ఖమ్మంలో వర్షం, వేడి నుంచి ఉపశమనం
ఖమ్మం నగరంలో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండవేడిమితో బాధపడుతున్న ప్రజలు వర్షం కారణంగా ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా కాలువలు పొంగి పొర్లాయి. పాత బస్ స్టేషన్ వద్ద రోడ్డుపై వరద నీరు వ్యాపించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Madanapalle Incident Accused Suicide: మదనపల్లెలో బాలికపై జరిగిన హత్యాచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. బాలికను దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత చిన్నారిని హత్య చేసిన ఉదంతంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన కులవర్ధన్ను నిర్ధాక్షిణంగా వ్యవహరించి, బాలిక మృతికి తగిన న్యాయం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఘటనకు పాల్పడిన కులవర్ధన్ తొలుత పరారీలో ఉండగా.. ఈరోజు ఉదయాన్నే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్పీ నిర్ధారించారు. అయితే నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. రాక్షసుడికి తగిన గతి జరిగిందని టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. నిన్న (మంగళవారం) మదనపల్లె పరిధిలో ఒక మైనర్ బాలికపై హత్యాచారం జరిగింది. కులవర్ధన్ అనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయితే తొలుత నిందితుడు కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో అతడు తప్పించుకున్నాడు.
నిందితుడు పరారీలో ఉండడం వల్ల అతడి కోసం వెతికేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా.. వారంతా మదనపల్లెను జల్లెడ పట్టారు. చివరికి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్ను కూడా రంగంలోకి దించినట్లు తెలిసింది.
అలా నిందితుడు కులవర్ధన్ ఆచూకీ కోసం వెతుకుతున్న తరుణంలో బుధవారం అనగా ఫిబ్రవరి 18న ఉదయం స్థానిక చెరుపులో ఓ మృతదేహం తేలియాడుతూ ఉంది. అది నిందితుడే అని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల చెర నుంచి తప్పించుకున్న నిందితుడు.. భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల మృతురాలు బాలిక తల్లి స్పందించింది. కులవర్ధన్ బతికే ఉంటే తానే చంపేదాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అతడి మృతి పట్ల మదనపల్లెలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నారిని బలి తీసుకున్న కిరాతకుడు మట్టికరిచిపోయాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP 10th Class Hall Ticket 2026 Release Date: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు నిర్వహించి.. వచ్చే నెలలో పదో తరగతి ఎగ్జామ్స్ జరిపేందుకు ఏపీ విద్యాశాఖ ప్రణాళిక రచించింది. అయితే ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ఈ క్రమంలో హాల్ టికెట్లపై విద్యార్థుల ఇంటి పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో ఎలాంటి తప్పులున్నా వాటి సవరణల కోసం అవకాశం కల్పిస్తామని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సమస్యలున్న విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పరీక్షలు పూర్తైన తర్వాత కూడా మార్క్స్ మెమో ఇచ్చే సమయంలో వివరాలను సవరణ చేసుకునేందుకు వీలుందని అధికారులు తెలియజేశారు.
అయితే పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 30 తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం జరగనుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. ఈ మ్యూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగుతుందట.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 టైమ్టేబుల్..
మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
మార్చి 21న ఇంగ్లీష్ (మార్చి 20 నుంచి 21కి పరీక్ష తేదీ మారింది)
మార్చి 23న మ్యాథమెటిక్స్
మార్చి 25న ఫిజికల్ సైన్స్
మార్చి 28న బయాలజికల్ సైన్స్
మార్చి 30న సోషల్ స్టడీస్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Infinix Note Edge 5g Price: ప్రముఖ ఇన్ఫినిక్స్ బ్రాండ్ తమ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ పేరుతో లాంచ్ చేసింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్తో పాటు ప్రీమియం కెమెరా సెటప్తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులోని ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్ఫోన్ ప్రీమియం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్తో లభిస్తోంది. ఇది IP65 రేటింగ్ సపోర్ట్తో అందుబాటులో ఉంది. ఇది మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ 6GB + 128GB స్టోరేజ్తో ధర రూ.21,999తో లభిస్తోంది..
