సైదాపూర్ లో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల ఐలయ్య
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Reserve Bank of India Notification 2026: ఎప్పటినుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతూ ఉన్నారా? అయితే మీకోసం శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉన్న నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. సెకండరీ స్కూల్ పాసైన ప్రతి ఒక్కరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, ఈ ఉద్యోగాల్లో భాగంగా ఖాళీలు, ఉద్యోగ అర్హత, ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో? జీతాలు వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం గతంలో అక్టోబర్ 12వ తేదీన 5 సర్కిల్స్లో దాదాపు 572 ఆఫీస్ అటెండెంట్ ల నియామకాలకు అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సర్కిల్లో వేరువేరు సంఖ్యలు ఖాళీలను అందుబాటులో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇక హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కు సంబంధించిన 37 ప్రత్యేకమైన అటెండెంట్ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా బోర్డు నుంచి సెకండరీ స్కూల్ ఉత్తీర్ణత కలిగిన సర్టిఫికెట్ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనవరి ఒకటి 2026 సంవత్సరం ముందుకంటే సెకండరీ స్కూల్స్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి వయోపరిమితికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అభ్యర్థులు తప్పకుండా 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలని నోటిఫికేషన్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాగే ఇతర కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులకు వయోపరిమితిలో మార్పులు కూడా ఉన్నాయి.
ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల రూ.25 వేల జీతం అందించబోతోంది. అలాగే గరిష్టంగా అభ్యర్థులకు రూ.53 వేల వరకు జీతం చేరే అవకాశాలు ఉన్నాయని నోటిఫికేషన్లో RBI క్లియర్గా పేర్కొంది. ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ వివరాల్లోకి వెళ్తే.. అర్హత కలిగిన ఉద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ రాత పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. ఈ పరీక్షలు భాగంగా ప్రతి విభాగం నుంచి 30 మార్కులకు దాదాపు 30 పరీక్షల వరకు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామకం ఉంటుందట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఇక ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలనుకునేవారు నేరుగా ఆన్లైన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ కనిపించే కొత్త దరఖాస్తును క్లిక్ చేసి అందులో అన్ని రకాల పత్రాలను అప్లోడ్ చేసి.. ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.450 వరకు పరీక్ష ఫీజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India)కు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ దరఖాస్తు ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2026 సంవత్సరం జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. చివరి తేదీ ఫిబ్రవరి నాలుగు వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన పేర్కొన్న తేదీలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైటు మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS-95 Pension Hike Update: ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) కింద పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది ప్రైవేట్ రంగ రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం ఉంది. గత 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కనీస పెన్షన్ పెంపుదలపై 2026 బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
6 రెట్లు పెరగనున్న పెన్షన్ మొత్తం!
ప్రస్తుతం EPFO నిబంధనల ప్రకారం కనీస నెలవారీ పెన్షన్ కేవలం రూ.1,000 మాత్రమే ఉంది. దీనిని చివరిగా 2014లో సవరించారు. అయితే పెరిగిన ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మొత్తాన్ని రూ.6,000కి పెంచాలని కార్మిక సంఘాలు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే, పెన్షనర్ల ఆదాయం ఏకంగా ఆరు రెట్లు పెరగనుంది.
పెన్షన్ పెంపు ఎందుకు అవసరం?
2014 తర్వాత కనీస పెన్షన్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు రూ.1,000 అనేది మందులు, నిత్యావసర వస్తువులకు కూడా సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం ప్రయోజనాలు అందుతున్న తరుణంలో, ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం EPS-95 పథకాన్ని అప్గ్రేడ్ చేయడం అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు.
EPS 95 పథకం అంటే ఏమిటి?
ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహించే సామాజిక భద్రతా వ్యవస్థ. ఉద్యోగి జీతం నుండి కట్ అయ్యే PF మొత్తంలో కొంత భాగం పెన్షన్ ఫండ్కు వెళ్తుంది. పదేళ్ల కంటే ఎక్కువ కాలం సర్వీస్ ఉన్న ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఈ పెన్షన్ పొందేందుకు అర్హులు.
ఎప్పుడు అమలులోకి రావచ్చు?
మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే కేంద్ర బడ్జెట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే, EPFO చరిత్రలోనే ఇది అతిపెద్ద పెన్షన్ సవరణగా నిలిచిపోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఈ పెంపు అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి.
