తహసీల్దార్ సుజాత ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమస్యలను పరిష్కరించాలన్నారు
Rudrangi, Telangana:తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజాహిత కార్యక్రమాల్లో తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ డివిజన్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనహితకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Panchayat Raj Promotions: ఆ శాఖలో ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బంపర్ ఆఫర్.. భారీగా పదోన్నతులుకి గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:AP Panchayat Raj Promotions List: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది.
డీడీఓలుగా 42 మంది ఎంపీడీఓలు
డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) తాజాగా 42 మంది మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (MPDO) సీనియారిటీ జాబితాను ఆమోదించింది. వీరందరికీ త్వరలోనే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్లు(DDO)గా ప్రమోషన్ లభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ శాఖలో పదోన్నతులు భారీగా జరగడం ఆ శాఖ ఉద్యోగులకు ఆనందంలో ముంచెత్తుతుంది.
అయితే గత పదేళ్ల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అంతకుముందు కూడా ఇదే శాఖలో దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.
పంచాయితీ రాజ్ ఉద్యోగుల హర్షం..
ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదోన్నతులు తమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని, గ్రామీణాభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికి దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం సీరియస్ రివ్యూ..
మరోవైపు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజ్, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పలు ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు..
పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యత.. గ్రామ పంచాయతీలన్నీ అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య నిర్వహణను పక్కాగా చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించారు.
దోమల నివారణ: దోమల నియంత్రణ కోసం గ్రామాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
సురక్షిత తాగునీరు: తాగునీటి నాణ్యత పరీక్షలను నిరంతరం నిర్వహించడంతో పాటు, పైప్లైన్ లీకేజీలను తక్షణమే అరికట్టాలి.
ఫ్రైడే - డ్రైడే: ప్రతివారం "ఫ్రైడే - డ్రైడే" కార్యక్రమాన్ని విధిగా, సక్రమంగా అమలు చేయాలి.
వ్యర్థాల నిర్వహణ: ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామీణ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పవన్ కళ్యాణ్ అధికారులను హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను (RRT) సిద్ధంగా ఉంచాలని, అలాగే ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
Also REad: ఏపీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. విద్యుత్ శాఖలో 629 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Also REad: బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న అబ్బాయ్.. మంగళగిరిలో డిప్యూటీ సీఎంను కలిసిన రామ్చరణ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Python Video: కొండచిలువకు ముద్దు పెట్టబోయాడు.. కట్ చేస్తే ముక్కు, నోరు కొరికేసింది.. వైరల్!
Hyderabad, Telangana:Python Video Watch Here: సోషల్ మీడియా క్రేజ్, రీల్స్ పిచ్చి యువత ప్రాణాల మీదకు తెస్తోంది.. కేవలం లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే ప్రమాదకరమైన విన్యాసాలు ఊహించని విషాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఒక యువకుడు అత్యంత ప్రమాదకరమైన కొండచిలువతో సాహసం చేయబోయి.. చావు అంచుల దాకా వెళ్ళిన భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియా వినియోగదారులను వనికించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను సైతం షేక్ చేస్తుంది. ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని రీతిలో వైరల్ అవ్వడం విశేషం.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముద్దు పెట్టబోతే.. ఏం జరిగిందో చూడండి..
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువ తలభాగాన్ని చేతిలో పట్టుకొని ఉండటం మీరు గమనించవచ్చు. సాధారణంగానే కొండచిలువలు అత్యంత బలమైనవి, ప్రమాదకరమైనవిగా భావిస్తారు.. అయితే ఆ యువకుడు ఏమాత్రం భయం లేకుండా ఆ పాముతో ఆటలాడడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఆ కొండచిలువను నెమ్మదిగా తన ముఖం వైపుకు.. తిప్పుకుంటూ.. దాని మూతికి దగ్గరగా.. తన ముఖాన్ని తీసుకెళ్లాడు.. బహుశా ఆ యువకుడు దానికి ముద్దు పెట్టుకోవడానికో.. లేదా కెమెరాకు క్రేజీగా ఫోజ్ ఇవ్వడానిko అతడు ప్రయత్నించి ఉండవచ్చు..
కానీ మరుక్షణమే అక్కడ ఊహించని ఘోరం జరిగిపోయింది.. అతనిపై దాడికి వస్తుందనుకుందో... ఏమో కానీ.. ఆ కొండచిలువ ఒక్కసారిగా మెరుపు వేగంతో యువకుడి పై దాడి చేసింది. దానికున్న పదునైన పళ్ళతో.. ఆ యువకుడి ముక్కుతో పాటు నోటి భాగాన్ని కలిపి గట్టిగా పట్టుకొని ఉండడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు.. పాము నోటికి చిక్కిన యువకుడు నరకయాతన అనుభవించడం కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. దాని పట్టు నుంచి తప్పించుకోవడానికి అతను పడిన ఆరాటం చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోయినంత పని అవుతుంది..
కొండచిలువలు ఒకసారి పట్టుకుంటే అంత సులభంగా వదలవని మనందరికీ తెలుసు.. ఆ పాము యువకుడి ముఖాన్ని గట్టిగా లాగుతుండడంతో.. అతడు విపరీతమైన నొప్పితో పాటు.. ప్రాణ భయంతో విలవిలలాడిపోతున్నాడు.. ఆ పాము నుంచి తన ముఖాన్ని విడిపించుకోవడానికి సర్వశక్తులు వినియోగించి ఎంతగానో కష్టపడ్డాడు.. ఈ బీకర దృశ్యాన్ని పక్కనే ఉండి రికార్డు చేస్తున్న వ్యక్తి కూడా ఒక్కసారిగా షాక్కు గురైపోయినట్లు తెలుస్తోంది..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఆశ్చర్యం కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు.. ఇలాంటి పిచ్చి పనుల వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు.. వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పాములతో చెలగాటమాడితే ప్రకృతి ఇలాగే బుద్ధి చెబుతుందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి ప్రమాదకరమైన పాముల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి ప్రమాదం ఉంచుకొస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనంగా భావించవచ్చు..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Video: పాపం.. పసిపాప అని చూడకుండా కాలితో తన్నిన మహిళ.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Kicks Child Video Watch: మానవత్వం మంట కలిసి పోతుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన చేతులే.. పసిబిడ్డపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. మహారాష్ట్రలోని పన్వేల్ తాలూకా నంద్గావ్ గ్రామంలో ఓ చిన్నారిపై మహిళ అమానుషంగా దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కాకుండా దేశవ్యాప్తంగా తీవ్రత కలకలం రేపతోంది.. అంతేకాకుండా ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కాలితో తన్నుతూ..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ప్రకారం చూస్తే.. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న ఒక చిన్నారిని.. ఒక మహిళ ఎలాంటి జాలి దయ లేకుండా విరుచుకు పడింది. అధికారిక సమాచారం ప్రకారం.. బాధితురాలు స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న ఒక మైనర్ బాలిక. ఆ చిన్నారిపై ఓ మహిళ ఎలాంటి జాలి, దయ లేకుండా విరుచుకుపడింది. పసిపాప అని చూడకుండా.. ఆ అంగన్వాడి మహిళ.. పాపం నేలపై పడేసి కాలితో పదే పదే తన్నడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఆ మహిళ ఏమాత్రం దయ లేకుండా తన క్రూరత్వాన్ని ప్రదర్శించడం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది..
సోషల్ మీడియా వినియోగదారుల ఆగ్రహం..
ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో పై తీవ్రంగా స్పందిస్తూ వస్తున్నారు. ఈమె మనిషా.. లేదంటే రాక్షసా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. నిస్సహాయురాలైన చిన్నారిపై ఇంతటి దాడికి పాల్పడడం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ మహిళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో జాతీయస్థాయిలో కూడా దీనిపై చర్చ నడుస్తోంది..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
రంగంలోకి దిగిన పోలీసులు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోను ఆధారంగా తీసుకొని నిందితురాలిని గుర్తించే పనిలో పడ్డట్లు సమాచారం.. నంద్గావ్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం వద్ద అసలు ఏం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద, ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు కూడా స్పందించినట్లు సమాచారం.. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Amazonలో బంపర్ ఆఫర్.. రూ.4,599 పీట్రాన్ 20000mAh పవర్ బ్యాంక్ కేవలం రూ.1,299కే!
Hyderabad, Telangana:Ptron Dynamo Power 20000mah Amazon Discount: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేనిదే క్షణం గడవదు... నిరంతరం ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వినియోగం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డిఛార్జ్ అవుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే క్రమంలో లేదా కరెంట్ లేని సమయాల్లో ఛార్జింగ్ అయిపోతే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. ఇలాంటి సమస్యలకు శాశ్వత చెక్ పెట్టడానికి పవర్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికీ అత్యవసర Gadget మారింది. నేటి యువత చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి వపర్బ్యాంక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు.
అమెజాన్లో బంపర్ ఆఫర్..
pTron సంస్థకు సంబంధించిన Dynamo Power 20000mAh స్మార్ట్ పవర్ బ్యాంక్పై ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon)లో మునుపెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ఎన్నో ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ పవర్ బ్యాంక్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ.4,599 ధరతో లభిస్తోంది. అయితే, ప్రస్తుతం అమెజాన్లో జరుగుతున్న స్పెషల్ సేల్లో భాగంగా దీనిపై భారీ ఫ్లాట్ తగ్గింపును అందిస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్ను వినియోగించి ఈ భారీ 20000mAh కెపాసిటీ పవర్ బ్యాంక్ను కేవలం రూ.1,299 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.3,300 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
pTron Dynamo Power 20000mAh ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు..
ఇందులో 20000mAh బ్యాటరీ ఉండటం వల్ల, స్మార్ట్ఫోన్ను సులభంగా 4 నుంచి 5 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది బెస్ట్ పవర్ హౌజ్ మారుతుందని భావించవచ్చు. అలాగే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉండేలా కాంపాక్ట్ డిజైన్తో దీన్ని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మీ మొబైల్స్, ఇయర్బడ్స్, స్మార్ట్ వాచ్లను సింపుల్గా వేగంగా ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేసుకునే సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఇది టైప్-సి (Type-C), మైక్రో USB అవుట్పుట్ ఆప్షన్స్ యూజర్లకు మరింత అద్బుతంగా ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు..
ఈ పవర్ బ్యాంక్ ధర కేవలం రూ. 1,299కే ఉండడమే కాకుండా.. కస్టమర్ల కోసం అమెజాన్ అదనంగా పలు బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కొనుగోలు చేసే సమయంలో కొన్ని క్రెడిట్స్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే తక్షణ క్యాష్బ్యాక్ లేదా అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.. ఒకవేళ మీరు ఆ ఆఫర్లను కూడా వినియోగించుకుంటే.. ఈ ప్రీమియం స్మార్ట్ పవర్ బ్యాంక్ను రూ.1,299 కంటే ఇంకా తగ్గింపు ధరకే మీ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart ధమాకా ఆఫర్.. రూ.29 వేలకే గూగుల్ పిక్సెల్ 10a.. మిస్ అవ్వకండి!
Hyderabad, Telangana:Google Pixel 10a Offer On Flipkart: గూగుల్ పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పెద్దగా చెప్పక్కర్లేదు.. ముఖ్యంగా అద్భుతమైన కెమెరా క్వాలిటీ, క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్గా భావించవచ్చు. అయితే, గూగుల్ నుంచి వచ్చిన మోస్ట్ అవేటెడ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ Google Pixel 10aపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.. అదిరిపోయే ఫీచర్లతో లభించే ఈ ప్రీమియం ఫోన్ను ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది.
భారీగా తగ్గిన ధర.. ఫ్లాట్ డిస్కౌంట్ వివరాలు..
గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ఫోన్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ. 49,999తో అందుబాటులో ఉంది. అయితే లోకేషన్ బట్టి ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో నడుస్తున్న స్పెషల్ ఆఫర్స్లో భాగంగా ఈ ఫోన్పై రూ. 1,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఇన్స్టంట్ డిస్కౌంట్ తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ ధర రూ. 48,999కే లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా భారీ బ్యాంక్ ఆఫర్స్ కూడా లభించడం విశేషం..
క్రెడిట్ కార్డ్లపై అదనపు బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని.. ఫ్లిప్కార్ట్ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది.. మీరు ఈ ఫోన్ను కొనుగోలు చేసేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి పేమెంట్ చేస్తే.. అదనంగా రూ.2,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ధర మరింత తగ్గి.. బడ్జెట్ లభించబోతోంది.
ఊహించని రేంజ్లో ఎక్చేంజ్ బోనస్..
ఈ డీల్లోనే అత్యంత ఆకర్షణీయమైన విషయం.. ఎక్చేంజ్ ఆఫర్. మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్చేంజ్ చేస్తే.. గరిష్టంగా రూ. 21,550 వరకు భారీ బోనస్ పొందవచ్చు. ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు బ్యాంక్ ఆఫర్స్, పూర్తి ఎక్చేంజ్ వాల్యూ వర్తిస్తే.. రూ.49,999 విలువైన గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ఫోన్ను కేవలం రూ.28,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్ఫోన్ మోడల్తో పాటు బ్రాండ్, అది ఎంతవరకు వర్కింగ్ కండీషన్లో ఉందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాత ఫోన్ కండీషన్ ఎంత బాగుంటే, అంత ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
గూగుల్ పిక్సెల్ 10a ఎందుకు కొనుగోలు చేయాలి?
ఈ స్మార్ట్ఫోన్ కేవలం బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు.. ఎన్నో అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు, అడ్వాన్స్డ్ కెమెరా సెటప్, పవర్ఫుల్ ప్రాసెసర్తో పాటు లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ప్రీమియం లుక్ అండ్ ఫీల్తో ఉండే ఈ ఫోన్ను రూ.30 వేల బడ్జెట్ రేంజ్లో దక్కించుకోవడం నిజంగా క్రేజీ డీల్ అనే చెప్పవచ్చు. స్టాక్ ముగిసేలోపే ఫ్లిప్కార్ట్ను సందర్శించి ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ACB Raids: సబ్-రిజిస్ట్రార్ సుచరిత ACBకి ఎలా చిక్కింది? MRO ఇంట్లో దొరికిన వజ్రాల కథేంటి?
Hyderabad, Telangana:Sub-Registrar Sucharitha Disproportionate Assets Case: అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది.. 30 లక్షల భారీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి.. ఇప్పటికే సస్పెన్షన్ను గురైన సబ్ రిజిస్ట్రార్ తుమ్మ కొమ్మ సుచరిత లీలలు ఒక్కటి ఒక్కటిగా బయట పడుతూ ఉన్నాయి. తాజాగా ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ(ACB) అధికారులు, ఆమె నివాసాలతో పాటు కార్యాలయాలపై ఏకకాలంలో సోదరులు నిర్వహించారు. ఈ సోదరులు తేలిన ఆస్తుల విలువ చూసి స్వయంగా అధికారులే ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది..
రూ. 5.05 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు..
కేవలం ప్రభుత్వ జీతం పై ఆధారపడి ఒక అధికారిని ఇంత స్వల్ప కాలంలో కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టిందని కోణంలో ఏసీబీ ఆరా తీస్తూ వస్తుంది.. ప్రాథమిక సోదాల ప్రకారం.. ప్రస్తుతం సుచరిత పేరిట.. సుమారు రూ.5.05 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ విలువల ప్రకారమే ఈ ఆస్తులు ఉంటే.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ పదులకోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు..
వజ్రాల వెలుగులు.. లగ్జరీ కార్ల జోరు..
సోదాల్లో దొరికిన ఆస్తుల వివరాలు చూస్తే సుచరిత లగ్జరీ లైఫ్ కు ఎంతగానో అలవాటు పడిందని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె ఇంట్లో లభ్యమైన బంగారంతో పాటు వజ్రాభరణాల విలువ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. రూ.1.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు అరుదైన వజ్రాలను ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రూ.12 లక్షల వరకు లిక్విడ్ క్యాష్ తో పాటు వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.38 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు.. మరో రెండు ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో 2.17 ఎగురాల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు వోక్స్వ్యాగన్ (Volkswagen) లగ్జరీ కార్ తో పాటు మరొక కారు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సస్పెన్షన్ నుంచి జైలు ఊచల వైపు..
గతంలో రూ.30 లక్షల లంచం కేసులో దొరికిపోయినప్పుడే ఈమె అవినీతి సామ్రాజ్యంపై అధికారులకు అనుమానాలు వచ్చాయి. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే ఆదాయానికి మించిన ఆస్తుల కోణాన్ని పరిశీలించగా.. ఊహించని స్థాయిలో నల్లధనం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.. సబ్ రిజిస్టర్ హోదాను అడ్డం పెట్టుకొని.. పెద్ద ఎత్తున భూములతో పాటు రిజిస్టర్లలో అక్రమాలకు పాల్పడి.. ఈ సొమ్ము వెనకేసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ ఆస్తులు అన్నింటిని సీజ్ చేసిన ఏసీబీ.. కేసును మరింత లోతుగా విచారిస్తోంది. లంచగొండి అధికారులకు ఈ కేసు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Dvidvadasa Yoga Effect: మోస్ట్ పవర్ఫుల్ ద్విద్వాదశ యోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని లక్ష్మీ కటాక్షం..
Hyderabad, Telangana:Dvidvadasa Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారంతో పాటు వాటి స్థాన మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని మన అందరికీ తెలుసు. గ్రహాలు నిర్దిష్ట కాల పరిమితుల్లో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం లేదా ఒకదానికొకటి ప్రత్యేక కోణాల్లో వెళ్తూ అనేక శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 22, బుధవారం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాలకు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బుధుడతో పాటు కుజుడు ఒకదానికొకటి.. సరిగ్గా 30 డిగ్రీల దూరంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే అత్యంత శక్తివంతమైన ద్విద్వాదశ యోగం ఏర్పడనుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు బుద్ధికి, వ్యాపారంతో పాటు వాక్చాతుర్యానికి ప్రతీక కాగా.. కుజుడు శారీరక శక్తికి, ధైర్యంతో పాటు పరాక్రమానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రెండు భిన్న స్వభావాలు కలిగిన గ్రహాల ప్రత్యేక దృష్టి కలయిక వల్ల ఏర్పడే ద్విద్వాదశ యోగం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ యోగం అపారమైన సంపదను, కెరీర్లో ఊహించని విజయాలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆ అదృష్ట రాశులేవో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వృషభ రాశి:
ద్విద్వాదశ యోగం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కెరీర్ పరంగా పెద్ద మైలురాయిని అధిగమించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. మీ మాటతీరు ఇతరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ లభించి.. పదోన్నతులు పొందే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సానుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి.. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతతతో పాటు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
సింహ రాశి:
బుధ, మంగళ గ్రహాల అద్భుత కలయిక సింహ రాశి వారికి బంపర్ విజయాలను తెచ్చిపెట్టబోతోంది. కెరీర్తో పాటు ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించబోతోంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో పెట్టుబడులు దీర్ఘకాలికంగా భారీ లాభాలను అందిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ ద్విద్వాదశ యోగం అద్భుతమైన అవకాశాలను లభించబోతున్నాయి.. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఆర్థికపరమైన అప్పుల బాధలు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఊహించని పురోగతి సాధిస్తారు. నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Venus-Ketu Conjunction 2026: సింహరాశిలో ప్రమాదకర కూటమి.. ఆ 4 రాశుల వారు జరభద్రం..
Hyderabad, Telangana:Venus-Ketu Conjunction 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల మార్పులు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇవి మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే జూలై 4న ఒక కీలకమైన గ్రహాల కూటమి ఏర్పడబోతోంది. సంపద, వైభవం, ప్రేమకు కారకుడైన శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేస్తాడు.. అయితే, అక్కడ అప్పటికే మాయా గ్రహంగా చెప్పుకునే కేతువు తిష్ట వేసి సంచార దశ కొనసాగిస్తున్నాడు. వేద జ్యోతిష్యం ప్రకారం.. శుక్రుడు, కేతువుల మధ్య తీవ్ర శతృత్వం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శుక్రుడు భౌతిక సుఖాలకు ప్రతీక అయితే, కేతువు వైరాగ్యానికి, భ్రమలకు కారకుడి భావిస్తారు. వీరిద్దరి కలయిక వల్ల జూలై 4 నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు, ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది 4 రాశుల వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి (Taurus):
వృషభ రాశికి అధిపతి శుక్రుడే కావడం వల్ల ఈ గ్రహాల కలయిక వీరిపై నేరుగా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సింహరాశిలోని 4వ స్థానంలో ఈ కూటమి ఏర్పడటం వల్ల భౌతిక సుఖాలు, సౌకర్యాలు విపరీతంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, ఆస్తి వివాదాలు తలెత్తి.. ఇంటికి శాంతి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొత్త వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. ప్రయాణాల సమయంలో ప్రమాదాల భయం ఉంది.. కాబట్టి జాగ్రత్త అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అనుకోని ఖర్చులు బడ్జెట్ను దెబ్బతీస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio):
ఈ వృశ్చిక రాశివారికి 10వ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇద్దరికీ ఒడిదుడుకులు తప్పవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులో మీపై కుట్రలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. పైఅధికారులతో సత్సంబంధాలు దెబ్బతినే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. తొందరపాటుతో ఉద్యోగం మారాలనే నిర్ణయం అస్సలు తీసుకోవద్దు.
తులా రాశి (Libra):
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి కావడం విశేషం.. 11వ స్థానంలో ఏర్పడే ఈ రెండు గ్రహాల కలయిక.. మీ ఆదాయాన్ని, సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి సాహసాలు చేయకపోవడం చాలా మంచిది. ఎవరికైనా ఇచ్చిన అప్పులు తిరిగి రావడం కష్టమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో లేదా స్నేహితుల మధ్య మీరు మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది.. దీనివల్ల మంచి స్నేహాలు దెబ్బతింటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆఫీసులో మీ కష్టానికి రావాల్సిన క్రెడిట్ వేరొకరికి దక్కడం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహ రాశి (Leo):
ఈ శుక్ర-కేతువుల కలయిక సింహరాశిలోనే జరగబోతోంది. కాబట్టి దీని ప్రభావం వీరి స్వభావం, మానసిక స్థితిపై ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు తలెత్తవచ్చు. కేతువు ప్రభావం వల్ల భాగస్వామి నుంచి మానసిక దూరం పెరిగే అవకాశం ఉంది. కారణం లేని భయాలతో మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధించే ఛాన్స్లు కూడా ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఓపిక వహించకపోతే, చేతికి వచ్చిన పనులు కూడా చెడిపోతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
IND W Vs BAN W: టీ20 ప్రపంచకప్లో దూసుకోపోతున్న భారత్..5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది!