ఇక రెండ వేరియంట్ 8GB + 128GB స్టోరేజ్తో అందుబాటులో ఉంది. మూడవ వేరియంట్ స్మార్ట్ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ రూ.25,999తో లభిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 25వ తేదిన ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్తో పాటు ఇన్ఫినిక్స్ ఇండియాలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లాంచింగ్ ఆఫర్స్లో భాగంగా ICICI బ్యాంక్, SBI కార్డ్లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్పై ఏకంగా రూ.2 వేల వరకు అదనపు బోనస్ కూడా లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఫీచర్స్ వివరాలు..
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2644×1208 పిక్సెల్ల రిజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. అలాగే 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. ఇక ఇందులో కంపెనీ ప్రత్యేకమైన 2160Hz PWM డిమ్మింగ్ను ఆప్షన్ను కూడా అందిస్తోంది..
డిస్ప్లే ప్రొటక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ను కూడా అందిస్తోంది. అలాగే ఇది మాలి-G610 GPUతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 6nm ప్రాసెసర్తో లభిస్తోంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేయాలనుకునేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైన Android 16 ఆధారంగా XOS 16 ఆపరేటింగ్పై రన్ అవుతుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shubman Gill Dance In Arjun Tendulkar Pre Wedding: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ, అర్జున్ టెండూల్కర్ వేడుకల కోసం గిల్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అక్కడ ఆయన చేసిన డ్యాన్స్ అభిమానులను అలరిస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో గిల్ పూర్తి 'ఫన్ మూడ్'లో కనిపించారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'మౌజా హీ మౌజా' (జబ్ వి మెట్) కు గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. బ్రౌన్ కలర్ బంద్గలా సూట్, మెడలో స్టైలిష్ మఫ్లర్ ధరించి గిల్ చాలా హుందాగా కనిపించారు. మైదానంలోనే కాదు, డాన్స్ ఫ్లోర్పై కూడా గిల్ 200 స్ట్రైక్ రేట్తో అదరగొడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోపై కొందరు ఇది ఆయన బంధువుల పెళ్లి వీడియో అని చెబుతున్నా.. నెట్టింట మాత్రం అర్జున్ ప్రీ-వెడ్డింగ్ వీడియోగానే వైరల్ అవుతోంది.
అర్జున్ టెండూల్కర్ పెళ్లి ఎవరితో? ఎప్పుడు?
అర్జున్ టెండూల్కర్ తన లాంగ్టైమ్ పార్ట్నర్ సానియా చండోక్ను పెళ్లాడబోతున్నారు. 2026 మార్చి 5న ముంబైలో ఈ వివాహం జరగనుంది. సానియా చండోక్ ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. వీరి కుటుంబానికి క్వాలిటీ ఐస్క్రీమ్, బాస్కిన్ రాబిన్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో అనుబంధం ఉంది.
शुभमन गिल अर्जुन तेंदुलकर की प्री-वेडिंग पार्टी में खूब मस्ती कर रहे हैं।
- कोहली कल रात शादी की पार्टी में शामिल होंगे।
- शुभमन गिल और विराट कोहली के डांस वीडियो देखना बेहद मजेदार होगा। pic.twitter.com/rS9CwUZ6Wv
— ममता राजगढ़ (@rajgarh_mamta1) February 16, 2026
సచిన్ తన కుమారుడి పెళ్లిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్న ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షా వంటి వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. అలాగే క్రీడా రంగంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ స్టార్స్ హాజరుకానున్నారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఇద్దరూ కలిసి డాన్స్ ఫ్లోర్పై స్టెప్పులు వేస్తే చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అర్జున్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్
2026 సంవత్సరం అర్జున్కు వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్గా కూడా చాలా కీలకం. వివాహంతో పాటు, ఈ ఏడాది ఐపీఎల్లో ఆయన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నారు. సచిన్ తనయుడి పెళ్లి వేడుకలు ఇప్పటికే జామ్నగర్లో అంబానీ కుటుంబంతో కలిసి ప్రారంభమయ్యాయి. మార్చి 5న జరగబోయే ఈ మెగా వెడ్డింగ్ కోసం క్రికెట్, సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pharmacist Grade 2 Candidates Telugu News: తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అందని ద్రాక్షలా మారింది.. అభ్యర్థులు పరీక్షలు ఎన్నో నెలలు అవుతున్న ఫలితాల విడుదలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వేల సంఖ్యలో ఉన్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారుల చుట్టూ రోజు తీరుగుతున్నా.. వచ్చే నేల, వచ్చే నెల అంటూనే సమాధానమే తప్ప.. ఎలాంటి వాస్తవ రూపంలో ఫలితాలు రాకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పరీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసి చాలా రోజులు గడుస్తున్నా.. కనీసం ప్రథమిక సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. రిజల్ట్స్ వస్తే.. మాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలుస్తుంది.. దాన్ని బట్టి మా భవిష్యత్ ప్రణాళిక చేసుకుంటాం.. కానీ ఇలా కాలయాపన చయడం వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాం.. అని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ చాలా మంది అభ్యర్థుల జీవితాల్లో ఊహించని సంక్షోభాన్ని సృష్టిస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చేసుకుని చాలా మంది ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యారు. అయితే, ఈ సమయంలో చాలా మంది అభ్యర్థులు తాము చేస్తున్న ప్రైవేట్ ఫార్మా కంపెనీలతో పాటు ఆసుపత్రుల్లోని ఉద్యోగాలను వదులుకున్నారు. చాలా మంది అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ..నమ్మకంతో ఉద్యోగం వదిలాం.. ఇప్పుడు అటు ప్రైవేట్ లేక, ఇటు సర్కారు ఉద్యోగాలు రాక నడిరోడ్డుపై నిలబడ్డాం.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు..
Also Read: Nampally Court: నాంపల్లి CBI కోర్టు వద్ద హై అలర్ట్.. బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత!
అభ్యర్థులు తాజాగా ప్రభుత్వంతో పాటు బోర్డుకు అల్టిమేటం జారీ చేశారు. ఎన్నిసార్లు చెప్పటిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. మర్చి నెలాఖరు లోపు ఫలితాలు విడుదల చేయకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే కొన్ని డిమాండ్లను కూడా వారు ముందుకు తీసుకు వచ్చారు. ఇందులో మొదటిది.. మార్చి 31లోపు ఫార్మసిస్ట్ గ్రేడ్-2 తుది ఫలితాలను వెల్లడించాలి. రెండవది నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలి. మూడవది అభ్యర్థుల వయోపరిమితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించాలి.
Also Read: Nampally Court: నాంపల్లి CBI కోర్టు వద్ద హై అలర్ట్.. బాంబు బెదిరింపుతో ఉద్రిక్తత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Assembly New Voter Amendment Bill: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యువతకు ఓటు హక్కు కల్పించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026'కు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఓటు హక్కు కల్పించే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ, కేంద్ర చట్టంతో అనుసంధానిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బిల్లు ప్రవేశం, ఆమోదం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లుకు మద్దతు పలికారు. గతంలో డిసెంబర్ 23, 2025న ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు ప్రస్తుతం సభలో చట్టబద్ధత లభించింది.
చారిత్రాత్మక మార్పు - యువతకు మేలు
గతంలో పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు కేవలం జనవరి 1ని మాత్రమే కటాఫ్ తేదీగా పరిగణించేవారు. తాజా సవరణతో ఆ నిబంధన మారింది. ఇకపై ఏటా నాలుగు తేదీల్లో (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) 18 ఏళ్లు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన వారు మరో ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాలిటీ ఎన్నికల తరహాలోనే పంచాయతీలకు కూడా ఒకే విధమైన ఓటర్ల జాబితా విధానం అమల్లోకి వస్తుంది.
చర్చలో పాల్గొన్న సభ్యుల సూచనలు
ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, ఎన్. ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. వారు ప్రధానంగా కింది అంశాలను లేవనెత్తారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను పూర్తిస్థాయిలో తొలగించి, పారదర్శకమైన జాబితాను రూపొందించాలని సూచించారు. సభ్యుల సూచనలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, అక్రమ ఓట్ల తొలగింపుపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
ఈ సవరణ బిల్లు వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు త్వరితగతిన ఓటు హక్కు లభించడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. కేంద్ర చట్టంతో అనుసంధానించడం ద్వారా ఎన్నికల నిర్వహణలో గందరగోళం తొలగిపోనుంది.
Also REad: Best AC in India: వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా? 3-స్టార్ vs 5-స్టార్..మీ ఇంటికి ఏది బెటర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dinesh Karthik On Babar Azam: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్పై టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాబర్ను భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘోర విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో బాబర్ అజామ్ కేవలం 5 పరుగులకే (7 బంతుల్లో) పెవిలియన్ చేరడం చర్చనీయాంశమైంది.
అది కోహ్లీకి అన్యాయం చేసినట్లే!
దినేశ్ కార్తీక్ ఒక క్రీడా విశ్లేషణలో మాట్లాడుతూ.. బాబర్ను కోహ్లీతో పోల్చడాన్ని తప్పుబట్టారు. "చాలా కాలంగా బాబర్ను విరాట్తో పోల్చుతున్నారు, అది చాలా అన్యాయం. విరాట్ ఎప్పుడూ బాబర్లా నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం నేను చూడలేదు" అని కార్తీక్ వ్యాఖ్యానించారు. బాబర్ షాట్ సెలక్షన్ చాలా పేలవంగా ఉందని, అతడిలో జట్టును గెలిపించగలననే ఆత్మవిశ్వాసం కనిపించడం లేదని విశ్లేషించారు.
గొప్ప క్రికెటర్కు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ కార్తీక్ కింది విధంగా అన్నారు. "ఒత్తిడిలో రాణించడమే గొప్ప ఆటగాడి లక్షణం. కానీ బాబర్పై నాకు ఆ నమ్మకం కలగడం లేదు. అతడిలో అత్యుత్తమ క్రికెటర్ లక్షణాలు నాకు కనిపించలేదు" ఇదే క్రమంలో యువ ఆటగాడు అభిషేక్ శర్మపై డీకే ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కోహ్లీ మెల్బోర్న్ ఇన్నింగ్స్..
విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఎలా ఆడతారో చెప్పడానికి 2022 టీ20 ప్రపంచకప్లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ మ్యాచ్లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశారు. 160 పరుగుల ఛేదనలో టీమ్ ఇండియాను ఒంటిచేత్తో గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి ఇన్నింగ్స్లు ఆడటంలో కోహ్లీకి సాటి ఎవరూ లేరని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డారు.
Also Read: Best AC in India: వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా? 3-స్టార్ vs 5-స్టార్..మీ ఇంటికి ఏది బెటర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nampally Court Latest News: హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి CBI కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చాయి.. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.. కోర్టు ప్రధాన బిల్డింగ్లో ప్రత్యేకమైన బాంబు అమర్చామని.. కొద్దిసేపట్లోనే బ్లాస్ట్ అవుతుందని వచ్చిన సమాచారంతో అటు పోలీసులతో పాటు ఇటు న్యాయవాదులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జరిగింది ఇదే..
బుధవారం ఉదయం కోర్టుకు సంబంధించిన అన్ని పనులు మొదలు కాగానే..కొద్దిసేపటికే అధికారులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.. అయితే, ఈ మెయిల్లో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కోర్టు ఆవరంలో బాంబ్ బ్లాస్ అవుతుందని రాశారు. అయితే, ఈ సమాచారం తెలిసిన వెంటనే నాంపల్లి పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీనికి ముందు జాగ్రత్తగా కోర్టు భవనంలోని నాయమూర్తులతో పాటు సిబ్బంది, న్యాయవాదులు వెంటనే బయటకు వచ్చారు. అంతేకాకుండా పోలీసులు వెంటనే ప్రాంగణాన్ని ఖాళీ చేశారు.
రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
పరిస్థితులు తీవ్రతరం కాకుండా ముందుగానే ఉన్నతాధికారులు కోర్టుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS)తో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా పంపించిన్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కోర్టులోని ప్రతి రూమ్ని, పార్కింగ్ ఏరియాను, క్యాంటీన్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనుమానాస్పద వస్తువుల కోసం అధికారులు అణువణువూ గాలించారు. ఈ సోదాల సమయంలో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో న్యాయవాదులు ఇబ్బంది పడినట్లు సమాచారం..
ఊపిరి పీల్చుకున్న అధికారులు..
కోర్టును మొత్తం తనిఖీలు చేసిన అధికారులు అనంతరం కోర్టులో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవవడంతో అధికారులు ఇది ఫేక్ మెయిల్గా తేల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దార్యప్తు ప్రారంభించారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో? పంపిన వ్యక్తి ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
3 star or 5 Star AC Which Is Better: వేసవి కాలం వచ్చేస్తోంది.. భానుడి భగభగలకు చెక్ పెట్టేందుకు చాలా మంది ఏసీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీ కొనడానికి వెళ్ళినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సందేహం.. '3 స్టార్ ఏసీ తీసుకోవాలా? లేక 5 స్టార్ ఏసీ బెటరా?' అనేది. ఏసీ రేటింగ్ను భారతదేశంలో BEE (Bureau of Energy Efficiency) నిర్ణయిస్తుంది. స్టార్స్ ఎక్కువగా ఉంటే విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుందని అర్థం.
3-స్టార్ ఏసీ (తక్కువ ధర - ఎక్కువ బిల్లు)
3-స్టార్ ఏసీ దీని ప్రారంభ ధర 5-స్టార్ ఏసీ కంటే తక్కువగా ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. ఇది 5-స్టార్ ఏసీ కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఫలితంగా నెలవారీ కరెంటు బిల్లు భారంగా మారుతుంది. మీరు ఏసీని రోజుకు కేవలం 2-3 గంటలు మాత్రమే వాడితే లేదా సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉపయోగిస్తే 3-స్టార్ ఏసీ సరిపోతుంది.
5-స్టార్ ఏసీ (ఎక్కువ ధర - భారీ పొదుపు)
ఇది అత్యంత శక్తి సామర్థ్యం కలిగినది. 3-స్టార్ ఏసీతో పోలిస్తే కరెంటు బిల్లులో ఏటా వేల రూపాయలు ఆదా చేస్తుంది. దీని కొనుగోలు ధర 3-స్టార్ మోడల్ కంటే దాదాపు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు. మీరు రోజుకు 6 నుండి 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీని ఉపయోగిస్తుంటే, 5-స్టార్ ఏసీయే బెస్ట్. మీరు పెట్టిన అదనపు పెట్టుబడి 2-3 ఏళ్లలోనే కరెంటు బిల్లుల పొదుపు రూపంలో తిరిగి వచ్చేస్తుంది.
స్టార్ రేటింగ్తో పాటు ఇవి కూడా ముఖ్యం..
కేవలం స్టార్ రేటింగ్ చూస్తే సరిపోదు, ఏసీ పనితీరు బాగుండాలంటే కింది విషయాలు గమనించాలి. గది చిన్నదైతే 1 టన్, మీడియం అయితే 1.5 టన్, పెద్ద హాల్ అయితే 2 టన్నుల ఏసీని ఎంచుకోవాలి. తప్పు టన్నేజ్ ఎంచుకుంటే 5-స్టార్ ఏసీ కూడా ఎక్కువ బిల్లును ఇస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా గదిలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
మంచి సర్వీస్ నెట్వర్క్ ఉన్న బ్రాండ్ను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో రిపేర్ ఖర్చులు తగ్గుతాయి. మీరు ఏసీని దీర్ఘకాలం (5-8 ఏళ్లు) వాడాలని ప్లాన్ చేస్తే, కళ్లు మూసుకుని 5-స్టార్ ఏసీ తీసుకోవడం తెలివైన పని. తక్కువ వాడకం ఉన్నవారికి మాత్రమే 3-స్టార్ ఏసీ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madanapalle Child Murder Case: మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడు కులవర్ధన్ (30) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాలికను అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు కురబలకోట మండలంలో అతడి మృతదేహం లభ్యమైంది.
స్థానికుల కథనం ప్రకారం.. కురబలకోట మండలం కనసానివారి పల్లె చెరువులో నిందితుడు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి ఫోన్ చేయగా పాప కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. బాలిక చివరిసారిగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్తో కనిపించిందని పాప తాత సమాచారం ఇచ్చారు.
మంగళవారం ఉదయం కులవర్ధన్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా, నీళ్ల డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా పడి ఉంది. నిందితుడు పాపపై అత్యాచారం చేసి, ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపేసి, అదే గదిలో రాత్రంతా నిద్రపోవడం కలచివేసింది.
నిందితుడి నేర చరిత్ర
పోలీసుల విచారణలో నిందితుడు కులవర్ధన్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు తేల్చారు. ఇతనిపై గతంలో కూడా పలు క్రిమినల్ ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. గంజాయి మత్తులో ఏమీ తెలియని చిన్నారిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడు పోలీసులకు దొరకకముందే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Most Romantic Zodiac Signs Telugu: ప్రేమ అనే భావన రాశిచక్రాలపై కూడా ఆధారపడి ఉంటుందంటే మీరు నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే.. ఎందుకంటే రాశి ఫలాలపై కూడా కొన్ని సార్లు ప్రేమ, వ్యక్తిగత జీవితం ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఎల్లప్పుడు జీవితభాగస్వామితో ప్రేమగా కూడా ఉంటారు. అయితే, ఆ రాశులేంటో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారు ఎల్లప్పుడు ప్రేమగా ఉంటారు..
తుల రాశి:
తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శృంగారభరితంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు మానసికంగా భాగస్వామితో చాలా సంతోషంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సంబంధాల్లో అవగాహన కూడా చాలా ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ ఎన్నో రకాలుగా పరిష్కారం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు చాలా సున్నితంగా ఉంటారు. అలాగే వీరు భాగస్వామితో కూడా ఎంతో ఆరోగ్యంగా జీవితం కొనసాగిస్తారు.
వృషభ రాశి:
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంచి భాగస్వాములు లభిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ భాగస్వామి భావాలను కూడా ఎంతో సులభంగా బాగా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అభిప్రాయభేదాలు కూడా లభిస్తాయి. వీరు చిన్ని చిన్న విషయాల్లో కూడా భాగస్వామితో చాలా ప్రేమగా ఉంటారు. అంతేకాకుండా వీరు కుంటుంబ పట్ల బాధ్యతాయుతంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశివారు చాలా సంతోషంగా జీవిస్తారు.
సింహ రాశి:
సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు తమ ప్రేమను వక్తపరచడంలో ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా తమ భాగస్వామిని కూడా ఎప్పుడు ప్రశంసిస్తునే ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరు తమ భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు కూడా చాలా అసక్తి చూపుతూ ఉంటారు. వీరికి ప్రతిరోజూ కొత్త కొత్త సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. దీని వల్ల వీరు మనసులో ఉన్న ప్రేమను కూడా చూపించగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు భాగస్వామ్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు చాలా నిజాయితీపరులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వీరికి విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వారు తమ భాగస్వాములతో ప్రేమగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ రాశివారు భాగస్వామితో ఎల్లప్పుడూ ఒకరికొకరు ఎంతో అండగా కూడా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతూనే ఉంటాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Schools Holiday: తెలంగాణలోని ఓ ప్రాంతంలో రేపు స్కూళ్లు, కాలేజ్లకు బంద్ ఉండే అవకాశం ఉంది. జరుగుతున్న రాజకీయంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం.. 144 సెక్షన్ పెట్టి ఇతర రాజకీయ పార్టీలను వేధించడంతో పరిస్థితి భయానకంగా మారింది. దీంతో కాంగ్రెస్ దౌర్జన్యాలు.. నీచపు రాజకీయానికి వ్యతిరేకంగా రేపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీతోపాటు సీపీఐ బంద్కు పిలుపునిచ్చాయి. అది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి పట్టణంలో. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో ఆ బంద్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Also Read: KCR Birthday Gift: ఐదుకు 5 క్లీన్ స్వీప్ విజయాలు కేసీఆర్ బర్త్ డే కానుక: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఏం జరిగింది?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డులను బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ గెలిచాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్, సీపీఐ ఎన్నిక కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అడ్డుకుంటుంది. మెజార్టీ లేకపోయినా మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని కుట్ర.. దౌర్జన్యం.. అధికార బలంతో రాజకీయం చేస్తోంది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతోపాటు సీపీఐ కౌన్సిలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో మున్సిపల్ కార్యవర్గం ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. రెండో రోజు మంగళవారం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం.. అధికారులకు కూడా వంతపాడడం.. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ క్యాతన్పల్లి బంద్కు పిలుపునిచ్చింది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
ఈ బంద్ ప్రభావంతో క్యాతన్పల్లిలో ఉన్న స్కూళ్లు, కాలేజ్లు కూడా బంద్ కానున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్యాతన్పల్లి రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల కవాతుతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏదో ఉగ్రవాదులు వచ్చినట్టు పెద్ద ఎత్తున బలగాలు మోహరించగా క్యాతన్పల్లిలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు ఏర్పడడంతో ఈ నేపథ్యంలో ఇచ్చిన బంద్తో ఇబ్బందులు ఎదురవుతాయని స్కూళ్లు, కాలేజ్లు బుధవారం పనిచేయకపోవచ్చు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా రేపు బుధవారం బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు కలిసి క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. 22 వార్డులు ఉంటే 7 వార్డులు గెల్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చైర్మన్ ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. ఈ దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు థూ.. అని ఉమ్ముతున్నారని తెలిపారు. 'గెలిచిన వారిని వారి సీట్లలో కూర్చోనివకుండా ఇదేం పద్దతి అని అడుగుతున్నా. కాంగ్రెస్ కార్యకర్తలకంటే అద్వాన్నంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా వేసుకుని రేవంత్ రెడ్డి పాటకు డాన్సులు చేయండి' అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు.
'కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు తాగి వచ్చి మంత్రి వివేక్ ముందు మా మహిళా సభ్యులను తాకరాని చోట తాకారు.. చెత్తనా కొడుకులు. నువ్వు, నీ కొడుకు కూర్చొని.. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో మా సోదరీమణుల మీద దౌర్జన్యం చేపిస్తావా?' అని మంత్రి వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రి ఆధ్వర్యంలో ఆడబిడ్డల మీద దౌర్జన్యం జరిగింది.. ఒక్క మునిసిపల్ కౌన్సిల్ కోసం ఇంత దుర్మార్గమా? నువ్వు రిక్వెస్ట్ చేయ్ ఇచ్చి పడేస్తాం. మా ఆడకూతుర్లకంటే మాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు' అని స్పష్టం చేశారు.
టెన్షన్.. హై టెన్షన్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతోపోలీసులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gudem Mahipal Reddy Gift To KCR Birthday: తన నియోవజకర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీల విజయాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుక అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన కాంగ్రెస్లో చేరి తిరిగి గులాబీ గూటిలోకి వచ్చేశారు. అధికారికంగా చేరకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తన పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీలు గెలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బుల్లెట్ దిగిందా లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఐదు మున్సిపాలిటీలు కేసీఆర్ బర్త్డే కానుక అని ప్రకటించారు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించిన అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం. మీ వెనుక నేనున్నా అభివృద్ధిలో ముందుకు సాగండి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి' అని కొత్త మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. 'పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పుట్టినరోజు కానుకగా అందించాం. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు' అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సహకరించిన కార్యకర్తలు, సంపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
'రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులందరూ ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి' అని కొత్త పాలకవర్గాలకు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి సంక్షేమాల అంశంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై పటాన్చెరు ప్రజలు ఎల్లప్పుడూ తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఐదు మున్సిపాలిటీలలోనూ.. బీఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook