icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Women Welfare Schemes: మహిళలకు బంపర్ గిఫ్ట్.. అటు ఫ్రీ బస్సు జర్నీ.. ఇటు జూన్ 1నుంచి ప్రతినెలా రూ. 3000 అకౌంట్లో జమ..!!

BBhoomi4m ago
Secunderabad, Telangana:

Annapurna Yojana West Bengal: భారతదేశంలోని రెండు రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన వెంటనే మహిళలకు భారీ వరాలు కురిపించాయి.  మహిళలు, సాధారణ ప్రజల కోసం అనేక ప్రధాన సహాయ కార్యక్రమాలను ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఇటీవలి మంత్రివర్గ నిర్ణయాలలో మహిళలు, వృద్ధులు, పేదలను లక్ష్యంగా చేసుకున్న అనేక కొత్త కార్యక్రమాలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2026 జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీము కింద..మహిళలకు ప్రతి నెలా రూ. 3,000 సహాయం అందుతుంది. ఇప్పటికే  లక్ష్మీ భండార్ స్కీము ప్రయోజనాలను పొందుతున్న మహిళలు ఆటోమేటిక్‌గా ఈ పథకం ప్రయోజనాలను పొందుతారు.  లక్ష్మీ భండార్ స్కీమ్ పేరును మార్చుతూ అన్నపూర్ణ యోజన అని పేరు పెట్టారు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ పథకంలోనూ పేర్లు లేని మహిళల కోసం ఒక కొత్త పోర్టల్ తెరవనున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం:
ఇక రాష్ట్రంలోని అన్ని  ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సువేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సౌకర్యం కూడా జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇక కొన్ని పాత పథకాలలో పలు కీలక మార్పులు చేసింది. మతపరమైన కారణాలతో నడుస్తున్న కొన్ని పాత సహాయ పథకాలను క్రమంగా నిలిపివేస్తామని కేబినెట్ నిర్ణయించింది. అయితే.. ఈ నెల వరకు నడుస్తున్న పథకాలు కొనసాగుతాయని వెల్లడించింది.  ఆ తర్వాత వాటిని రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.

Also Read: ప్రభుత్వ రంగ బ్యాంకు సంచలనం.. FDలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం.. కొత్త రేట్లు ఇవే

ఇక కేరళలోని కొత్తగా ఏర్పడిన  యూడీఎఫ్ ప్రభుత్వం కూడా  మహిళలు, సమాజంలోని బలహీన వర్గాల కోసం అనేక పెద్ద నిర్ణయాలు తీసుకుంది. కేరళలో కూడా కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం 2026 జూన్ 15 నుంచి అమల్లోకి వస్తుంది.  ఆశా , అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం ఆరోగ్య, సామాజిక కార్యకర్తలకు కూడా ఉపశమనం కల్పించింది. ఆశా కార్యకర్తలకు ప్రతి నెలా రూ.3,000 అదనపు గౌరవ వేతనం అందించనుంది. ఇక అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా నెలకు అదనంగా రూ. 1,000 లభిస్తాయి.వీరితోపాటు పాఠశాలలో పనిచేస్తున్న వంటవాళ్లు, ఇతర సిబ్బంది జీతాలను కూడా పెంచారు.

వృద్ధుల కోసం కొత్త శాఖ:
దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వయోవృద్ధుల సంరక్షణ, వారి జీవితాలను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. రాష్ట్రంలో కొత్త శాసనసభను ప్రారంభించడం కూడా ప్రభుత్వం తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. ఇక కొన్ని కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఒక నివేదికను కూడా విడుదల చేస్తుంది. ఈ  రెండు రాష్ట్రాల్లోని కొత్త ప్రభుత్వాలు మహిళలకు, సాధారణ ప్రజలకు సహాయాన్ని, సౌకర్యాలను పెంచడంపై ప్రాధాన్యతనిచ్చినట్లు చూడవచ్చు.

