రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలానికి ఎస్ఎస్ఐ ఎల్లగౌడ్ బదిలీపై వచ్చారు
Rudrangi, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల మండలం బదిలీపై వచ్చిన ఎస్సై ఎల్లా గౌడ్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఎల్లా గౌడ్ మాట్లాడుతూ. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దు వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సరైన వాహన పత్రాలు వెంబట ఉంచుకోవాలి మైనర్ పిల్లలు వాహనాలు నడపవద్దు నడుపుతే శిక్ష జరిమానా తప్పదు అన్నారు.ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
KCR Assembly: అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ రావాలి.. సలహాలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి
Parkal, Telangana:Telangana Assembly Session: సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని.. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తొలి సీఎం కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరుకావాలని మరోసారి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి.. తమకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 'రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్ది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయాడు' అని కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారని విమర్శించారు.
ప్రజా పాలన- ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దాదాపు రూ.424 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారీగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రగతి నివేదన
'32 నెలల్లో ధాన్యం కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ రుణాలు అందించాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. యూనిఫాం కట్టు పనిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాం. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు జరుపుకునేలా ప్రోత్సహించాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. 'మేం 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం. పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగుల భవిష్యత్ కోసమే వయసు సడలించాం' అని వెల్లడించారు.
'నిరుద్యోగులు రాజకీయ పట్టీలు మాయ మాటలకు మోసపోవద్దు. ప్రతీ ఆరునెలలకు ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది' అని పేర్కొన్నారు. రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. 'ఆనాడు అధికారం అనుభవించారు ప్రతిపక్షంలో కార్యకర్తల రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్న రక్తపిపాసులు' అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
'కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం. ప్రజా పాలనతో ప్రజలకు లాభం. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం అయిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2029లో రెట్టింపు మెజారిటీతో ఇక్కడి ఎమ్మెల్యేలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తమది సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం అని.. ఎంతైనా కష్టపడి సమస్యలను పరిష్కరిస్తానని ప్రకటించారు. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా ఏం చేయలేరని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ , కడియం కావ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
KTR Call: కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర.. రేపు ధర్నాలకు కేటీఆర్ పిలుపు
Baddipadaga, Telangana:Kalyana Lakshmi And Shaadi Mubarak: కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ పథకాలు రద్దవుతాయనే ఆందోళనలు సర్వత్రా నెలకొంది. ఎన్నికల్లో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన అది ఇవ్వకుండా ఏకంగా ఆ పథకాన్ని ఏకంగా రద్దు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేయాలని సూచించారు. హైకోర్టు తీర్పు సాకుతో పేదింటి ఆడబిడ్డల భరోసాను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి అంశంలో హైకోర్టు లో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేసిందని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, మంత్రుల అవినీతి అంశాల్లో కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేటు లాయర్లను పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు కౌంటర్ వెయ్యలేదని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పేరుతో కల్యాణ లక్ష్మిని పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోందని తెలిపారు. ఆడబిడ్డల తులం బంగారం అడుగుతున్నందుకే పూర్తిగా కల్యాణ లక్ష్మిని ఎత్తగొట్టే కుట్ర అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల రద్దు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించాల్సిన ఆందోళనలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ కుట్రను అడ్డుకోవడంతోపాటు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలు అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఆడబిడ్డ పెళ్లి ఆర్థిక భారంగా గుర్తించిన కేసీఆర్ 2014 అక్టోబర్ 2న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశలవారీగా రూ.75,116కు, అనంతరం రూ.1,00,116కు పెంచారని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందని.. కరోనా వంటి సమయంలోనూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు.
అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా.. కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కల్యాణలక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
Nag Panchami 2026: నాగుల పంచమి.. పూజా విధానం, పొరపాటున కూడా రేపు చేయకూడని నాలుగు పనులు ఏంటో తెలుసా..?