Hyderabad, Telangana:IND W Vs BAN W T20 World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన ఆసక్తికర పోరులో ఐదు వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ సేన గెలుపును నమోదు చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత మహిళా జట్టులో ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు వేగంతో చేసిన 53 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 16.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది భారత మహిళల జట్టు. అటు బౌలింగ్లో రాధా యాదవ్ 3 వికెట్లు, శ్రీ చరణీ చివర్లో చేసిన 2 వికెట్లతో బంగ్లాదేశ్ 136/8 పరుగులకే పరిమితమైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు తడబాటుతో ప్రారంభమైన ఊపందుకోవడానికి ఇబ్బంది పడింది. దిలారా అక్తర్ త్వరగా అవుటవ్వగా, జువైరియా ఫెర్దౌస్ (33), శోభనా మోస్టరీ (22) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, రాధా యాదవ్ నేతృత్వంలోని భారత స్పిన్నర్లు మిడిల్, చివరి ఓవర్లలో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.
నిగర్ సుల్తానా కీలక వికెట్తో సహా, రాధా 3/28 అనే అద్భుతమైన ప్రదర్శనతో బంగ్లాదేశ్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరి ఓవర్లో శ్రీ చరణీ కూడా రెండుసార్లు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 136 స్కోరుతో ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత్ పలు క్యాచ్లను జారవిడిచినా, వారి బౌలర్లు వాటి ప్రభావం స్కోరుపై పడకుండా చేయడంలో విజయం సాధించారు.
137 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన భారత్.. ఓపెనర్ స్మృతి మంధాన త్వరగా పెవీలియన్ బాట పట్టగా.. మరో బ్యాటర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. షఫాలీ వర్మ 34 బంతుల్లో 53 పరుగులతో ఆధిపత్య ఇన్నింగ్స్ ఆడింది. 8 ఫోర్లు, 1 సిక్సర్తో ఆమె దూకుడు బ్యాటింగ్, భారత్ను అవసరమైన రన్ రేట్ కంటే చాలా ముందు ఉంచింది. షఫాలీ స్టంపింగ్ తర్వాత.. యస్తికా భాటియా, రిచా ఘోష్ వెంటవెంటనే అవుటయ్యారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (26), హర్మన్ప్రీత్ కౌర్ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
19 బంతులు మిగిలి ఉండగానే, నహిదా అక్తర్ బౌలింగ్లో దీప్తి శర్మ విన్నింగ్ షాట్ కొట్టడంతో భారత్ను విజయం వరించింది. ఈ విజయంతో భారత్ నెట్ రన్ రేట్ పటిష్టంగా ఉండటంతో పాటు గ్రూప్ 'ఎ'లో వారి స్థానం కూడా బలపడింది.
భారత్, బంగ్లాదేశ్ ప్లేయింగ్ XIలు
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మ.
బంగ్లాదేశ్: దిలారా అక్టర్, జుయారియా ఫెర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, నహిదా అక్టర్, శంజిదా అక్టర్ మేఘ్లా, మరుఫా అక్టర్.
Also Read: వన్డే జట్టులో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆగమనం..కానీ, ఆ పని
Also REad: హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Crash: గోల్డ్, సిల్వర్ మార్కెట్ క్రాష్.. బంగారం ధర ఇంకా దిగొస్తుందా? గోల్డ్ కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
Hyderabad, Telangana:Gold Price Crash News: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో ఒక్కసారిగా పతనమయ్యాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే అత్యల్ప స్థాయికి ఇరు లోహాల ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా జనవరి 30 నుండి మార్కెట్లో ప్రారంభమైన ఈ కరెక్షన్ ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది.
ధరలు భారీగా తగ్గడానికి 3 ప్రధాన కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ఈ మూడు ముఖ్య పరిణామాలు బంగారం, వెండి ధరలను క్రిందికి లాగుతున్నాయి.
యూఎస్ ఫెడ్ కఠిన వైఖరి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గిస్తుందని మార్కెట్ ఆశించింది. అయితే, ద్రవ్యోల్బణ భయాల కారణంగా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్లు వంటి రాబడి ఇచ్చే ఆస్తులకే ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో వడ్డీ లేని బంగారంపై డిమాండ్ తగ్గుతుంది.
బలమైన డాలర్ ఇండెక్స్: గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ పుంజుకోవడంతో, ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయంగా కొనుగోళ్లు తగ్గాయి.
రిస్క్-ఆన్ సెంటిమెంట్: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం నుండి తమ పెట్టుబడులను లాభాలనిచ్చే షేర్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు.
వెండి మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి!
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లోనే అత్యధిక క్షీణత నమోదవుతోంది. వెండి కేవలం విలువైన లోహమే కాకుండా పరిశ్రమలలో కూడా ఎక్కువగా వాడుతుండటమే దీనికి కారణం. జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి (ఔన్స్కు 121 డాలర్లు)తో పోలిస్తే ప్రస్తుతం వెండి ధర సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్కు 56-57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది నవంబర్ 2025 తర్వాత అత్యల్ప రికార్డు కావడం గమనార్హం.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మార్కెట్ మరికొంత కాలం ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు లేదా కొనుగోలుదారులు భావోద్వేగాలకు లోనుకాకుండా, పైన పేర్కొన్న సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను గమనిస్తూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
(గమనిక: ఈ కథనం కేవలం మార్కెట్ సమాచారం, నిపుణుల విశ్లేషణ ఆధారంగా అందించబడింది. దీనిని పెట్టుబడి సలహాగా (Investment Advice) పరిగణించరాదు. మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం శ్రేయస్కరం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఏనుగు పేడతో ఖరీదైన కాఫీ..ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కాఫీ ఇది..కప్పు రూ.4,720 మాత్రమే!
Also REad: Jonnagiri Gold Mines: ఏపీలో భారీ బంగారు గని.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: ద్రోణి ప్రభావం..తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
Hyderabad, Telangana:Telangana Rain Alert: నైరుతి రుతుపవనాలు మూగబోయిన వేళ.. వాతావరణ శాఖ మరో ఆసక్తికరమైన వార్త తెలిపింది. రాబోయే 72 గంటల పాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.Krishi Thapanda Apartment: హీరోయిన్ ఇంట్లో బిజినెస్ మ్యాన్ మృతదేహం..షాక్లో సినీ ఇండస్ట్రీ..రంగంలో దిగిన పోలీసులు!
Bengaluru, Karnataka:Krishi Thapanda Apartment News: బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరి నగర్)లో గల ప్రముఖ కన్నడ నటి కృషి థపండా విలాసవంతమైన 'ఎలిగెంట్స్ అపార్ట్మెంట్' ఫ్లాట్లో 33 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషయం కన్నడ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఏం జరిగిందంటే?
మృతుడిని వైశాక్ (33)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాక్ బుధవారం రాత్రి నటి అపార్ట్మెంట్కు వచ్చాడు. అయితే, గురువారం ఆయన ఫ్లాట్లో శవమై కనిపించాడు. ఆ సమయంలో ఫ్లాట్లో ఎవరూ లేకపోవడంతో, అతను సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటి కృషి థపండా ఇంట్లో లేరని అధికారులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న ఆర్ఆర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడి వివాదాస్పద నేపథ్యం
పోలీసుల ప్రాథమిక విచారణలో వైశాక్కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాక్కు తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్యతో గొడవల కారణంగానే అతను నటి కృషి థపండా నివాసంలో ఆశ్రయం పొందుతున్నాడని లేదా తరచుగా అక్కడికి వచ్చి వెళ్తుండేవాడని సమాచారం.
వైశాక్కు గతంలో నేర చరిత్ర కూడా ఉందని సమాచాం అందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అరవింద్ రెడ్డికి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో వైశాక్ గతంలో అరెస్టయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు కూడా నమోదైంది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు ఆర్ఆర్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై'అసాధారణ మరణం'గా కేసు నమోదు చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా నటి కృషి థపండాతో పాటు, మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. అయితే, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని, అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని పోలీస్ అధికారులు ప్రజలను కోరారు.
Also Read: సినిమాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టువిప్పిన హీరోయిన్!
Also Read: "నా బాడీ నా ఇష్టం అంటే.. నా కళ్లు నా ఇష్టం అంటారు".. సునీత సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.కోటి 25 లక్షల ప్రమాద బీమా.. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
Hyderabad, Telangana:Telangana Govt Employees: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ఉద్యోగ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమాను ప్రారంభించింది. ఉద్యోగ కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా సరికొత్త ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకంతో ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని.. బ్యాంకులతో మాట్లాడి ఈ భారీ బీమా రక్షణను కల్పిస్తున్నట్లు వివరించారు.
ఉచిత బీమా
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించిన అనంతరం భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. ఈ అద్భుతమైన బీమా పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటి 25 లక్షలు, విమాన ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని తెలిపారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందని.. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ కూడా ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.
ఒక పెద్ద దిక్కుగా
తమ కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రాత్రికి రాత్రే రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులు కేవలం జీతగాళ్లు కాదని.. వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుత కాలంలో ఇళ్లు, వాహనాలు, పిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఈఎంఐలు కడుతున్నారని.. సకాలంలో జీతాలు రాకపోతే వారి అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్గా మారి సిబిల్ స్కోర్ దెబ్బతినేదని వివరించారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఒకటో తేదీ నాడే జీతాలు ఇచ్చేలా కఠినమైన ప్రణాళికను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
శాశ్వత పరిష్కారం
ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డ్ల సమస్యకు తాము శాశ్వత పరిష్కారం చూపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందించేలా నిర్ణయం తీసుకోవడంతో ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. కోటి 15 లక్షల కుటుంబాల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ కార్డులపై సన్నబియ్యం, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా రూ.1,11,116 ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు చేర్చడంలో డెలివరీ మెకానిజంగా ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని.. వారి కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.
పీఆర్సీపై బిగ్ అప్డేట్.. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి తీపి కబురు
Baddipadaga, Telangana:Telangana Pay Revision Commission: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగ వర్గాలు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై తెలంగాణ సీఎం కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీని ఇస్తామని ప్రకటన చేశారు. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ వాయిదా పడుతుండగా.. ఈ క్రమంలో తాజాగా అప్డేట్ రావడంతో ఉద్యోగ వర్గాలు ఆశాభావంలో ఉన్నారు.
ఆరోగ్య బీమా
ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణ అంటే నమ్మకం.. ఉద్యోగులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత తీసుకోవడం అంటే భద్రత. ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి బీమా సొమ్ము అందించాం. వారి మాదిరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమాను అమలు చేస్తున్నాం' అని తెలంగాణ సీఎం తెలిపారు.
నేను గుంపు మేస్త్రీనే
'ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇస్తుంది. ఉద్యోగుల భద్రత యజమానిదే… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందిచేందుకు ఇవాళ బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'కొందరు నన్ను గుంపుమేస్త్రీ అని అవహేళన చేస్తుంటారు. ఎవరు ఎలా మాట్లాడినా.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు' అని చెప్పుకొచ్చారు.
నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం
'నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమే. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. మీకు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి.. చర్చించుకుని పరిష్కరించుకుందామని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు.
ఆదాయం పెంచండి
'రోజుకో గంట ఎక్కువ పనిచేయండి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచండి. పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తాం' అని ఉద్యోగులకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ప్రకటించారు. 30 నెలలుగా తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా తాను పదే పదే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ పని చేయండి
'నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే రోజుకు ఒక గంట ఎక్కువ పని చేయండి. మార్పు తీసుకొద్దాం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఎదగాలంటే మీ అందరి సహకారం అవసరం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తొమ్మిదేళ్ల ప్రేమ బంధాన్ని వివాహంగా మార్చుకున్న జబర్దస్త్ కమెడియన్ ఫైమా
Dichpally, Telangana:Faima Marriage: బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ ఫైమా వివాహం చేసుకుంది. పటాస్, జబర్దస్త్, బిగ్బాస్ షోలలో మెరిసిన ఫైమా ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేసింది. ఎలాంటి హడావుడి.. ఆడంబరం లేకుండా సాదాసీదాగా ఆమె ఓ ప్రముఖ ఆలయంలో మూడు మూళ్లు వేయించుకుంది. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
కొన్నేళ్లుగా ప్రవీణ్ నాయక్ అనే యువకుడితో ఫైమా ప్రేమాయణం కొనసాగిస్తోంది. అతడితో సహజీవనం కూడా చేస్తున్నట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఎన్ని రూమర్లు వచ్చినా వాటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఏకంగా వివాహం చేసుకుంది. మొదట రిజస్టర్ కార్యాలయంలో చాలా సింపుల్గా ఫైమా, ప్రవీణ్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తర్వాత హల్దీ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ప్రముఖ ఖిల్లా రామాలయంలో గురువారం సాదాసీదాగా ఫైమా వివాహ వేడుక జరిగింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్తో ఫైమా మూడు ముళ్లు వేయించుకుంది. తాళి కట్టించుకునే సమయంలో ఫైమా కన్నీటి పర్యంతమైంది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె చివరికి విజయవంతంగా ప్రేమించిన యువకుడు ప్రవీణ్తో వివాహం చేసుకోవడంతో ఫైమా గుర్తుచేసుకున్నట్టు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగిందని సమాచారం. జీవితంలో ప్రేమ, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు గతంలో ఫైమా వాపోయింది.
బుల్లితెరపై ఓ టీవీ చానల్లో కామెడీ షో పటాస్తో ఫైమా వెలుగులోకి వచ్చింది. తనదైన కామెడీతో.. టైమింగ్తో నవ్వులు పూయించిన ఫైమా అనంతరం ఆమె జీవితం తిరిగింది. అనంతరం జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి దాదాపు అందరి టీమ్లలో ఫైమా పనిచేశారు. సీనియర్లకు దీటుగా కామెడీ చేస్తూ ఫైమా తనదైన ప్రత్యేకతను సాధించుకుంది. బుల్లెట్ భాస్కర్ టీమ్లో ఫైమా ప్రధాన కమెడియన్గా కొనసాగారు.