Also REad: Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Honor Magic 8 Pro Air Price In India: హానర్ కంపెనీ తమ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ పేరుతో లాంచ్ చేయబోతోంది. జనవరి 19వ తేదీన అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన ప్రాసెసర్ తో విడుదల చేయబోతోంది. ముఖ్యంగా ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ జంబో బ్యాటరీతో విడుదల కాబోతోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ (Honor Magic 8 Pro Air) స్మార్ట్ఫోన్ను కంపెనీ మొదటగా జనవరి 19వ తేదీన చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ మొబైల్కు సంబంధించిన ఎన్నో రకాల ఫీచర్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ఫోన్ బేస్ వేరియంట్ 16gb ర్యామ్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని చైనా మార్కెట్లో LDY-AN00 మోడల్ నెంబర్తో విక్రయాలు ప్రారంభించబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్ ప్రాసెసర్తో విడుదల కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్ పర్ఫామెన్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ చేసే యువతకు చాలా బాగా పనికి వస్తున్నట్లు త్వరలో కంపెనీ క్లైమ్ చేయబోతోంది. అలాగే ఇది 4 ఎఫిషియెన్సీ కోర్లు 2.70GHz వద్ద క్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కంపెనీ మాలి-జి1-అల్ట్రా-ఎంసి12 ప్రాసెసర్ను కూడా అందించబోతోంది. అలాగే చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 MagicOS 10 స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. దీంతోపాటు ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన డిస్ప్లేను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్తో 6.31-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీని వెనక భాగం కెమెరా మాడ్యూల్ చాలా స్టైలిష్ గా ఉండబోతోంది. ఇందులోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి తోడు అదనంగా మరో రెండు 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 64-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీని ప్యాక్ను కూడా కలిగి ఉంటుంది. దీనిని చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. అలాగే ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Most Gold Reserves Countries: ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. అది ఆయుధాలతో కాదు.. 'బంగారం'తో! సామాన్యులు పెరుగుతున్న ధరలను చూసి బెంబేలెత్తుతుంటే, అగ్రరాజ్యాలు మాత్రం టన్నుల కొద్దీ పసిడిని తమ ఖజానాల్లో దాచుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధిక బంగారం ఎవరి దగ్గర ఉంది? ఈ రేసులో భారత్ ఎక్కడ ఉంది? అనే ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ధిక మాంద్యం భయాలు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కాగితపు కరెన్సీ కంటే 'బంగారం' మిన్న అని ప్రపంచ దేశాలు నమ్ముతాయి. అందుకే అమెరికా నుండి చైనా వరకు అగ్రరాజ్యాలన్నీ తమ ఆర్థిక భద్రత కోసం భారీగా పసిడిని నిల్వ చేస్తున్నాయి.
అత్యధిక బంగారు నిల్వలున్న టాప్ దేశాలు..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న అధికారిక నిల్వలను గమనిస్తే అమెరికా తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలను కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం.
| దేశం | బంగారు నిల్వలు (సుమారుగా) |
| అమెరికా | 8,133 టన్నులు |
| జర్మనీ | 3,351 టన్నులు |
| ఇటలీ | 2,452 టన్నులు |
| ఫ్రాన్స్ | 2,437 టన్నులు |
| రష్యా | 2,332 టన్నులు |
| చైనా | 2,264 టన్నులు |
| భారతదేశం | 840 - 900 టన్నులు |
ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి?
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
భౌగోళిక ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇజ్రాయెల్-హమాస్) ఘర్షణల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన 'గోల్డ్' వైపు మొగ్గు చూపుతున్నారు.
డీ-డాలరైజేషన్: డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా, చైనా వంటి దేశాలు తమ వద్ద ఉన్న అమెరికన్ బాండ్లను అమ్మి, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
కేంద్ర బ్యాంకుల వేట: గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది.
భారతదేశం పరిస్థితి ఏంటి?
భారతీయులకు బంగారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. కొన్ని అధికారిక నివేదికల ప్రకారం.. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద సుమారు 840 టన్నులకు పైగా బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బంగారం నిల్వ చేసుకున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది.
మన దగ్గర ఉన్న అసలు సంపద ప్రజల దగ్గర ఉంది. భారతీయ గృహిణుల వద్ద సుమారు 25,000 టన్నులకు పైగా బంగారం ఉందని అంచనా. ఇది అమెరికా, జర్మనీ దేశాల మొత్తం నిల్వల కంటే ఎంతో ఎక్కువ!
చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగారం ఇప్పుడు కేవలం అలంకరణ వస్తువు కాదు.. అది ఒక బలమైన ఆర్థిక ఆయుధం. భవిష్యత్తులో రాబోయే ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోవడానికి పసిడి ఒక్కటే అసలైన రక్షణ కవచం. అందుకే సామాన్యుడి నుండి అగ్రరాజ్యం వరకు అందరి చూపు పసిడిపైనే!
Also REad: Bank Holiday: వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్..బ్యాంకులో పని ఉంటే ఆ రోజు లోపే వెళ్లండి..ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Holidays This Week: మీరు ఈ వారంలో బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు ఏవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం.. జనవరి 19 నుండి జనవరి 25 మధ్య ఎటువంటి అదనపు పండుగ సెలవులు లేనప్పటికీ, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు రెండు రోజులు మూసి ఉంటాయి.