Also Read: మిడిల్ క్లాస్ నచ్చిన Top 5 Electric Scooters ఇవే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Heatwave Alert: ఆ 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్..ప్రాణాంతకంగా మారిన వడగాలులు!

Hyderabad, Telangana:Heatwave Alert AP And Telangana: ఓ పక్క నైరుతి రుతుపవనాలు దేశానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్న తెలుగు ప్రజలకు ఇప్పుడు నెత్తిమీద తాటికాయ పడినట్లు అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ రానున్న వారం రోజుల పాటు మాడు పగిలేలా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు భానుడు భగభగలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉండబోతునున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
0
0
Report
Advertisement

Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది! క్రికెట్, కుస్తీలో రఫ్ఫాడించిన మెగాపవర్ స్టార్..పక్కా బ్లాక్‌బస్టర్!

Mumbai, Maharashtra:

Peddi Movie Telugu Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశాయి. తాజాగా మే 18న ముంబైలోని జియో స్టూడియోలో 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమాలో హీరో పెద్దిగా నటించిన రామ్‌చరణ్ బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో పాటు తాను క్రికెట్, కుస్తీలో రాటుదేలిన ఆటగాడిగా కనిపిస్తాడు. కుస్తీలో నేషనల్ గేమ్స్‌లో పాల్గొన్నట్లు సన్నివేశాల్లో కనిపిస్తుంది. గ్రామీణ యువకులకు స్పోర్ట్స్‌లో ఇతనో రోల్‌ మోడల్‌గా కనువిందు చేయనున్నాడు. అయితే లోకల్ రాజకీయాల వల్ల పెద్దికి వచ్చిన కష్టం ఏంటి? అతను ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సొచ్చిందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్‌లోని డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

నిన్న అనగా మే 17న 'పెద్ది' ట్రైలర్ చూసిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. "పెద్ది ట్రైలర్ చూసాను! జస్ట్ వావ్..అంతే. 3 నిమిషాలు… ప్యూర్ ఫైర్‌ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్.. అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి" అని 'పెద్ది' టీమ్‌పై ప్రశంసల వర్షం కురింపించారు.

చిరూ లీక్స్‌కు పని చెప్పి చాలా రోజులు అవుతుందని చిరంజీవి చమత్కరించారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ 'పెద్ది' ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..." అనే డైలాగ్‌ లీక్ చేసి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని మరింత పెంచారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌లోని డైలాగ్ లీక్ చేయడం వల్ల 'పెద్ది' సినిమా డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి సారీ చెప్పారు. "Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ 'పెద్ది' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఇందులో కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మే 18న సినిమా ట్రైలర్ విడుదల చేయనుండగా.. జూన్ 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 

Also Read: 'పెద్ది' సినిమా ఫస్ట్ రివ్యూ..చివరి 50 నిమిషాలు ఘోరం..ప్రేక్షకులకు కన్నీళ్లే ఇక!

Also REad: 'పెద్ది'లో చెల్లి కోసం వెళ్లి అక్కను తీసుకొచ్చారట..జాన్వీ కపూర్‌పై డైరెక్టర్ కామెంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bakrid Holiday: బక్రీద్ పండగ ఎప్పుడు? మే 27 లేదా మే 28 ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

Bakrid Holiday In Telangana: తెలంగాణలో ఆదివారం సాయంత్రం 'జుల్-హిజ్జా 1447 AH' మాసానికి సంబంధించిన నెలవంక కనిపించకపోవడంతో, రాష్ట్రంలో బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగను మే 28న జరుపుకోనున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని 'సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-దక్కన్' సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

ఆ సంస్థ ప్రతినిధి సయ్యద్ హసన్ ఇబ్రహీం హుస్సేని ఖాద్రీ (సజ్జాద్ పాషా) జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం నడుస్తున్న 'జుల్-ఖాదా' మాసం 30 రోజులు పూర్తి చేసుకుంటుంది. దీనివల్ల మే 19 (మంగళవారం) జుల్-హిజ్జా మాసపు మొదటి రోజు అవుతుంది. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం జుల్-హిజ్జా పదవ రోజున బక్రీద్ జరుపుకుంటారు. కాబట్టి, పండుగ తేదీ మే 28 (గురువారం)గా ఖరారైంది.

