Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajanna Sircilla505302

మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తున్న చైర్ పర్సన్ మాధవి

Jul 22, 2024 12:51:04
Vemulawada, Telangana

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్వేష్‌తో కలిసి మున్సిపల్ వార్డు అధికారులు, జవాన్లు, నీటి సరఫరా సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా నీరు చేరకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, వార్డుల్లో డ్రైన్ల ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీరు పేరుకుపోని మార్గం.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 01, 2026 18:30:54
Hyderabad, Telangana:

Union Budget: 'కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనం. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయం. ఏళ్లు గడుస్తున్నాయి.. బడ్జెట్లు మారుతున్నాయి తప్ప తెలంగాణకు నిధుల కేటాయింపులో చూపుతున్న కేంద్రం వివక్షలో ఎలాంటి మార్పు లేదు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

కేంద్ర బడ్జెట్‌పై ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. 'తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసు లేదు. ఒక్క ప్రాజెక్టుకు ఆర్థిక సాయం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయం ఇది అని ప్రకటించారు.

Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్‌ జగన్‌

'తెలంగాణ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 16 మంది ఎంపీలతో రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ఘోరంగా విఫలమయ్యాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో ఉండి కూడా నిధులు తీసుకురాలేకపోవడం వారి అసమర్థతను చూపుతోందని తెలిపారు. రేవంత్ రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా వాటి ఫలితం మాత్రం శూన్యం అని హరీశ్ రావు విమర్శించారు.

Also Read: IND beat NZ: టీ20 ప్రపంచకప్‌ ముందు భారత్‌ అద్భుతం.. న్యూజిలాండ్‌తో 4-1తో సిరీస్‌ సొంతం

'డిల్లీ పర్యటనలు రాజకీయ ప్రదర్శనలకే పరిమితమయ్యాయి తప్ప, తెలంగాణకు ఎలాంటి లాభం లేదు. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం వల్లే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు కనీస ప్రాధాన్యం లేకుండా పోయింది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు జరిగేది నష్టమే తప్ప లాభం కాదని మరోసారి స్పష్టమైందని చెప్పారు.

'కేంద్ర బడ్జెట్ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకం.. ప్రజలకు వ్యతిరేకం.. రైతులకు కూడా వ్యతిరేకం' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాలకు ఈ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం లేదని తెలిపారు. 'రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాను క్రమంగా తగ్గిస్తూ ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిని తీవ్రంగా దెబ్బతీశారు. కేంద్రం మాటల్లో సహకార సమాఖ్య అంటూ ఆచరణలో రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం ప్రజాస్వామ్య విరుద్ధం' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

'మధ్యతరగతి ప్రజలను పన్ను ఊరట లేదు, ద్రవ్యోల్బణ భారం పట్టించుకోలేదు, ఉద్యోగ కల్పన కాగితాలకే తప్ప వాస్తవ రూపం దాల్చడం లేదు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లయిన నిరుద్యోగం, తయారీ రంగం పతనం, రైతుల సంక్షోభం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. దేశ భవిష్యత్తుపై ఎటువంటి స్పష్టత లేని బడ్జెట్ ఇది.. బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగియటం తీవ్ర నిరాశకు నిదర్శనం అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 18:04:52
Hyderabad, Telangana:

KCR SIT Investigation: 'రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలి అంటే డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్డ. అటెన్షన్ డైవర్ట్ చేయడం, తమ చేతకానితనాన్ని సబ్వర్ట్ చేయడం, పర్వర్ట్ రాజకీయాలు చేయడం. రాష్ట్రంలో రెండేళ్లుగా కాంగ్రెస్ పరిపాలన తీరు ఇలానే ఉంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 'సిట్ చట్టాన్ని గౌరవించలేదు.. బీఎన్‌ఎస్‌ చట్టాన్ని.. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు' అని ఆరోపించారు. కానీ తాము ఒక బాధ్యత కలిగిన పార్టీగా.. తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ విచారణకు హాజరయ్యారని కేటీఆర్‌ తెలిపారు. సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా.. రేవంత్‌ రెడ్డి ఆడించినట్టు ఆడుతున్నా.. కేసీఆర్ మాత్రం చట్టం, న్యాయం మీద గౌరవంతో విచారణకు సహకరించారని వివరించారు.

