icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

E20 Fuel Protest: కేంద్ర ప్రభుత్వానికి మరో నిరసన సెగ..E20 పెట్రోల్‌పై జూలై 31న రాజధానిలో భారీ ర్యాలీ!

New Delhi, Delhi:

Delhi E20 Petrol Protest: దేశంలో మారుతున్న ఇంధన విధానాలు, వినియోగదారుల ఎంపిక హక్కుల పరిరక్షణ కోసం 'టీమ్ భారత్' (Team Bharat) సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈనెల 31న ఢిల్లీలో 'గాడీ మార్చ్, గాంధీ మార్చ్' పేరుతో భారీ శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగనుంది.

ఆందోళనలకు అసలు కారణం ఏమిటి?
దేశంలో విక్రయిస్తున్న E10, E20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల మైలేజీ భారీగా తగ్గిపోతోందని, ఇంజిన్ రిపేర్ సమస్యలు వస్తున్నాయని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పౌరుల వేదిక అయిన 'టీమ్ భారత్' ఇంధన విధానంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల కోసం ఈ ఉద్యమానికి నడుం బిగించింది.

ఈ ర్యాలీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు కాదని, ఇథనాల్ 20 (E20) విధానంపై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పౌరుల ఉద్యమమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ మార్చ్ ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ప్రారంభమై.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి నివాసాలు, కార్యాలయాల మీదుగా వెళ్లి పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ముగియనుంది.

టీమ్ భారత్ ప్రధాన డిమాండ్లు..
1) E10 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన పాత వాహనాల కోసం మార్కెట్లో E10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి. 

2) E20 పెట్రోల్ ధరపై 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలి. అలాగే ప్యూర్ పెట్రోల్ ధరలను తగ్గించాలి. 

3) E20 ఇంధన విధానానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, సమాచారాన్ని దేశ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి. 

4)2023కి ముందు తయారైన వాహనాలపై E20 పెట్రోల్ చూపుతున్న దుష్ప్రభావాలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

5) చివరగా..ఇథనాల్ విధానం వల్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలి.

వాహనదారులకు పిలుపు 
ఈ ర్యాలీలో కార్లు, బైక్ యజమానులు, కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీమ్ భారత్ పిలుపునిచ్చింది. "మేరీ గాడీ.. మేరా అధికార్", "మేరీ బైక్.. మేరీ చాయిస్", "అవర్ వెహికల్స్.. అవర్ చాయిస్.. అవర్ రైట్" వంటి నినాదాలతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా తమ నిరసన తెలపాలని కోరింది.

ఇథనాల్ విధానంపై వాదనలు..
దేశంలో ఇంధన దిగుమతులను తగ్గించడం, రైతులకు మద్దతునివ్వడం, ఇంధన భద్రతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే, 2023కి ముందు తయారైన వాహనాలపై దీని ప్రభావం వల్ల మైలేజ్ తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంపై వాహనదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదం నేపథ్యంలో జూలై 31న జరగనున్న 'గాడీ మార్చ్' దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also REad: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!

Also REad: CJP Next Target: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. బొద్దింకల పార్టీ టార్గెట్ వీరిపైనే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Siddaramaiah: రాజీనామాతో తీవ్ర అసంతృప్తి.. రాజకీయాలకు మాజీ సీఎం సిద్ధరామయ్య గుడ్‌బై

Mandya, Karnataka:

Siddaramaiah Good Bye To Politics: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నాయకులు సిద్ధ‌రామ‌య్య కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2028లో కర్ణాటకలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌బోన‌ని సిద్ధరామయ్య ప్ర‌క‌టన చేయడం చర్చనీయాంశంగా మారింది. వ‌య‌సు మీద పడడం, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజ‌కీయాలు పెరిగిపోతుండ‌టం కార‌ణంగా తాను ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయాలు అవినీతిమయం
మాండ్య జిల్లాలో ఆదివారం జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య పాల్గొని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాలు అవినీతిమయంగా మారాయని తెలిపారు. ఈ కారణంగా తాను 2028 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్ప‌టికీ తాను రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతానని స్పష్టత ఇచ్చారు. తాను ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తానని.. ప్ర‌జ‌ల కష్టాలపై తన గొంతు విప్పుతానని సిద్ధరామయ్య ప్రకటించారు.