Hyderabad, Telangana:Nag Panchami 2026 date puja Vidhi kaal sarp remedy: మనం శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన నాగుల పంచమిని రేపు అంటే సోమవారం రోజున ఆగస్టు 17న జరుపుకుంటున్నాం. శ్రావణ మాసం పంచమి తిథి రోజున నాగుల పంచమిగా చెప్తారు.ఈ మాసం శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైందని చెప్తారు. రేపుసోమవారం కూడా కలిసి రావడం మరో విశేషంగా చెప్తున్నారు. నాగుల పంచమి రోజున ముఖ్యంగా బ్రాహ్మీమూహుర్తంలో నిద్రలేవాలి.ఉతికిన వస్త్రాల్ని ధరించుకొవాలి.
ఆ తర్వాత దీపారాధన చేయాలి. దగ్గరలోని గుడిలోకి వెళ్లి జంటనాగుల్ని పూజించుకొవాలి. పుట్టకు పూజలు చేయాలి. సుబ్రహ్మణ్యుడ్ని ఆరాధించుకొవాలి. సోమవారం రోజున నాగపంచమి రావడంతో శివుడికి పంచామృత అభిషేకంచేయించుకొవాలి. దీని వల్ల కాలసర్పదోషాలుఅన్ని పోతాయి. నవ నాగుల స్తోత్రాలను చదవాలి.
నెయ్యితో దీపారాధన చేయాలి. యథాశక్తి షోడషోపచారాలతో పూజలు చేయించుకొవాలి. ఆతర్వాత పండ్లు లేదా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి.
నాగ పంచమి రోజున చేయకూడని నాలుగు పనులు..
నాగుల పంచమి రోజున పొరపాటున కూడా భూమిని తవ్వడం చేయకూడదు, అదే విధంగా కడయిలో వేయించడం వంటివి చేయకూడదు. కత్తిని, సూదిదారంను, కత్తెరను రేపు ఒక్కరోజు అస్సలు ఉపయోగించకూడదు. కేవలం చేతిలో కట్ చేసే కూరగాయలు. అంటే చిక్కుడు, గోరుచిక్కుడును వండుకొవాలి.
Read more: Nag Panchami 2026: నాగ పంచమివేళ మరో అద్భుతం.!. ఈ రోజు తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..?..
ఆవాలు, జీలకర్రల్ని ఉపయోగించకూడదు. ఇక నిజమైన పాము మీద అస్సలు పాలు పోయకూడదు. వాటిని పాలను జీర్ణం చేసుకునే శక్తి ఉండదని నిపుణులు చెప్తుంటారు. ఈ పనులు మాత్రం తప్పినిసరి అవాయిడ్ చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shocking Incident: ఫ్రెండ్స్తో బెడ్ షేర్ చేసుకోమంటున్నాడు.. ప్రముఖ డాక్టర్పై భార్య సంచలన ఆరోపణలు
Hyderabad, Telangana:Rajendranagar Police: కోటి ఆశలతో డాక్టర్ను పెళ్లి చేసుకున్న ఆ యువతి కాపురం పెట్టాక అతడి నిజ స్వరూపం తెలిసి విస్తుపోయింది. ప్రేమగా చూసుకోవాల్సిన భర్త తనను అతడి స్నేహితులతో పక్క పంచుకోవాలని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందింది. పెళ్లయిన ఏడు రోజులకే అతడ నరకం చూపించడంతో కాళ్ల పారాణి ఆరకముందే ఆమె పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తెలంగాణలోని హైదరాబాద్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో కండ్రగుంట శ్రీనివాస రావు వైద్య నిపుణుడు. ఏడు రోజుల కిందట ఓ యువతితో వివాహమైంది. డాక్టర్ అయిన భర్త కావడంతో ఎన్నో ఆశలతో.. జీవితం బాగుంటుందని ఆశపడిన భార్యకు కాపురం పెట్టిన తర్వాత భర్తలోని నీచుడు బయటపడ్డాడు. అతడి స్నేహితుడితో తనను పడుకోవాలని కట్టుకున్న భార్యను వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా అతడిపై బెడ్ పంచుకోకుంటే విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇక అంతేకాకుండా తనతోపాటు పని చేసే తోటి మహిళ ఉద్యోగులకు న్యూడ్ వీడియో కాల్స్, న్యూడ్ ఫొటోస్ పంపుతున్నట్లు భార్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తకు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. తన భర్త డాక్టర్ శ్రీనివాస్ మానసికంగా , శారీరకంగా వేధించారని ఫిర్యాదులో ఆమె వాపోయారు. ఈ విషయాలు బయటకు చెప్పినా.. తల్లిదండ్రులకు చెపితే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించారు.
డాక్టర్ శ్రీనివాస్కి ఆయన తల్లిదండ్రులు, అతడి సోదరుడు కూడా వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని విచక్షణరహితంగా దాడి చేసినట్లు భాదితురాలు ఫిర్యాదు చేశారు. తమను ప్రశ్నిస్తే 100 మందిని తీసుకొచ్చి నీ అంతు, మీ తమ్ముడు అంతు చూస్తానని బెదిరించినట్లు శ్రీనివాస్ అన్న వెంకటేశ్పై బాధితురాలు ఆరోపణలు చేశారు. తనకు.. తన కుటుంబసభ్యులకు భర్త, వారి కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు భయాందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని తాళలేక బాధితురాలు రాజేంద్రనగర్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 6 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణకు రావాలని పదుల సంఖ్యలో ఫోన్లు చేసినా నిందితుడు నుంచి స్పందన లేదని పోలీసులు చెబుతున్నారు.
RK Roja: దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేరు: ఆర్కే రోజా
Tirupati, Andhra Pradesh:YSR Congress Party: 'దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరూ లేడని.. ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే' మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వైస్రాయ్ హోటల్లో సొంత మామ ఎన్టీఆర్పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదే అని గుర్తుచేశారు. 'స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆఖరికి అన్నం పెట్టకుండా పంపించాడు. మహిళలను చంద్రబాబు అవమానించారు, వారికి క్షమాపణ చెప్పాలి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
'చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేది. ఇప్పుడు రూ.లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చింది?' అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని చెప్పారు. 'నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను. ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
'మద్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి' అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని.. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని హెచ్చరించారు. కారు గ్యారేజీలో ఉండాలి.. ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా గుర్తుచేశారు.
'చంద్రబాబు కన్నా చిన్న వాడు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ 98 శాతం నెరవేర్చారు. అమరావతిలో అనవసరంగా డబ్బులు పెడుతూ, దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు' అని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు.
Cobra Video: శివలింగంపై పడగవిప్పిన భారీ నాగుపాము.. వీడియో!
Hyderabad, Telangana:Cobra Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి.. వాటిల్లో జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ.. సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. తాజాగా శివాలయంలోని శివలింగం వద్ద సర్పాలు సందడి చేసిన ఓ అరుదైన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్ ను సైతం షేక్ చేస్తోంది. గర్భగుడిలో శివలింగంపై పాములు ప్రత్యక్షమై భక్తులతో పాటు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక పురాతన శివాలయంలోని గర్భగుడిలో ఉన్న శివలింగం వద్ద కొన్ని పాములు హల్చల్ చేయడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అందులో ఉన్న ఒక భారీ నాగుపాము శివలింగాన్ని చుట్టుముట్టి.. పడక విప్పి మరి చూడడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు.. అంతటితో ఆగకుండా.. శివలింగం వెనక భాగంలో మరో రెండు పాములు కదులుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది..
సాధారణంగా పాములను చూస్తేనే ఎవరైనా భయంతో పరుగులు తీస్తూ ఉంటారు.. కానీ ఈ ఆలయంలో శివలింగంపై పాములు ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. కొంతమంది వీడియోలు తీస్తూ ప్రశాంతంగా ఉండిపోవడం మనం ఈ వీడియో ద్వారా గమనించవచ్చు. అయితే ఈ వీడియో ఇప్పుడు instagram లో విపరీతంగా వైరల్ గా మారింది. ఇది అప్లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాకుండా చాలామంది లైకులు కూడా కొడుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని.. సాక్షాత్తు ఆ పరమశివుడి లీలే అంటూ కొంతమంది భక్తులు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఓం నమశ్శివాయ.. హర హర మహాదేవ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కొందరు భక్తులు దీన్ని శుభసూచకంగా భావించి వీడియో తమ మిత్రులకు షేర్ చేస్తున్నారు.. సహజంగా కొన్ని పాములు ఆహారం కోసం ఇలా దేవాలయాలకు వస్తూ ఉంటాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.. ఇలాంటి పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: బుసలు కొడుతున్న భారీ నాగుపామును ఒంటిచేత్తో లేపిన యువకుడు.. వీడియో!