Also Read: KTR Condemns: కేంద్ర మంత్రులు, రేవంత్‌ రెడ్డి వైఫల్యంతో బడ్జెట్‌లో తెలంగాణకు ఘోర అన్యాయం

హైదరాబాద్‌ నందినగర్‌లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్‌తోపాటు తాము ఏ తప్పు చేయకపోవడంతోనే నిజాయితీగా కేసీఆర్‌ సిట్‌కు సంపూర్ణంగా సహకరించారు. సిట్‌ అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా.. కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలను ప్రజల్లో సృష్టించేలా రెండేళ్లుగా లీకుల రూపంలో ఇస్తూ కాంగ్రెస్ పార్టీ పైశాచిక ఆనందం పొందుతుందో నేటితో ఫుల్ స్టాప్ పెడతుందని ఆశిస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రతిసారి విచారణ అనంతరం పంపే లీకులను విశ్వసించరాదు అని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లీకుల మీద ఆధారపడి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మెయ్యడమే అవుతుంది. అది తిరిగి వచ్చి రేవంత్ రెడ్డి మొహం మీదే పడుతుంది. చెత్త రాజకీయం.. లీకులు, పనికిమాలిన విచారణలు రెండేళ్లు కాలక్షేపం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్లీ కేసీఆర్‌ విచారణ పేరిట ఏదో చేస్తున్నారు అంటూ కథనాలు వండి వారిస్తున్నారు' అని కేటీఆర్‌ మండిపడ్డారు. 'సిట్‌ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో అర్థం కావట్లేదు. మహేష్ గౌడ్ నాయకత్వంలో సిట్ ఉందా లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీనా? లేక బీజేపీనా? అది కూడా మాకు అర్థం కావట్లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

'రెండు సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇవాళ తెలంగాణలో ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ మీద చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. అన్నీ గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

'గులాబీ అధినేత ఇచ్చిన సమాధానాలతో సిట్‌కు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి. తేటతెల్లమై ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్లు తెరుచుకొని ఉంటాయి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్‌ని అడిగింది స్పష్టం ఒక్కటే! ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏదీ జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పి ఉంటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Feb 01, 2026 17:46:28
Gollet, Telangana:ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ, రథోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ నిర్వహించగా భక్తులు తరించిపోయారు. అదేవిధంగా లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం గురించి ఉదయం నుండి వేచి ఉన్న వేలాదిమంది భక్తులు ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు. రథోత్సవం వేళ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగి పోయింది. ట్రాఫిక్ ఇబ్బందులు, తదితర కారణాలతో గర్భగుడిలోని స్వామిని దర్శించుకోని భక్తులు కూడా రథోత్సవం వేళ స్వామి వారిని ప్రత్యక్షంగా తిలకించి తరించిపోయారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
0
comment0
Report
Feb 01, 2026 17:17:11
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తడంతో సరియైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరను దృష్టిలో పెట్టుకొని గంగాపూర్ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకారనే ఉద్దేశంతో అధికారులు సాధారణ ఏర్పాట్లు చేయగా ఊహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఏర్పాట్లు సరిపోక పలు విధాలుగా ఇబ్బందులు పడ్డారు. వేలాది సంఖ్యలో వాహనాలు జాతరకు రాగా సుదూరంలో ఉన్న పార్కింగ్ ప్రాంతానికి వెళ్లలేక పలు వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయలేక అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెబ్బెన నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్ దేవాలయానికి వెళ్లాల్సిన భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనాలను రైల్వే గేట్ అవతల నిలిపివేసి కాలినడకన దేవాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రోడ్డుకిరువైపులా పంటచేన్లు ఉండటంతో వాహనాల పార్కింగ్కు సరైన ఏర్పాట్లు చేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది. ఉదయం సుమారు 10 గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాత్రి 7,8 గంటల వరకు కూడా కొనసాగాయి. ఇక ఎండోమెంట్ అధికారులు కూడా ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లే మెట్లపై షామియానా కర్రలు అడ్డంగా అమర్చడం, షామియానా తాళ్లు ఊడిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దేవాదాయ శాఖ అధికారులు మంచినీటి సౌకర్యం గురించి కూడా అంతగా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. భక్తులకు కొంగుబంగారమైన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చినా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేవనే విమర్శలు వస్తున్నాయి.
0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 17:05:33
Hyderabad, Telangana:

Union Budget 2026 -27: కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో రూపాయి దక్కకపోయినా హర్షం వ్యక్తం చేస్తూ కీలక ప్రకటనలు చేశారు. న్యూఢిల్లీలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందిస్తూ కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించారు. 'భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వ నడుస్తోంది. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాలతో భారత జీడీపీ ఏడు శాతం పెరిగింది. గతేడాది రూ.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది రూ.53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు' అని వివరించారు. 

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

'కేంద్ర బడ్జెట్‌లో అనేక ప్రజారంజక విషయాల మీద దృష్టి పెట్టారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గత బడ్జెట్‌లో మాదిరిగా ఈ ఏడాది రూ.4 లక్షల కోట్లు పెట్టారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్ష్యంతో బడ్జెట్ పెట్టారు' అని ఈటల రాజేందర్‌ తెలిపారు. 'అనేక మందుల మీద దిగుమతి సుంకం తగ్గించారు. క్యాన్సర్‌తో పాటు 17 రకాల మందుల మీద పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారు' అని బీజేపీ ఎంపీ రాజేందర్ వెల్లడించారు.

Also Read: KCR Live Updates: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ.. క్షణ క్షణం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే!

'మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మారిస్తే ఆ పథకమే తీసేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కానీ గత బడ్జెట్‌లో రూ.81 వేల కోట్లు బడ్జెట్ పెడితే ఈసారి రూ.లక్షా యాభైవేల కోట్ల పై చిలుకు బడ్జెట్ పెట్టారు. గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కల్పిస్తుంది' అని మల్కాజిగిరి ఎంపీ రాజేందర్‌ తెలిపారు. 'లక్షలాదిమంది ఆధారపడి ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డైరీ, పౌల్ట్రీ, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది అనడానికి బడ్జెట్ స్పీచ్ సాక్ష్యం' అని చెప్పారు.

Also Read: KTR Condemns: కేంద్ర మంత్రులు, రేవంత్‌ రెడ్డి వైఫల్యంతో బడ్జెట్‌లో తెలంగాణకు ఘోర అన్యాయం

'ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచడం కోసం అనేక పథకాలను ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. వికసిత భారత్ 2047 వైపు ప్రయాణించడానికి ఈ బడ్జెట్ స్పష్టమైన మార్గ నిర్దేశం చేసింది. సేవారంగం మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. ఒరిస్సా- ఆంధ్రప్రదేశ్-తమిళనాడు-కేరళ రాష్ట్రాలకు మినరల్ హబ్‌గా తయారు చేయడం కోసం ప్రత్యేక కారిడార్ ప్రకటించారు' అని ఎంపీ ఈటల రాజేందర్‌ వివరించారు. 'ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఈ బడ్జెట్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగం నుంచి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు ఏం చేయాలి అనే దానిమీద చాలా సునిశితమైన దృష్టితో ఈ బడ్జెట్ ప్రతిపాదన చేశారు' అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 16:38:17
Hyderabad, Telangana:

KTR On Union Budget: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో మరోసారి తెలంగాణకు ఘోర అన్యాయం జరిగిందని ప్రకటించారు. కేంద్ర మంత్రులు, రేవంత్ రెడ్డి ఘోర వైఫల్యంతోనే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని.. మిగిలింది మొండి చెయ్యి మాత్రమేనని మండిపడ్డారు. పుష్కరకాలంగా బీజేపీ తెలంగాణకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని విమర్శించారు. తనపై ఉన్న కేసులను, అవినీతి ఆరోపణల నుంచి ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడం తప్పించ 60 సార్లు ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు.

Also Read: Chandrababu: కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు హర్షం.. ఇది ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్

కేంద్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో కాంగ్రెస్, బీజేపీల వైఖరిని, రాష్ట్రానికి నిధులు తేలేని నిస్సహాయతను ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు.

Also Read: KCR Live Updates: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ.. క్షణ క్షణం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే!

తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పుష్కరకాలంగా వివక్షపూరిత వైఖరి కొనసాగిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షిణతో కలిగిన ప్రయోజనంపై రేవంత్‌ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

బడాబాయ్‌తో దోస్తీ చేసి తెలంగాణకు నిధుల వరద పారిస్తానని ప్రగల్బాలు పలికిన చోటాబాయ్ మాటలు అన్ని బూటకమేనని కేంద్ర బడ్జెట్ సాక్షిగా తేలిపోయిందని కేటీఆర్‌ ప్రకటించారు. బడే భాయ్ – చోటే భాయ్ అనుబంధంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమి సాధించిందో వెల్లడించాలని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల నుంచి కాపాడాలని బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఆరు చిల్లర పైసలు కూడా తేలేని చేతగాని రేవంత్ రెడ్డి ఉండడం దౌర్భాగ్యం అని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన ఢిల్లీ టూర్లన్నీ రాహుల్ గాంధీకి మూటలు మూసేందుకు, తన సొంత ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం, తాను చేసిన కుంభకోణాలపై విచారణ చేయకుండా బీజేపీ నేతల వద్దకు వెళ్లడమే తప్ప తెలంగాణ హక్కుల కోసం గట్టి పోరాటం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. 

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ నాయకులు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ పక్షాన కనీసం గొంతెత్తి అడగకపోవడంతోనే చిల్లిగవ్వ కూడా కేంద్ర బడ్జెట్లో దక్కలేదని కేటీఆర్‌ వాపోయారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని వివక్షతో చూస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 15:49:22
Lahore, Punjab:

Pakistan Boycott India Match In T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా భావించే భారత్ - పాకిస్థాన్ పోరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడం పెను సంచలనంగా మారింది. శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొంటున్నప్పటికీ, ఫిబ్రవరి 15న జరగాల్సిన దాయాదుల పోరుకు మాత్రం దూరం కానుంది.

ప్రభుత్వ అధికారిక ప్రకటన
పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక 'X' ఖాతా ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం.. పాక్ జట్టు శ్రీలంకలో జరిగే ఇతర మ్యాచ్‌లలో పాల్గొంటుంది. అయితే, ఫిబ్రవరి 15, 2026న భారత్‌తో షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లో పాక్ జట్టు మైదానంలోకి దిగదని పాకిస్థాన్ క్రికెట్ ప్రకటించింది. భారత్‌లో భద్రతాపరమైన కారణాలతో బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుండి తొలగించిన తర్వాత పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పాక్ బహిష్కరణ వల్ల కలిగే ప్రభావం
పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరించడం వల్ల నియమావళి ప్రకారం భారత్‌కు రెండు పాయింట్లు లభిస్తాయి. పాక్ జట్టు తన గ్రూప్ స్టేజ్‌లో మిగిలిన జట్లు నెదర్లాండ్స్ (ఫిబ్రవరి 7), USA (ఫిబ్రవరి 10), నమీబియా (ఫిబ్రవరి 18) లతో తలపడనుంది.

బహిష్కరణ వార్తలు ఒకవైపు ఉన్నా, టోర్నీ కోసం పాకిస్థాన్ అత్యంత పటిష్టమైన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం జట్టుకు వెన్నెముకగా నిలవనున్నాడు. అతనితో పాటు ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. శ్రీలంక పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ వంటి స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా పేస్ బాధ్యతలు చేపడతారు. అయితే, స్టార్ బౌలర్ హారిస్ రౌఫ్‌ను తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పాకిస్థాన్ తుదిజట్టు..
సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్, ఫహీమ్ అష్రఫ్, ఖవాజా నఫాయ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ ఖాన్

రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీకి, టోర్నీ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నిర్ణయంపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read; Ambati Rambabu Arrest: నల్లపాడు పీఎస్ వద్ద ఉద్రిక్తత..గడ్డపారతో వచ్చి 'అంబటి' కోసం వెతుకులాట!

Also REad: Defence Budget 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్..5 రాష్ట్రాల బడ్జెట్ సైన్యానికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 15:06:57
Nallapadu, Andhra Pradesh:

Ambati Rambabu Arrest News: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి గడ్డపారతో పీఎస్ ముందుకు వచ్చి హల్‌చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.

మద్యం మత్తులో ఉన్న ఒక టీడీపీ కార్యకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఉన్న కోపంతో గడ్డపార పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కే రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

పీఎస్ ముందే హడావుడి
నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదుటకు వచ్చిన ఆ వ్యక్తి, చేతిలో గడ్డపారను పట్టుకుని "లోపల అంబటి రాంబాబు ఉన్నాడా? బయటకు రమ్మనండి" అంటూ పెద్ద గట్టిగా అరుస్తూ హంగామా చేశాడు. పూర్తిగా మద్యం సేవించి ఉండటంతో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో అతను రెచ్చిపోయాడు.

అప్రమత్తమైన పోలీసులు
స్టేషన్ బయట గడ్డపారతో ఒక వ్యక్తి కేకలు వేయడం గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అతడిని చుట్టుముట్టి, చేతిలో ఉన్న గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గట్టిగా మందలించి అక్కడి నుండి పంపించి వేశారు.

అసలు కారణం ఏమిటి?
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీశాయని, అందుకే ఆవేశంతో ఇలా ప్రవర్తించినట్లు సదరు కార్యకర్త తెలిపినట్లు సమాచారం.

మద్యం మత్తులో పీఎస్ పరిసరాల్లో ఉద్రిక్తతకు కారణమైన సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కొద్దిసేపు నల్లపాడు పీఎస్ వద్ద ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: Union Budget 2026: బడ్జెట్‌లో టెక్నాలజీకి ప్రాధాన్యత..క్రిప్టో రంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం?!

Also Read: Tirupati Laddu Case: శ్రీవారితో పెట్టుకుంటే శిక్ష తప్పదు..తిరుమల అపచారంపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 14:08:42
Hyderabad, Telangana:

India AI mission Budget: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన నేపథ్యంలో క్రిప్టో, బ్లాక్‌చెయిన్ రంగం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా సాంకేతికతకు పెద్దపీట వేయడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బరాజ్ అందించిన విశ్లేషణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో IndiaAI మిషన్‌కు రూ.2,000 కోట్లు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాన్ని పెంచేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రూ.500 కోట్లు కేటాయించడం భవిష్యత్తు సాంకేతికతపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతోంది.

బ్లాక్‌చెయిన్, డీప్-టెక్ అనుసంధానం
ప్రభుత్వం డీప్-టెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిధులను కేటాయించడాన్ని విక్రమ్ సుబ్బరాజ్ స్వాగతించారు. బ్లాక్‌చెయిన్ అనేది కేవలం క్రిప్టో కరెన్సీకి మాత్రమే పరిమితం కాకుండా, డేటా భద్రత, ఆర్థిక లావాదేవీల నమ్మకాన్ని పెంచే ప్రాథమిక సాంకేతికత అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల్లో బ్లాక్‌చెయిన్ ఒక కీలక భాగంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రిప్టో రంగానికి దీర్ఘకాలిక మేలు
ఈ బడ్జెట్ వల్ల క్రిప్టో మార్కెట్‌లో తక్షణమే ధరలు పెరగకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఈ రంగం బలపడటానికి అవసరమైన పునాది పడుతుంది. సాంకేతిక విద్యపై పెట్టిన పెట్టుబడి వల్ల కొత్త టెక్-ప్రతిభావంతులు తయారవుతారు. భారతదేశ అవసరాలకు అనుగుణంగా కొత్త బ్లాక్‌చెయిన్ వినియోగాలను అభివృద్ధి చేయడానికి మెరుగైన మౌలిక సదుపాయాలు లభిస్తాయి.

ఊహాగానాలకు అతీతంగా బ్లాక్‌చెయిన్
AI మాదిరిగానే, బ్లాక్‌చెయిన్ అసలైన విలువ కేవలం ట్రేడింగ్ లేదా లాభాల్లోనే కాకుండా, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఉందని ఆయన వెల్లడించారు. స్వల్పకాలిక మార్కెట్ ఒడిదుడుకుల కంటే, వచ్చే దశాబ్ద కాలంలో ఈ సాంకేతికత సంస్థాగతంగా విస్తరించడం చాలా ముఖ్యమని ఆయన విశ్లేషించారు.

మొత్తంగా, ఈ బడ్జెట్ భారతదేశాన్ని ఒక గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇది క్రిప్టో పరిశ్రమకు, బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లకు భవిష్యత్తులో స్థిరమైన వృద్ధిని అందిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి కోసం సంబంధిత నిపుణులను సంప్రదిస్తే మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Defence Budget 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్..5 రాష్ట్రాల బడ్జెట్ సైన్యానికి!

Also Read: Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటి? తెలుగు రాష్ట్రాలకు కీలక కేటాయింపులు ఇవే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 13:20:48
Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Laddu CBI Report: కుప్పం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై వైకాపా నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారు ఈ జన్మలోనే అనుభవిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారన్న నివేదికల నేపథ్యంలో, గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు.

పవిత్రత కాపాడటమే మా లక్ష్యం
"మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం. నిజాయితీ గల అధికారిగా పేరున్న శ్యామలరావును ఈటీవోగా పంపడం అందులో భాగమే. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక కోరారు. ఆ నివేదికలో కల్తీ నిజమని తేలిన తర్వాతే నేను మీడియా ముందు మాట్లాడాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మహాపాపం.. అపచారం
తిరుమల కొండపై గత ఐదేళ్లలో మహాపాపం జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. "జంతువుల కొవ్వుతో ప్రసాదాన్ని కల్తీ చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. ఇంతటి అపచారం చేసిన వారు వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. దేవుడితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది" అని ఆయన హెచ్చరించారు.

వైకాపా నేతల ప్రవర్తనపై ధ్వజం
కల్తీ వ్యవహారం బయటపడిన తర్వాత వైకాపా నేతలు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. "తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తప్పు వారు చేసి, నన్ను క్షమాపణలు చెప్పమనడం వారి అహంకారానికి నిదర్శనం. ఇలాంటి నేతల గురించి ఏమనాలో భక్తులే నిర్ణయించుకోవాలి" సీఎం చంద్రబాబు అన్నారు.

సామాన్య భక్తుడిగానే నేను..
ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ శ్రీవారి ముందు తాను కేవలం ఒక సామాన్య భక్తుడినేనని చంద్రబాబు పేర్కొన్నారు. "నేను ఎప్పుడూ వైకుంఠ ద్వారం గుండా వెళ్లి దర్శించుకోలేదు. దేవుడిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. అందుకే ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 'సిట్' (SIT) దర్యాప్తుకు ఆదేశించాం" అని వివరించారు.

అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ వంటి ఇతర అంశాలపై ఇప్పుడు మాట్లాడనని చెబుతూనే, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

Also Read: Benefits of Wearing Gold Ornaments: బంగారం ధరిస్తే ఆ రోగాలు రావా? ఆభరణాల వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే!

Also Read: Defence Budget 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్..5 రాష్ట్రాల బడ్జెట్ సైన్యానికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 12:20:10
Mangalagiri, Andhra Pradesh:

Chandrababu Reaction On Union Budget: 'కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్' అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌ను తాను స్వాగతిస్తున్నట్లు.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్‌ సహకరించేలా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందని అభిప్రాయపడ్డారు.

Also Read: KCR Live Updates: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణ.. క్షణ క్షణం లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవే!

కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని కేంద్ర బడ్జెట్‌తో మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉంది. 2047 వికసిత్ భారత్ డెవలప్‌డ్‌ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని వివరించారు. 'ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్‌ బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దిశ అండ్ గతి ఉపకరించేలా బడ్జెట్ ఉంది. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫామ్స్‌కు వెళ్తుంది. రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు' అని కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉందని చెప్పారు.

Also Read: TTD EO: తిరుమల లడ్డూ వివాదంలో కొత్త మలుపు.. టీటీడీ ఈఓ అనిల్‌ సింఘాల్‌ బదిలీ

'హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంది. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయి. బెంగుళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు, తదితర ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయి. హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు అన్ని అనుసంధానం అవుతాయి' అని సీఎం చంద్రబాబు వివరించారు.

'డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ కూడా ఉంది. అత్యంత విలువైన భార ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్  తయారీకి ఉపకరించే అవకాశం ఉంది. ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్ కు రూ.40 వేల కోట్లు పెట్టారు. టెక్స్ టైల్ సెక్టార్‌కు కూడా ఊతమిచ్చారు. మన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుంది. పర్యాటకానికి, హాస్పిటాలిటికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు' అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పారు.

'కొబ్బరి, జీడిపప్పు, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయి. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారు. భారత్ డేటా సెంటర్ల హబ్‌గా తయారవుతుంది. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేంద్ర బడ్జెట్టులో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 10:45:31
Tirupati Urban, Andhra Pradesh:

Muddadi Ravi Chandra: తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని తీవ్ర ఆరోపణలు రావడంతో సిట్‌ విచారణ చేస్తుండగా.. తాజాగా వచ్చిన రిపోర్టులో అలాంటి సాక్ష్యాలు లేవని తేలింది. ఈ క్రమంలో మరోసారి ఏపీ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ ఏర్పడగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ ఈఓగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఈఓగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను 2025 సెప్టెంబర్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి తీసుకువచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవులు లేవు, నెయ్యి లేదు, అంతా కాక్టెయిల్ కెమికల్స్ అని తేల్చడంతో తిరుమల లడ్డూ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈఓ బాధ్యతల నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలు కూడా పూర్తికాకుండానే అనిల్ కుమార్‌ను సాగనంపడం మరో వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

రవిచంద్ర ముద్దాడ ఎవరు?
టీటీడీ కొత్త ఈఓగా ఐఏఎస్‌ అధికారి రవిచంద్ర ముద్దాడను పూర్తి అదనపు బాధ్యతలతో ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర ముద్దాడకు టీటీడీ ఈఓ బాధ్యతలు అదనంగా అప్పగించారు. 1996 బ్యాచ్‌కు చెందిన రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ కేడర్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. వివాదస్పదమైన వందల కోట్ల భూమిని కబ్జా నుంచి కాపాడి ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో మేటి అధికారిగా పేరు పొందిన రవిచంద్ర ముద్దాడ నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

Also Read: Love Affair: ఇద్దరి అబ్బాయిల వేధింపులతో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

కరోనా సమయంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా రవిచంద్ర పని చేశారు. తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించే సమర్ధమైన అధికారిగా గుర్తింపు పొందారు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నా వ్యక్తిగత పేరు కన్నా ప్రభుత్వానికి పేరు రావాలని నిజాయితీగా కష్టపడి పని చేసే అత్యుత్తమ అధికారిగా రవిచంద్ర ముద్దాడ గుర్తింపు తెచ్చుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 10:11:23
Hyderabad, Telangana:

Science Behind Wearing Gold Ornaments: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, పసిడిపై భారతీయులకున్న మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే, మన పూర్వీకులు నగలను కేవలం అలంకరణ కోసమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఒక 'మెడికల్ థెరపీ'లా భావించేవారని మీకు తెలుసా? ముక్కుపుడక నుండి కాలి మెట్టెల వరకు మనం ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉందని పెద్దలు చెబుతున్నారు. భారతీయ సంప్రదాయంలో దాదాపు 36 రకాల ఆభరణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి శరీరంలోని కీలకమైన ఆక్యుప్రెషర్ పాయింట్లపై ప్రభావం చూపిస్తాయి.

లోహాల వెనుక ఉన్న 'థర్మల్' సైన్స్
మనం ధరించే లోహాలు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బంగారం (Gold): ఇది వెచ్చని లోహం. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో శరీర వేడిని నిలుపుకోవడానికి బంగారం అద్భుతంగా పనిచేస్తుంది.

వెండి (Silver): ఇది చలువ చేసే లోహం. శరీరంలోని అధిక వేడిని గ్రహించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే మన దేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వెండి ఆభరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

రాగి (Copper): ఇది శరీరంలోని ఎలెక్ట్రో-మ్యాగ్నెటిక్ శక్తిని సమతుల్యం చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో రాగి సహాయపడుతుంది.

ఆభరణాలు - ఆక్యుప్రెషర్ ప్రయోజనాలు
శరీరంలోని నరాల చివరలు కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. నగలు వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి.

ముక్కుపుడక: ముక్కుపై ఉండే నిర్దిష్ట నరాలను నొక్కడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మహిళల్లో నెలసరి సమస్యలు, ప్రసవ వేదన తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

చెవి రింగులు: చెవి లోబ్స్‌పై ఉండే పాయింట్లు కంటి చూపును మెరుగుపరచడంలో, మెదడు చురుగ్గా పనిచేయడంలో తోడ్పడతాయి.

కాలి మెట్టెలు: బొటనవేలి పక్కన ఉండే వేలికి వెండి మెట్టెలు ధరించడం వల్ల ఆ నరం గర్భాశయం గుండా గుండెకు అనుసంధానమై ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి, మహిళల హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

మన పూర్వీకులు వాతావరణాన్ని బట్టి లోహాలను ఎంచుకునేవారు. అందుకే నడుము పైన బంగారాన్ని, పాదాలకు వెండిని ధరించాలని ఒక నియమం పెట్టారు. బంగారం శరీరంలోని విద్యుత్ శక్తిని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటే, వెండి భూమిలోని ధనాత్మక శక్తిని శరీరంలోకి పంపి పునరుజ్జీవింపజేస్తుంది.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాచీన నమ్మకాలు, సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కోణాలను వివరించడానికి మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

Also REad: Defence Budget 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్..5 రాష్ట్రాల బడ్జెట్ సైన్యానికి!

Also REad: Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటి? తెలుగు రాష్ట్రాలకు కీలక కేటాయింపులు ఇవే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 09:50:03
Hyderabad, Telangana:

Defence Budget 2026 Highlights: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత లభించింది. సరిహద్దుల్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ బడ్జెట్‌లో 15 శాతం పెరుగుదలను ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. మొత్తం రక్షణ బడ్జెట్ ₹7.85 లక్షల కోట్లు (గత ఏడాది ₹6.81 లక్షల కోట్లు)గా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

మూలధన బడ్జెట్ (Capital Outlay): ₹2.19 లక్షల కోట్లు. ఇది కొత్త ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ కోసం కేటాయించిన నిధులు. ఇందులో రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల నమోదైంది.

నౌకాదళానికి 'రాఫెల్-ఎం' బలం
భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రాఫెల్ జెట్లు ఉండగా, ఇప్పుడు నేవీ కోసం ప్రత్యేకంగా రాఫెల్-ఎం (Rafale-M) ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది.

సుమారు 26 లేదా అంతకంటే ఎక్కువ రాఫెల్-ఎం జెట్లను సముద్ర సరిహద్దు భద్రత కోసం కొనుగోలు చేయనున్నారు. ఇది హిందూ మహాసముద్రంలో నేవీ యొక్క వైమానిక శక్తిని రెట్టింపు చేస్తుంది.

ప్రాజెక్ట్ 75I: అధునాతన జలాంతర్గాములు
సముద్ర గర్భంలో భారత సైన్యం పట్టు పెంచుకోవడానికి జలాంతర్గామి రంగానికి భారీ నిధులు అందనున్నాయి. ప్రాజెక్ట్ 75I కింద ఆరు స్టెల్త్ జలాంతర్గాములు కొత్త స్టెల్త్ జలాంతర్గాములను నిర్మించనున్నారు.

ఇవి 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (AIP) టెక్నాలజీతో పనిచేస్తాయి. దీనివల్ల ఇవి ఎక్కువ రోజులు నీటి అడుగునే ఉండి శత్రువుల కంటికి చిక్కకుండా దాడి చేయగలవు.

ఆపరేషన్ సింధూర్ ప్రభావం
పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' తర్వాత దేశ భద్రతపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. మునుపటి దశాబ్దంలో బడ్జెట్ పెరుగుదల 9-10 శాతానికే పరిమితమవ్వగా, ఈసారి 15 శాతానికి పెంచడం దేశ భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతోంది.

ఈ కేటాయింపులు కేవలం ప్రస్తుత ముప్పులను ఎదుర్కోవడమే కాకుండా, రాబోయే దశాబ్ద కాలంలో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళంగా మార్చడానికి పునాది వేయనున్నాయి. కొత్త ఆయుధాలు, ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా వ్యవస్థలతో త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మరింత బలోపేతం కానున్నాయి.

Also REad: Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటి? తెలుగు రాష్ట్రాలకు కీలక కేటాయింపులు ఇవే..

Also REad: Union Budget 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం..పన్ను నిబంధనల్లో భారీ సడలింపులు..టీసీఎస్ తగ్గింపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Feb 01, 2026 09:31:38
Rebbena, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఆదివారం వేలాది వాహనాల్లో భక్తులు పోటెత్తడంతో మధ్యాహ్నం పూట సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు,మహిళలు,వృద్ధులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అన్ని విధాల రవాణా ఏర్పాట్లు, వన్ వే ప్లాన్ సిద్ధం చేసిన ఒకేసారి వేలాది సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జాయిన్ ఎక్కడికి అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నంబాల రైల్వే గేట్ దాటిన తర్వాత ట్రాఫిక్ జామై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఎటు వెళ్లలేక యాతన పడ్డారు. కొంతమంది భక్తులు అయితే తెచ్చుకున్న వాహనాలను వదిలేసి కాలినడకకుండా దేవాలయానికి చేరుకోవడం కనిపించింది. గంటలపాటు ట్రాఫిక్ నిలిచి పోవడం పట్ల అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
0
comment0
Report
Advertisement
Back to top