మళ్లీ పోటీ చేయ‌ను
'వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు న‌న్ను మ‌ళ్లీ పోటీ చేయ‌మ‌ని అడుగుతున్నారు. కానీ మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా' అని మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య ప్ర‌క‌టన చేశారు. బహిరంగ సభలో ప్రకటించిన విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక కూడా ఇదే చెబుతూ పస్టు చేశారు. 79 ఏళ్ల వయస్సు ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్‌ పార్టీకి నమ్మిన బంటు. కన్నడ రాజకీయాల్లో అపర చాణక్యుడుగా గుర్తింపు పొందిన సిద్ధరామయ్య మొన్నటి దాకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. 2013 మే 13 నుంచి 2018 మే 16వ తేదీ వరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు 1996- 1999 వరకు, తర్వాత 2004- 2005 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

రాజ‌కీయ జీవితానికి 50 ఏళ్లు
కర్ణాటక రాజకీయాల్లోకి 1978లో సిద్ధ‌రామ‌య్య ప్రవేశించారు. తాలుకా బోర్డు నుంచి అతడి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983 నుంచి నేటి వరకు సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గాలు మారుస్తున్నా కూడా ఎక్కడా ఓటమన్నదే లేకపోవడం విశేషం. 2028వ సంవత్సరం వరకు ఆయన రాజ‌కీయ జీవితానికి 50 ఏళ్లు పూర్త‌వుతాయి. దీంతో అప్పుడు పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.

0
0
Report

KCR: పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం కేసీఆర్‌ ఆందోళన.. కేటీఆర్‌, హరీశ్‌ రావుకు ఫోన్‌

Hyderabad, Telangana:

Peddi Sudarshan Reddy Health Condition: తెలంగాణ ఉద్యమకారుడు.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరంభం నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి గుండెపోటుకు గురవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గుండెపోటుకు గురయ్యారనే సమాచారం అందుకున్న పార్టీ నాయకత్వం వెంటనే అప్రమత్తమై వైద్య సేవలు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంది. పెద్ది సుదర్శన్‌ ఆరోగ్యంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆందోళన చెందుతున్నారు. పెద్ది సుదర్శన్‌కు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వానికి ఆదేశించారు. నిరంతరం కేటీఆర్‌, హరీశ్‌ రావుతో ఫోన్‌లో కేసీఆర్‌ వివరాలు తెలుసుకుంటూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కేసీఆర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్‌కు ఆదేశించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి  ఆరోగ్యంపై పార్టీ ముఖ్య నాయకులను అప్రమత్తం చేశారు. అస్వస్థతకు గురైన విషయం తెలిసి ఆందోళన చెందిన కేసీఆర్ ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.

సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులతో పాటు, పార్టీ నాయకులు కేటీఆర్, హరీశ్‌ రావు, వినోద్ కుమార్‌, వరంగల్‌ జిల్లా నాయకులతో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ తెలిపింది. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచిస్తున్నారని వెల్లడించింది. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య సమాచారాన్ని,. మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న కృషిని వైద్యులు కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని తెలిసీ కేసీఆర్‌ ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం.

ఆరోగ్య స్థితిపై టీపీసీసీ చీఫ్ ఆరా
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు (పీసీసీ) మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడం ఊరటనిచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ప్రాణాలు పోసిన డాక్టర్‌ మమత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఇప్పుడు ప్రాణంతో ఉన్నారు. ఆమె చేసిన ప్రయత్నం అందరినీ కదిలించింది. ఉదయం 8 గంటల నుంచి ఆయనను కాపాడేందుకు ఆమె వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించారు. పలుమార్లు సీపీఆర్  చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తొమ్మిదోసారి పెద్ది సుదర్శన్‌ రెడ్డికి చేసిన సీపీఆర్‌తో పెద్ది సుదర్శన్‌ రెడ్డి గుండె కొట్టుకోవడం ప్రారంభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కావాల్సిన వైద్యం అందిస్తున్నారు. మమత చూపిన చొరవపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ప్రశంసలు కురిపించారు.