Hyderabad, Telangana:Cobra Viral Video Watch: దట్టమైన అడవిలో అత్యంత ప్రమాదకరమైన విష సర్పంతో ఓ యువకుడు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్గా మారింది. సాధారణంగా నాగుపాముల పేరు వింటేనే ఎవరికైనా తప్పకుండా భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది ఏకంగా పడగవిప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును ఓ కుర్రాడు అత్యంత చాకచక్యంగా.. కేవలం ఒంటి చేత్తో పైకి లేపిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్గా మారడం విశేషం.. ఇప్పుడు ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారుల సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు..
వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే.. దట్టమైన చెట్లతో పాటు పొదలతో నిండిన అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.. అక్కడ నేలపై ఉన్న ఒక భారీ నాగుపాము పడక విప్పి.. ఏ క్షణంలోనైనా కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీకు ఈ వీడియోలో అది కనిపిస్తుంది. అయితే, ఆ యువకుడు ఏ మాత్రం భయపడకుండా ఆ పాము దగ్గరగా వెనక భాగంలోకి వెళ్ళాడు. క్షణాల వ్యవధిలోనే అతనికున్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో ఎలాంటి.. స్నేక్ స్టిక్స్ లేకుండా కేవలం తన ఒంటి చేతితో ఆ నాగుపాముని పట్టుకొని పైకి లేపడం మీరు గమనించవచ్చు. ఆ సమయంలో ఆ విశ్వసం గాల్లో పడక విప్పి కదులుతున్నప్పటికీ.. కుర్రాడు ఏమాత్రం బెదరకుండా నిలబడటం వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు..
ఆశ్చర్యం కలిగించే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసేవి.. ఇంతటి తెగింపు అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం ఆశ్చర్య పోతు.. ఇలా పిచ్చిపిచ్చి సాహసాలు ప్రమాదకరమైన పాములతో చేయడం మంచిది కాదని కామెంట్లు పెడుతున్నారు..
లైకులతో పాటు వ్యూస్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారని పలువురు తీవ్రంగా ఈ వీడియో చూసి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వన్యప్రాణి రక్షణ నిపుణులతో పాటు స్నేక్ క్యాచర్లు ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. నాగుపాము అత్యంత ప్రమాదకరమైన న్యూరో టాక్సిక్ విషాన్ని కలిగి ఉందని.. దానికాటి క్షణాల వ్యవధిలోనే ప్రాణాలను గాల్లో కల్పిస్తాయని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా విషసర్పాలు ఇలా పట్టుకోవడానికి ప్రయత్నించకూడదని స్పష్టం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TIMS Hospital: ఏర్పాట్లు పూర్తి.. రేపు ఎర్రగడ్డ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం
Hyderabad, Telangana:Hyderabad: హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు మరో అత్యాధునిక ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్లోని ఎర్రగడ్డలో టిమ్స్ ఆస్పత్రి (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభమవగా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసింది. ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించగా.. త్వరలో ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల టిమ్స్ ఆస్పత్రికి ప్రభుత్వం అధికారులు, వైద్యులు, వైద్యారోగ్య సిబ్బందిని నియమించింది. ఈ ఆస్పత్రికి ప్రభుత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టారు.
రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, ఇతర అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ, ప్రజల రాకపోకలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ట్రాఫిక్ పోలీసులను మంత్రి దామోదర రాజననర్సింహ ఆదేశించారు. వాహనాల పార్కింగ్, అతిథులు, ప్రజాప్రతినిధుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పోలీస్, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, బందోబస్తు, క్రౌడ్ మేనేజ్మెంట్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని చెప్పారు.
ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి దామోదర రాజననర్సింహ ఆదేశించారు. టిమ్స్ ప్రారంభోత్సవం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంత్రి వెంట ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డా. ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐ, పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Viral Video: మెట్రోలో రద్దీని అడ్డం పెట్టుకుని దొంగతనం.. మహిళా దొంగ ఏం చేసిందో చూడండి!
Hyderabad, Telangana:Metro Theft Caught On Camera Video Viral: రోజు ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తూ.. రైల్లో మీరంతా చాలా సురక్షితంగా ఉన్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అయితే, ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా ఆలోచనలో పడాల్సిందే.. క్షణాల్లో పక్కనున్న వారి వస్తువులు, బ్యాగ్ లో ఉన్న పర్సును ఎలా మాయమవుతున్నాయో కళ్ళకు కట్టినట్లు చూపే ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రాజీవ్ చౌక్ లో ఉన్న కాశ్మీరీ గేట్, నందిని చౌక్ వంటి నిత్యం రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొంతమంది దొంగల ముఠా ఎలా రెచ్చిపోతున్నాయో మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. మెట్రో రైలు ఆగగానే కొంతమంది ప్రయాణికులు దిగడంతో పాటు.. మరి కొంతమంది ప్రయాణికులు మెట్రోలోకి ఎక్కేందుకు పోటీ పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే విపరీతమైన రద్దీ నెలకొంటుంది. సరిగ్గా ఈ హడావిడి.. గందరగోళం ఉన్న సమయంలోనే.. ప్రొఫెషనల్ దొంగలు తమకు అనుకూలంగా మార్చుకొని చేతివాటం చూపెడుతూ ఉంటారు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ మెట్రో ఎక్కుతున్నట్లు నటిస్తూ కనిపించడం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఆమె ముందు ఉన్న మరో మహిళ ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ లోకి ఎంతో సులభంగా చేయి పెట్టడం మీరు గమనించవచ్చు.. అందులో ఉన్న విలువైన వస్తువులు, నగలను దొంగిలించే ప్రయత్నం చేసింది.. అంతా తాను అనుకున్నట్లుగానే జరిగిపోతుందని ఆ మహిళ భావించింది..
అయితే సరిగ్గా అదే సమయంలో తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కెమెరాతో రికార్డు చేస్తున్న విషయాన్ని ఆ మహిళా దొంగ గమనించింది.. కెమెరా కంటికి చిక్కానని.. తెలియగానే ఒక్కసారిగా షాక్కు గురైనట్లు కూడా మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.. వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంది.. ఆపై ఏమీ తెలియనట్లుగా అమాయకంగా ముఖం పెట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తుంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్దీ సమయంలోనే లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకుంది.. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు దొంగ ప్రవర్తనను చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కామెంట్లలో పెడుతున్నారు.. కెమెరా లేకపోయి ఉంటే ఆ ప్రయాణికురాలు తమ విలువైన వస్తువులన్నింటిని పోగొట్టుకునేదని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. మెట్రో అధికారులతో పాటు భద్రత సిబ్బంది నిఘా పెంచాలని కోరుతున్నారు..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?
Balapur, Telangana:Balapur Ganesh Mandapam 2026 Theme: వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఇప్పటికే గణేశ్ ఆర్డర్లు పూర్తవగా.. మండపాలు వినూత్నంగా.. కొత్త తరహాలో తీర్చిదిద్దడానికి ఉత్సవ సమితి నిర్వాహకులు ప్లాన్లు వేస్తున్నారు. ఇక ఈసారి బాలాపూర్ గణేశ్ మరో కొత్త రూపంలో కనిపించనుంది. ఈసారి ఏ థీమ్తో మండపం సిద్ధం చేస్తున్నారో తెలుసుకుందాం.AUS Vs BAN Test: పిల్లకూన బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా ఘోర ఓటమి..ఆసీస్ గడ్డపై బంగ్లా జట్టు తొలి విజయం ఇదే!
The Gardens, Northern Territory:AUS Vs BAN 1st Test: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్లోని మొదటి మ్యాచ్ కంగారూల జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాలోని డార్విన్లోని మరారా క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్పై 9 వికెట్ల తేడాతో గెలిచి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. గెలవడానికి 57 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నాలుగో రోజు రెండో సెషన్లోనే బంగ్లాదేశ్ ఆ లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లాదేశ్ విజయంలో ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్, ఆల్రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో మహమూద్ మొత్తం 9 వికెట్లు తీయగా, మిరాజ్ 65 పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాదేశ్కు ఇదే తొలి టెస్టు విజయం. బంగ్లాదేశ్ గతంలో ఆస్ట్రేలియాలో రెండు టెస్ట్ మ్యాచ్లలో ఓడిపోయింది. ఆ రెండు మ్యాచ్లు బంగ్లాదేశ్ 2003 పర్యటనలో జరిగాయి. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్కు ఇది రెండవ టెస్ట్ విజయం.
గత టెస్ట్ విజయం 2017 ఆగస్టులో మీర్పూర్లో ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా లభించింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు ఏడు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. వీటిలో ఆస్ట్రేలియా ఐదింటిలో గెలుపొందగా, బంగ్లాదేశ్ రెండింటిలో విజయం సాధించింది. ఈ సిరీస్లోని రెండవ టెస్ట్ ఆగస్టు 22 నుంచి మక్కేలో జరగనుంది.
నాలుగో రోజు ఆట సాగిందిలా..
మ్యాచ్ నాలుగో రోజున, ఆస్ట్రేలియా 161/4 స్కోరుతో తమ రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. తొలి సెషన్లో మెహిదీ హసన్ మిరాజ్, అలెక్స్ క్యారీ (30 పరుగులు), బ్యూ వెబ్స్టర్ (5 పరుగులు), పాట్ కమిన్స్ (8 పరుగులు)లను అవుట్ చేసి ఆస్ట్రేలియాను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టాడు. అయినప్పటికీ, వికెట్లు పడుతున్నా కామెరాన్ గ్రీన్ క్రీజులో నిలిచాడు. గ్రీన్ 201 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో సహా 104 పరుగులు చేశాడు. ఇది గ్రీన్కు మూడవ టెస్ట్ సెంచరీ.
మరోవైపు మిచెల్ స్టార్క్ (18 పరుగులు) కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు, కానీ టాస్కిన్ అహ్మద్ అతని ఇన్నింగ్స్ను ముగించాడు. అవుటైన తొమ్మిదవ వికెట్ కామెరాన్ గ్రీన్. హసన్ మహమూద్ బౌలింగ్లో గ్రీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ (15 పరుగులు) మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు, దీంతో కంగారూ ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది. రెండవ ఇన్నింగ్స్లో మిరాజ్ ఐదు వికెట్లు తీయగా, మహమూద్ మూడు వికెట్లు పడగొట్టాడు. టాస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 198 పరుగులు మాత్రమే చేసింది. స్టీవ్ స్మిత్ అత్యధికంగా 71 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరఫున హసన్ మహమూద్ ఆరు వికెట్లు తీయగా, ఇబాదత్ హుస్సేన్, టాస్కిన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
దీనికి ప్రతిగా, బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ అద్భుతమైన 101 పరుగులు చేశాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (84), మెహిదీ హసన్ మిరాజ్ (65) కూడా బ్యాటింగ్లో ఉపయోగకరమైన సహకారం అందించారు. ఆస్ట్రేలియా తరఫున జోష్ హేజిల్వుడ్ ఆరు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Also REad: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Faria Abdullah Troll: సోషల్ మీడియాలో హీరోయిన్ ఫరియాపై ట్రోలింగ్..వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్!
Hyderabad, Telangana:Faria Abdullah Crying Video: 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ పై నటి తాజాగా స్పందించింది. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.Shravana Masam Chicken Price: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధరలు..ఇప్పుడు ఎలా అమ్ముతున్నారంటే?
Hyderabad, Telangana:Shravana Masam Chicken Egg Price: హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో చాలామంది నాన్-వెజ్ వంటకాలకు దూరంగా ఉంటూ పూర్తిగా శాకాహారాన్ని ఆచరిస్తారు. ప్రతి ఏటా ఈ సమయంలో మాంసాహారానికి డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పాతాళానికి పడిపోయాయి. గత నెలలో చుక్కలు చూపించిన ధరలు ఇప్పుడు అమాంతం తగ్గిపోవడంతో సామాన్యులకు ఊరట లభిస్తోంది.
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గతంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340 వరకు చేరుకుని సామాన్యులను షాక్కు గురిచేసింది. అయితే శ్రావణ మాసం ఎఫెక్ట్తో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రాంతాలను బట్టి, రవాణా ఖర్చులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ జోన్ పరిధిలో కిలో డ్రస్డ్ చికెన్ రూ.197లకు విక్రయిస్తుండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.222గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉండగా.. ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ రూ.100లకు అమ్మకాలు జరుగుతుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిధిలో ఎక్స్ ఫామ్ లైవ్ బర్డ్ రూ.110, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137 ధరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా డ్రస్డ్ చికెన్ రూ.212, కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.240గా అమ్మకాలు జరుపుతున్నారు.
తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు
చికెన్తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. గతంలో ఒక్కో గుడ్డు ధర రూ.8 వరకు పలకగా, ప్రస్తుతం ఆ ధరలు తగ్గావు. విజయవాడ జోన్లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.75 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, కరీంనగర్ జోన్ 12 గుడ్ల రిటైల్ ధర రూ.74గా ఉంది.
వ్యాపారుల ఆందోళన.. మరికొంత తగ్గే ఛాన్స్
శ్రావణ మాసం పూర్తయ్యే వరకు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, కోళ్లకు డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత నెలతో పోలిస్తే చికెన్ ధర దాదాపు రూ.100 వరకు తగ్గిపోవడంతో తమకు ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఫామ్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: పాడుబడ్డ ఇంటి గోడలో బంగారు నిధి..గుట్టలు గుట్టలుగా రూ.100 కోట్ల గోల్డ్ బిస్కెట్స్!
Also Read: అనిల్ రావిపూడి సినిమాలో ఆర్మీ జవాన్గా విక్టరీ వెంకటేష్..లెఫ్టినెంట్ కల్నల్ పాత్రలో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పు.. గాంధీ జయంతి రోజున ఘనంగా ప్రారంభమయ్యేలా!
Dubai, Dubai:2027 ODI World Cup Schedule: 2027 వన్డే ప్రపంచకప్ కేవలం ఫోర్లు, సిక్సర్లతో అలరించే సాధారణ క్రికెట్ పోరాటమే కాకుండా.. చరిత్ర, గౌరవం, ఒక సరికొత్త ఫార్మాట్తో అభిమానుల ముందుకు అద్భుతంగా రాబోతోంది. క్రీడలు, చరిత్ర కలగలిసిన ఈ మహాసంగ్రామం ఏకంగా అక్టోబర్ 2న, అనగా మహాత్మా గాంధీ జయంతి రోజున ప్రారంభం కానుంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు చరిత్ర ప్రేమికులకు ఎంతో గర్వకారణంగా, ప్రత్యేకంగా నిలుస్తోంది.
గాంధీజీ జీవితం భారతదేశంతో పాటు ఈ ప్రపంచకప్కు ప్రధాన ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా దేశపు భవిష్యత్తును మార్చడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. ఒక సాధారణ యువ బారిస్టర్గా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన గాంధీజీ, అక్కడ తీవ్రమైన వర్ణవివక్షను ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలోనే ఆయనలోని సత్యాగ్రహి ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికాలో గడిపిన ఆ రెండు దశాబ్దాల కాలమే తన జీవితంలో అత్యంత కీలకమైనదని ఆయన తరచూ భావించేవారు.
అక్కడ భారతీయుల హక్కుల కోసం ఆయన నడిపిన అహింసాయుత పోరాటం, తర్వాతి కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్లో జాతిపితగా స్వాతంత్ర్య సంగ్రామానికి ఆయన సారథ్యం వహించారు.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీని అక్టోబర్ 2న ప్రారంభించడమే బాపూజీకి అర్పించే ఘనమైన నివాళిగా భావిస్తున్నారు. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. మొదట ఈ టోర్నీని అక్టోబర్ 8న ప్రారంభించాలని ఐసీసీ భావించినప్పటికీ, ఇప్పుడు ఆ తేదీని అక్టోబర్ 2కి మార్చాలని నిర్ణయించారు. దీంతో వార్మప్ మ్యాచ్లు సెప్టెంబర్ చివరి వారంలోనే మొదలుకానున్నాయి. ఆఫ్రికా ఖండంలోని 12 వేదికలలో 14 జట్ల మధ్య జరిగే ఈ ప్రపంచకప్ ఫైనల్ పోరు నవంబర్ 21న అత్యంత వైభవంగా జరగనుంది.
ఈసారి ప్రపంచకప్ తన ప్రారంభ తేదీతో పాటు వినూత్నమైన, ఆసక్తికరమైన ఫార్మాట్ వల్ల కూడా బాగా వార్తల్లో నిలుస్తోంది. మొత్తం 14 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీకి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం క్వాలిఫైయర్ పోరు జరగనుంది.
టోర్నీ ప్రధాన దశలో అత్యల్ప ర్యాంకింగ్స్ ఉన్న మూడు జట్ల మధ్య 'సూపర్ సిరీస్' పేరుతో ట్రై-సిరీస్ నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచే జట్టు ప్రధాన రౌండ్లో ఉండే జట్లతో కలుస్తుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించి, 'సూపర్ సెవెన్' దశ, సెమీఫైనల్స్ ద్వారా నవంబర్ 21న తుది పోరు నిర్వహిస్తారు. చారిత్రక ప్రాధాన్యతతో కూడిన ఈ టోర్నీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది.
Also REad: విరాట్ కోహ్లీకి ఈ టాలీవుడ్ హీరోయిన్ మరదలు అవుతుంది..ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
Also Read: టీమ్ఇండియా ఫ్యాన్స్కు దిమ్మతిరిగే వార్త..భారత్ - శ్రీలంక తొలి టెస్టు రద్దవుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Wife Killed Husband: ఏపీలో దారుణం.. భర్తను గొంతుకోసి చంపిన భార్య.. అనుమానంతో చంపి తల వద్ద దీపం పెట్టింది!
Pakalajeedi, Andhra Pradesh:Wife Killed Husband in AP: కాలం మారుతున్న కొద్దీ వివాహేతర సంబంధాలు, అనుమానాలు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఒకప్పుడు భర్తలు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ఉండగా, ఇటీవల కాలంలో భార్యలే స్వయంగా భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రేమ వివాహం.. ముగిసిన 30 ఏళ్ల కాపురం..
అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఉన్మాద ఘటన చోటుచేసుకుంది. రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కొండ్ల ఇందిర, వెంకటరావు (58) దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, ఒక కూతురికి వివాహం అయింది.
వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్వర్క్లో ఉద్యోగం చేస్తుండగా, ఇందిర స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, గడిచిన మూడేళ్లుగా కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి.
భర్తపై అనుమానంతోనే ఈ అఘాయిత్యం
వెంకటరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొండ్ల ఇందిరతో నిత్యం గొడవలు పడేది. అనకాపల్లిలో ఉన్న కూతురి ఇంటికి వెళ్లి శనివారం తిరిగి వచ్చిన వెంకటరావుపై ఇందిరకు తీవ్ర అనుమానం పెరిగింది.
ఆ మహిళ దగ్గరికే వెళ్లొచ్చాడనే కోపంతో ఊగిపోయిన ఇందిర, పట్టరాని ఆగ్రహంతో కత్తి తీసుకుని భర్త గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. అత్యంత విచిత్రం ఏమిటంటే.. హత్య చేసిన అనంతరం మృతుని తల వద్ద దీపం పెట్టి, నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది.
నిందితురాలిగా అంగన్వాడీ కార్యకర్త
మహిళలకు కుటుంబ సమస్యలపై, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అంగన్వాడీ కార్యకర్తే స్వయంగా ఈ హత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానం పెనుభూతమై ముగ్గురు పిల్లల భవిష్యత్తును, మూడు దశాబ్దాల కాపుారాన్ని చిదిమేసిన ఈ ఘటన చోడవరం ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Also Read: మరోసారి చంద్రబాబు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరం..అసలేం జరుగుతోంది?
Also Read: భారతదేశానికి అర్ధరాత్రే స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 వెనుక జోతిష్య రహస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