వారాంతపు సెలవుల వివరాలు..
RBI నిబంధనల ప్రకారం.. ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో జనవరి 24న నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పనిచేయవు. అలాగే జనవరి 25న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు కారణంగా బ్యాంకులన్నీ మూసి ఉంటాయి.
జనవరి 26న 'గణతంత్ర దినోత్సవం' సెలవు
వారాంతపు సెలవుల వెంటనే సోమవారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంకింగ్ పనులను జనవరి 23 (శుక్రవారం) లోపే పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.
బ్యాంకులు మూసి ఉన్నా అందుబాటులో ఉండే సేవలు ఇవే!
భౌతిక బ్యాంక్ శాఖలు పని చేయకపోయినప్పటికీ, డిజిటల్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి.
ATM సేవలు: నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ కోసం ATMలు యథావిధిగా పనిచేస్తాయి.
డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా నిధుల బదిలీ (IMPS, NEFT, RTGS) చేసుకోవచ్చు.
UPI చెల్లింపులు: గూగుల్ పే, ఫోన్ పే వంటి UPI సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.
కార్డ్ లావాదేవీలు: డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ లేదా షాపింగ్ మాల్స్లో చెల్లింపులు చేసుకోవచ్చు.
గమనిక: చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి శాఖలకు వెళ్లి చేయాల్సిన పనులకు మాత్రం ఈ సెలవు దినాల్లో వీలుండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Blinq Mobility EV Car Price: భారతీయ నగరాల్లో నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా బ్లింక్ మొబిలిటీ (Blink Mobility) ఒక వినూత్న ఎలక్ట్రిక్ పాడ్ కారును ఆవిష్కరించింది. రతన్ టాటా 'నానో' కలలను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ కారు రూపం ఉండడం విశేషం. ఇంతకీ ఆ కారు విశేషాలేంటో తెలుసుకుందాం.
భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థులు, టెస్లా మాజీ నిపుణులు కలిసి ఈ అత్యాధునిక ఈవీని రూపొందించారు. కేవలం రూ.2 నుంచి రూ.3 లక్షల ధరలోనే లభించే అవకాశం ఉన్న ఈ కారు, భవిష్యత్తు సిటీ మొబిలిటీని మార్చేయనుంది.
డిజైన్, లుక్ వివరాలు..
కాంపాక్ట్ సైజ్: రద్దీగా ఉండే నగరాల్లో, చిన్న గల్లీల్లో కూడా సులభంగా నడిపేలా ఇది చాలా చిన్నగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు: ముందు భాగంలో హెక్సాగోనల్ డీఆర్ఎల్లు (DRLs), ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు, వెనుక స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్ లైట్లతో ఇది ఆధునిక లుక్ను కలిగి ఉంది.
స్పేస్: స్కేట్బోర్డ్ ప్లాట్ఫారమ్పై నిర్మించడం వల్ల కారు లోపల ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.
బ్యాటరీ స్వాపింగ్ -గేమ్ ఛేంజర్
ఈ కారులోని అత్యంత ముఖ్యమైన ఫీచర్ బ్యాటరీ స్వాపింగ్ (Battery Swapping). గంటల కొద్దీ ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఖాళీ అయిన బ్యాటరీని తీసివేసి నిండుగా ఉన్న బ్యాటరీని కేవలం 5 నిమిషాల్లోనే మార్చుకోవచ్చు.
బ్యాటరీని ఒక సర్వీస్గా అందించడం వల్ల కారు ధర గణనీయంగా తగ్గుతుంది. అంటే కారును బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసి, వాడుకున్న దానికి మాత్రమే ఛార్జీలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఒకసారి బ్యాటరీ సెట్ వేసుకుంటే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు
బ్లింక్ మొబిలిటీ పాడ్ కారు కేవలం చౌకగా ఉండటమే కాదు, అత్యంత సురక్షితమైనది కూడా. అంతే కాకుండా డ్రైవర్ అలసటను గుర్తించి అప్రమత్తం చేసే స్మార్ట్ ఏఐ టెక్నాలజీ ఉంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటే ముందే హెచ్చరించే వ్యవస్థను ఇందులో అమర్చారు.