మారనున్న ప్రభుత్వ సెలవు..
తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వార్షిక క్యాలెండర్‌లో బక్రీద్ సెలవును మే 27గా ముందుగానే ప్రకటించింది. అయితే, పండుగ తేదీ ఒక రోజు ముందుకు మారడంతో, ఈ ప్రభుత్వ సెలవును మే 28కి సవరిస్తూ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, జూన్ 4న వచ్చే 'ఈద్-ఎ-గదీర్' పండుగకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

బక్రీద్ పండుగ సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో తాత్కాలిక పశువుల మార్కెట్లు వెలుస్తున్నాయి. ఖుర్బానీ (బలి) ఆచారాల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి వ్యాపారులు పెద్ద సంఖ్యలో జీవాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్ లో వేలాది మంది కొనుగోలుదారులతో ఈ మార్కెట్లు కిటకిటలాడుతుంటాయి.

పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నివసించే కుటుంబాల సౌకర్యార్థం నగరంలో వృత్తిపరమైన ఖుర్బానీ సేవలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. జంతువుల సేకరణ, వధ ప్రక్రియ నుండి మాంసాన్ని ప్యాక్ చేసి ఇంటి వద్దకే డెలివరీ చేసే సరికొత్త సౌకర్యాన్ని నగరవాసులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వార్షిక హజ్ యాత్రకు ఆరంభాన్ని సూచించే ఈ జుల్-హిజ్జా మాసంలో ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లు, ఖుర్బానీలతో పాటు బంధుమిత్రుల కలయికలతో భక్తిశ్రద్ధల నడుమ పండుగ వేడుకలకు సిద్ధమవుతున్నారు.

Also Read: పెట్రోల్ కారును CNG ఫిట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది లాభమా..నష్టమా!

Also Read: ఉద్యోగులకు కీలక అప్‌డేట్..హైదరాబాద్‌లో 8వ పే కమిషన్..నెలకు రూ.69,000 డిమాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

CNG Car Conversion Cost: పెట్రోల్ కారను CNG ఫిట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది లాభమా..నష్టమా!

Hyderabad, Telangana:

CNG Car Conversion Kit Cost: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఇప్పుడు భారతదేశంలోనూ కనిపిస్తోంది. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు నిరంతరం పెరుగుతున్న క్రమంలో వాహనదారులు తక్కువ ధర గల ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లుతున్నారు. భారతదేశంలో పెట్రోల్ కార్లను CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)గా మార్చే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. తక్కువ ఇంధన ఖర్చు, మంచి మైలేజ్ కారణంగా.. చాలా మంది CNG కిట్‌లను తమ కార్లకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణ పెట్రోల్ కారుకు CNG కిట్‌ను అమర్చడానికి సుమారు రూ.35,000 నుండి రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. కిట్ నాణ్యత, కారు మోడల్, కంపెనీని బట్టి ధర మారుతుంది. ప్రభుత్వ ఆమోదం పొందిన కిట్‌లను మాత్రమే ఉపయోగించాలని రవాణా శాఖ సూచించింది.

CNG వాహనాల ప్రధాన ప్రయోజనం తక్కువ ఇంధన ఖర్చులు కావడం గమనార్హం. పెట్రోల్ CNG చాలా చౌకగా ఉండటం వల్ల కిలోమీటరుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అదనంగా CNG వాడకం పర్యావరణానికి అనుకూలమైనది. అంతే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా సహకరిస్తుంది.

అయితే CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ కిట్‌ను ప్రభుత్వ ఆమోదం పొందిన సర్వీస్ సెంటర్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. ఆ తర్వాత.. వాహనం RC బుక్‌లో CNG వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరిగా ఉంది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆటోమోటివ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ కారు లేదా ఇతర వాహనాలు ఎక్కువగా వినియోగించే వారికి CNG ఒక మంచి ఎంపిక కావచ్చు. అయితే, బూట్ స్పేస్ తగ్గడం, కొన్ని సార్లు పవర్ తక్కువగా ఉండటం చిన్న సమస్యలే అయినా మైలేజీ పరంగా కారు యజమానులు ఆర్థికంగా తక్కువ ఖర్చు అవుతుంది. అయితే పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో రాబోయే రోజుల్లో CNG కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)

ALso Read: ఉద్యోగులకు కీలక అప్‌డేట్..హైదరాబాద్‌లో 8వ పే కమిషన్..నెలకు రూ.69,000 డిమాండ్!

Also REad: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Deepak Singla Arrest: ఆప్ నేత దీపక్ సింగ్లా అరెస్ట్..బీజేపీ ప్రతికార చర్య అంటున్న ఆమ్ఆద్మీ పార్టీ నేత అతిషీ!

Bandoli, Goa:

Deepak Singla Arrest News: బ్యాంకు మోసం ఆరోపణల కేసుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, గోవా కో-ఇన్‌చార్జ్ దీపక్ సింగ్లా అరెస్టు అయ్యారు. నేడు ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముమ్మర సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత ఈడీ అధికారులు దీపక్ సింగ్లాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, గోవా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. అయితే ఈ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి తీవ్ర ఆరోపణలు చేశారు.

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే బీజేపీ ఈ దాడులకు తెగబడిందని ఆతిషి ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "గోవాలో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) బలం పెరుగుతుండటంతో, బీజేపీ (భారతీయ జనతా పార్టీ) తన నమ్మకమైన అనుచరుడైన ఈడీని రంగంలోకి దించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మా గోవా కో-ఇన్‌చార్జ్ దీపక్ సింగ్లా నివాసంతో పాటు పలువురు వాలంటీర్ల ఇళ్లలో సోదాలు చేశారు. ఇది కేవలం మా కార్యకర్తలను భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే కాదు.. రాబోయే ఎన్నికల వ్యూహాల కోసం ఆప్ సంస్థాగత డేటా మొత్తాన్ని సేకరించి బీజేపీకి ఇచ్చేందుకే ఈ దాడులు!" అని ఆమె దుయ్యబట్టారు.

బెంగాల్, పంజాబ్ తరహాలోనే కుట్ర!
మరో వీడియో సందేశంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి గత ఎన్నికల ఉదాహరణలను ప్రస్తావిస్తూ బీజేపీ తీరును తప్పుపట్టారు. గతంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను దెబ్బతీసేందుకు వారి ఎన్నికల వ్యూహకర్త 'ఐప్యాక్' (I-PAC) సంస్థపై ఈడీని ప్రయోగించి డేటాను దొంగిలించారని ఆరోపించారు. ఎన్నికలు ముగియగానే నిందితులను వదిలేశారని గుర్తుచేశారు.

అదేవిధంగా పంజాబ్‌లోనూ ఆప్ నేతలను టార్గెట్ చేశారని.. బీజేపీలో చేరడానికి నిరాకరించినందుకే పంజాబ్ మంత్రి, ఆప్ నేత సంజీవ్ అరోరాను మే 9న 'హాంప్టన్ స్కై రియల్టీ లిమిటెడ్' కేసు నెపంతో అరెస్ట్ చేశారని, కానీ అదే పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ అశోక్ మిట్టల్ వంటి వారిపై ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఇప్పుడు పంజాబ్ తర్వాత వారి తదుపరి లక్ష్యం గోవానేనని స్పష్టం చేశారు.