0
0
Report
Advertisement
Advertisement

DK Aruna: ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ రెడ్డి సంబరాలు: డీకే అరుణ

Hyderabad, Telangana:

Students Protest: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరగలేదా? రాహుల్ గాంధీ తన వీపు తాను చూసుకోకుండా సందట్లో సడేమియాల వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తప్పుబట్టారు. మీడియాలో కొంతమంది మాట్లాడే మాటలు చదువు సంస్కారం ఉన్న వాళ్లు మాట్లాడారు. నేపాల్, బంగ్లాదేశ్‌ల భారత్ చేస్తామని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో కొందరు చేశారు' అని డీకే అరుణ విమర్శించారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదో తరగతి పేపర్ లీక్ అయ్యింది.. ఇక్కడ ఎవరూ రాజీనామా చేశారు? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ నిలదీశారు. 'దేశ కీర్తి, మోదీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క విషయంపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా లేరు. కానీ నల్ల బట్టలు వేసుకొని మాత్రం రోడ్డుపై ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి చేస్తున్నారు. ఆ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపించే డబ్బుల ముఠాలు ఢిల్లీకి పంపుతున్నారు' అని డీకే అరుణ విమర్శలు చేశారు.

'నీట్ పేపర్ లీక్ అవ్వగానే రద్దు చేసి తిరిగి తక్కువ సమయంలో ఎగ్జామ్ పెట్టీ  పొరపాటును సరిదిద్దారు. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేసే ఒక వ్యక్తి మోదీ నాయకత్వాన్ని అస్తిరపరచాలని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు' మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయితే అప్పుడెందుకు ఎవరు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు.

'విద్యార్థుల ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్ని బయటికి వస్తాయి. భారతదేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులను భారతీయులు సహించరు. నీట్ రద్దు అవ్వగానే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేయలేదు? ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కొట్టేయాలని మోడీ ఇంటి ముందు ధర్నా చేశారు' బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డికు పేపర్ లీక్‌పై మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

'మోదీ నాయకత్వాన్ని చూస్తే మీకెందుకంత బాధా! ఈర్ష్య? నిరసనలో విద్యార్థుల కంటే ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఉన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ అన్నం తినే వారిలా కాకుండా గడ్డి తినే వారిలా మాట్లాడుతున్నారు. దేశ వ్యతిరేకులు విదేశాల నుంచి  ఫుడ్, డబ్బులు పంపించి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ వివరించారు. యువత మంచి మార్గంలో నడిచి దేశ సంప్రదాయాలను కాపాడాలని విన్నవించారు.

'ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ రెడ్డి సంబరాలు చేస్తూ ర్యాలీ తీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కట్టడి చేయడం బీజేపీకి 5 నిమిషాల పని. ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం' అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. 'పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం హయాంలో ఫార్మా ఉద్యోగుల పేపర్ లీక్ అయ్యింది. ఆప్ నాయకులు వచ్చి కూడా ఉద్యమంలో మాట్లాడుతున్నారు' అని వివరించారు. పేపర్ లీకేజీపై శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కఠిన చట్టాల రూపకల్పనకు అందరూ ముందుకి వచ్చి మద్దతు ఇవ్వకుండా.. సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. మోదీ కీర్తిని దెబ్బ తీయాలనే దురాలోచలోనే మాత్రమే ఉన్నారని.. సరైన సమయంలో అందరికీ తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.

0
0
Report

Ram Charan Surgery: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు మరోసారి సర్జరీ..కోయంబత్తూరుకు వెళ్లిన మెగా ఫ్యామిలీ!

Hyderabad, Telangana:

Ram Charan Wrist Surgery: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయమైంది. ఆ సమయంలో సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన చేతికి కట్టుతోనే ప్రత్యక్షమయ్యారు. ఈ గాయానికి త్వరలోనే సర్జరీ అవసరమవుతుందని అప్పట్లో వార్తలు రాగా.. అయితే సినిమా విడుదల దగ్గర పడడంతో ఆ సమయంలో సర్జరీ చేయించుకోవడం వీలు కాలేదు. ఇప్పుడు ఆ సర్జరీ కోసం రామ్‌చరణ్ తన ఫ్యామిలీతో పాటు కోయంబత్తూరు బయల్దేరారు. కోయంబత్తూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఈ సర్జరీ జరగనుంది.

కోయంబత్తూరుకు కుటుంబ సభ్యులు
రామ్ చరణ్‌కు ధైర్యం చెప్పేందుకు, అండగా నిలిచేందుకు ఆయన తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసి, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

సర్జరీ అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ, రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలే విడుదలైన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం దాదాపుగా రూ.400 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా.. హీరో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా అలరించింది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, జగపతిబాబు, రావు రమేష్ వంటి వారు నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోనూ విడుదలై సందడి చేస్తుంది. 

Also Read: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!

Also Read: "ఆ డైరెక్టర్ నగ్నంగా నటించమని చెప్పాడు"..అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ హాట్ కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

6,700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయం.. భువనగిరిలో భారీ అక్రమ దందా!

Hyderabad, Telangana:

Yadadri Bhuvanagiri Rice Mill Fraud: ప్రభుత్వం పేదల బియ్యం కోసం కస్టమ్ మిల్లింగ్ (CMR) కింద కేటాయించిన వేలాది టన్నుల ధాన్యం పక్కదారి పట్టింది. అధికారుల కన్ను పడటంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ రైస్ ఇండస్ట్రీలో జరుగుతున్న భారీ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. సుమారు 6,700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించుకొని.. ఏకంగా రూ.24 కోట్ల మేర గోల్‌మాల్ చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగింది? 
భువనగిరి సమీపంలోని ఓ రైస్ ఇండస్ట్రీస్‌కు పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం.. సీఎంఆర్ (Custom Milling Rice) కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి రైస్ రూపంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంది.

అయితే, ఈ నెల 24వ తేదీన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సదరు రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలను, మిల్లు గోదాముల్లో ఉన్న సరుకుతో సరిపోల్చి చూశారు. ఆ సమయంలో రికార్డుల్లో చూపించిన ధాన్యానికి, అక్కడ ఉన్న నిల్వలకు అస్సలు పొంతన లేకపోవడంతో అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

రూ.24 కోట్ల ధాన్యం మాయం.. 
తనిఖీల సమయంలో గోదాముల్లో ఉండాల్సిన సుమారు 6,700 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఈ భారీ తేడాపై మిల్లు యాజమాన్యాన్ని అధికారులు నిలదీయగా.. వారు సరైన ఆధారాలు చూపలేక నీళ్లు నమలడం.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అధికారులకు పక్కాగా అనుమానం వచ్చింది. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని గ్రహించిన సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ (DM) హరికృష్ణ తక్షణమే చర్యలు తీసుకున్నారు..

ఐదుగురిపై కేసు నమోదు.. 
డీఎం హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ప్రభుత్వ సొమ్మును తప్పుదోవ పట్టించి.. అక్రమాలకు పాల్పడిన రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నూనె వెంకటేశ్వర్లు తో పాటు మరో నలుగురు బాధ్యులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Viral Video: బ్యాంకు మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు

Chennai, Tamil Nadu:

Kayalvizhi Alagiri Video: బ్యాంకులో ఓ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు హల్‌చల్‌ చేశారు. బ్యాంకులో తిట్ల పురాణం అందుకోవడమే కాదు బ్యాంకు మేనేజర్‌నే చెంప ఛెళ్లుమనిపించారు. అతడు ఏమైనా చేశాడా అంటే లేదు. కానీ ఓ విషయమై అతడితో వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా లేచి ఆమె కొట్టారు. చిన్న విషయమై ఆమె రాద్ధాంతం చేయడంతో ఈ సంఘన సంచలనం రేపుతోంది. అయితే దాడి చేసి మాజీ సీఎం మనవరాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేనేజర్‌పై దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని చెన్నైలో అడయార్‌ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్‌ఆర్‌ఐ శాఖ ఉంది. ఈ బ్యాంకు కార్యాలయానికి మాజీ కేంద్ర మంత్రి ఎంకే ఆళగిరి కుమార్తె, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు కయల్విళి అళగిరి వచ్చారు. అయితే బ్యాంకు కొనసాగుతున్న వాణిజ్య సముదాయం యజమాని కయల్విళి అళగిరి. ఇటీవల ఆ భవనంలోని లిఫ్ట్ పని చేయకపోవడంతో బ్యాంక్ శాఖ మేనేజర్ హర్షిన్ సింగ్ మొదట మెయింటెనెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమస్యపై సరైన స్పందన రాకపోవడంతో బ్యాంకు మేనేజర్‌ భవన యజమాని కయల్విళి అళగిరికి ఫోన్ చేసి లిఫ్ట్ సమస్యను వివరించారు.

లిఫ్ట్‌ సమస్యపై ఫోన్ చేసి తనకు ఫిర్యాదు చేయడంతో కయల్విళి అళగిరి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకే ఫిర్యాదు చేస్తారా అని ఈ నెల 20వ తేదీన నేరుగా బ్యాంకుకు ఆమె వచ్చారు. నేరుగా మేనేజర్ ఛాంబర్‌లోకి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగారు. కూర్చుని మేనేజర్‌ ప్రశాంతంగా సమాధానం ఇస్తుండగా ఒక్కసారిగా లేచిన కయల్విళి ఆవేశంలో మేనేజర్ హర్షిన్ సింగ్ చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా తిట్లతో విరుచుకుపడ్డారు. దీనికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయని మేనేజర్‌ను బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తమ బ్యాంకు మేనేజర్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ నమచ్చివాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడయార్ పోలీసులు కయల్విళి అళగిరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, భౌతిక దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి తీవ్ర ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ చేస్తున్నారు. గొప్ప రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా బ్యాంక్ మేనేజర్‌పై దాడికి దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎంత రాజకీయ నాయకురాలు అయినా కూడా ఇలా భౌతిక దాడులు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

0
0
Report

Vivo S2: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. భారత్‌లోకి Vivo S2 రీ-ఎంట్రీ..

Hyderabad, Telangana:

Vivo S2 India Launch: టెక్ దిగ్గజం సంస్థ వివో (Vivo) భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరొక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. గత కొన్ని సంవత్సరాల పాటు విడుదల చేస్తానున్న ప్రకటించి.. ఐకానిక్ S సిరీస్‌ను భారత్‌లో తిరిగి విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. 2019లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వివో S1 తర్వాత.. దాదాపు ఏడేళ్ల తర్వాత వివో S2 మోడల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ క్రమంలో కంపెనీ ఇప్పటికే ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేయగా.. టెక్ వర్గాల్లో ఈ ఫోన్‌పై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6న భారత్‌లో అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. లాంచ్ అయిన కొద్ది రోజులకే.. అంటే ఆగస్టు 11 నుంచి దీనిని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. 

వివో S2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
కంపెనీ ఇంకా పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల OLED ప్యానెల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా సులభంగా అన్‌లాక్ చేయడానికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 8GB RAM వేరియంట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీని స్టోరేజ్ విషయానికి వస్తే.. 128GB (బేస్ మోడల్)తో పాటు 256GB ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ సఫైర్ బ్లూ (Sapphire Blue), రీగల్ బ్రాంజ్ (Regal Bronze)తో పాటు సిల్క్ వైట్ (Silk White) అనే మూడు రాయల్ కలర్స్‌లో లభించనుంది.

ధర వివరాలు..
భారత మార్కెట్లో వివో S2 ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 38,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫుల్ ఆప్షన్స్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ. 42,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. డిజైన్, పనితీరుకు ప్రాధాన్యతనిచ్చే.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ వివో S2 ఒక మంచి ఆప్షన్‌గా నిలవబోతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

సినిమా ఫక్కీలో స్కెచ్.. సిద్ధిపేట ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్!

Hyderabad, Telangana:

Siddipet Latest News: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ ఖైదీ.. పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బైక్ దొంగతనాల కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు సాయికుమార్ తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైక్ దొంగతనాల కేసులో నిందితుడైన సాయికుమార్‌తో పాటు మొత్తం ఏడుగురు ఖైదీలను క్రమశిక్షణా ప్రక్రియలో భాగంగా.. అలాగే జైలు నిబంధనల ప్రకారం.. మెడికల్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్.. పోలీసులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారి దృష్టిని మళ్లించి ఒక్కసారిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఖైదీ మాయమైనట్లు గమనించిన సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ.. అప్పటికే అతడు పరారయ్యాడు.

పరారైన సాయికుమార్ పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలకు తీసుకురాగా ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Also Read: Dharmapuri: అయ్యో.. ధర్మపురిలో తీవ్ర విషాదం.. నిద్రమత్తులో పామును తొక్కిన నాలుగేళ్ల బాలుడు.. ఆ తర్వాత..!

ఖైదీ పరార్ వార్త తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోకి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి.. అతడు ఏ వైపు పరారయ్యాడనే అంశంపై విశ్లేషిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.

Also Read: Dharmapuri: అయ్యో.. ధర్మపురిలో తీవ్ర విషాదం.. నిద్రమత్తులో పామును తొక్కిన నాలుగేళ్ల బాలుడు.. ఆ తర్వాత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

7200mAh భారీ బ్యాటరీతో వివో X300e గుడ్ న్యూస్.. లాంచ్ డేట్, ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Vivo X300e Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ టెక్ దిగ్గజం  వివో నుంచి మరొక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతోంది. వివో X300e (Vivo X300e) పేరుతో ఈ నయా మోడల్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో.. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు, కెమెరా ఫీచర్లు వివిధ సర్టిఫికేషన్ సైట్లలో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo కంపెనీ అధికారిక సమాచారం ప్రకారం.. ఈ Vivo X300e లాంచ్ ఈవెంట్ ఆగస్టు 27న ఘనంగా జరగబోతోంది. కంపెనీ తన దేశీయ మార్కెట్ అయిన చైనాలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతోంది.. టెక్ ప్రియుల కోసం.. ఈ లాంచ్ ప్రోగ్రామ్‌ను కంపెనీ అధికారిక సోషల్ మీడియా సైట్లలో ప్రత్యక్ష ప్రసారం (Live Stream) చేయనున్నారు. లాంచ్‌కు ముందే ఈ పరికరం ప్రధాన ఫీచర్లు లీక్ అవ్వడంతో మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

శక్తివంతమైన ప్రొసెసర్..
ఈ ఫోన్‌లో 6.59-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే క్వాల్‌కామ్‌కు సంబంధించిన మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని గరిష్ట ఫ్రీక్వెన్సీ 3.8GHz గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ అత్యంత సులభంగా మారుతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ ఫోన్ మూడు ప్రధాన వేరియంట్లలో లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్ 8GB RAM + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతోంది. ఇందులో రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక చివరి మోడల్ 12GB RAM + 512GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.. ఇందులోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో అందుబాటులో ఉంది. ఇక మూడవ కెమెరా 8 మెగాపిక్సెల్ సెన్సార్‌కు కూడా కలిగి ఉంటుంది. ఫ్రంట్ భాగంలో కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇతర ఫీచర్లు..
ఈ ఫోన్‌లో రోజంతా వినియోగించుకునేందుకు ఎంతో శక్తివంతమైన 7200mAh భారీ బ్యాటరీని అందించారు. దీనితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మొత్తం మూన్‌లైట్ వైట్ (Moonlight White), సన్‌లైట్ ఆరెంజ్ (Sunlight Orange)తో పాటు మిడ్‌నైట్ బ్లాక్ (Midnight Black) కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులో కంపెనీ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, NFCతో పాటు బ్లూటూత్, WLAN, USB కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Chandrababu: ఎన్నికలపై చంద్రబాబు కీలక ప్రకటన.. మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం

Amaravathi, Andhra Pradesh:

TDP Door To Door Programme: 'స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలి. టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. బూత్ కన్వీనర్లు సహా వివిధ పార్టీ హెదాల్లో పని చేసిన వారు బాధ్యతతో పని చేయాలని సూచించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయాలి.. ప్రజలు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలని చెప్పారు. తనకు కావాల్సింది అనుచరులు కాదు.. పార్టీకి నాయకులు కావాలని చెప్పారు.

తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్ల కూటమి పాలనపై రేపటి నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమంపై సమీక్ష చేశారు. గత ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని.. సీట్లల్లో 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించగలిగామని గుర్తుచేశారు.

'నాటి ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసంతోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. టీడీపీ సహా కూటమి పార్టీలు చేసిన పోరాటాలు.. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతో మంచి మెజార్టీలు సాధించగలిగాం. ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేపడుతున్నాం.. నిరంతరం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 'సమస్యలకు పరిష్కారం చూపగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. నాయకత్వ నైపుణ్యం పెంచుకోవాలి' అని సూచించారు.

'ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలి. ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలి... వారికి అర్థమయ్యేలా వివరించాలి' అని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ యంత్రాంగం మొత్తం అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ ఏమరుపాటు వద్దు.. ప్రజలకు నచ్చని, వారు మెచ్చని పనులు చేయకూడదని పార్టీ నాయకత్వానికి హితవు పలికారు.

'రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కచ్చితంగా కొనసాగాల్సిందే... ఇది ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలి. యువత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు... యువతను గొడ్డలి పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశాలను వివరించాలి. యువత భవితకు.. వాళ్ల ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' అని టీడీపీ నాయకత్వానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.

'డబ్బులు ఉన్నాయని ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో గొడ్డలి పార్టీ వ్యవహరించింది. కేవలం డబ్బులతోనే ప్రజాభిమానాన్ని పొందలేం' అని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. 2024 ఎన్నికలతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించాలని సూచించారు. 'గొడ్డలి (వైఎస్సార్‌సీపీ) పార్టీ విధానాలు.. తప్పుడు పద్దతులను ప్రజల్లో ఎండగట్టాలి. ఘోర ఓటమి చెందినా... ఇప్పటికీ సమాజంలో చిచ్చును రాజేస్తోంది. గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రజలతో నిత్యం ఇంటరాక్ట్ అయితే గొడ్డలి పార్టీ కుట్రలను ఎక్స్ పోజ్ చేయవచ్చు. నిరంతరం ప్రజల్లో ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఇది అగ్ర స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి నేతల వరకు వర్తిస్తుంది' అని టీడీపీ నాయకత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

0
0
Report

AP Weather Alert: బంగాళాఖాతంలో అలజడి..వాయుగుండంగా మారిన అల్పపీడనం! ఆ జిల్లాల్లో అలర్ట్!

Visakhapatnam, Andhra Pradesh:

AP Cyclone Weather Alert: వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

వాయుగుండం ప్రభావం
ఇది వాయువ్య దిశగా పయనిస్తూ, రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా మారి, భారీ అలలు ఎగసిపడే సూచనలు ఉన్నాయి.

మత్స్యకారులకు హెచ్చరిక 
ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలను ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎల్ నినో ప్రభావం, విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రాబోయే బుధవారం వరకు రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: దేశంలో భారీ వర్షాల హెచ్చరిక.ఈ 3 రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్'..ఐఎండీ సూటిగా వార్నింగ్!

Also Read: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఘోర ప్రమాదం..ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top