కంపెనీ నేపథ్యం, పెట్టుబడులు
నికేష్ బిష్త్ స్థాపించిన ఈ సంస్థలో.. టెస్లాలో సైబర్ ట్రక్ వంటి ప్రాజెక్టులపై పనిచేసిన అంకిత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ స్టార్టప్ రూ.4.3 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధులతో బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ను, పైలట్ ప్రాజెక్టులను వేగవంతం చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oneplus 15T Launch Date In India: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలో ఒకటైన వన్ప్లస్ కంపెనీ త్వరలోనే తమ కొత్త మొబైల్ను విడుదల చేయబోతోంది. ఇటీవల లీకైన వివరాల ప్రకారం, దీనిని కంపెనీ వన్ప్లస్ 15T (Oneplus 15T) పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ సిరీస్లో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. వన్ప్లస్ 15, వన్ప్లస్ 15R మోడల్స్తో వినియోగదారులకు లభించబోతోంది.
లీకైన వివరాల ప్రకారం, ఈ వన్ప్లస్ 15T మొబైల్ ఎంతో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్తో లాంచ్ కాబోతోంది. అయితే, ఈ మొబైల్ను కంపెనీ భారత మార్కెట్లో వన్ ప్లస్ 15 ఎస్ గా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 1.5K రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ చాలా అద్భుతమైన 6.3-అంగుళాల LTPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ కెమెరాలు భాగంగా వెనక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ ప్రత్యేకమైన సెన్సార్లతో కూడిన కెమెరాలు కూడా కలిగి ఉంటుంది అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 7,500mAh బ్యాటరీని ప్యాక్తో లంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ వన్ప్లస్ 15T స్మార్ట్ఫోన్ మొత్తం నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులోని మొదటి వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ని కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 16gb ర్యామ్తో 1TB ఇంటర్నల్ స్టోరేజ్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక OnePlus 15 6.78-అంగుళాల FHD+ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 1.5K LTPO AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ ప్రాసెసర్ను కలిగి ఉండబోతోంది. కాబట్టి ఇది మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. ముఖ్యంగా ఎక్కువ గేమింగ్ చేసే వారికి ఈ స్మార్ట్ఫోన్ బెస్ట్ ఆప్షన్గా భావించవచ్చు.
ఈ OnePlus 15 స్మార్ట్ ఫోన్ 16 ఆధారంగా కలర్ OS 16 ఆపరేటింగ్ సిస్టంపై విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ వెనుక భాగంలో కూడా అద్భుతమైన కెమెరా సెటప్ లభించబోతోంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన విడుదల తేదీని వన్ ప్లస్ కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది. కాబట్టి అధికారిక ధ్రువీకరణ కోసం కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siva Balaji Madhumitha Divorce: సినిమా నటుడిగా, బిగ్ బాస్ విజేతగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన శివబాలాజీ, తన భార్య మధుమితతో కలిసి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ప్రేమకథలో ఉన్న మలుపులు, పెళ్లయ్యాక ఎదురైన గొడవల గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
ప్రేమ కోసం మూడు రోజుల నిరాహార దీక్ష
శివబాలాజీ, మధుమితల ప్రేమ పెళ్లికి మొదట్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా మధుమిత తల్లికి ఈ సంబంధం అస్సలు ఇష్టం లేదట. పెళ్లికి ఒప్పుకోకుండా ఆమెను గదిలో బంధించి, ఫోన్ కూడా లాగేసుకున్నారట. శివబాలాజీని పెళ్లి చేసుకోవడం కోసం మధుమిత ఏకంగా మూడు రోజుల పాటు అన్నపానీయాలు మానేసి నిరాహార దీక్ష చేశారట. చివరికి ఆమె తండ్రి జోక్యం చేసుకుని తల్లిని ఒప్పించడంతో వీరి వివాహం ఘనంగా జరిగింది.
విడాకుల ఆలోచన..!
పెళ్లైన మొదటి ఒకటిన్నర సంవత్సరం వీరిద్దరికీ నరకంలా గడిచిందని వారు చెప్పుకొచ్చారు. అప్పటికే వారికి బాబు కూడా పుట్టాడు. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు కారణంగా మూడో వ్యక్తిని (బయటి వ్యక్తులను) తమ గొడవల్లోకి లాగడం వల్ల సమస్యలు మరింత ముదిరాయని వారు చెప్పుకొచ్చారు. గొడవలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకోవాలని కూడా అనుకున్నారట. ఒక దశలో కజిన్ సలహాతో కొన్ని రోజులు విడివిడిగా కూడా ఉన్నారు.
నిలిపిన 'ఇగో' త్యాగం
ఎట్టకేలకు తమ మధ్య ఉన్న 'ఇగో' (అహంకారం) సమస్యలను పక్కన పెట్టాలని ఈ జంట నిర్ణయించుకుంది. బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా తమ సమస్యల గురించి నేరుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ఒకరిపై ఒకరికి ఉన్న అపార్థాలు తొలగిపోయి, ప్రస్తుతం ఒక అన్యోన్యమైన దంపతులుగా కొనసాగుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Home Made Fraud Telugu Latest News: ఇంట్లో తయారు చేస్తున్న పదార్థాలు అంటూ అమాయక కస్టమర్స్ని నమ్మబలికి.. వారి నుంచి భారీ డబ్బులు వసూలు చేస్తున్న ఓ దుకాణం అసలైన మోసం గుట్టు రట్టయింది. బ్రాండెడ్ వస్తువులను హోమ్ మేడ్ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో ఆహార భద్రత అధికారులు సదరు షాపుపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే వారి అసలైన దందా ఏంటో బయటపడింది. ఇది తెలుసుకున్న అమాయపు కస్టమర్స్ ఒక్కసారిగా శాఖ అయిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఏమైంది? ఎక్కడ ఇంతటి దారుణం జరిగింది? దీనికి సంబంధించిన అసలైన విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఏం జరిగిందంటే జగిత్యాల పట్టణానికి చెందిన నవీన్ అనే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న కొత్త బస్టాండుకు చాలా దగ్గరగా ఉండే రాజు స్వీట్స్ అండ్ హోమ్స్ ఫుడ్స్ దుకాణానికి వెళ్ళాడు. అక్కడ అమ్ముతున్న ఒక కిలో పచ్చడిని ఇంట్లోనే స్వయంగా తయారు చేసిందని యజమాని అనడంతో... వెంటనే నవీన్ ఆ తొక్కును కొనుగోలు చేశాడు.. అయితే సాధారణ మార్కెట్లో దాని ధర 180 రూపాయలకు లభిస్తుంది.. కానీ ఆ తొక్కును అమ్ముతున్న యజమాని హోం మేడ్ పేరు చెప్పి ఏకంగా రూ.400 విక్రయించాడు.
అయితే నవీన్ తాను మోసపోయానని గ్రహించిన వెంటనే జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అతను కోరారు.. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష వెంటనే రంగంలోకి దిగింది. తక్షణమే స్పందిస్తూ అధికారులు సదరు దుకాణంలో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో షాప్ లో నిల్వ ఉంచిన పచ్చళ్ళతోపాటు ఇతర ఆహార పదార్థాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతోపాటు వారు విక్రయిస్తున్న పచ్చళ్లపై ఎలాంటి సమాచారం లేకపోవడానికి కూడా గుర్తించారు.
ఈ సందర్భంగా జగిత్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మాట్లాడుతూ.. కొన్ని కీలకమైన విషయాలను కస్టమర్స్ కి వెల్లడించారు.. వస్తువులు ఇంట్లో తయారుచేసిన లేదా ఫ్యాక్టరీలో తయారుచేసిన.. ప్యాకింగ్ తేదీలపై తప్పనిసరిగా తయారి తేదీతో పాటు ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిందేనని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి విక్రయిస్తున్న పచ్చళ్లను సీజ్ చేసి పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు. అంతేకాకుండా దీనికి గాను ఆ షాపును విక్రయిస్తున్న యజమానికి ప్రత్యేకమైన నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే మూడు రోజుల్లో ఈ వ్యవహారంపై ప్రత్యేకమైన వివరణ ఇవ్వాలని.. లేకపోతే దుకాణానికి సంబంధించిన లైసెన్సును రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Budget 2026: 2026 కేంద్ర బడ్జెట్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగంలో ఆశలు మరింత పెరుగుతున్నాయి. నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో పాటు టైర్–2, టైర్–3 నగరాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డెవలపర్లు కోరుతున్నారు. గృహ యాజమాన్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే ఈ బడ్జెట్లో కీలక సంస్కరణలు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంపై ఉన్న జీఎస్టీ భారమే గృహ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారిందని డెవలపర్లు చెబుతున్నారు. నివాస ప్రాజెక్టులపై 5 శాతం లేదా 12 శాతం జీఎస్టీ ఉండగా, రూ.45 లక్షల వరకు ఉన్న సరసమైన ఇళ్లకు మాత్రమే 1 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. అయితే నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఈ పరిమితి చాలా తక్కువగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా సగటు ఆదాయం కలిగిన వ్యక్తికి సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోందని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో 2026 బడ్జెట్లో కొన్ని కీలక డిమాండ్లను పరిశ్రమ ప్రభుత్వం ముందుంచుతోంది. సరసమైన గృహాల ధర పరిమితిని రూ.80–90 లక్షల వరకు పెంచాలని, అలా చేస్తే మరిన్ని ఇళ్లు 1 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయని సూచిస్తున్నారు. అలాగే కొన్ని విభాగాల్లో జీఎస్టీ రేట్లను తగ్గించడం లేదా సరళమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.
ఇదే సమయంలో నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు వర్క్స్ కాంట్రాక్టులపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతం లేదా 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టుల అనుమతులను వేగవంతం చేయడం, రోడ్లు, మెట్రో రైలు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టడం కూడా కీలకమని అంటున్నారు.
ఈ సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు వస్తుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డెవలపర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం పెరిగి, “అభివృద్ధి చెందిన భారత్” లక్ష్యానికి బడ్జెట్ 2026 బలమైన పునాది వేస్తుందని వారు నమ్ముతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget 2026: బడ్జెట్ 2026 నేపథ్యంలో సామాన్యుల జేబుపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పన్నుల్లో ఉపశమనం లభిస్తుందా? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయా? పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఏదైనా ఊరట కల్పిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన తాజా నివేదిక, రాబోయే బడ్జెట్ దిశను, ప్రభుత్వ ఆర్థిక వ్యూహాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం.. ఈసారి ప్రభుత్వం పన్ను నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. గత బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించడం వల్ల పన్ను వసూళ్ల వృద్ధి ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అంచనాల ప్రకారం 21 శాతానికి పైగా ఉండాల్సిన పన్ను వృద్ధి, వాస్తవంగా కేవలం 6.8 శాతానికే పరిమితమైంది. దీంతో ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026లో భారీ పన్ను తగ్గింపులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే.. పూర్తిగా ఉపశమనం ఉండదని కాదు. పెద్ద ఎత్తున పన్ను స్లాబ్ మార్పులు కాకపోయినా, చిన్నపాటి సర్దుబాట్లు, రిబేట్లలో స్వల్ప మార్పులు లేదా పరిమిత రాయితీలు ఇవ్వవచ్చని అంచనా. దీని ద్వారా ప్రభుత్వ వసూళ్లపై భారం పడకుండా, సామాన్యులకు కొంత ఊరట కల్పించే ప్రయత్నం ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ద్రవ్యోల్బణంపై కూడా బడ్జెట్ ప్రభావం కీలకంగా ఉండనుంది. ప్రభుత్వ ఖర్చులు పెరిగితే, వాటికి అవసరమైన నిధుల కోసం పన్ను ఆధారాన్ని విస్తరించడం లేదా కొన్ని సేవలపై ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావం పెట్రోల్, డీజిల్, విద్యుత్, గ్యాస్, రేషన్ వంటి నిత్యావసరాల ధరలపై పడవచ్చు. సబ్సిడీల్లో మార్పులు జరిగితే కొన్ని వస్తువులు ఖరీదయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇక వ్యయపరంగా చూస్తే, ప్రభుత్వం తన ప్రధాన ఎజెండాపైనే దృష్టి సారించనుంది. రోడ్లు, రైల్వేలు, పట్టణ మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం, విద్య, పట్టణ సేవల వంటి సామాజిక మౌలిక రంగాలపై ఖర్చును పెంచడం ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగనుంది. ఇవి నేరుగా సామాన్యుల దైనందిన జీవితంపై సానుకూల ప్రభావం చూపే అంశాలుగా నిపుణులు భావిస్తున్నారు.
ఉపాధి అవకాశాల సృష్టి కూడా ఈ బడ్జెట్లో కీలక అంశంగా మారనుంది. ముఖ్యంగా MSME రంగానికి మద్దతు, సులభమైన రుణాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ స్కిల్స్పై పెట్టుబడులు పెరగవచ్చని మోర్గాన్ స్టాన్లీ నివేదిక సూచిస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఊతం లభించి, కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. మొత్తంగా.. బడ్జెట్ 2026లో సామాన్యులకు భారీ పన్ను ఉపశమనం కంటే, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగాలపై పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సబ్సిడీలు, టారిఫ్ల్లో మార్పులు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ బడ్జెట్ సామాన్యుల జేబుపై భారం పూర్తిగా తగ్గించకపోయినా, దీర్ఘకాలంలో జీవన సౌకర్యాలు మెరుగుపడేలా మార్గం వేసే బడ్జెట్గా ఉండవచ్చని అంచనా వేయొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hindu Adoptions and Maintenance Act: సుప్రీంకోర్టు తాజాగా వితంతువుల హక్కులను మరింత బలోపేతం ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. హిందూ దత్తత, నిర్వహణ చట్టం, 1956 ప్రకారం, ఒక మహిళ తన భర్త మరణించిన తర్వాత వితంతువుగా మారినప్పటికీ.. ఆమె మామగారి ఆస్తి నుండి భరణం పొందే హక్కు కలిగి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భర్త మరణం మామగారి మరణానికి ముందు జరిగిందా? తర్వాత జరిగిందా? అనే అంశం ఆధారంగా వితంతువు హక్కులను నిరాకరించలేమని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ తీర్పుకు కారణమైన కేసు దివంగత డాక్టర్ ప్రసాద్ ఆస్తికి సంబంధించినది. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు రంజీత్ శర్మ మార్చి 2, 2023న మరణించారు. రంజీత్ శర్మ భార్య గీతా శర్మ, తన భర్త మరణించిన అనంతరం మామగారి ఆస్తి నుంచి భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే కుటుంబం తరఫున వాదన ఏమిటంటే, డాక్టర్ ప్రసాద్ 2011లోనే తన ఆస్తిని మరో కుమారుడు దేవిందర్ రాయ్ భార్య కాంచన రాయ్, వారి పిల్లలకు వారసత్వంగా ఇస్తూ వీలునామా రాశారని, అందులో రంజీత్ శర్మను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గీతా శర్మ దాఖలు చేసిన భరణం పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. డాక్టర్ ప్రసాద్ మరణించిన సమయంలో గీతా శర్మ వితంతువు కాదనే కారణంతో ఆమె అభ్యర్థనను కొట్టివేసింది. దీనిపై గీతా శర్మ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, గీతా శర్మ చట్టపరంగా ఆధారపడిన వ్యక్తేనని పేర్కొంది. భరణం అంశాన్ని మళ్లీ పరిశీలించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
ఈ నిర్ణయాన్ని కాంచన రాయ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. గీతా శర్మ తన మామగారి మరణ సమయంలో వితంతువు కాదని, అందువల్ల ఆమెకు భరణం హక్కు ఉండదని వాదించారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 21(vii) ప్రకారం, కుమారుడి ఏ వితంతువైనా కుటుంబంపై ఆధారపడిన వ్యక్తిగా పరిగణిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. భర్త మరణం మామగారి మరణానికి ముందే జరగాలి అనే షరతు చట్టంలో ఎక్కడా లేదని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉటంకిస్తూ, భర్త మరణించిన కాలాన్ని ఆధారంగా చేసుకుని వితంతువుల మధ్య వివక్ష చూపడం సమానత్వ హక్కుకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. భరణం నిరాకరించడం మహిళ గౌరవంగా జీవించే హక్కును హరించడమేనని పేర్కొంది. ఇలాంటి విధానం వితంతువులను పేదరికం, సామాజిక ఒంటరితనంలోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మనుస్మృతిని ప్రస్తావిస్తూ, కుటుంబ పెద్ద తనపై ఆధారపడిన మహిళలను పోషించడం నైతికంగానూ, చట్టపరంగానూ బాధ్యతేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మామగారు మరణించిన తర్వాత కూడా ఆయన వారసులు, ఆయనపై ఆధారపడిన వారికి సహాయం అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ, అన్ని అప్పీల్స్ను తిరస్కరించింది. గీతా శర్మకు ఇవ్వాల్సిన భరణం మొత్తాన్ని ఆమె అర్హతలు, పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. వితంతువుల హక్కుల పరిరక్షణలో ఈ తీర్పు ఒక చారిత్రాత్మక ముందడుగుగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPF Money Via UPI Soon: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సౌలభ్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా తక్షణమే PF మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు క్లెయిమ్ దాఖలు, ధృవీకరణ, బ్యాంక్ బదిలీ వంటి ప్రక్రియలతో కొంత సమయం తీసుకున్న ఉపసంహరణలు, ఇకపై చాలా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సంస్కరణ ద్వారా ‘జీవన సౌలభ్యం’ను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత విధానం ప్రకారం, EPF సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన UPI గేట్వే ద్వారా తమ అర్హత కలిగిన PF బ్యాలెన్స్ను నేరుగా చూడగలుగుతారు. అవసరమైన మొత్తాన్ని UPI పిన్ సహాయంతో సురక్షితంగా తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. ఒకసారి డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత, దానిని ATMల ద్వారా నగదుగా తీసుకోవచ్చు లేదా డిజిటల్ చెల్లింపులకు వినియోగించుకోవచ్చు.
భద్రత మరియు భవిష్యత్ పొదుపుల దృష్ట్యా, మొత్తం PFలో కొంత భాగాన్ని ‘ఫ్రీజ్’గా ఉంచే విధానాన్ని కూడా EPFO ప్రవేశపెట్టనుంది. కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు తమ మొత్తం సహకారంలో కనీసం 25 శాతం మొత్తాన్ని ఖాతాలో తప్పనిసరిగా నిల్వగా ఉంచాలి. మిగిలిన మొత్తాన్ని అవసరాల మేరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ 25 శాతం నిల్వపై ప్రస్తుత 8.25 శాతం వడ్డీ రేటుతో పాటు కాంపౌండింగ్ లాభం కొనసాగుతుంది. దీని వల్ల పదవీ విరమణ సమయానికి సభ్యులకు పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంటాయి.
ఇక ఉపసంహరణలకు సంబంధించిన క్లిష్టమైన నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. ఇప్పటివరకు ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను తొలగించి, వాటిని మూడు ప్రధాన వర్గాలుగా విభజించింది. అవి అత్యవసర అవసరాలు (వైద్య చికిత్స, విద్య, వివాహం), గృహ అవసరాలు మరియు ప్రత్యేక పరిస్థితులు. ఈ మార్పులకు EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారికంగా ఆమోదించిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం EPFO ప్రతి ఏడాది దాదాపు 5 కోట్ల క్లెయిమ్లను పరిష్కరిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఉపసంహరణలకే సంబంధించినవి. ఆటో సెటిల్మెంట్ విధానంలో రూ.5 లక్షల వరకు క్లెయిమ్లు మూడు రోజుల్లోనే పూర్తవుతున్నప్పటికీ, UPI ఏకీకరణతో ఈ సమయం మరింత తగ్గనుంది. EPFOకు స్వంత బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోయినా, UPI అనుసంధానంతో బ్యాంకింగ్ తరహా సేవలను అందించే స్థాయికి సంస్థ చేరుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం సజావుగా అమలయ్యేలా అవసరమైన సాఫ్ట్వేర్ మార్పులు, సాంకేతిక లోపాల పరిష్కారంపై ప్రస్తుతం EPFO తీవ్రంగా పనిచేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sampath Kumar Harassment: నేషన్ హైవే 44 పనుల్లో రూ.8 కోట్లు డబ్బులు ఇస్తేనే పనులు సాగనిస్తానని బెదిరింపులు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ బెదిరింపులకు పాల్పడడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ పార్టీ ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కీలక విషయాలు వెల్లడించారు. మండల స్థాయి అధికారులను నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నాడని.. వసూలు రాజాగా సంపత్ మారాడని ఆరోపించారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో-2 దశపై కీలక పరిణామం.. ఏం జరిగిందో తెలుసా?
హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ కుమార అక్రమాలు, కమీషన్కు దాడులకు పాల్పడడం వంటి అంశాలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు వివరించారు. వసూల్ రాజా సంపత కుమార్పై అన్ని ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే బయట పెడతామని ప్రకటించారు. నడిగడ్డ నీ రాజ్యం కాదు ప్రజలదని స్పష్టం చేశారు.
Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి
'40 వేల ఓట్లతో ఆయన ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. తనను ముట్టుకుంటే అగ్గి అవుతారు అన్నాడు. అగ్గి కాదు కానీ మట్టి అవుతారు ఎందుకంటే మీరు చేసే అక్రమ దందా మట్టి దందానే. జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఆయన జాతీయ సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ నాయకుడు కనుక మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్తారా? లేక హోమ్ మంత్రి అలియాస్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా?' అని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
Also Read: Sankranti Offer: సంక్రాంతికి బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే విమాన టికెట్
'జర్నలిస్టుల మీద సిట్ వేసిన ప్రభుత్వం ఇతని మీద సిట్ విచారణ వేస్తారా? మారణాయుధాలతో బెదిరించారు అని శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఫిర్యాదు చేసింది. రేపు అక్కడకు పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి సిట్ విచారణ వేయాలి' అని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. సంపత్ మాట్లాడిన బూతులు చూస్తూ బయట పెట్టడం లేదు. సంపత్ సతీమణి ప్రభుత్వ టీచర్ అంట.మరి విధులకు వెళ్తుందో లేదో తెల్వదు ఆయన ఏదో మ్యానేజ్ చేసుకుంటున్నారు. ఆయన అఫిడవిటలో ఎలాంటి భూములు లేవని నిల్ అని పెట్టారు. ఇప్పుడు మాత్రం అసైన్డ్స్ ల్యాండ్ రెండు ఎకరాలు సతీమణి మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలా కబ్జాలు చాలా ఉన్నాయి.అన్ని ఆధారాలు ఉన్నాయి' అని మన్నె క్రిశాంక్ వెల్లడించారు.
'సంపత్ అబ్బాయి ఒక్క కంపెనీ డైరెక్టర్. 100 పడకల హాస్పిటల్ కేసీఆర్ సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేశారు. కానీ సంపత్ కుమార్ కొడుకు గ్లోబెన్ కంపెనీకి మాత్రమే టెండర్లు రావాలి అని బెదిరిస్తున్నారు. కాంటాక్ట్ రావాలి అంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రమే రావాలి. ఇందులో కాంట్రాక్ట్ మాత్రం వాళ్ల అబ్బాయికి ఇచ్చారు. చిన్నది అయిన పెద్దది అయిన మట్టి అయిన ఇంకా ఏదైనా టెండర్ రావాలి అంటే కేవలం సంపత్ కుమార్ కుటుంబ సభ్యులకు మాత్రమే రావాలి' అని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి