అబ్దుల్లాపూర్ మెట్టులో 7 బైక్లకు నిప్పంటించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు
Telangana:అబ్దుల్లాపూర్ మెట్టు జెఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో గూండాలు రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన ఏడు బైక్లకు నిప్పంటించారు, దానితో పాటు ఏడు బైక్లను దగ్ధం చేశారు, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పన్ను విచారణ జరుగుతోంది. 7 బైక్ దగ్ధం ఘటనలో ఇద్దరు అనుమానితులుగా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు అదే కాలనీకి చెందిన మొగిల మహేంద్ర, ఎజమేడల శివకుమార్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Peddi Day 1 Collection: రూ.200 కోట్లతో బాక్సాఫీసు బద్దలు కొట్టిన రామ్చరణ్..'పెద్ది' సూపర్ హిట్ టాక్!
Hyderabad, Telangana:Peddi Day 1 Collection News: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది' నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ గురించి చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చింది. తొలి రోజు దాదాపుగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. అదే విధంగా సినీ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా మరో రూ.40 కోట్లు వచ్చినట్లు.. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ రూ.200 కోట్ల మార్క్ను చేరినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.Pawan Kalyan Telangana: "పవన్పై విమర్శలు వద్దు".. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు హైకమాండ్ హుకుం!
Hyderabad, Telangana:Pawan Kalyan Telangana Congress: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఇటీవలే కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ను విమర్శించడం వల్ల ఆయన తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం సహా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది.Free Electricity: 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్..ఇలా అప్లే చేయండి!
Hyderabad, Telangana:Free Electricity 300 Units: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులు భారం తగ్గించేందుకు ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీయోజన'. ఈ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగా కరెంటు పొందడమే కాకుండా, విద్యుత్ను అమ్మి సొమ్ము కూడా సంపాదించుకోవచ్చు.
తాజాగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పథకంపై కీలక ప్రకటన చేశారు. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 75 లక్షలు ఇళ్లకు సోలార్ ప్యానల్స్ అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 25 లక్షలు ఇళ్లల్లో వీటిని విజయవంతంగా ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
సబ్సిడీ లభించే వివరాలు..
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 75 వేల కోట్లను కేటాయించింది. ఏర్పాటు చేసుకుని ప్యానల్స్ సామర్ధ్యాన్ని బట్టి భారీగా రాయితీ (సబ్సిడీ) అందిస్తుంది.
సోలార్ ప్యానల్ సామర్థ్యం 1 కిలో వాట్ (Kw) ఇంటిపై అమర్చేందుకు కేంద్రం రూ.30,000 స్థిర సబ్సిడీని అందజేస్తుంది. అలాగే రెండు కిలో వాట్ సామర్థ్యంతో ఏర్పరిచే ప్యానల్స్ కు ఖర్చులో 60 శాతం రాయితీ ఇవ్వనుండగా.. అలాగే రెండు నుంచి మూడు కిలోమీటర్లు సామర్థ్యం ఉన్న సూర్యఫలకాలకు అదనపు సామర్థ్యం పై 40% రాయితీ ఇవ్వనున్నారు. చివరగా 3 కిలో వాట్ల సామర్థ్యం సోలార్ ప్యానల్స్ పై గరిష్టంగా 78 వేల రూపాయల వరకు సబ్సిడీని అందించనున్నారు.
ఈ పథకం ముఖ్య ప్రయోజనాలు..
1) ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు.
2) సోలార్ ద్వారా తయారైన కరెంట్ లో మీ ఇంటి అవసరాలకు పోను మిగిలిన విద్యుత్ స్థానిక డిస్కౌంట్ కంపెనీలకు విక్రయించి డబ్బు సంపాదించవచ్చు.
3) జీవితకాలం కరెంట్ బిల్లు భయం ఉండదు.
అర్హులు ఎవరు?
> దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
> సొంత ఇల్లు కలిగి ఉండి, రూఫ్ టాప్ (పై కప్పు)పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు స్థలం ఉండాలి.
> రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: మద్యం మత్తులో దారుణం..భర్తను కర్రతో చావకొట్టిన భార్య..పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది
Also REad: జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి అభ్యర్థి ఇతనే! డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madhya Pradesh Crime: మద్యం మత్తులో దారుణం..భర్తను కర్రతో చావకొట్టిన భార్య..పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది!
Chhatarpur, Madhya Pradesh:Madhya Pradesh Crime News: మద్యం మత్తులో ఓ భర్త చేసిన విపరీత చేష్ట.. ఒక ప్రాణాన్ని బలి తీసుకోగా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కన్న బిడ్డను కాపాడే క్రమంలో ఓ భార్య.. భర్తను కర్రతో కొట్టి చంపిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.
పోలీస్ కథనం ప్రకారం.. ఛతర్ పూర్ కు చెందిన నీలం కుశ్వాహ, తన భర్త దీన్ దయాళ్ కుష్వాహతో విభేదాల కారణంగా గత నాలుగేళ్లుగా పుట్టింటిలోనే ఉంటుంది. జూన్ 1న దీన్ దయాళ్ ఎప్పుడైతే సంఘం మద్యం సేవించి నీలం ఉంటున్న పుట్టింటికి వచ్చాడు. బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన అతను.. అంతటితో ఆగకుండా తన సొంత కొడుకును కాళ్లు పైకి పెట్టి తలకిందులుగా వేలాడదీశాడు.
మద్యం మత్తులో తన బిడ్డను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో నీలం తీవ్ర ఆందోళనకు గురైంది. కన్న బిడ్డను కాపాడుకునే క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైనా ఆమె, ఇంట్లో ఉన్న కర్రతో దాడి చేసింది. ఆమె బలంగా కొట్టిన మొదటి దెబ్బకే దీన్ దయాళ్ మంచంపై పడిపోయాడు. అయినా ఆగకుండా నీలం వరుసగా కొట్టడంతో తీవ్ర గాయాలు పాలైన దీన్ దయాళ్ అక్కడితో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
శవం పక్కనే ఎనిమిది గంటలు..
భర్త చనిపోయాడని నిజం తెలిశాక నీలం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఏం చేయాలో అర్థం కాక భర్త మృతదేహం వద్ద 8 గంటల పాటు నిశ్చయస్తూ రాలే కూర్చుండిపోయింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానిక ఆలయానికి వెళ్లి తాను చేసిన తప్పును క్షమాపణ కోరుతూ దేవుడి ముందు ఒక 10 నిమిషాల పాటు కూర్చుని ప్రార్థించింది.
ఆ తర్వాత గుడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్కు వచ్చిన నీలం తానే తన భర్తను చంపేసినట్లు అంగీకరించింది. ఇదే విషయాన్ని సివిల్ లైన్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.
మహిళా ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మంచంపై పడి ఉన్న దీన్ దయాళ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భర్త నుంచి ఎదురైన వేధింపులు, బిడ్డపై జరిగిన దాడి కోణాలతో పాటు అన్ని కోణాల్లోనూ కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: వెండి కొనే వారికి బ్యాడ్న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!
Also Read: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP TET 2026: ఏపీ టెట్ నోటిఫికేషన్ అవుట్.. ఫీజు, దరఖాస్తు చేసుకునే విధానం ఇదే!స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!
Hyderabad, Telangana:AP TET 2026 Notification Apply Link: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులతోపాటు ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా దీనికి అర్హత సాధించాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2026 నోటిఫికేషన్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఉన్న వివరాలను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. టెట్ పాస్ అయిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలల్లో టీచర్లుగా చేరవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5, 2026 వరకు సమయం ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేస్తూ రూ.1000 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుల ప్రక్రియ జూన్ 5, 2026 నుండి ప్రారంభమై జూలై 5 వరకు కొనసాగుతుంది. జూలై 15 నుండి ఆన్లైన్లో మాక్ టెస్టులు ప్రారంభమవుతాయి. హాల్ టికెట్లు అదే నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి. ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుండి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తారు. పరీక్షల తర్వాత, ఆగస్టు 24న ప్రాథమిక సమాధాన పత్రాలను విడుదల చేస్తారు. అభ్యంతరాల కోసం ఆగస్టు 25 నుండి 31 వరకు అవకాశం ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 8న తుది సమాధాన పత్రాన్ని విడుదల చేస్తారు. ఏపీ టెట్ ఫలితాలను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. దీని తర్వాత అక్టోబర్ 2026లో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది, డీఎస్సీకి టెట్ తప్పనిసరి.
ఏపీ టెట్ 2026 దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న 'ఏపీ టెట్ 2026' అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి, మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేసిన తర్వాత, మీ విద్యా అర్హతలను నమోదు చేసి మీకు కావలసిన పేపర్ను ఎంచుకోవాలి. చివరగా ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయ్యాక కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడు ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డీఎస్సీపై క్లారిటీ, ఈసారి పరీక్షలు కీలకం!
Also Read: తెలంగాణ లాసెట్, పీజీఎల్సెట్ రిజల్ట్స్ వచ్చేశాయి, స్కోర్కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
ఏపీ టెట్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించబడుతుంది. ప్రతి పేపర్కు 150 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పేపర్-1 అనేది 1 నుండి 5వ తరగతి వరకు బోధించే టీచర్ల కోసం, పేపర్-2 అనేది 6 నుండి 8వ తరగతి వరకు బోధించే అభ్యర్థుల కోసం రూపొందించారు. ఒక్కో పేపర్కు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: కరీంనగర్ మైనింగ్ శాఖలో సీఐడీ మెరుపు దాడులు.. పదేళ్ల రికార్డుల స్కాన్..
Hyderabad, Telangana:Mining Department Cbcid Raids: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న గ్రానైట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మైనింగ్ శాఖ కార్యాలయంలో సీబీసీఐడీ (CBCID) అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ప్రత్యేకమైన బృందాలు.. అక్కడి కీలక రికార్డులతో పాటు ఫైలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గత కొంతకాలంగా గ్రానైట్ పారిల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి అన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ ప్రారంభం కావడం మైనింగ్ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.
2014 నుంచి రికార్డులు స్క్రీనింగ్..
ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు ప్రధానంగా గత పదేళ్ల కాలానికి సంబంధించిన రికార్డులపై దృష్టి సాధించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాల్లో జరిగిన గ్రానైట్ లీజులతో పాటు వాటి బదిలీల వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అధికారులు కొన్ని విషయాలపై సమగ్రంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన క్వారీ లీజుల బదిలీలతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల రాయల్టీని కొందరి వ్యాపారులు అధికారులు కుమ్మక్కై ఎలా గండి కొట్టారని కోణాన్ని పరిశీలిస్తున్నారట..
అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు..
అంతేకాకుండా లీజు పరిధి దాటి.. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా జరిపిన గ్రానైట్ తవ్వకాలతో పాటు వే పర్మిట్లు లేకుండా తక్కువ పరిమాణాన్ని చూపిస్తూ భారీ ఎత్తున జరిగిన గ్రానైట్ రవాణా వ్యవహారాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. గతంలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్ విభాగం ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని సిఐడి ఈ విచారణను వేగవంతం చేసింది. వాస్తవానికి క్వారీల నుంచి తరలిన గ్రానైట్ పరిమాణానికి.. ప్రభుత్వానికి చెల్లించిన సీనరేజ్ సొమ్ముకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రేపుల ద్వారా విదేశాలకు ఎగుమతి అయిన కంటైనర్ల వివరాలతో పాటు ఇక్కడ రికార్డులను సరి సరిపోల్చే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రభుత్వ ఆదాయానికి గండి..
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. మైనింగ్ రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన అధికారులపై, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐడి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.. ఈ తనిఖీల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రముఖ గ్రానైట్ వ్యాపారులు, మైనింగ్ శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. రానన్న రోజుల్లో ఈ కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Karimnagar: కరీంనగర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల భారీ దందా.. విద్యుత్ శాఖ విచారణలో షాకింగ్ నిజాలు!
Hyderabad, Telangana:Karimnagar Fake Certificates: ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యా కేంద్రంగా ఉండడమే కాకుండా.. తెరచాటున అక్రమ సర్టిఫికెట్ల దందాలకు అడ్డాగా మారిందని సంచలన ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. అంటే 2010 సంవత్సరం నుంచి 2014 మధ్యకాలంలో కరీంనగర్ కేంద్రంగా కొన్ని ప్రైవేటు స్టడీ సెంటర్లు నకిలీ విద్యార్హత పత్రాల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగించినట్లు సమాచారం.. ఎలాంటి చదువు రాని వారికైనా ప్రత్యేకంగా నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి విక్రయించారని ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి..
ఆన్లైన్ లేకపోవడం కారణంగానే..
ఆ కాలంలో విద్యాసంస్థల్లో ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే సాగేది. ప్రస్తుతమున్న డిజిటల్ లేదా ఆన్లైన్ ధృవీకరణ వ్యవస్థ అప్పట్లో అందుబాటులో లేకపోవడాన్ని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పేరు ఊరు లేని యూనివర్సిటీల పేర్లతో.. అలాగే కొన్ని గుర్తింపు లేని బోర్డుల పేరుతో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లను భారీ మొత్తంలో విక్రయించినట్లు సమాచారం..
విద్యుత్ శాఖ విచారణలో కీలకమైన అంశాలు..
ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల సర్టిఫికెట్లు నకిలీవని అంతర్గత విచారణలో తేలడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీసింది. ఈ ఉద్యోగులు సమర్పించిన పత్రాలు కరీంనగర్ కేంద్రంగా నడిచిన స్టడీ సెంటర్ల ద్వారానే విక్రయించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో ఈ నెట్వర్క్ ఎంత మేరకు విస్తరించి ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది.
ప్రభుత్వ ఎంక్వయిరీ డిమాండ్..
కరీంనగర్ నుంచి సాగిన ఈ అక్రమ నెట్వర్క్ ద్వారా వందలో అది మంది ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఉద్యోగులు పొందినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం విద్యుత్ శాఖలోనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఈ కాలంలో చేరిన వారి విద్యార్హత పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. అర్హత లేని వారి కీలక పదవుల్లో ఉండటం వల్ల వ్యవస్థకు ముప్పని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారం పై సమగ్ర విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యా స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఎవరు? ఆనాడు ఏఏ యూనివర్సిటీల పేరిట దందా జరిగింది? అన్న కోణంలో పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. నిజం తేలితే అనేకమంది నకిలీ మేధావుల ఉద్యోగాలు ఊడటమే కాకుండా క్రిమినల్ కేసులో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ స్టడీ సెంటర్ల నుంచి చాలామంది నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు కూడా తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి అభ్యర్థి ఇతనే! డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం!
Chinnakakani, Andhra Pradesh:Janasena Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కడం ఖాయం కావడంతో, అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో భాగంగా టిడీపీకి మూడు స్థానాలు, జనసేనకు ఒక సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
అంతేకాదు 2024 ఎన్నికల సమయంలో జనసేన కొన్ని లోక్సభ స్థానాలు త్యాగం చేసినందుకుగానూ.. 2029 లోపు జనసేనకు మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఇచ్చేలా కూటమిలో ముందస్తు హామీ లభించింది. అందులో భాగంగా ఇప్పుడు దక్కే ఒక సీటుతో జనసేన పార్టీ తొలిసారి రాజ్యసభలు అడుగుపెట్టబోతుంది.
పవన్ ఎంపిక ఎవరు?
తొలిసారి దక్కుతున్న ఈ రాజ్యసభ స్థానం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లు సుముఖంగా వినిపిస్తున్నాయి.
అందులో ఒకరు లింగమనేని రమేష్ పేరు వినిపిస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరొందిన ఈయన ఈ సీటు దాదాపు ఖరారు అయిందని ప్రచారం చాలా రోజులుగా సాగుతుంది. ఆర్థిక, సామాజిక సమీకరణాలపరంగా ఈయన పేరు ముందంజలో ఉంది.
మరోవైపు రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబుని ఢిల్లీకి పంపే యోజనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన సాధ్యపడలేదు. ఆయన రాజ్యసభకు పంపేందుకు అప్పట్లో పెండింగ్లో పెట్టారని టాక్ కూడా ఉంది.
లింగమనేని రమేష్ లేదా నాగబాబు.. వీరిద్దరిలోనే ఒకరు జనసేన తరఫున మొదటి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే అనూహ్య నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్పై గద్దర్ కూతురు ఘాటు వ్యాఖ్యలు..సీఎం చంద్రబాబు మద్దతు!
Also Read: గుడ్న్యూస్! కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kohli Livingstone: "కోహ్లీ అందుకే ఇండియాలో ఉండడానికి ఇష్టపడడు!" ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Livingstone On Virat Kohli: క్రికెట్ మైదానంలో అడుగు పెడితే చాలు అగ్రెసివ్గా మారిపోయే విరాట్ కోహ్లీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. లండన్ వీధుల్లో సాధారణ వ్యక్తిగా తిరుగుతూ, కెమెరా కంటికి చిక్కకుండా ఉండటానికి ఆయన మొగ్గు చూపుతారు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం, లండన్ పట్ల ఆయనకున్న ఇష్టం, ఐపీఎల్ లో ఆయన ఆటతీరు మారటానికి గల కారణాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్న అనుభవాన్ని లివింగ్ స్టోన్ గుర్తుచేసుకున్నారు. "విరాట్ అందరితో చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను చూసిన అత్యంత పోటీతత్వం గల ఆటగాడు కోహ్లీనే. ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచడంలో ఆయన స్టైలే వేరు. ఇండియాలో కోహ్లీకి ఉన్న క్రేజీ అంతా కాదు. ఎయిర్పోర్ట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఎక్కడికి వెళ్ళినా నిరంతరం మీడియా, అభిమానుల నిఘా ఆయనపై ఉంటుంది. ఈ విపరీతమైన అటెన్షన్ కోహ్లీకి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది" అని లివింగ్ స్టోన్ అన్నాడు.
క్రికెట్ కు దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా, కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ ఇష్టపడతాడని లివింగ్ స్టోన్ వెల్లడించాడు. అందుకే నిరంతరం మీడియా ఫోకస్ నుంచి విరామం కోసమే ఆయన భారత్ నుంచి వచ్చి ఇంగ్లాండ్ లో కొంత సమయాన్ని గడుపుతున్నట్లు లివింగ్ స్టోన్ పేర్కొన్నాడు.
కోహ్లీ ఆట తీరు మారడానికి కారణం ఇదే?
ఇటీవల కాలంలో కోహ్లీ బ్యాటింగ్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా టీ20లో దూకుడుగా ఆడుతున్నాడు. దీనిపై కూడా లివింగ్ స్టోన్స్ స్పందించాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్లో వచ్చిన మార్పులే దీని కారణమని చెప్పాడు.
"ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ల ఆధ్వర్యంలో కోహ్లీ తన ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లాడు. పవర్ ప్లే లో మరింత టాకింగ్ ఆడటం స్పిన్నర్లపై భారీ షాట్లు కొట్టడం వెనక వీరి ప్రణాళికలు ఉన్నాయి" అని లివింగ్ స్టోన్ తెలిపాడు. మైదానంలో అగ్నిపర్వతంలా రగిలిపోయే కింగ్ కోహ్లీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబమే లోకంగా బతికే ప్రశాంతమైన వ్యక్తి అని లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్!
ALso REad: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గత విభేదాలు..కావ్య పాపపై ఇంగ్లాండ్ ఆటగాడు ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maoist Devji: కత్తి కన్నా కలం గొప్పదని నిరూపించిన దేవ్జీ.. 60 ఏళ్ల వయసులో లాసెట్లో ఊహించని ర్యాంకు..
Hyderabad, Telangana:Former Maoist Devji: ఆయుధం పట్టిన చేతులు అక్షరం వైపు మళ్లాయి.. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని.. విప్లవ పంథాలో ముందుకు సాగిన ఓ మాజీ మావోయిస్టు అగ్రనేత ఇప్పుడు న్యాయ శాస్త్రం వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ.. తాజాగా విడుదలైన తెలంగాణ లాసెట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు..
43 ఏళ్ల తర్వాత ఇంటర్ పూర్తి చేశారు..
తిరుపతి ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం.. ఆయన సుమారు 43 ఏళ్ల క్రితమే కోరుట్లలోని ఇంటర్మీడియట్ చదువుకున్నారు.. అయితే అప్పట్లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై అడవి బాట పట్టడంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది.. ఆ సమయంలో ఆయన ఇంటర్మీడియట్లో తెలుగు పేపర్ బ్యాక్లాగ్గా ఉండిపోయింది. ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆయన.. చదువుపై ఉన్న మక్కువతో ఆ పాత బాకీని తీర్చుకున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల్లో ఆ ఒక్క పేపర్ను రాసి.. నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటర్ను అధికారికంగా పూర్తి చేశారు..
కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేయడమే కాకుండా.. న్యాయ శాస్త్రం చదవాలని బలమైన సంకల్పంతో ఆయన లాసెట్ పరీక్షకు హాజరయ్యారు.. నిన్న విడుదలైన ఫలితాల్లో తిరుపతి 57 మార్కులు సాధించి.. రాష్ట్రస్థాయిలో 349 ర్యాంకు కైవసం చేసుకున్నారు. 60 ఏళ్లకు పైబడిన వయస్సులో కూడా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టి ఈ స్థాయి ర్యాంకు సాధించడం పట్ల విద్యార్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
పేదల కోసమే న్యాయం..
తన విజయానికి గల కారణాలను వివరిస్తూ తిరుపతి బాగోద్వేగానికి లోనయ్యారు.. అడవిలో ఉన్నప్పుడు ప్రజల సమస్య కోసం పోరాడారని.. ఇప్పుడు సమాజంలో ఉంటూ చట్టం ద్వారా పేదలకు అండగా ఉండాలనుకుంటున్నారన్నారు.. అందుకే లా చదవాలని నిర్ణయించుకున్నారని.. తనకున్న అనుభవంతో పాటు న్యాయ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించి నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం చేయడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. తుపాకీ గొట్టం ద్వారానే మార్పు వస్తుందని నమ్మిన ఒకప్పటి అగ్రనేత.. నేడు రాజ్యాంగం కల్పించిన చట్టం ద్వారా మార్పు కోసం ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.. కత్తికన్నా కలం గొప్పది.. అనే మాటను తిరుపతి నిజం చేసి చూపించారని పలువురు మేధావులు ప్రశంసిస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rahu Transit 2026: కుంభరాశిలో రాహు సంచారం.. డిసెంబర్ 5 వరకు ఈ 3 రాశుల వారికి కాసుల వర్షం, తిరుగులేని అదృష్టం!
Hyderabad, Telangana:Rahu Transit In Aquarius Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు గ్రహాన్ని అత్యంత ప్రమాదకరమైన ఛాయాగ్రహంగా పిలుస్తారు. దీనిని శని ఛాయగా కూడా చెప్పుకుంటారు. అయినప్పటికీ నవగ్రహాల్లో ఇది అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ప్రభావం మానవ జీవితాలపై అకస్మాత్తుగా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాన్ని కలియుగానికి రాజుగా పిలుస్తారు. రాహువు పరిమితం లేకుండా పనిచేసే గ్రహంగా కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఈ గ్రహం అప్పుడప్పుడు శుభ ఫలితాలను ఇస్తే.. అప్పుడప్పుడు ఫలితాలను అందిస్తుంది. కొన్నిసార్లు రాహువువు అకస్మాత్తుగా చురుకుగా మారి చాలా తక్కువ సమయాల్లోనే.. పేదవారిని సైతం ధనవంతులు చేస్తాడు..
ప్రతి నెలలో ఏదో ఒక గ్రహం సంచారం చేస్తూనే ఉంటుంది. అలాంటిది రాహువు గ్రహం కూడా అప్పుడప్పుడు తప్పకుండా సంచారం చేస్తుంది. ఈ గ్రహం ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలోనే కదులుతూ ఉంటుంది. ఈ రాహువు సంచారం కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతా. అంతేకాకుండా జీవితంలో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, ఈ ఛాయాగ్రహం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా విదేశీ ప్రయాణాలతో పాటు.. పని ప్రదేశాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు గ్రహం కుంభరాశిలోనే అంచార దశలో ఉండబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి రాహువువు దేవుడి అనుగ్రహం లభించబోతోంది. దీంతో ఆయా రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ రాశులవారికి రాహువు అనుగ్రహం..
మేష రాశి
రాహువు కుంభరాశిలోకి వెళ్లడం కారణంగా మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. కాబట్టి రాహువువు కుంభరాశిలోకి వెళ్లడం కారణంగా వీరి జీవితంలో సానుకూలమైన శక్తులు రావడం ప్రారంభమౌతాయి. వ్యాపార సమస్యలు కూడా క్రమంగా పరిష్కారం అవుతాయి. వృత్తితోపాటు వ్యక్తిగత జీవితాల మధ్య సరైన సమతుల్యత కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
తులారాశి
తులారాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. వీరి పనిపై దృష్టి పెట్టి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే అదృష్టం తోడుగా ఉండి అనుకున్న పనుల్లో భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఏమైనా కోర్టు కేసులు ఉన్న వ్యక్తులు తప్పకుండా విజయాలు సాధించుతారు. జీవిత భాగస్వామితో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అంతేకాకుండా భాగస్వామి మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహువువు శక్తివంతమైన ప్రభావంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. డిసెంబర్ ఐదవ తేదీ వరకు వీరికి జీవితంలో శాంతితో పాటు సంతోషం నెలకొంటుంది. ఉద్యోగపరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. వీరికి సమాజంలో గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా పెద్దల నుంచి అద్భుతమైన సపోర్టు కూడా లభిస్తుంది. వీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై కూడా ఆసక్తి కనబరిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fortune After 30: అదృష్టం అంటే వీరిదే.. 30 ఏళ్లు దాటాక కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే!
Hyderabad, Telangana:Fortune After 30 Zodiac Signs Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశి దాని సొంత లక్షణాలను తప్పకుండా కలిగి ఉంటుంది. కొందరు పుట్టుకతోనే రాజ్యసంతో ఉంటారు.. మరి కొంతమంది అదృష్టం వారి జీవితంలో ఒక్క నిర్దిష్ట సమయంలో మారడం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారికి అదృష్టం నిజంగా వారి 30 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. ఆ రాశుల వారికి 30 ఏళ్లు దాటగానే వారు జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా రాజ్య సంతోషంతో పాటు సౌకర్యాలు, బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు. వారు ఏది చేయాలనుకుంటే అది చేసి దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతారు. అయితే, 30 ఏళ్ల తర్వాత కొన్ని రాశుల వారికి అదృష్టం ఎలా రావడం ప్రారంభం అవుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్ పాట్..
సింహరాశి
సింహరాశికి అధిపతి సూర్యుడుగా వ్యవహరిస్తాడు. ఈ రాశిలో జన్మించినవారు కష్టపడితే ఏ వయసులోనైనా అద్భుతమైన విజయాలను సాధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత సింహ రాశి వారికి విజయ పథం మారుతుందని వారు చెబుతున్నారు. 30 ఏళ్లు వచ్చేవరకు వారు తమ అన్ని ప్రయత్నాల్లో పూర్తిగా విజయాలు సాధించలేరు.. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత అదృష్ట చక్రం తిరిగి వారి బ్యాంకు బ్యాలెన్స్ ఊహించని స్థాయిలో పెంచుతుంది. అంతేకాకుండా అనేక రూపాల్లో సంతోషం రావడం ప్రారంభం అవుతుంది..
మకర రాశి
కర్మ దేవుడిగా పిలిచే శని మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారు స్వభావారీత్యా చాలా కష్టపడతారు. తమ లక్ష్యాలను అస్సలు వదులుకోరు.. అయితే శని ప్రభావం వల్ల వారి జీవితంలో విజయాలు కొంచెం నెమ్మదిగా వస్తూ ఉంటాయి.. మకర రాశి వారికి ఆర్థికంగా లాభపడే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అది 30 ఏళ్ల ఎస్ తర్వాత మాత్రమే నెరవేరుతుంది. ఈ వయస్సు తర్వాత కూడా వారి పూర్వీకుల నుంచి లేదా వారసత్వం ద్వారా వచ్చే ఆస్తులను కూడా పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వారి కష్టానికి తగిన ప్రతిఫలం 30 ఏళ్ల తర్వాతే దొరుకుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి చిన్న వయసులోనే వృత్తిపరమైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ సమయంలో అనేక రూపాల్లో డబ్బులు వచ్చినప్పటికీ కొన్ని ప్రతికూలమైన సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న చిన్న అడవుల్లోనూ కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ 30 ఏళ్ల తర్వాత మాత్రం జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి.. ఆయన ఆశీస్సులు 30 ఏళ్ల తర్వాత మెండుగా ఉంటాయి. దీని కారణంగా వీరు సంక్షోభాల మంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా అంచలంచలుగా పెరుగుతూ వస్తాయి..
కన్య రాశి
కన్యా రాశి వారు కూడా వారికి 30 ఏళ్లు వచ్చిన తర్వాత ధన లాభాలు పొందడం ప్రారంభమవుతుంది. వీరు తప్పకుండా జీవితంలో 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అదృష్టం వారికి పూర్తిగా అనుకూలించి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బులు వేగంగా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. వీరి జీవనం కూడా ఒక్కసారిగా మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధించగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: ప్రమోషన్లపై ప్రభుత్వ లెక్చరర్ల ఆగ్రహం.. యూజీసీ నిబంధనలు అమలుచేయాలి
Baddipadaga, Telangana:Govt Lecturers Promotions: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) పదోన్నతులలో యూజీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమోషన్ పొందేందుకు కనీస అర్హత జూనియర్ లెక్చరర్ సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం (టీజీసీటీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2004 సంవత్సరంలో ఇచ్చిన జీఓ నంబర్-10ని 22 సంవత్సరాల తర్వాత జీఓ నంబర్ 21 ద్వారా పునరుద్ధరించడంతో యూజీసీ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆ సంఘం నాయకులు ఆరోపించారు.
'జూనియర్ లెక్చరర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్గా పదోన్నతి పొందిన వారి జూనియర్ లెక్చరర్ సర్వీసును (N-5/2) అనే సూత్రం ప్రకారం లెక్కించారు. ఇందులో ఎన్ అనేది మొత్తం జూనియర్ లెక్పరర్ సర్వీసును సూచిస్తుంది. దీని నుంచి 5 సంవత్సరాల సర్వీసును తీసివేసిన తర్వాత, మిగిలిన 50 శాతం సర్వీసును కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) పదోన్నతి కోసం లెక్కించారు' అని తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు తెలిపారు.
'2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 10ని ఇప్పుడు మళ్లీ అమలు చేయమనడం అన్యాయం, యూజీసీ నిబంధనలను ఉల్లంఘించడం, రాజ్యాంగ విరుద్దం' అని టీజీసీటీఏ స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో ఉపాధ్యాయుల నియామకం కోసం యూజీసీ మార్గదర్శకాలలో నిర్దేశించిన అర్హతా ప్రమాణాల ప్రకారం ఒక పోస్టుకు నియామకం జరిగితే.. సీఏఎస్ పదోన్నతి కోసం గత సర్వీసును లెక్కించవచ్చుని యూజీసీ మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయని గుర్తుచేసింది. ఈ అర్హతా ప్రమాణాల ప్రకారం సంబంధిత సబ్జెక్ట్లో పీజీ డిగ్రీతోపాటు నెట్/సెట్, పీహెచ్డీ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం నాయకులు వివరించారు. 'కానీ, జూనియర్ లెక్చరర్ నియామకం సంబంధిత సబ్జెక్టులో కేవలం పీజీ డిగ్రీ అర్హతతో జరుగుతుంది. జూనియర్ లెక్చరర్ సర్వీసును CAS పదోన్నతికి లెక్కించడం UGC మార్గదర్శకాల ప్రకారం ఒక స్పష్టమైన ఉల్లంఘన' అని వెల్లడించారు.
డిగ్రీ లెక్చరర్ పదోన్నతులకు ఫీడర్ కేడర్గా జూనియర్ లెక్చరర్ పోస్టు మార్పు, ఏ ప్రభుత్వ శాఖలోనూ ప్రమోషన్లకై ఫీడర్ క్యాడర్ సర్వీస్ వర్తించదని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం నాయకులు స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 423 ద్వారా ఇంటర్మీడియట్ విద్యలోని జూనియర్ లెక్చరర్ కేడర్ నుంచి కళాశాల విద్యలోని డిగ్రీ లెక్చరర్ కేడర్కు ఒక పదోన్నతి మార్గాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జూనియర్ లెక్పరర్ పోస్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుకు ప్రమోషన్ పొందుటకు ఫీడర్ కేటగిరీగా ఉంది' అని వివరించారు.
ప్రమోషన్కు కావాల్సిన అర్హతలు
==> డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీ అధ్యాపకుల సీఏఎస్ పదోన్నతులకు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంది.
==> ఓరియంటేషన్ కోర్స్, రిఫ్రెష్ కోర్స్లను పూర్తిచేయడం రీసెర్చ్ పబ్లికేషన్స్ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
==> అసిస్టెంట్ ప్రొఫెసర్గా పీహెచ్డీ కలిగి ఉండి నాలుగేళ్ల సంవత్సరాల సర్వీస్ ఉండాలి.
==> ఎంఫిల్తో అయితే 5 సంవత్సరాల సర్వీస్ / నెట్, సెట్తో అయితే 6 సంవత్సరాల కనీస సర్వీస్ పూర్తి చేయాలి.
==> అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ వంటి సీఏఎస్ పదోన్నతులు పొందడానికి కూడా యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
సహజ న్యాయాన్ని నిలబెట్టడానికి.. యూజీసీ నిబంధనలను సక్రమంగా.. కచ్చితంగా అమలయ్యేలా తక్షణమే స్పందించి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు. గతంలో ఎప్పుడో 2004లో ఇచ్చిన జీఓ నంబర్- 10ను డిగ్రీ లెక్చరర్గా పదోన్నతి పొందడానికి ఫీడర్ కేడర్ ఉన్న జూనియర్ లెక్చరర్ సర్వీసును సీఏఎస్ పదోన్నతులకు లెక్కించాలని కోరడం ప్రస్తుత సర్వీస్ నిబంధనలకు, యూజీసీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సర్వీసును మాత్రమే సీఏఎస్ పదోన్నతులకు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Peddi Day 1 Collection: 'పెద్ది' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్..తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Hyderabad, Telangana:Peddi Day 1 Collection News: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్తో మొదలైంది. సూపర్ హిట్ టాక్తో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే ప్రీమియర్స్తో కలుపుకొని తొలిరోజు కలెక్షన్స్ ఎంతమేర వస్తాయనే విషయంపై ట్రేడ్ వర్గాలు కొన్ని విశేషాలను బయటపెట్టాయి.KS Bharat Retirement: తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్!
Hyderabad, Telangana:KS Bharat Retirement News: తెలుగు క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీంతో టీమిండియా తరఫున టెస్ట్ ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించిన ఒక తెలుగు ఆటగాడి అంతర్జాతీయ ప్రస్థానానికి ముగింపు పడింది.
భావోద్వేగానికి గురైన కేఎస్ భరత్:
తన రిటైర్మెంట్ నోట్లో భరతదేశం తరఫున ఆడటాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తూ ఇలా రాసుకొచ్చారు. "గర్వంతో, కృతజ్ఞతా భావంతో నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాను. నా దేశం కోసం ఆడటం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, టెస్టుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్షణానికీ తగిన గౌరవాన్ని ఇచ్చింది. నా కలను సాకారం చేయడానికి అండగా నిలిచిన నా కుటుంబానికి, బీసీసీఐ, కోచ్లకు, సహచర ఆటగాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని కేఎస్ భరత్ రాసుకొచ్చాడు.
కోహ్లీ, రోహిత్, ద్రవిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు..
తన కెరీర్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ముగ్గురు దిగ్గజాలకు భరత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడే అవకాశం ఇచ్చి, తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా చేసినందుకు ఆర్సీబీ అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అమూల్యమైన అవకాశం దక్కిందని భరత్ గుర్తుచేసుకున్నారు.
అదే విధంగా రాహుల్ ద్రవిడ్ కోచ్గా పనిచేసిన ఇండియా 'ఎ' జట్టు నుండి జాతీయ జట్టు వరకు ఆయన అందించిన గైడెన్స్, సపోర్ట్ వల్లే తాను టెస్టు క్రికెటర్గా ఎదగలిగానని కేఎస్ భరత్ కొనియాడారు.
కేఎస్ భరత్ క్రికెట్ ప్రస్థానం
ఫిబ్రవరి 2023లో నాగ్పూర్లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన భరత్.. ఫిబ్రవరి 2024లో విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. అంతర్జాతీయ కెరీర్ స్వల్పంగానే సాగినప్పటికీ, దేశవాళీ క్రికెట్లో ఆయన ఒక దిగ్గజంగా నిలిచారు.
Also REad: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గత విభేదాలు..కావ్య పాపపై ఇంగ్లాండ్ ఆటగాడు ఫైర్!
ALso REad: టీమ్ఇండియాకు భారీ షాక్..ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లీ దూరం..రోహిత్ డౌటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
