icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ఒకరికి  మోదం ఒకరికి ఖేదం.. జొన్నగిరి బంగారు గనులపై స్థానికుల తీవ్ర అభ్యంతరం

Jonnagiri, Andhra Pradesh:

కర్నూలు జిల్లాలో బంగారు గనులు..తమ గ్రామాలను బుగ్గిపాలు చేస్తున్నాయనీ అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జొన్నగిరిలోని గోల్డ్ మైన్స్ తవ్వకాలు ఒకరికి  మోదం..మరొకరికి ఖేదం అన్నట్లుగా వుంది. తమ పొలాల్లో బంగారు నిక్షేపాలున్నా..వాటి వల్ల తమకేమీ ఉపయోగం లేకపోగా..గనుల తవ్వకాల్లో కెమికల్స్ వాడకంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వాటి వాడకం వల్ల తమకు చర్మసంబదిత రోగాలు వస్తున్నాయని వాపోతున్నారు.

కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా, వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ 'జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌'ను చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్క జొన్నగిరిలోనే దాదాపు 50 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా. పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలయ్యాక, రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా 1000 కిలోల (ఒక టన్ను) శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధి లో 1477 ఎకరాల్లో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తవ్వకాలకు అనుమతులు పొందింది. ఆ సంస్థకు పలు రాష్ట్రాల్లో 35 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజాలు తవ్విన అనుభవం ఉంది. బంగారు గనులున్న జొన్నగిరి ప్రాంతంలోనే ఉత్పత్తికి అవసరమైన పరిశ్రమను 320 కోట్ల రూపాయలతో చేపట్టింది. 2006లోనే తవ్వకాలకు అనుమతులు పొందినప్పటికీ ఇక్కడ దొరికే బంగారం నాణ్యత, తవ్వకాలు లాభదాయకమా? కాదా? నిర్ధారించుకుని కర్మాగారం నిర్మించడానికి ఆ సంస్థకు ఏకంగా 19 ఏళ్లు పట్టింది.

ఒక మినీప్లాంట్‌లో ఖనిజం శుద్ధి చేసి, బంగారం నాణ్యత నిర్ధరించుకుంది. సంతృప్తికర ఫలితాలు రావడంతో పూర్తిస్థాయి ప్లాంట్ నిర్మించింది. జియో మైసూర్ సర్వీసెస్ సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో కోటి టన్నుల బంగారం ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. తూర్పు బ్లాక్‌లో భూమి అడుగున దాదాపు 180 మీటర్ల లోతులో 6.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించింది. 2043 వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి తీసుకోవడంతో పాటు ఆ తరువాత మరో 50 సంవత్సరాల పాటు వాటిని కొనసాగించడానికి కూడా ముందస్తు అనుమతులు పొందింది.

బంగారం, వెండి తదితర ఖనిజాల వెలికితీతలో అపార అనుభవమున్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా ప్రారంభానికి నోచుకోని ఈ కర్మాగారాన్ని పట్టా లెక్కించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కర్మాగారం ప్రారంభించారు. ఇక్కడ మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1500 కిలోలు బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఇంత పెద్ద బంగారు పరిశ్రమ ఏర్పాటు వల్ల తమకు ఉపాధి లభిస్తుందని ఇక్కడి వారు ఆశపడ్డారు. కానీ పరపతి,సిఫారసు లేనిదే పరిశ్రమలో ఉపాధి కూడా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రతనాలు రాశులుగా పోసి అమ్మేవారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికే జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తే బీడు భూముల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. వీటికోసం ప్రజలు రోజూ ఉదయమే పొలాల వెంట అన్వేషణ చేస్తుంటారు. అలాంటి జొన్నగిరి ప్రాంతంలో బంగారు ఖనిజాలు కూడా లభ్యమవడం విశేషం. జొన్నగిరి ఇక స్వర్ణగిరిగా మారుతున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉన్నా..బంగారం కోసం చేస్తున్న మైనింగ్ వల్ల తమ గ్రామాలు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. తాగు నీటి సమస్య కూడా తీవ్రమైందని, డబ్బులు పెట్టీ నీళ్లు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 1500 ఎకరాలు రైతుల వద్ద భూములను కొని, మరి కొందరి వద్ద లీజుకు తీసుకుని తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇక్కడి ప్రజల పరిస్థితి మరోలా కనిపిస్తోంది.  జొన్నగిరి బంగారు గని కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగ పడుతుంది తప్ప, సామాన్య ప్రజలకు ఏవిధమైన లాభం లేదని అంటున్నారు.

0
0
Report

తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో హీరో నాని, ఇతర ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

కోరిన కోరికలు తీర్చే కొంగు బొంగారంగా.. ఇల వైకుంఠంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం మొన్నటి దాకా భారీ ఎత్తున భక్తులు ఉండగా.. ఇప్పుడు కొంత రద్దీ తగ్గింది. కానీ సాధారణం కన్నా అధికంగానే భక్తుల రద్దీ కొనసాగుతుండగా.. పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. గురువారం స్వామిని దర్శించుకునేందుకు సినీ నటుడు నాని, కర్ణాటక మంత్రి, ఇతర ప్రముఖులు వచ్చారు.

తెలుగు సినీ నటుడు నాని తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఆలయంలోకి వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం నాని కుటుంబసభ్యులు మాట్లాడుతూ స్వామి వారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. ఇక నానిని చూసేందుకు అతడి అభిమానులు ఎగబడ్డారు. కొందరు ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఇక కర్ణాటక రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి.. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు.

భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతో పోలిస్తే అధికంగానే ఉంది. వైకుంఠంలోని వేచి ఉన్న 31 కంపార్ట్మెంట్లు వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. టోకెన్‌ పొందిన టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) దర్శనానికి 12 గంటలు సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 24వ తేదీన 70,139 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 34,940 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

0
0
Report

కేవలం రూ.5,000 లోపే 32 ఇంచుల బ్రాండెడ్ స్మార్ట్ టీవీ.. ఎలా కొనాలో చూడండి!

Hyderabad, Telangana:

VW 32 inch Smart TV 2025 Edition Flipkart Offer: డిజిటల్ కాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. అయితే, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు ఉన్న టీవీని కొనుగోలు చేయడం అనేది కాస్త కష్టమైన పనే.. అలాంటి వారికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక అదిరిపోయే సువర్ణావకాశాన్ని అందిస్తోంది.. విసియో వరల్డ్ (VW) బ్రాండ్‌కు సంబంధించిన VW NA 80 cm (32 inch) HD Ready LED TV 2025 Edition (VW32A) స్మార్ట్‌టీవీపై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.12,999 టీవీ ఇప్పుడు రూ.7,699 లకే..
సాధారణంగా ఈ వీడబ్ల్యూ (VW) 32 అంగుళాల 2025 ఎడిషన్ స్మార్ట్ టీవీ అసలు ధర (MRP) రూ. 12,999తో అందుబాటులో ఉంది.. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న స్పెషల్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఈ టీవీపై ఏకంగా రూ.5,300 వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తోంది.. ఈ బంపర్ డిస్కౌంట్ కారణంగా కస్టమర్లు ఈ సరికొత్త స్మార్ట్ టీవీని కేవలం రూ.7,699 లోపే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉండడం విశేషం..

బ్యాంక్ ఆఫర్ల వివరాలు ఇవే..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా..ఈ టీవీని ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మరింత ఆకర్షించడానికి అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తూ వస్తోంది.. ఈ టీవీని కొనుగోలు చేసే సమయంలో మీరు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్‌ ఉపయోగించి పేమెంట్ చేస్తే దాదాపు.. దాదాపు రూ.385 వరకు అదనపు ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. దీనితో టీవీ ధర మరింత తగ్గుతుంది.

కేవలం రూ.5,000 లోపే మీ ఇంటికి..
ఈ డీల్‌లో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే.. భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం.. మీ ఇంట్లో ఉన్న పాత వర్కింగ్ కండిషన్ టీవీని ఎక్స్చేంజ్ చేస్తే.. దాదాపు రూ. 2,090 వరకు అదనపు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది.. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పూర్తిగా వినియోగించుకుంటే.. ఈ సరికొత్త 2025 ఎడిషన్ స్మార్ట్ టీవీని కస్టమర్లు నెట్ ఎఫెక్టివ్ ధర రూ. 5,000 లోపే పొందవచ్చు.. అయితే, ఈ ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్‌టీవీ మోడల్‌తో పాటు దాని కండీషన్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పాత టీవీ కండిషన్ బాగుంటే గరిష్ట తగ్గింపు లభిస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

వచ్చే వారమే Redmi K90 Ultra లాంచ్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పవర్‌ఫుల్ ఫీచర్స్!

