్రీ మొబైల్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత తెలుసుకుందాం. 

ఈ వైరల్ వార్త వెనకున్న అసలు నిజమేంటీ? 
ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారితోపాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఈ స్కీముకు అర్హులు అంటూ పేర్కొన్నారు. ఈ వార్త వెనకున్న అసలు నిజాన్ని PIB ఛేదించింది.  వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ వీడియోతోపాటు ఉన్న క్యాప్షన్ లో ఫ్రీ మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పే  వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిఐబీ తెలిపింది. ఈ వీడియోను గవ్ట్ ఎడ్జ్ అనే ఫేస్ బుక్ పేజీకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఎడిట్ చేసి తప్పుడు వాదనతో సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వెల్లడి అయ్యింది. సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్లో సెర్చ్  చేస్తే ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోగా తేలింది. ఈ వీడియోను ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కూలేట్ చేస్తున్నట్లు పిఐబీ తేల్చింది. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

 

Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్‌లో భారత్‌కు చెందినవి కూడా..!!

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

7000mAh బ్యాటరీతో మోటో సంచలనం.. బడ్జెట్ ధరలోనే Moto G77 Power ఫోన్‌ లాంచ్!

Hyderabad, Telangana:

Moto G77 Power Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) భారతీయ మొబైల్ ప్రియుల కోసం మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇది Moto G77 Power పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఈ వారంలోనే భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.. లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన డిస్‌ప్లే, కెమెరాతో పాటు బ్యాటరీ వంటి కీలక వివరాలను అధికారికంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతోంది..

కళ్లు చెదిరే డిస్‌ప్లే.. 
ఈ Moto G77 Power స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ (2400 x 1080 పిక్సెల్స్) LCD డిస్‌ప్లేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 120Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలిపింది.. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా.. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Corning Gorilla Glass 7i)ను మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ రేంజ్‌లో మోటోరోలా అందిస్తూ వస్తోంది.

సోనీ సెన్సార్‌తో అద్భుతమైన కెమెరా క్వాలిటీ..
ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్‌లో అదిరిపోయే కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనుక భాగంలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా తీసుకు వచ్చింది.. ఇందులో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ Sony LYTIA 600 ప్రైమెరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో ఏకంగా 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను కూడా విడుదల చేసింది..

శక్తివంతమైన ప్రాసెసర్.. 
ఈ Moto G77 Power స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 (MediaTek Dimensity 6400) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గ్రాఫిక్స్ కోసం.. Arm Mali-G57 MP2 GPUని కూడా విడుదల చేసింది.. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

7,000 mAh జంబో బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరులోనే పవర్ ఉన్నట్లుగా.. ఇందులో ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు నిరంతరాయంగా బ్యాటరీ లైఫ్ కూడా లభిస్తుంది. దీనికి తోడు 30W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉండడం విశేషం..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Flipkart GOAT సేల్ ధమాకా.. Samsung గెలాక్సీ A36 5G పై రూ.7,825 భారీ డిస్కౌంట్!

Hyderabad, Telangana:

Samsung Galaxy A36 5g Price Cut: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే గోట్ సేల్ (GOAT Sale) ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటి నుంచో రూ.30,000 లోపు బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు సాంసంగ్‌ గెలాక్సీ A36 5G (Samsung Galaxy A36 5G) ఒక బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.. ఈ సేల్‌లో సాంసంగ్‌ బ్రాండ్ ఈ పాపులర్ ఫోన్‌పై కంపెనీ ఏకంగా రూ.7,000 కంటే ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్‌ ఆఫర్స్ అందుబాటులోకి రావడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ సేల్‌లో దీనిపై ఉన్న ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫర్స్‌ వివరాలు...
గతేడాది మార్చి నెలలో సాంసంగ్‌ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌తో పాటు 128 GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.32 వేలతో విడుదలైంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.26,999కే అందుబాటులోకి రావడం విశేషం..

ఇవే కాకుండా అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అదనంగా బ్యాంక్ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.1,825 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. దీనితో ఈ స్మార్ట్‌ఫోన్ ఎఫెక్టివ్ ధరతో కేవలం రూ.25,174కే సొంతం చేసుకోవచ్చు. అంటే లాంచ్ ధరతో పోలిస్తే.. ఇప్పుడే కొనుగోలు చేసే కస్టమర్లకు ఏకంగా రూ.7,825ల వరకు భారీగా డిస్కౌంట్‌ లభిస్తుంది. 

దీంతో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే వారి కోసం గరిష్టంగా రూ.23,700 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ బోనస్‌ అనేది మీ పాత ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ బోనస్‌ను కొత్త స్మార్ట్‌ఫోన్‌ నుంచి తీసేస్తే దాదాపు రూ.3 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలు..
ఈ సాంసంగ్‌ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.7 అంగుళాల Full HD+ Super AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో పాటు 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ వేగంగా ఉండటం కోసం దీనిలో పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 (Exynos 1380) ప్రాసెసర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. 

50MP ట్రిపుల్ కెమెరా సెటప్..
ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని వెనుక భాగంలో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంగాలో చాలా ప్రత్యేకమైన f/2.2 అపెర్చర్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

తిరుమలలో రానున్న రోజులన్నీ ఎన్నో విశిష్టతలు.. జూలై క్యాలెండర్‌ ఇదే!

Tirupati Urban, Andhra Pradesh:

TTD July Calendar: వైకుంఠ శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో ప్రతి రోజు ఒక విశిష్టత.. ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. జూలై నెల రావడంతో ఈ నెలలో తిరుమలలో ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, పూజలు ఉన్నాయో తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసంలో తిరుమలలో అనేక ప్రత్యేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై నెలకు సంబంధించిన క్యాలెండర్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

జూలై నెల ప్రారంభమై వారం పూర్తయ్యింది. 5వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ సుందరరాజస్వామి వారి 'అవతారోత్సవాలు' ప్రారంభమయ్యారు. 6వ తేదీన రాత్రి 10:41 గంటలకు 'పునర్వసు కార్తె' ప్రారంభమైంది.

7వ తేదీ: తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామి వారి అవతారోత్సవాల ముగింపు

10వ తేదీ: స్మార్త సాంప్రదాయం పాటించేవారికి ఏకాదశి వ్రతం

11వ తేదీ: వైష్ణవ సాంప్రదాయం పాటించేవారికి శూన్య ఏకాదశి

12వ తేదీ: మాస శివరాత్రి

15వ తేదీ: చంద్రోదయం, రాత్రి 2:44 గంటలకు 'గురుమౌఢ్యము' (గురు మూఢమి) ప్రారంభం.

17వ తేదీ: తిరుమలలో అత్యంత ముఖ్యమైన రోజు ఇది. ఉదయం 11:53 గంటలకు 'కర్కాటక సంక్రమణం' జరుగుతుంది. దీంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఆణివార ఆస్థానం' జరుగుతుంది. అనంతరం సాయంత్రం 'పుష్పపల్లకి సేవ' నిర్వహిస్తారు. అదే రోజు శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి 'సాక్షాత్కార వైభవోత్సవాలు' ప్రారంభమవుతాయి.

18వ తేదీ: కులశేఖరాళ్వార్ తిరునక్షత్రం (జయంతి)

19వ తేదీ: శ్రీనివాసమంగాపురం స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు

20వ తేదీ: రాత్రి 12:14 గంటలకు 'పుష్యమి కార్తె' ప్రారంభం

22వ తేదీ: తిరుపతి గోవిందరాజస్వామి వారు ఆళ్వార్ తీర్థానికి (కపిలతీర్థం) వేంచేసే ఉత్సవం

24వ తేదీ: తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 'జ్యేష్ఠాభిషేకం' ప్రారంభం

25వ తేదీ: హిందువులకు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.
తిరుపతి కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో 'పవిత్రోత్సవాలు' ప్రారంభం. తాళ్లపాకలో చెన్నకేశవస్వామి మరియు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

26వ తేదీ: తిరుమల నారాయణగిరి కొండపై 'ఛత్రస్థాపన' ఉత్సవం, తులసీ మహాత్మ్య పూజ
తిరుపతిలో శ్రీ విఖనసాచార్యుల వారి ఉత్సవాల ప్రారంభం
శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేకం ముగింపు

28వ తేదీ: తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాల ముగింపు

29వ తేదీ: గురుపూర్ణిమ (వ్యాస పూర్ణిమ / ఆషాఢ పూర్ణిమ) పర్వదినం, మహోదయ్ వేడుకలు

30వ తేదీ: తిరుపతిలో విఖనసాచార్యుల వారి 'శాత్తుమొర' ఏకాంత సేవ, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి సుగంధ భరితమైన 'పుష్పయాగం' సేవ

0
0
Report

ప్రపంచ కప్ కల నెరవేరక.. కన్నీళ్లతో కెరీర్ ముగించిన 5గురు ఫుట్‌బాల్ దిగ్గజాలు వీరే..!

BBhoomi5h ago
Secunderabad, Telangana:

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో బ్రెజిలియన్ స్టార్ నెయ్ మార్, పోర్చుగీస్ హీర్ క్రిస్టియానో రోనాల్డోల ప్రపంచ కప్ కలలు కన్నీళ్లతో ముగిసాయి. దీంతో ఫుట్ బాల్ హిస్టరీలో ఒక్క ట్రోఫీని కూడా గెలవని ఐదుగురు గొప్ప ఆటగాళ్ల ఎవరన్న చర్చి ఇప్పుడు మళ్లీ మొదలైంది. దగ్గరకు వచ్చి దాహాన్ని తీర్చుకోలేని ఆ ఐదుగురు దిగ్గజాలు ఎవరో చూద్దాం. 

1. క్రిస్టియానో ​​రొనాల్డో (పోర్చుగల్)

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలిన ఇద్దరు వ్యక్తుల్లో క్రిస్టియానో రొనాల్డూ ఒకరు. ఐదు వేర్వేరు ప్రపంచ కప్‌లలో గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. యూరో కప్, పలు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు.. ప్రతిష్టాత్మకమైన  బాలన్ డి ఓర్  అవార్డును ఐదుసార్లు గెలుచుకున్నాడు. అయితే.. పోర్చుగల్‌ను ఒక్క ప్రపంచ కప్‌కు కూడా నడిపించలేకపోయాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు. నాకౌట్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోయిన తర్వాత, రొనాల్డో కన్నీళ్లతో మైదానం వీడటం చూసి ప్రతి ఫుట్‌బాల్ అభిమాని గుండె పగిలిపోయింది. బహుశా ఇదే అతని చివరి ప్రపంచ కప్ కావడంతో.. రొనాల్డో ప్రపంచ కప్ కల శాశ్వతంగా చెదిరిపోయిందనే చెప్పాలి. 

2. నెయ్‌మార్ జూనియర్ (బ్రెజిల్)

బ్రెజిల్ గర్వించదగిన అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు నెయ్‌మార్. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఈయన పేరిట ఉంది. ప్రతి ప్రపంచ కప్‌లో బ్రెజిల్‌ను ఫేవరెట్‌గా నిలపడంలో నెయ్‌మార్ కీలక పాత్ర పోషించాడని చెప్పాలి.  కానీ గాయాల రూపంలో దురదృష్టం అతన్ని వెంటాడింది. ఒంటరి పోరాటం చేసినప్పటికీ..  క్వార్టర్ ఫైనల్స్ , సెమీఫైనల్స్ దాటలేకపోయాడు. బ్రెజిల్ ట్రోఫీని గెలవలేకపోయింది. చివరికి నెయ్‌మార్ తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోక కన్నీళ్లతో వీడ్కోలు పలకాల్సి వచ్చింది.

3. జోహన్ క్రూయిఫ్ (నెదర్లాండ్స్)

జోహన్ క్రూయిఫ్ ఫుట్‌బాల్ చరిత్రను మార్చిన ఒక మేధావి అని చెప్పాలి. ఆధునిక ఫుట్‌బాల్‌లో ఉపయోగించే  టోటల్ ఫుట్‌బాల్  పద్ధతికి ఆయనే పితామహుడు అని చెబుతుంటారు. మూడుసార్లు బ్యాలన్ డి ఓర్ విజేత అయిన ఈ డచ్ దిగ్గజం.. 1974 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌ను ఒంటరిగా ఫైనల్‌కు నడిపించాడు. కానీ వారు ఫైనల్‌లో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడిపోయారు. జోహన్ క్రూయిఫ్ ఎన్నడూ ప్రపంచ కప్ గెలవనప్పటికీ... ప్రపంచ కప్ గెలిచిన జట్ల కంటే ఫేమస్ అయ్యాడు. 

4. ఫ్రాంక్ పుస్కాస్ (హంగేరీ)

1950లలో హంగేరీని ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా తీర్చిదిద్దిన ఘనత ఫ్రాంక్ పుస్కాస్‌కు దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఈయన పేరుమీదే నమోదు అయ్యింది.  1954 ప్రపంచ కప్‌లో హంగేరీని ఫైనల్‌కు నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్‌లో ఆరంభంలోనే గోల్ చేసినప్పటికీ, హంగేరీ చివరికి ఓడిపోయింది. ఇలా ఒక గొప్ప తరం ఆటగాళ్లు ప్రపంచ కప్‌ను కోల్పోయారని చెప్పాలి.

5. పాలో మాల్డిని (ఇటలీ)

ఫుట్‌బాల్ చరిత్రలో  అత్యుత్తమ డిఫెండర్ అని అందరూ పిలిచే పేరు ఒక్కటే పాలో మాల్డిని.  ఇటాలియన్ జట్టు తరపున నాలుగు ప్రపంచ కప్‌లలో ఆడాడు. అద్భుతమైన రక్షణ అతన్ని ప్రత్యర్థి జట్లకు పీడకలగా మార్చింది. 1994 ప్రపంచ కప్ ఫైనల్‌కు ఇటలీని నడిపించినప్పటికీ, వారు పెనాల్టీ షూటౌట్‌లో బ్రెజిల్ చేతిలో ఓడిపోయారు. ఏసీ మిలాన్‌కు అన్నీ గెలిపించిన మాల్డిని, ఇటలీకి ప్రపంచ కప్ గెలిపించలేకపోయాననే విచారంతో తన కెరీర్‌ను ముగించాడు.

Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్‌లో భారత్‌కు చెందినవి కూడా..!!

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top