icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Vaibhav Sooryavanshi: సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన బుడ్డోడు.. వైభవ్‌ సూర్యవంశీ ఘనత ఇదే!

Wadgaon, Maharashtra:

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో తన పరుగులతో ఊచకోత కోస్తున్న బుడ్డోడు వైభవ్‌ సూర్యవంశీ భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌లకు జాతీయ జట్టులో వైభవ్‌ సూర్యవంశీ ఎంపికయ్యాడు. జట్టుకు ఎంపికవడంతో వైభవ్‌ సూర్యవంశీ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అధిగమించాడు. అతి పిన్న వయసులో భారత జట్టులోకి వచ్చిన ప్లేయర్‌గా వైభవ్‌ రికార్డు నెలకొల్పాడు. ఇన్నాళ్లు సచిన్‌ పేరిట ఉన్న రికార్డును పోరడు తిరగరాశాడు. 

భారత జట్టు నుంచి పిలుపు రావడంతో సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్‌ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. 2026 జూన్‌లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం సీనియర్ పురుషుల టీ20 అంతర్జాతీయ జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  
15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ తర్వాత భారత జాతీయ జట్టుకు తొలిసారిగా పిలుపు లభించింది. 

జూన్ 2026లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన కోసం సీనియర్ పురుషుల టీ20 జట్టుకు ఎంపికై వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్‌ 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికవగా.. వైభవ్‌ 15 ఏళ్ల వయసులో ఎంపికయ్యాడు. భారత జట్టులోకి సచిన్‌ టెండూల్కర్‌ 16 ఏళ్ల 205 రోజులకు రాగా.. వైభవ్‌ సూర్యవంశీ 15 సంవత్సరాల 71 రోజుల వయస్సులో భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. దీంతో క్రికెట్‌ దేవుడు టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి భారత క్రికెట్ జట్టులో ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. 

ఐర్లాండ్‌ టూర్‌
భారత జట్టు రెండు టీ20 మ్యాచ్‌ల కోసం జూన్ 26, 28 తేదీలలో ఐర్లాండ్‌కు వెళ్లనుంది. 
ఇంగ్లండ్‌ టూర్‌
జూలై 1 నుంచి 11 మధ్య ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌షిబ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్‌ సూర్యవంశీ.

తెలంగాణకు చెందిన తిలక్‌ వర్మకు ప్రమోషన్‌ లభించింది. ఆసియాకప్‌లో అదరగొట్టిన తిలక్‌వర్మ అనంతరం ఐపీఎల్‌లో దుమ్మురేపాడు. నిలకడగా ఆడుతూ అద్భుతాలు చేస్తున్న తిలక్‌కు బీసీసీఐ వైస్‌ కెప్టెన్‌గా పదోన్నతి కల్పించింది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహించనుండగా.. మన తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. పదోన్నతి లభించడంతో తిలక్‌ వర్మ కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

0
0
Report

Buchi Babu Apology: ఎట్టకేలకు జాన్వీ కపూర్‌కు క్షమాపణ చెప్పిన 'పెద్ది' డైరెక్టర్..సినిమాలో ఆ సీన్లు కట్‌ చేస్తానని హామీ!

Hyderabad, Telangana:

Buchi Babu Apology To Janhvi Kapoor: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కలయికలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇటీవలే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ సీన్లపై వస్తున్న విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు.

సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, అలాగే కొన్ని సీన్లపై ప్రేక్షకుల నుంచే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా సినిమాపై వస్తున్న విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించడమే కాకుండా.. తన తప్పును అంగీకరిస్తూ సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతు పోస్టు పెట్టాడు.

"క్షమాపణలు కోరుతున్నా: బుచ్చిబాబు"
దర్శకుడు బుచ్చిబాబు ఆ పోస్టు ద్వారా స్పందిస్తూ.. మహిళల పట్ల తనకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంటుందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఒక దర్శకుడిగా సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడం, వారిలో స్ఫూర్తి నింపడమే నా లక్ష్యం. ఎవరినీ అసౌకర్యానికి గురిచేయాలనో, అగౌరవపరచాలనో నేను అనుకోలేదు. 'పెద్ది' సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న అభ్యంతరాలు, విమర్శలను మేము చాలా తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలకు నేను ఇచ్చే గౌరవం ఎప్పటికీ తగ్గదు. ఎవరినైనా అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు మీ మనోభావాలను దెబ్బతీసి ఉంటే.. అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

అభ్యంతర సన్నివేశాల్లో మార్పు!
అభ్యంతరాలు, విమర్శలు తీవ్రం కావడంతో ఆయా సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించడమో లేదా మార్పులు చేయడమో చేస్తున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను గమనించిన వెంటనే, వివాదస్పద సన్నివేశాల్లో మార్పులు చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. 

ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుందని, భవిష్యత్తులో కథలు రాసుకునేటప్పుడు అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని బుచ్చిబాబు చెప్పారు.

ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలని, రాబోయే రోజుల్లో మహిళలను మరింత శక్తిమంతంగా చూపించే కథలను చెప్పడానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 'పెద్ది' సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు.

Also REad: హీరోయిన్ త్రిషకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన సీఎం విజయ్..ఉపఎన్నికలో హీరోకి ఛాన్స్!

ALso Read: ప్రియమణి బర్త్‌డే స్పెషల్..42 ఏళ్లు వచ్చినా నీ అందానికి ఎవరూ సాటి రారు ప్రియా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hyderabad Police: బైక్‌ రైడర్లు, కారు డ్రైవర్లకు హైదరాబాద్‌ పోలీసుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Hyderabad, Telangana:

Hyderabad Bike Riders: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొలువుదీరిన హైటెక్‌సిటీ, నాలెడ్జ్‌ సిటీ, టీ హబ్‌ వంటి ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో బైక్‌ రైడర్లు, కారు డ్రైవింగ్‌తో హల్‌చల్‌ చేస్తున్న వారికి హైదరాబాద్‌ పోలీసులు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉల్లంఘించి మరోసారి స్టంట్లు, రైడ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, రాంగ్ పార్కింగ్ చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ముఖ్యంగా వారాంతాలైన శనివారం, ఆదివారం రోజుల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని కూకట్‌పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్ తెలిపారు. డ్రోన్‌ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని, ఎక్కడైనా స్టంట్స్ లేదా అక్రమ రేసింగ్‌లు జరిగిన వెంటనే వీడియో ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

సోషల్ మీడియా ఖాతాలు కూడా..
బైక్ రైడింగ్‌లు, స్టంట్స్ చేస్తూ రీల్స్ రూపొందించి ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో అప్‌లోడ్ చేస్తున్న ఖాతాలను కూడా గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇటువంటి ప్రమాదకర కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని కూడా ఉపేక్షించబోమని ప్రకటించారు. ఐటీ కారిడార్‌ను సురక్షితంగా ఉంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం పోలీసుల బాధ్యత అని డీసీపీ రీతిరాజ్ పేర్కొన్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై భవిష్యత్తులో కూడా ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని తెలిపారు.

విస్తృత తనిఖీలు
హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ పరిధిలోని మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, చాదర్‌ఘాట్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లలో బస చేస్తున్న అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్-ఇన్ రికార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు మరియు అవసరమైన అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

మహిళలకు'స్త్రీ రైడ్‌' కార్యక్రమం
ఓ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతకు సంబంధించి స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 'ప్రస్తుతం 55 టూ వీలర్, నాలుగు ఆటో రైడ్స్‌ను ప్రారంభిస్తున్నాం. జొమాటో, స్విగ్గీలాంటి డెలివరీలలో మగవారిని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మహిళలు రైడ్ సర్వీస్‌లకు ముందుకు రావడం శుభ పరిణామం' అని చెప్పారు. 'మహిళలు డ్రైవింగ్ చేయాలంటే కుటుంబ సహకారం చాలా అవసరమని గుర్తుచేశారు. కొంతకాలంగా మహిళలకు సపోర్ట్ తగ్గడంతో క్యాబ్ సర్వీస్‌ల నుంచి వైదొలిగారు. పోలీసు శాఖలో మహిళా అధికారులకు సమస్యలు ఎదురయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్లగా నియమితులైయిన మహిళలు కష్టాలను దాటుకుంటూ ధైర్యంగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో మహిళా రైడర్స్ సంఖ్యను పెంచే విధంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

0
0
Report
Advertisement

Viral Video: ముక్కులోంచి దూరి నోట్లోకి.. యువతి పామ్‌తో షాకింగ్ స్టంట్.. వైరల్ వీడియో!

Hyderabad, Telangana:

 Snake Through Nose And Mouth Viral Video: సోషల్ మీడియా వేదికగా వ్యూస్‌తో పాటు లైక్స్ కోసం కొందరు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.. ఊహకందని.. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లను చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి అత్యంత ప్రమాదకరమైన ఒక ఘటన ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఒక యువతి ఏకంగా బతికున్న పాముతో చేసిన సాహసం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భయం లేని భామ.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక యువతి ఎలాంటి భయం లేకుండా ఒక సజీవమైన చిన్న పామును తీసుకుంది. చూస్తుండగానే ఆ ప్రమాదకరమైన పామును తన ముక్కు రంధ్రం ద్వారా లోపలికి పంపించింది. అంతటితో ఆగకుండా.. ఆ పామును గొంతు భాగం గుండా కిందికి లాగి.. నోటి గుండా దాని తలను బయటకు తీసింది. ముక్కులోంచి దూరి నోటి ద్వారా బయటికి వచ్చిన ఆ పాముతో ఆమె ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ.. కెమెరాకు ఫోజులు ఇవ్వడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు..

ఈ దృశ్యం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అసలు ఈమె మనిషేనా? ఆ పాము కరిస్తే పరిస్థితి ఏంటి? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఆమె సాహసానికి ఆశ్చర్యపోతుంటే.. మరి కొంతమంది మాత్రం తీవ్రంగా మండిపడుతూ వస్తున్నారు.. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి ప్రాణాంతక స్టంట్‌లు చేస్తున్నారు. ఇది మూగజీవాలను వేధించడమే కాకుండా చూసేవారికి కూడా తప్పుడు సందేశాన్ని ఇస్తుంది అని సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

వైద్య నిపుణులు కూడా ఈ విధమైన ఘటనపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ముక్కుతో పాటు గొంతు భాగాలు అత్యంత సున్నితమైనవని.. పాములో విషపూరితమైన బ్యాక్టీరియా లేదా అది పొరపాటున లోపల కరిస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లను ఎవరు అనుసరించవద్దని.. ఇవి ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్‌లో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Adi Srinivas: రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు: బీజేపీపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్!

Karimnagar, Telangana:

Adi Srinivas News: తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం బిజెపి నాయకులు ప్రభుత్వంపై కక్షగట్టి.. ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా మారుతున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత బిజెపి నేతలకు లేదని ఆయన మండిపడ్డారు. సీఎల్పీ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ అంశాలపై క్లారిటీ ఇచ్చారు..

తుమ్మిడిహెట్టిపై బీజేపీ మౌనం ఎందుకు?
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలను తీర్చి అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో బిజెపి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభావాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులతో పాటు నిధులను తీసుకురావడంలో బిజెపి పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.. స్థానిక ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే వారికి ముఖ్యంగా మారిందని ఆయన విమర్శించారు..

రాజకీయ ఉనికి కోసమే ఇదంతా..
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పై ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు.. రామచంద్రరావు తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ ప్రజా రంజక పాలనపై విమర్శలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన విశిష్టతను వివరిస్తూ.. 150 మీటర్ల ఎత్తులో ఈ బ్యారేజీ నిర్మిస్తే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా.. కేవలం గ్రావిటీ ద్వారానే దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని.. రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని ఆయన భీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బాధ్యత రహితమైన విమర్శలు మానుకొని.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Mobile Recharge: మొబైల్‌ వినియోగదారులకు షాక్.. త్వరలోనే పెరగనున్న రీఛార్జ్ ధరలు!

Hyderabad, Telangana:

Mobile Recharge Price Hike News: దేశంలోని మొబైల్ వినియోగదారులపై మరోసారి రీఛార్జ్ భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే నిత్యవసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి టెలికాం కంపెనీలు త్వరలో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాబోతున్న 3 నుంచి 6 నెలల కాలంలో మొబైల్ టారిఫ్ ధరలు సుమారు 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పరిమితంగానే టారిఫ్ పెంపు ఉంటుంది! 
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ అయిన యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా తాజాగా ఈ టారిఫ్ పెంపుపై కీలక విశ్లేషణ చేశారు.. గతంలో టెలికాం సంస్థలు ఒకేసారి 15 నుంచి 20 శాతం వరకు భారీగా ధరలను పెంచి వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయని ఆయన గుర్తు చేశారు.. అయితే, ఈ సారి అంత భారీ స్థాయిలో కాకుండా పరిమితంగానే ధరల సవరణ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. సుమారు 10 శాతం పెంపుతో కంపెనీలు తమ సగటు ఆదాయాన్ని మెరుగుపరుచుకునే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు..

కారణాలు ఇవేనా? 
దేశంలో 5G సేవల విస్తరణ కోసం టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి.. ఆశించిన స్థాయిలో ఈ సేవల ద్వారా ఆదాయం రాకపోవడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెరిగిన ఖర్చుల వల్ల కంపెనీల పై ఆర్థిక ఒత్తిడి పెరుగుతూ ఉందట.. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకుంటేనే భవిష్యత్తు ప్రాజెక్టులు లాభసాటిగా మారుతాయని కంపెనీలు కూడా భావిస్తున్నాయట.. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియోతో పాటు భారతి ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలు తారిఫ్ పెంపు వైపు అడుగులు వేస్తున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం..

Also Read: Confirm Tatkal Ticket: తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే 100 పర్సెంట్ గ్యారెంటీ!

సామాన్యుడు బడ్జెట్ పై ఊహించని ప్రభావం..
ఈ పెంపు గనుక అమల్లోకి వస్తే నెలవారి, మూడు నెలల ప్లాన్ ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి.. ముఖ్యంగా డేటా తో పాటు వాయిస్ కాల్స్ ఎక్కువగా ఉపయోగించే మధ్యతరగతి తో పాటు సామాన్య ప్రజల నెలవారి బడ్జెట్పై ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపబోతోంది. రానున్న రోజుల్లో కంపెనీలు అధికారికంగా ఈ ధరల పెంపును ఎప్పటి నుంచి అమలు చేస్తాయని దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మార్కెట్ సమాచారాల ప్రకారం.. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల లోపే ఈ టారిఫ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ టారిఫ్ కారణంగా రీఛార్జ్ ధరలు ఎంతవరకు పెరుగుతాయి అనేది చూడాల్సిందే..

Also Read: Confirm Tatkal Ticket: తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ కావాలా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే 100 పర్సెంట్ గ్యారెంటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Budhaditya Rajayoga Effect: జూన్ 15 నుంచి బుధాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి తిరుగులేని ధనలాభం, అదృష్టం మీదే!

Hyderabad, Telangana:

Budhaditya Rajayoga in June Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహ సంచారం ప్రజల జీవితాలపై భారీ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇక జూన్ నెలలో గ్రహ స్థితులు చాలా శుభప్రదంగా మారబోతున్నాయి. ఒక బలమైన మార్పు ఈ సమయంలో సంభవించబోతోంది. జూన్ 15న సూర్య భగవానుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. బుద్ధికి కారకుడిగా భావించే.. బుధుడు ఇప్పటికే అక్కడ సంచార దశలో ఉండడంవల్ల ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం ఎంతో బలమైనదిగా, శక్తివంతమైనదిగా, శుభప్రదం అయిందిగా భావిస్తారు.

బుధాదిత్య అనే పదం బుధ, ఆదిత్య అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. బుధుడు, సూర్యుడు కలిసినప్పుడల్లా కొన్ని రాశుల వారికి ఈ యోగ ప్రభావంతో తెలివితేటలు పెరగడమే కాకుండా.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ సమయంలో వారికి ఆత్మవిశ్వాసం పెరిగి.. వృత్తి జీవితంలో విజయాలు కూడా సాధించగలుగుతారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ యోగ ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఈ  రాశుల వారికి బంపర్ లాభాలు:

మేషరాశి 
మేషరాశి వారికి బుధాదిత్య రాజయోగ ప్రభావంతో ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.. అంతేకాకుండా పెద్ద ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీతం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వ్యాపారంలో కూడా గొప్ప పురోగతి లభించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కుటుంబ సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అందరూ కలిసి ఎంతో బాధ్యతగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు..

వృషభరాశి 
వృషభ రాశి వారికి కూడా ఈ శక్తివంతమైన రాజయోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బాగా ఆలోచించగలుగుతారు. ఈ సమయంలో పనిలో అందరూ మీకు అండగా నిలుస్తారు. అలాగే జీతం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు అద్భుతమైన పదవులు కూడా పొందుతారు. వ్యాపారాలు చేసేవారు కొత్త ప్రాజెక్టులు పొందడమే కాకుండా ఈ సమయంలో సువర్ణ అవకాశాన్ని సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

మిథున రాశి 
బుధాదిత్య రాజయోగ ప్రభావంతో మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. వ్యక్తిత్వం కొత్త రూపాన్ని సంతరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమయంలో అన్ని కష్టమైన పనులు సులభంగా చేయగలిగే అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు. వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా డబ్బుకూరతో తొలగిపోయి.. ఉద్యోగంలో భారీ పురోగతి లభించవచ్చు. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Vaidhriti Yoga: సూర్య, చంద్రుల కలయికతో వైధృతి యోగం.. జూన్ 4 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని ధనలాభం!

Hyderabad, Telangana:

Sun-Moon Conjunction 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం రాశిని మార్చినప్పుడల్లా లేదా సంచారం చేసినప్పుడల్లా అది ఏదో ఒక ప్రభావాన్ని అన్ని రాశుల వారిపై చూపుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక రాశిలో రెండు గ్రహాలక లేక జరిగినప్పుడు కూడా యోగాలను సృష్టిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం లో యోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జూన్ 4వ తేదీన సూర్యచంద్రుల కలయిక జరిగింది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన వైధృతి యోగం ఏర్పడింది. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. 

ఇదిలా ఉంటే వైధృతి యోగ ప్రభావం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీని కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతాయి. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పురోగతి లభించి.. వృత్తి జీవితంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అదృష్టం కూడా సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్..
మేష రాశి 
ఈ శక్తివంతమైన రెండు గ్రహాల సంయోగంతో మేషరాశి వారికి ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభించబోతోంది. అలాగే మీపై అధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తారు. దీంతో పాటు చాలా కాలంగా నిలిచిపోయిన లేదా బాకీలున్న డబ్బులు కూడా తిరిగి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో శాంతితో పాటు సంతోషకరమైన వాతావరణ నెలకొని ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అద్భుతమైన సపోర్టు లభిస్తుంది.. అనుకున్న పనుల్లో అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు..

సింహరాశి 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి సూర్యచంద్ర గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన ప్రభావం ఈ రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వ్యక్తులందరికీ అద్భుతమైన గుర్తింపు లభించబోతోంది. అంతేకాకుండా రాజకీయ వ్యక్తులకు పదవులు కూడా లభిస్తాయి. ఏదైనా ఒక కొత్త వ్యాపారంలో ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపార ఒప్పందాల కారణంగా భవిష్యత్తులో గణనీయమైన ధన లాభాలు పొందగలుగుతారు. మీ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా చురుకుగా ఉంటారు..

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు వైధృతి యోగ ప్రభావంతో జీవితంలో ఉన్న అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కోరుకున్న కంపెనీల్లో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. పనుల్లో ముఖ్యమైన బాధ్యతలు మీ భుజాలపై పడే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కొత్త ఆదాయ మార్గాలు విపరీతంగా ఏర్పడతాయి. దీంతోపాటు ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో పాటు మీ పిల్లలతో ఎంతో ఆనందకరమైన సమయాన్ని గడపగలుగుతారు. దీని కారణంగా మానసిక ఒత్తిడి నుంచి కూడా ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం అద్భుతమైన అదృష్టాన్ని అందించబోతోంది. ముఖ్యంగా వీరి ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కూడా పెంచుకుంటారు. అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు కూడా లభిస్తాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. దీంతోపాటు విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ధన లాభాలు పొందుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Tariff Price Hike: మొబైల్‌ వినియోగదారులకు భారీ షాక్‌? భారీగా పెరగనున్న రీచార్జ్‌ ప్లాన్ల ధరలు

Wadgaon, Maharashtra:

Tariff Price Hike: ఇప్పటికే అన్నీ ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు గ్యాస్‌ ధరలు పెరుగుతున్న వేళ ప్రజల నెత్తిపై మరో భారీ భారం పడబోతున్నది. జీవితంలో నిత్యావసరంగా మారిన మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికామ్‌ సంస్థలు భారీగా తమ టారిఫ్‌ చార్జీల ధరలు పెంచబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. మొబైల్‌ రీఛార్జ్‌ల భారం పెద్ద ఎత్తున పడబోతుందనే వార్తతో మొబైల్‌ఫోన్‌ వినియోగదారుల్లో ఆందోళన ఏర్పడింది.

టెలికాం వినియోగదారులకు త్వరలోనే భారీ షాక్‌ తగలబోతున్నది. మరోసారి మొబైల్‌ రీఛార్జ్‌ల భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో టెలికాం సంస్థలు తమ రీఛార్జ్‌ ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. టారిఫ్‌లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్‌ విశ్లేషకులు, బ్రోకరేజ్ సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టారిఫ్‌ ఛార్జీల పెంపుపై యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 15 నుంచి 20 శాతం చొప్పున భారీగా టారిఫ్‌ ధరలు పెంచగా.. ఈసారి ఆ స్థాయిలో లేకపోయినా భారీగానే పెరగనున్నాయని చెప్పారు. ఈసారి పరిమిత స్థాయిలో ధరల సవరణ ఉండే అవకాశం ఉందని ఓ ఆంగ్ల ప్రధాన మీడియాతో పంచుకున్నారు.

టారిఫ్‌ ధరల పెంపుతోనే టెలికాం రంగంలో ఆదాయ వృద్ధిపై ఆధారపడడం లేదని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్‌ మల్హోత్రా తెలిపారు. అధిక డేటా ప్రయోజనాలు, 5జీ సేవలు, ప్రీమియం ప్లాన్‌లపై వినియోగదారులు దృష్టిసారిస్తుండడంతో వారి నుంచి వచ్చే సగటు ఆదాయం సహజంగానే పెరుగుతోందని వివరించారు. టారిఫ్‌ పెంపు లేకుండానే ఏఆర్‌పీయూ ఏటా 4 నుంచి 5 శాతం మేర పెరుగుతోందని చెప్పారు. ధరలు పెరుగుతున్నా వినియోగదారుల నుంచి వ్యతిరేకత లేకపోవడంతో టెలికామ్‌ సంస్థలు ఛార్జీల పెంపుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. 5జీ సేవల వినియోగం పెరగడం, అధిక విలువ కలిగిన ప్లాన్‌లకు మారుతున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతుండడంతో టెలికాం కంపెనీలకు ఆదాయం పెరుగుతోంది. దీంతో భారీ ధరల పెంపు ప్రభావం వినియోగదారులపై కనిపించడం లేదని విశ్లేషకులు గౌరవ్‌ మల్హొత్రా పేర్కొన్నారు.

బ్రోకరేజ్ సంస్థలు కూడా టారిఫ్‌ ఛార్జీలు భారీగా పెరగనున్నాయిని అంచనా వేశాయి. టెలికాం టారిఫ్‌ల పెంపుపై బ్రోకరేజ్‌ సంస్థలు ఇప్పటికే తెలిపారు. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రధాన సంస్థలు 10 నుంచి 15 శాతం వరకు టారిఫ్‌లను పెంచవచ్చని జెఫరీస్‌ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టారిఫ్‌ ఛార్జీల పెంపుపై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ ధరల పెంపును ప్రకటించలేదు. టారిఫ్‌ ఛార్జీలు పెంచాలంటే టెలికాం కంపెనీలు, మార్కెట్‌ పరిస్థితులు, పోటీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

0
0
Report
Advertisement

Revanth Reddy: పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం: రేవంత్‌ రెడ్డి

Mahbubnagar, Telangana:

Palamuru Lift Irrigation Scheme: 'మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదు. దొంగలకు సద్దులు మోసెటోళ్లు నిన్నమొన్న పాదయాత్ర చేస్తామని మాట్లాడుతున్నారు. పాదయాత్ర కాదు.. కాశీదాక పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు తొలిగిపోవు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నామని తెలిపారు.

Also Read: Palamuru Projects: పాలమూరులో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. లేకుంటే చరిత్ర క్షమించదు: రేవంత్ రెడ్డి

జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రెండురోజులుగా జిల్లా రైతులకోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించా. వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు మనకు తెలుసు. పాలమూరులో ఊరు లేకపోయినా.. పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కొందరిని ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు' అని రేవంత్ రెడ్డి వివరించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు.

'పదేళ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్… ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించాడు' అని వివరించారు. అందుకే మట్టికి పోయినా మనోడే పోవాలని పెద్దలు చెప్పారని.. పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఈ 30 నెలల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 'జైళ్లు కట్టాలని వాళ్లు అనుకుంటే స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నాం. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నాం. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది. పిల్లల్ని చదివించండి.. చదువుకుంటేనే బతుకులు బాగుపడతాయి' అని పేర్కొన్నారు.

ప్రాజెక్టులు పూర్తి కావాలి
'జిల్లాల్లో వలసలు ఆగాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇందిరమ్మ ఇల్లు లేని గూడేలు లేవు. పాలమూరు ప్రజలు మట్టి తీసుడే కాదు మట్టితో కప్పడం కూడా తెలుసు' అని తెలిపారు. పాలమూరు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెడతామని ప్రకటించారు. జిల్లాలో ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయం అని శపథం చేశారు. 'రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. రూ.పది వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేశాం' అని చిట్టా వివరించారు.

అడుగుతాం…కడుగుతాం
'గోదావరి జలాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారు. బీజేపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు? ఎవరు దాగుడుమూతలాడినా, తప్పించుకు తిరిగినా అడుగుతాం…కడుగుతాం.. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. మీరు బురద చల్లినా, తలకిందులుగా తపస్సు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి 90 టీఎంసీలకు ఒప్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని తెలిపారు. 'పాలమూరు బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి… దొంగలు వస్తారు… దోపిడీదారులు వస్తారు. దొంగలకు సద్దులు మోసెటోళ్లతో జాగ్రతగా ఉండండి. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం. 2029లో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం' అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

0
0
Report

Sharmila Rajya Sabha: వైఎస్ షర్మిళకు కాంగ్రెస్ మొండిచేయి..పార్టీని విలీనం చేసినా నో ఛాన్స్!

Hyderabad, Telangana:

Sharmila Rajya Sabha News: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.. అది కాంగ్రెస్ పార్టీలో అయితే మరీ కష్టం! వైఎస్ఆర్ కూతురు అనే బ్రాండ్ ఇమేజ్, సొంత పార్టీ (YSRTP) వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసినప్పుడు లభించిన హామీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఉన్న అత్యంత ఆప్తబంధం.. ఇవేవీ చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పార్లమెంట్‌కు పంపించలేకపోయాయి. కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ రేసులో నిలిచిన షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం గట్టి షాకే ఇచ్చింది.

'ఢిల్లీ' రాయబారం విఫలం!
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి షర్మిల పేరు కర్ణాటక స్థానానికి ప్రముఖంగా వినిపించింది. "నాకు ఇచ్చిన హామీ గుర్తుంది కదా.. రాజ్యసభ సీటు ఇవ్వాలి" అంటూ వారం రోజుల క్రితమే ఆమె అధిష్టానానికి గుర్తు చేశారు. నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఖర్గే సైతం షర్మిలకు రాజ్యసభ హామీ ఉందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఏపీలో పార్టీ గొంతుకను పార్లమెంట్‌లో బలంగా వినిపించాలంటే తనకు ఈ అవకాశం ఇవ్వాలని షర్మిల భావించారు. కానీ, తాజాగా విడుదలైన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

విలీన హామీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటక స్థానాన్ని పొరుగు రాష్ట్ర నేతకు కేటాయించడంపై అక్కడి కాంగ్రెస్ స్థానిక నాయకత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానికేతరులకు ఇస్తే క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానాన్ని హెచ్చరించారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. షర్మిల కేవలం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడానికే పరిమితమయ్యారని, కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయలేదనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరాయి. ఏపీ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ నేతలతో షర్మిలకు సఖ్యత లేకపోవడం కూడా ఆమెకు మైనస్‌గా మారింది. జాతీయ స్థాయిలో పార్టీ అవసరాల దృష్ట్యా ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ పవన్ ఖేరా వంటి కీలక నేతలకు అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తదుపరి వ్యూహం ఏంటి?
ప్రస్తుతం షర్మిల బెంగళూరులోనే ఉన్నారు. డీకే శివకుమార్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు దక్కనందుకు అధిష్టానాన్ని ప్రశ్నించడం కంటే.. ప్రస్తుతానికి వివాదాలకు దూరంగా ఉంటూ ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపైనే ఆమె దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 'సరే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి!' అన్న చందంగా సాగుతోంది ప్రస్తుత షర్మిల రాజకీయ ప్రస్థానం.

Also Read: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?

Also REad: వెండి కొనే వారికి బ్యాడ్‌న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Palamuru Projects: పాలమూరులో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. లేకుంటే చరిత్ర క్షమించదు: రేవంత్ రెడ్డి

Mahbubnagar, Telangana:

Palamuru Pending Projects: పాలమూరులోని ప్రతి ఇంచు సాగునీటితో తడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి కావాలంటే..
రూ.55 వేల కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. వాళ్లు (బీఆర్‌ఎస్‌ పార్టీ) 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా.. 90 శాతం పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యం? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

'రూ.27 వేల కోట్లు పంపులు, లిఫ్ట్‌లకే ఎక్కువ ఖర్చు చేశారు. ప్రజలు అమాయకులు కాదు.. అన్నీ గమనిస్తున్నారు. భూసేకరణ పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీరు నిల్వ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్ణాటక తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు. కేసీఆర్‌కు ఊడిగం చేయడం మాని జిల్లా అభివృద్ధికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. భూసేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని సూచించారు. భూసేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడకుండా ఉంటే అదే పెద్ద సాయం అని పేర్కొన్నారు. తనపై కోపంతో కొడంగల్‌ ఎత్తిపోతలను తొక్కిపెట్టారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 90 టీఎంసీల నీళ్లతో 26 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని.. సాగునీటితో పాటు పరిశ్రమలకూ పెద్ద ప్రయోజనం చేకూరేది అని వివరించారు. 'బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. కమీషన్లు దండుకుని ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు
'బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం భూసేకరణ కూడా చేయలేదు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంపులు, లిఫ్టుల్లో జరిగిన అవినీతిపై నాగం జనార్ధన్‌ రెడ్డి పోరాటం చేశారని తెలిపారు. పాలమూరులో ఏ ఒక్క ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేదని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్‌ఎస్‌ నాయకులకు నరనరాన అబద్దం జీర్ణించుకుపోయింది' అని మండిపడ్డారు.

మనకెందుకు శ్రమ
ఇటీవల పవన్‌ కల్యాణ్‌ వ్యవహారంపై తీవ్ర దుమారం రేపగా.. దీనిపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడలేదు. 'పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. ఇక మనకెందుకు శ్రమ' అని చెప్పి ముగించారు.

0
0
Report
Advertisement

CM Vijay Trisha: హీరోయిన్ త్రిషకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన సీఎం విజయ్..ఉపఎన్నికలో స్టార్ హీరోకి ఎమ్మెల్యే సీటు!

Nagalapuram, Tamil Nadu:

Trisha Raghava Lawrence: తమిళనాట రాజకీయాలు, సినిమా పుకార్లు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తన 'టీవీకే' (TVK) పార్టీతో అఖండ విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి.. హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్ త్రిష త్వరలోనే రాజకీయాల్లో నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందని ప్రచారం సాగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం విజయ్ ఆమెకు షాక్ ఇచ్చి, ఆ స్థానంలోకి మరో స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నట్లు తమిళ పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తిరుచిరాపల్లి సీటు కథేంటి?
విజయ్, త్రిషల మధ్య 'సమ్ థింగ్ సమ్ థింగ్' అంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి త్రిష ఆయనతోనే ఎక్కువగా కనిపిస్తుండటంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. ఆయన తన తిరుచిరాపల్లి స్థానానికి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ తిరుచిరాపల్లి ఉపఎన్నికలో త్రిషను పోటీ చేయించి, గెలిచిన తర్వాత ఆమెకు 'డిప్యూటీ సీఎం' పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆమె తమిళనాడుకు మరో జయలలిత కాబోతుందంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు త్రిషకు విజయ్ హ్యాండ్ ఇచ్చారని, ఆ స్థానం నుండి ఆమెను కాకుండా ఒక స్టార్ హీరోను బరిలోకి దించబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది.

త్రిషకు నో ఛాన్స్!
తిరుచిరాపల్లి ఉపఎన్నిక రేసులో త్రిష స్థానాన్ని భర్తీ చేయబోయే ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అనాథలకు, వికలాంగులకు సేవ చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, త్వరలోనే అధికారికంగా విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. రాఘవ లారెన్స్‌కు ఉన్న సేవా గుణం, ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని, త్రిష కంటే ఆయనే తిరుచిరాపల్లి స్థానానికి సరైన అభ్యర్థి అని విజయ్ భావిస్తున్నట్లు కోలీవుడ్ టాక్ నడుస్తోంది.

ప్రచారంపై నిజమెంత?
ఈ మార్పులపై విజయ్ నుంచి గానీ, టీవీకే పార్టీ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. తమిళనాట మాత్రం ఈ ప్రచారం ఒక ఊపు ఊపుతోంది. మరోవైపు రాజకీయ పక్కన పెడితే, వ్యక్తిగతంగా త్రిష ఇప్పటికీ విజయ్ సరసన కనిపిస్తూనే ఉంది. ఇటీవలే స్టార్ హీరో అజిత్ తల్లి మరణించినప్పుడు కూడా విజయ్, త్రిషలు ఒకే కారులో వెళ్లి పరామర్శించడం విశేషం. మరి ఈ తిరుచిరాపల్లి ఉపఎన్నిక సీటు నిజంగానే లారెన్స్‌కు దక్కుతుందా? లేక ట్విస్టుల మధ్య త్రిషకే లభిస్తుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

Also Read: మద్యం మత్తులో దారుణం..భర్తను కర్రతో చావకొట్టిన భార్య..పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది

Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్..ఇలా అప్లే చేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Peddi Day 1 Collection: రూ.200 కోట్లతో బాక్సాఫీసు బద్దలు కొట్టిన రామ్‌చరణ్..'పెద్ది' సూపర్ హిట్ టాక్!

Hyderabad, Telangana:Peddi Day 1 Collection News: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది' నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ గురించి చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా అప్‌డేట్ ఇచ్చింది. తొలి రోజు దాదాపుగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. అదే విధంగా సినీ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా మరో రూ.40 కోట్లు వచ్చినట్లు.. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ రూ.200 కోట్ల మార్క్‌ను చేరినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
0
0
Report
Advertisement
Advertisement
Back to top