Hyderabad, Telangana:

Redmi K90 Ultra to Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి (Xiaomi) సబ్-బ్రాండ్ అయిన  రెడ్‌మి (Redmi) గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) విడుదలకు ఖరారైంది. వచ్చే వారం చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్  వైబో (Weibo) ద్వారా రెడ్‌మి ఈ సమాచారాన్ని వెల్లడించింది.. జూన్ 30వ తేదిన విడుదల చేయబోతున్నట్లు తెలిపింది..

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌..
Redmi K90 Ultra స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ (Qualcomm)కు చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) చిప్‌సెట్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది.. హెవీ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ఈ ప్రాసెసర్ అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో సరికొత్త అప్‌గ్రేడెడ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను కూడా అందిస్తోంది.. ఫోన్‌ను కూల్‌గా ఉంచేందుకు ఇందులో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ (కూలింగ్ ఫ్యాన్) కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

అద్భుతమైన డిస్‌ప్లే.. 
ఈ స్మార్ట్‌ఫోన్ లుక్‌తో పాటు డిజైన్ పరంగా చాలా క్లాసీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన సిల్వర్ కలర్ వేరియంట్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.. ఫోన్ వెనుక భాగంలో పెద్ద హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది చూడటానికి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మి K90 మ్యాక్స్ (Redmi K90 Max) మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59-ఇంచుల 1.5K LTPS OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..
రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) స్మార్ట్‌ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అయిన్నట్లు కూడా తెలుస్తోంది.. దీని ప్రకారం.. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని సమాచారం. అలాగే వినియోగదారుల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని.. ఇందులో సరికొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ (Ultrasonic Fingerprint Scanner)ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

K90 సిరీస్‌లో మరో సంచలనం..
ఇప్పటికే రెడ్‌మి K90 సిరీస్‌లో బేస్ మోడల్‌తో పాటు రెడ్‌మి K90 ప్రో, రెడ్‌మి K90 మ్యాక్స్ వంటి మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. కాగా.. ఇప్పుడు రాబోతున్న అల్ట్రా మోడల్ సరికొత్త టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్‌తో సాంసంగ్‌, ఒప్పో వంటి బ్రాండ్ల ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. తొలుత జూన్ 30న చైనాలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్.. ఆ తర్వాత త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు వచ్చే వారం లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Gold Rate: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. జూలైలో మరింత పతనం.. 10గ్రాముల పసిడి రూ. 1 లక్షకు చేరుకుంటుందా?

BBhoomi1h ago
Secunderabad, Telangana:

Gold Rate: బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయిలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా గమనించినట్లయితే ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గుతున్నట్లు మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 4100డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకే నెలలో సుమారు 6 శాతం వరకు బంగారం ధర తగ్గినట్లు మనము గమనించవచ్చు.  జూన్ నెలలో బంగారం ధర గరిష్టంగా 1. 55 లక్షల రూపాయల వరకు పెరిగింది. అంటే ఒకే నెలలో సుమారు 10వేల రూపాయల వరకు తగ్గినట్లు మనం గమనించవచ్చు.

 అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అని చెప్పాలి. దీనికి తోడు డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టేందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.  అన్నిటికంటే ప్రధానమైనది బంగారం దగ్గర తగ్గడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భవిష్యత్తులో భారీగా పెంచుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఇవి కూడా ఇన్వెస్టర్లను బంగారం నుంచి బయటకు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు.  

సాధారణంగా బంగారం ధర అనేది ఎక్కువగా డాలర్ విలువపై ఆధారపడి ఉంటుంది.  ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో అప్పుడు బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఎప్పుడైతే అమెరికా డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు ధర బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. 

ఎందుకంటే అమెరికా డాలర్ బలపడితే.. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.  అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసి ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోన్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కూడా భారీగా తగ్గడం కూడా  బంగారం పైన ప్రభావం చూపుతోందని చెప్పాలి.  దీనికి తోడు జూలైలో బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.

 అయితే అమెరికా విడుదల చేసే కీలకమైన ఆర్థిక డేటా పర్సనల్ కాన్సెప్షన్ ఎక్స్పెండిచర్ల నివేదికలో సానుకూలంగా వచ్చినట్లయితే బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం టెక్నికల్ గా చూస్తే బంగారం ధర 450డాలర్లుగా ఉంది. జూలై నెలలో ఈ స్థాయి వద్ద బంగారానికి బలమైన సపోర్టు లభించే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే ధరలు జూలై నెలలో భారీగా తగ్గడం అంత సులభం కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆనంద్ రాఠి సంస్థ విడుదల చేసిన కమ్యూనిటీ నివేదిక ప్రకారము ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కరెక్షన్ తాత్కాలికం మాత్రమే అని దీర్ఘకాలిక ట్రేడ్ ఇంకా బలంగానే ఉంటుందని.. బంగారం ధరలో మళ్లీ వేగం పంచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.

Also Read: నిరుద్యోగులకు నెలకు రూ. 3,000.. జర్నలిస్టులకు రూ. 5,000 పెన్షన్..!!

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Venus Transit: ఒకే రోజు శుక్రుడి డబుల్ ట్రాన్సిట్.. ఆ 5 రాశుల జీవితాల్లో ఊహించని అద్భుతాలు..

Hyderabad, Telangana:

Venus Transit Effect On Zodiac Latest News: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా భావించే శుక్రుడు అతి త్వరలోనే ఒక అరుదైన సంచారం చేయబోతున్నాడు. ఒకే రోజు శుక్ర గ్రహం రాశితో పాటు నక్షత్ర సంచారం చేయబోతోంది.  జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శుక్రుడి ఈ అరుదైన గ్రహ చలనం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 5 రాశులవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కోరుకున్న కొరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సుఖసంతోషాలు, ప్రేమ, ఐశ్వర్యం, శృంగారం, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడి ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల ఆయా రాశుల వారి ఆర్థిక స్థితి, ప్రేమ జీవితం, దాంపత్య బంధం, కెరీర్, సామాజిక గౌరవం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీవితంలో అద్భుతం జరుగుతుంది..

ఈ క్రింది రాశులవారికి బంపర్ జాక్‌ఫాట్:
1. వృషభ రాశి (Taurus):
శుక్రుడి శుభ ప్రభావంతో వృషభ రాశి వారికి ఆర్థికంగా భారీ పురోగతి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి.. వ్యాపారస్తులకు సరికొత్త అవకాశాలు తలుపుతట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సుఖశాంతులు ఊహించని స్థాయిలో పెరుగుతాయి..

2. మిథున రాశి (Gemini):
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నూతన ఆదాయ వనరులు లభించడమే కాకుండా.. ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి..

3. సింహ రాశి (Leo):
సమాజంలో సింహ రాశి వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో కీర్తి ప్రతిష్టలతో పాటు ఉన్నతాధికారుల పూర్తి సపోర్ట్ కూడా అద్భుతంగా పెరుగుతుంది.. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

4. తులా రాశి (Libra):
తులా రాశికి అధిపతి శుక్రుడే కావడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అదృష్టాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దాంపత్య జీవితంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది.. కొత్త ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

5. మీన రాశి (Pisces):
మీన రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పూర్తిగా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు.. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Rahu Ketu Transit: రాహు కేతువుల మహా సంచారం.. ఈ 5 రాశుల వారికి తిరుగుండదు, అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Rahu Ketu Transit Effect On Zodiac: మానవ జీవితంలో నవగ్రహాల స్థానాలకు, వాటి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. జాతకంలో గ్రహాల స్థితి బాగుంటే సామాన్యుడు కూడా రాత్రికి రాత్రే అపర కుబేరుడు కాగలడని జ్యోతిష్య శాస్త్రం చెబుతూ వస్తోంది.. ముఖ్యంగా  ఛాయా గ్రహాలుగా పిలిచే.. రాహువు, కేతువుల ప్రభావం మానవ జీవితాలపై చాలా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే రాహు-కేతువుల మహా సంచారం కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.. అయితే, ప్రత్యేకంగా ఐదు రాశుల వారికి ఈ ఊహించని అదృష్టంతో పాటు ఆర్థిక పురోగతి, అఖండ విజయాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

డిసెంబర్ 5న మహా అద్భుతం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహు-కేతువులు ఎల్లప్పుడూ వక్ర మార్గంలో ఒక గ్రహం నుంచి ఇతర గ్రహంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాయి.. ప్రతి 18 నెలలకు ఒకసారి రాశి మారుతుంటారు. రాబోయే డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనుండగా.. అదే రోజున కేతువు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది.. ఈ మార్పు వల్ల కింది ఐదు రాశుల వారు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
1.మేష రాశి (Aries) 
రాహువు ఈ సమయంలో కర్మ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో వృత్తితో పాటు ఉద్యోగ రంగాల్లో అపారమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి  కీర్తి ప్రతిష్టలు, సమాజంలో ప్రభావం పెరుగుతాయి. ఉన్నత పదవులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు లేదా మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉన్నవారికి ఇది సువర్ణ కాలంగా మారబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి.

2. వృషభ రాశి (Taurus) 
వృషభ రాశి వారికి రాహువు తొమ్మిదవ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. అలాగే కేతువు మూడో స్థానంలో ఉంటాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ గ్రహాల అనుకూలత వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వేగంగా, ఎంతో సులభంగా పూర్తవుతాయి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.. ఉద్యోగస్తులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి..

3. సింహ రాశి (Leo) 
సింహ రాశి వారికి రాహువు ఆరో స్థానంలో ఉండడం వల్ల.. కేతువు పన్నెండో స్థానంలో ఉండడంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీనివల్ల న్యాయపరమైన వివాదాలు లేదా ఆఫీసులో ఉండే మనస్పర్ధల నుంచి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విదేశీ సంబంధాలు లేదా వ్యాపారాల ద్వారా మంచి లాభాలు ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి..

4. కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారి జాతకంలో రాహువు ఐదో స్థానంలో.. కేతువు లాభ స్థానమైన పదకొండో స్థానంలో ఉండడం కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. ఈ గ్రహ సంచారాలతో వీరికి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెంపొందుతాయి. నైపుణ్యాల వల్ల కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి..

5. మీన రాశి (Pisces) 
మీన రాశి వారికి రాహువు ఆదాయ స్థానంలో ఉండడం వల్ల వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.. ఇది ఆర్థికంగా అత్యంత లాభదాయకమైన సమయంగా భావించవచ్చు.. మీ ఆదాయం అకస్మాత్తుగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి.. సమాజంలో పెద్దలతో పరిచయాలు, మీ నెట్‌వర్క్ విస్తరించడం వల్ల భవిష్యత్‌లో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కారుదే గెలుపు.. కేసీఆర్‌ సారుదే విజయం: కేటీఆర్‌

Hyderabad, Telangana:

BRS Party: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని స్థానాల్లో కారు గుర్తుదే గెలుపు అని.. కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు సునామీ ఖాయం అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అనాదిగా బీఆర్ఎస్ పార్టీకి కోట అని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టేందుకు మరింత పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోవాలని గులాబీ పార్టీ సైన్యానికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పైన కదం తొక్కాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంతోపాటు సమకాలీన రాజకీయాలపై దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక కోట మాదిరిగా అండగా ఉందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్ల విఫల పరిపాలన తర్వాత తిరిగి ప్రజలంతా బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నారని చెప్పారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతుందని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలు, అవినీతిని ఎక్కడికక్కడ ప్రజల ముందుకు, సింగరేణి కార్మికుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యవర్గానికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న అరాచకాలను, అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించి బూత్‌ల వారీగా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకుపోవాలని చెప్పారు. గ్రామస్థాయి పార్టీ కార్యాచరణ కాకుండా బూత్‌ల వారీగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. అధికారం ఉన్నా లేకున్నా మన వెంట నాయకుల వెంట నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తించాలి. కార్యకర్తలతోనే పార్టీ బలంగా నిలబడిందనే విషయాన్ని గ్రహించి ముందుకుపోవాలి' అని సూచించారు. 

కరీంనగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుందని.. ఆ విషయం ముమ్మాటికి నిజమవుతున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అందిన కాడికి దోచుకుంటున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. పార్టీ నాయకులంతా మారుతున్న ప్రస్తుత కాలానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు.

0
0
Report
Advertisement

Ram Charan Pawan Kalyan: బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న అబ్బాయ్.. మంగళగిరిలో డిప్యూటీ సీఎంను కలిసిన రామ్‌చరణ్!

Chinnakakani, Andhra Pradesh:

Ram Charan Meets Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఒక అరుదైన, ఆసక్తికరమైన భేటీ జరిగింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయనను మంగళగిరి కార్యాలయంలో చరణ్ కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 'బాబాయ్-అబ్బాయి'ల ప్రత్యేక సమావేశం ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఘనస్వాగతం..ఆత్మీయ ముచ్చట్లు
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రామ్ చరణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను కలిసి చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ప్రస్తుత పరిణామాలు, పలు ఆసక్తికర విషయాలపై కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.

చరణ్ అమరావతి పర్యటనకు కారణం?
రామ్ చరణ్ అమరావతికి రావడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (APL) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మంగళగిరిలోని ఏసీఏ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళ్లే ముందే.. రామ్ చరణ్ నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఆయన క్రికెట్ స్టేడియం వైపు అడుగులు వేశారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్!
జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. సోషల్ మీడియా షేక్‌ అవుతోంది. మెగా అభిమానులు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తూ ఈ విజువల్స్‌ను టాప్ ట్రెండింగ్‌లో నిలిపారు.

Also Read: "నా బాడీ నా ఇష్టం అంటే.. నా కళ్లు నా ఇష్టం అంటారు".. సునీత సంచలన వ్యాఖ్యలు!

Also Read: "బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా?" మరో అవకాశం ఇచ్చిన నాగార్జున టీమ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Black Ivory Coffee: ఏనుగు పేడతో ఖరీదైన కాఫీ..ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కాఫీ ఇది..కప్పు కేవలం రూ.4,720 మాత్రమే!

Hyderabad, Telangana:

Black Ivory Coffee Price: కాఫీ ప్రియులకు ఉదయాన్నే ఒక కప్పు వేడి కాఫీ పడకపోతే రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన "బ్లాక్ ఐవరీ కాఫీ" గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే, ఈ కాఫీ తయారీ వెనుక ఉన్న కథ, దాని ధర సామాన్యులను ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. కొన్ని విలాసవంతమైన హోటళ్లు, రిసార్టులలో కేవలం ఒక కప్పు బ్లాక్ ఐవరీ కాఫీ ధర సుమారు 50 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.4,000 పైమాటే) పలుకుతుంది.

ఈ విచిత్రమైన విలాసవంతమైన కాఫీ విశేషాలేంటో తెలుసా..
1) ఏనుగుల మల విసర్జనతో కాఫీ తయారీ!

ఈ కాఫీ ప్రత్యేకత అంతా దాని తయారీ విధానంలోనే ఉంది. థాయ్‌లాండ్‌లో సంరక్షణలో ఉన్న ఏనుగులకు అత్యంత నాణ్యమైన అరబికా కాఫీ చెర్రీలను అరటిపండ్లు, బియ్యం వంటి ఆహారంతో కలిపి తినిపిస్తారు.

ఏనుగుల జీర్ణవ్యవస్థ గుండా ప్రయాణించిన ఈ కాఫీ గింజలు, వాటి విసర్జన (పేడ) ద్వారా బయటకు వస్తాయి. అలా వచ్చిన గింజలను కార్మికులు ఎంతో జాగ్రత్తగా చేతితో వేరు చేస్తారు. ఆ తర్వాత వాటిని అత్యంత పరిశుభ్రమైన పద్ధతుల్లో కడిగి, ఎండబెట్టి, రోస్ట్ చేసి తుది కాఫీ పొడిని తయారు చేస్తారు.

2) ఇంత ధర ఎందుకు?
బ్లాక్ ఐవరీ కాఫీ కిలో ధర వేల డాలర్లలో ఉండటానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఏనుగులు తిన్న కాఫీ గింజల్లో చాలా వరకు నమిలేటప్పుడు విరిగిపోతాయి లేదా జీర్ణమైపోతాయి. ఒక కిలో నాణ్యమైన కాఫీ గింజలు లభించాలంటే ఏనుగులకు సుమారు 33 కిలోల కాఫీ చెర్రీలను తినిపించాల్సి ఉంటుంది. ఇది భారీ స్థాయిలో లభించేది కాదు. ఏటా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఏనుగు పేడ నుండి గింజలను వేరు చేయడం, శుభ్రపరచడం వంటి పనులకు అధిక శ్రమ, సమయం పడుతుంది.

3) చేదు లేని అద్భుతమైన రుచి!
"ఏనుగు జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌ల వల్ల కాఫీ గింజల్లోని ప్రొటీన్లు విచ్ఛిన్నమవుతాయి. కాఫీలో చేదుదనానికి ఈ ప్రొటీన్లే కారణం కాబట్టి, ఏనుగుల ద్వారా వచ్చే గింజల్లో చేదు చాలావరకు తగ్గిపోతుంది."

ఈ సహజ సిద్ధమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల ఈ కాఫీకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇది తాగేటప్పుడు చాక్లెట్, మాల్ట్, స్వల్పంగా నట్స్ (జీడిపప్పు/బాదం వంటివి) కలబోసిన అద్భుతమైన ఫ్లేవర్లు తెలుస్తాయని కాఫీ నిపుణులు చెబుతుంటారు.

4) జంతు సంరక్షణ
ఏనుగులను కాఫీ తయారీకి వాడటంపై జంతు ప్రేమికుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, తాము కేవలం రక్షిత ఏనుగులను మాత్రమే ఉపయోగిస్తామని, కాఫీ చెర్రీలు వాటి రోజువారీ ఆహారంలో ఒక చిన్న భాగం మాత్రమేనని తయారీ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ, ఇలాంటి లగ్జరీ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు సదరు కంపెనీల పారదర్శకతను, జంతు సంరక్షణ ప్రమాణాలను సరిచూసుకోవడం వినియోగదారుల బాధ్యత.

ఏనుగు విసర్జన నుండి సేకరించిన గింజలతో తయారవుతుందనే విషయం కొందరికి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, కాఫీ ప్రపంచంలో దీనికున్న క్రేజ్ వేరు. ఇది కేవలం దాహాన్ని తీర్చుకునే రోజువారీ పానీయం కాదు.. సంపన్నులు, కాఫీ ప్రియులు ఆస్వాదించే ఒక విలాసవంతమైన అనుభూతి!

Also REad: ఏపీ ప్రజలకు తీరనున్న కష్టాలు..బంగారు గనిని ప్రారంభం..700 మంది ఉపాధి..

Also Read: అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bigg Boss 10 Agnipariksha: "బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నారా?" మరో అవకాశం ఇచ్చిన కింగ్ నాగార్జున టీమ్!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Agnipariksha Audition: తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజీ సంపాదించుకున్న రియలిటీ షో బిగ్ బాస్. త్వరలోనే సరికొత్త మైలురాయని అందుకుని పదవ సీజన్లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు 9 సీజన్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ మెగా షో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి షో మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు నిర్వాహకులు భారీ ప్లానింగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సామాన్లకు హౌస్ లోకి వెళ్లేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించారు. 

సాధారణంగా సెలబ్రిటీలతో నిండిపోయే బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులకు చూడదగ్గ ఓ అద్భుతమైన విషయంగా మారుతుంది. గత సీజన్లో కామన్ మ్యాన్ కేటగిరీ కింద అడుగుపెట్టిన కంటెస్టెంట్ హౌస్ లోనే తన సత్తా చాటడం కాకుండా ప్రేక్షకుల ఆదరణతో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. దీంతో పదో సీజన్ కూడా కామన్ మ్యాన్ కు పెద్దపీట వేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

గత సీజన్‌లో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం కల్పించేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష కాన్సెప్ట్ విజయవంతం కావడంతో ఈసారి మరింత పకడ్బందీగా 'బిగ్ బాస్ అగ్ని పరీక్షా సీజన్ 2' కూడా లాంచ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే జూన్ 12 నుంచి జూన్ 20 వరకు గడువు ఇచ్చారు వచ్చిన వేలాది దరఖాస్తులను పరిశీలించిన డిజిటల్, ఆన్‌గ్రౌండ్ సెలెక్షన్లలో గెలిచిన దాదాపు 5 మంది సామాన్యులను మైల్ స్టోన్ సీజన్ 10 హౌస్ లోకి నేరుగా ఎంట్రీ లభించనుంది. 

ఒకవేళ 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్స్ మిస్ అయినవారికి తాజాగా సర్‌ప్రైజ్ ఇచ్చారు నిర్వాహకులు. 'బిగ్‌బాస్ తెలుగు 10'కి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వైట్ గోల్డ్ సంస్థతో కలిసి ఈసారి కొత్త కాంటెస్ట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రోమో ప్రముఖ యాంకర్ శ్రీముఖి విడుదల చేసింది. 

"బిగ్‌బాస్ 10 అగ్ని పరీక్ష ఆడిషన్ వీడియో సబ్మిట్ చేయడం మిస్ అయ్యారా? మీకోసం మరో గోల్డెన్ ఛాన్స్" అంటూ ఆ వీడియో ప్రారంభం అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు వారు ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆడిషన్ వీడియోను సబ్మిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఇది అగ్ని పరీక్ష రౌండ్లోకి వెళ్లడానికా లేదా నేరుగా సామాన్యుడి కంటెస్టెంట్‌గా ఎంపిక చేయడానికా అనేది తెలియాల్సి ఉంది. 

ఈ ప్రతిష్టాత్మక పదో సీజన్ కోసం సెలబ్రిటీలు, సామాన్యుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం తుదిదశకు చేరుకుతుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ సరికొత్త సీజన్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానట్లు సమాచారం. ఏదేమైనా ఒక సామాన్యుడిగా వచ్చి బిగ్ బాస్ ట్రోఫీ గెలవాలనుకునే మాత్రం ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.

Also Read: "డబ్బు కోసం ఎంతమంది మొగుళ్లనైనా మారుస్తా!" స్టార్ హీరోయిన్ సంచలన ప్రకటన!

Also REad; నేడు కోర్టులో అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్.. వెండాతున్న తొక్కిసలాట కేసు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Infinix Note 60 Pro: భారత మార్కెట్లోకి Infinix కొత్త సంచలనం.. సూపర్ కార్ డిజైన్‌తో కొత్త ఫోన్ లాంచ్!

Hyderabad, Telangana:

Infinix Note 60 Pro Pininfarina Limited Edition: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్ (Infinix) భారతీయ మొబైల్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను అందించేందుకు రెడీ అయ్యింది.. ప్రముఖ ఇటాలియన్ లగ్జరీ కార్ డిజైనింగ్ సంస్థ Pininfarina భాగస్వామ్యంతో సరికొత్త Infinix Note 60 Pro Pininfarina Limited Edition స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం అధికారికంగా లాంచ్‌ చేసింది. ఇది రూ.40,000 లోపు బడ్జెట్ విభాగంలో ప్రీమియం లుక్‌తో పాటు అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడం విశేషం..

స్పార్ట్స్ కార్ తరహా డిజైన్.. 
ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని డిజైన్ అని భావించవచ్చు.. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే లగ్జరీ స్పోర్ట్స్ కార్ల స్ఫూర్తితో దీని వెనుక ప్యానెల్‌ను కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ (Carbon Fibre Finish)తో తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఫోన్‌కు మరింత దృఢంగా ఉండేందుకు 360-డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.. ఇది ఫోన్‌కు అత్యంత ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది క్లాసీ  టోరినో బ్లాక్ (Torino Black) కలర్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి రావడం విశేషం..

డిస్‌ప్లే, ప్రాసెసర్ అద్భుతం..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ల్పేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది. దీనికి స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 (Snapdragon 7s Gen 4) 4nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌కు అద్భుతంగా సరిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

6500mAh భారీ బ్యాటరీ.. 
బ్యాటరీ పరంగా ఇన్‌ఫినిక్స్ ఎక్కడా రాజీ పడలేన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 6,500mAh గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు అలాగే 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ఐస్‌కోర్ 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంచచడం విశేషం..

కెమెరా, ఇతర స్పెషల్ ఫీచర్స్..
ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. దీని ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేసే అవకాశం కూడా లభిస్తోంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ వెనుక కెమెరా పక్కన నోటిఫికేషన్లు, యానిమేషన్ల కోసం ప్రత్యేకమైన  యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే (Active Matrix Display)ను అందుబాటులో ఉంచడం విశేషం. అంతేకాకుండా ఫోన్ కుడి వైపున హెల్త్ మానిటరింగ్ సెన్సార్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ధర వివరాలు..
భారత మార్కెట్లో Infinix Note 60 Pro Pininfarina Limited Edition కేవలం 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ. 37,999తో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)తో పాటు ఇన్‌ఫినిక్స్ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Vemulawada: వేములవాడ రాజన్న క్షేత్రంలో అద్భుత ఘట్టం.. రైతులకు ఉచితంగా 200 కోడెల పంపిణీ!

Nampalli, Vemulawada, Telangana:

Vemulawada Temple News: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ చేతుల మీదుగా తిప్పాపురం గోశాలలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. మొదటి విడతగా బుధవారం రోజున 200 కోడెలను అర్హులైన రైతులకు అందజేశారు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ.. స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా.. ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిజమైన.. అర్హులైన పేద రైతులను మాత్రమే ఎంపిక చేసినట్లు ఆమె వెల్లడించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే ఈ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.

రాజన్న ప్రసాదంగా భావించండి: కలెక్టర్ పిలుపు..
రైతులకు కోడెలను అందజేసిన అనంతరం కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.. రైతు సోదరులారా.. ఈ కోడెలను కేవలం పశువులుగా కాకుండా.. వేములవాడ రాజన్న ప్రసాదంగా.. స్వామివారి ఆశీస్సుల రూపంగా భావించాలని.. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అవసరాలకు లేదా విక్రయించడానికి వీల్లేదని.. కేవలం మీ వ్యవసాయ పనులకు, సాగు ఉత్పాదకతను పెంచుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని కోరారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ఉచితంగా కోడెలను అందుకున్న రైతుల ఆనందానికి అవధులు లేవు.. వేములవాడ రాజన్నను దర్శించుకుని, కోడెలను ఇంటికి తీసుకెళ్తుండటంతో తిప్పాపురం గోశాల పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.. ఎద్దులను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న తమకు, స్వామివారి కోడెలు వ్యవసాయానికి ఎంతో ఆసరాగా నిలుస్తాయని లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top