రాబోయే ఫిబ్రవరిలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని తెలిసిపోవడంతోనే బీజేపీ ఇదంతా చేస్తోందని ఆప్ నేత ఆతిషి అన్నారు. సింగ్లా నివాసం వద్ద 15 ఈడీ వాహనాలు, 50 మంది అధికారులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు.

Also Read: నిన్న బంగారం..నేడు వెండి..సిల్వర్ దిగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం!

Also Read: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

8th Pay Commission: ఉద్యోగులకు కీలక అప్‌డేట్..హైదరాబాద్‌లో 8వ పే కమిషన్..నెలకు రూ.69,000 డిమాండ్!

Hyderabad, Telangana:

8th Pay Commission Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ సెంట్రల్ పే కమిషన్ నేటి నుంచి హైదరాబాద్‌లో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. మే 18, 19 (సోమ, మంగళవారాలు) రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలలో వివిధ ఉద్యోగ సంఘాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అసోసియేషన్లతో కమిషన్ చర్చలు జరపనుంది.

ముందుగా దరఖాస్తు చేసుకుని, మెమో ఐడీ పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొని తమ ప్రతిపాదనలను కమిషన్ ముందు ఉంచేందుకు అవకాశం లభించింది. ఈ చర్చల ఆధారంగానే కమిషన్ తన తుది నివేదికను రూపొందించనుంది.

ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్లు ఇవే!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతినిధి సంస్థ అయిన 'నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ' (NC-JCM) డ్రాఫ్ట్ కమిటీతో పాటు తెలంగాణకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో ప్రధానంగా కింది డిమాండ్లను కమిషన్ ముందు ఉంచాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనాన్ని రూ.69,000 కు పెంచడం ప్రధాన డిమాండ్‌గా పెట్టుకున్నారు. 

వేతన సవరణ కోసం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83 గా నిర్ధారించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రతి ఏటా ఇచ్చే యాన్యువల్ ఇంక్రిమెంట్‌ను కనీసం 6 శాతానికి పెంపుతో పాటుగా కనీస హౌస్ రెంట్ అలవెన్స్‌ను 30 శాతానికి పెంచాలని వారు కోరుతున్నారు. అదే విధంగా ఉద్యోగుల చిరకాల డిమాండ్ పాత పెన్షన్ విధానం (OPS)ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేయనున్నారు. 

తదుపరి సమావేశాల షెడ్యూల్..
హైదరాబాద్ సమావేశాల అనంతరం 8వ పే కమిషన్ దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పర్యటించనుంది. హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో త్వరలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా సమావేశాల తాలూకా తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జూన్ 1 నుంచి 4 వరకు జమ్మూలోని శ్రీనగర్‌లో 8వ వేతన సంఘ సమావేశాలు జరగనున్నాయి. అలాగే జూన్ 8న లడాఖ్‌లో పే కమిషన్ భేటీ కానుంది.

అయితే శ్రీనగర్, లడాఖ్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాలు కమిషన్‌ను కలవడానికి మే 16 లోపే ఆన్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్లు పూర్తి చేసుకున్నాయి. సెక్టార్ల వారీగా ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా డిమాండ్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ALso Read: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

Also Read: రైతుల యూరియాను ప్లైవుడ్ కంపెనీలు దోచేస్తున్నాయి..జీ న్యూస్ ఆపరేషన్‌లో నమ్మలేని నిజం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hyderabad To Mumbai Bullet Train: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

Hyderabad, Telangana:

Hyderabad To Mumbai Bullet Train Project: హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బుల్లెట్ రైలు వేగంతో దూసుకెళ్లే హైదరాబాద్-పుణె-ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధమైనట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది.

3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబైకి..
ప్రస్తుతం హైదరాబాద్ నుండి ముంబయికి రైలు లేదా రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే కనీసం 12 నుండి 15 గంటల సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన 671 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ అందుబాటులోకి వస్తే, కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుండి ముంబయికి వెళ్లొచ్చు. ఇది ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఇరు రాష్ట్రాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాలకు భారీ ఊపునివ్వనుంది.

ఈ ప్రాజెక్టును అత్యాధునిక సాంకేతికతతో, ఎన్నో భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణ విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ కారిడార్‌లో మొత్తం 35.30 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని భూగర్భంలో నిర్మించనున్నారు. ప్రకృతి రమణీయతతో కూడిన పశ్చిమ కనుమలలోని ఖండాల ఘాట్ పరిధిలో దాదాపు 24 కిలోమీటర్ల మేర అధునాతన సొరంగ మార్గాలను తవ్వనున్నారు.

రాష్ట్రాల వారీగా విస్తరణ ఎలా ఉండబోతుంది?
ఈ హైస్పీడ్ రైలు మార్గం మొత్తం మూడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. దీని విస్తరణ విభజన ఇలా ఉందని ప్రాజెక్ట్ డీపీఆర్ వెల్లడిస్తోంది. మహారాష్ట్రలో 68 శాతం, కర్ణాటకలో 18 శాతం ఉండగా.. తెలంగాణలో కేవలం 14 శాతం ప్రాజెక్ట్ విస్తరణలో వాటా ఉండబోతుంది. 

ఈ రూట్‌లో ప్రయాణించే రైళ్లు గంటకు గరిష్ట వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌లను డిజైన్ చేస్తున్నారు. డీపీఆర్ సిద్ధం కావడంతో, తదుపరి అనుమతులు లభించిన వెంటనే భూసేకరణ, నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు దక్కన్ ప్రాంత రవాణా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.

Also REad: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షం..45 డిగ్రీలు దాటిన ఎండలు..బయటకి రావొద్దని హెచ్చరిక

Also Read: ఆర్టీసీలో మరోసారి ప్రైవేటీకరణ సెగ..ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఉద్యోగ సంఘాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

CSK Vs SRH Prediction: చెన్నై Vs హైదరాబాద్.. ఐపీఎల్‌లో నేడు చావో రేవో మ్యాచ్..ధోనీ ఆడతాడా?

Chennai, Tamil Nadu:

CSK Vs SRH Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ రేసులో నేటి మ్యాచ్‌లో క్లారిటీ రానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకం కానుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. ఆ తర్వాతి మూడు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయి. 

12 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న SRH (NRR 0.331), ఈ క్రమంలో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొంత వెసులుబాటు ఉంది. సీఎస్కేకు 12 పాయింట్లు ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 14 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ముందు ఉంది. 

పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడిపోయినా కూడా, ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే, ఈ పరిస్థితి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండూ తమ చివరి రెండు మ్యాచ్‌లలో కనీసం ఒకదానిలోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎస్ఆర్‌హెచ్‌కు మార్గం సుగమం అవుతుంది. 

ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపోటముల మధ్య సతమతమవుతుంది. ప్లేఆఫ్స్ రేసులో బలంగా నిలవాలంటే ఈ జట్టులోని బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో, కష్టమైన వికెట్‌పై వారిని 168 పరుగులకే ఐదు వికెట్ల నష్టానికి పరిమితం చేసి SRH పట్టులో ఉన్నట్లు కనిపించింది. కానీ అత్యుత్తమ పేస్ బౌలింగ్ ముందు కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.

అంతకు ముందు పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అధిక స్కోరు నమోదు చేసి 33 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ విజయం లభించింది.

ఇక CSK విషయానికొస్తే, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు అంత సులువుగా లేవు. 16 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించే అవకాశం వారికి ఇంకా ఉన్నప్పటికీ, దాని కోసం వారు తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలవాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఎస్ఆర్‌హెచ్ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది. 

నెట్ రన్ రేట్ పరంగా చూస్తే ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వెనుకబడి ఉంది. వారి రన్‌రేట్ 0.027 గా నమోదయ్యింది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్న రాజస్థాన్ రాయల్స్ (0.082) కంటే వెనుకబడి ఉంది. మరోవైపు 0.355 అనే పటిష్టమైన NRR (నెట్ రన్ రేట్)తో 13 పాయింట్ల వద్ద ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా పోటీలో బలంగా నిలిచింది.

అయినప్పటికీ, CSK తమ అవకాశాలపై ఇంకా ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే, పలు కీలక ఆటగాళ్ల గాయాలతో సహా లెక్కలేనన్ని అడ్డంకులను ఎదుర్కొంటూ, వారి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రదర్శించిన పట్టుదల అమోఘంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడుతాడనే సంకేతాలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సమాచారం అందుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కార్తిక్ శర్మ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ఊర్విల్ పటేల్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అమన్ ఖాన్, శివం దూబె, డియాన్ ఫోరెస్టర్, జక్ ఫౌల్కిస్, అన్షుల్ కాంబోజ్, మెక్‌నీల్ నోరోన్హా, మూథ్యా షార్ట్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, శ్రేయాస్ గోపాల్, గుజాప్‌నీత్ సింగ్, మ్యాట్ హెన్సీ, అకీల్ హోసీన్, స్పెన్సర్ జాన్సర్, అకాష్ మద్వేల్, ముఖేష్ చౌదరి, నూర్ అహ్మద్, 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, ఆర్ఎస్ అంబరీష్, హర్ష్ దూబే, క్రైన్స్ ఫులేత్రా, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు కుమార్ పాట్‌స్టోన్, కమిందు కుమార్ పాట్‌స్టోన్ కుమార్, గెరాల్డ్ కోయెట్జీ, ప్రఫుల్ హింగే, దిల్షన్ మధుశంక, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ.

Also Read: రేపే ధోనీ చివరి మ్యాచ్..చెపాక్‌లో ఫ్యాన్స్ మధ్య వీడ్కోలు పలకనున్న దిగ్గజం?!

Also Read: ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి..బెంగళూరు గెలవాలని చెన్నై ఫ్యాన్స్ పూజలు..ఎందుకో తెలుసా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

DC vs RR Highlights: రసవత్తరంగా ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ పోరు.. రాజస్థాన్‌కు ఢిల్లీ అదిరిపోయే దెబ్బ

New Delhi, Delhi:

DC beat RR by 5 wickets: ఐపీఎల్‌ 2026 ముగింపు దశకు చేరుకున్న సమయంలో రసవత్తర పోరు సాగుతోంది. ప్లేఆఫ్స్‌ నుంచి దూరమైన జట్లు రేసులో ఉన్న జట్లను దెబ్బతీస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ దెబ్బ తీసింది. రాజస్థాన్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. అద్భుతంగా పోరాడిన ఢిల్లీ జట్టును మ్యాచ్‌ సొంతం చేసుకుని రాయల్స్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్‌ రావాల్సిందే: కేటీఆర్‌

ఢిల్లీలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ మరోసారి తక్కువ (12) స్కోర్‌కు ఔటవగా.. టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీ దూకుడుగా ఆడి 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ధ్రువ్‌ జురేల్‌ అద్భుత ప్రదర్శన కనబర్చి 40 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, రెండు సిక్సర్లు నమోదు చేయగా.. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ కూడా అద్భుతంగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లో 51 పరుగులు చేసి మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. ఫెరెరా గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. రవి సింగ్‌ (4), శుభమ్‌ దుబే (5), దసూన్‌ శనక (10) ఏమాత్రం మోస్తరు పరుగులు చేయలేకపోయారు. మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లతో విజృంభించగా.. లుంగీ ఎంగిడి, మాధవ్‌ తివారీ తలా రెండేసి వికెట్లు తీశారు.

Also Read: PBKS vs RCB Highlights: హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు బెంగళూరు.. పంజాబ్‌కు తీవ్ర నిరాశ

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్‌లలోనే 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అభిషేక్‌ పరేల్‌, కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడడంతో ఢిల్లీ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అభిషేక్‌ 31 బంతుల్లో 51 పరుగులు చేయగా.. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ నమోదు చేశాడు. రాహుల్‌ 42 బంతుల్లో 56 పరుగులు చేసి ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు బాదాడు. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా ఆడి 34 పరుగులు చేసి మ్యాచ్‌ను విజయానికి చేరువలో చేశాడు. సాహిల్‌ పరాఖ్‌ (9), త్రిస్టన్‌ స్టబ్స్‌ (4), డేవిడ్‌ మిల్లర్‌ (9) తక్కువ పరుగులు చేయగా.. అశుతోష్‌ శర్మ మరోసారి బ్యాట్‌తో మెరిసి 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్లు తడబడ్డారు. జోఫ్రా ఆర్చర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు తీయగా.. దసూన్‌ శనక ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తే ముందడుగు వేయాల్సిన రాజస్థాన్‌ రాయల్స్‌ వెనుకడుగు వేసింది. ఏ రకంగానూ ప్లేఆఫ్స్‌కు వెళ్లలేని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు కాపాడుకుంది. అయితే ఈ విజయంతో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు దెబ్బతిన్నాయి. 12 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆరు విజయాలు, ఆరు ఓటములు సాధించింది. ఢిల్లీ క్యాపిట్స్‌ 13 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు ఏడు ఓటములు సాధించింది.

0
0
Report
Advertisement

KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్‌ రావాల్సిందే: కేటీఆర్‌

Hyderabad, Telangana:

BRS Party: 'హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కాలి అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రెండున్నర సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. కనీస పౌర సదుపాయాలు కూడా నిర్వహించలేని దుస్థితిలోకి నగరం ఉందని, ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి వృధా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: PBKS vs RCB Highlights: హ్యాట్రిక్ విజయంతో ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌కు బెంగళూరు.. పంజాబ్‌కు తీవ్ర నిరాశ

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ 'మన బూత్ - మన బాధ్యత' కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)పై గులాబీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పలు అంశాలపైన వివరంగా మాట్లాడారు. 'ఉన్న నగరాన్ని వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి వృధా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న నగరాన్ని నిర్వహణ చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారు' అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

కాంగ్రెస్ ప్రభుత్వం వారాంతాల్లో.. సెలవు రోజుల్లో బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి పంపిస్తూ రెండున్నర సంవత్సరాల పాటు వేలాది మంది ఇండ్లను కూల్చివేసిందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేస్తే.. రేవంత్‌ రెడ్డి వచ్చాక హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదని గుర్తుచేశారు. 'ఒకప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు ఈరోజు కేసీఆర్‌ ప్రభుత్వ చొరవతో.. కృషితో వచ్చినవే అని వాటి వెనుక ఎంత శ్రమ, ఎంత నిబద్ధత ఉంది. ఇది ప్రజలు గుర్తించాలి' అని కేటీఆర్ కోరారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో ఎల్బీనగర్ రూ.వేల కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను మార్చారని గుర్తుచేశారు.

Also Read: Telangana Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్‌సీపై కీలక ముందడుగు

'గత ప్రభుత్వంలో కేసీఆర్ పేదలకు అండగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాలను.. గతంలో ఉన్న ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి అనేక అంశాల గురించి ప్రస్తుతం ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. వాటిని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది' అని గులాబీ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని.. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని ప్రకటించారు.

'గత ప్రభుత్వం 'తెలంగాణ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (టిమ్స్) పేరుతో ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు చేపడితే ప్రస్తుతం గడ్డిఅన్నారంలో జరుగుతున్న నిర్మాణం పూర్తిగా స్తంభించిపోయింది. త్వరలోనే టిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఒక భారీ ధర్నాను చేపడతాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటించారు. కచ్చితంగా హైదరాబాద్ నగరంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాడితే అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘనమైన విజయాలు సాధిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top