మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తున్న చైర్ పర్సన్ మాధవి
Vemulawada, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్వేష్తో కలిసి మున్సిపల్ వార్డు అధికారులు, జవాన్లు, నీటి సరఫరా సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా నీరు చేరకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని, వార్డుల్లో డ్రైన్ల ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీరు పేరుకుపోని మార్గం.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
SVSN Varma Resign: ఇన్చార్జ్ పదవి తొలగింపు.. టీడీపీకి పిఠాపురం వర్మ రాజీనామా?
Pithapuram, Andhra Pradesh:Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు గుర్తింపు దక్కడం లేదు. వరుస అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో అతడు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించడంతో వర్మ దిగ్భ్రాంతికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో అతడు భావోద్వేగానికి లోనయి.. కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ అవమానిస్తుండడంతో అతడు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన
పిఠాపురం బాధ్యతల నుంచి తొలగింపు
2024లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్కల్యాణ్కు దక్కింది. ఎన్నో ఏళ్లుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మను ఏమాత్రం సంప్రదించకుండా జనసేనకు టికెట్ ఇవ్వడంతో తీవ్ర వివాదం రాజుకుంది. ఎన్నికలు ముగిశాక.. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వర్మకు పిఠాపురంలో ప్రాధాన్యం లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా వర్మకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.
Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి.. అద్భుత విజయంతో టాప్లోకి సన్రైజర
పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు గౌరవం.. పెద్ద పదవి ఇవ్వాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. సొంత ప్రభుత్వంలో ప్రమోషన్ రావాల్సి ఉండగా.. ఉన్న పదవినే పీకేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి టీడీపీ తొలగించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గంపై నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై వర్మ కలత చెందారు. తనను పదవి నుంచి తొలగించడంతో వర్మ భావోద్వేగానికి లోనయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం వర్మ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో టీడీపీని వీడే అవకాశం కూడా లేకపోలేదని చర్చ జరుగుతోంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నా. రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయి. ఫైనల్గా పార్టీ బాగుండాలనేదే చూడాలి. నారా లోకేష్ నాతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను పూర్తిగా సహకరిస్తా' అని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.
వరుస అవమానాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక వర్మకు ఇంటా బయట ఘోర అవమానాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వర్మకు గుర్తింపు లభించకపోగా.. మిత్రపక్షం జనసేన పార్టీ పవన్ కల్యాణ్ను పట్టించుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో.. ప్రభుత్వ కార్యక్రమాల్లో వర్మకు ప్రాధాన్యం లభించడం లేదు. జనసేన పార్టీ నాయకులు పిఠాపురంలో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే వర్మ పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి పూర్తిగా వదిలేసింది. ఈ నేపథ్యంలోనే వర్మకు నియోజకవర్గంలో పట్టించుకోవడం లేదు. వరుస వివాదాల నేపథ్యంలో వర్మను పక్కనపెట్టారు. ఈ క్రమంలో పదవి నుంచి తొలగించగా.. మనస్తాపానికి లోనయిన వర్మ టీడీపీకి రాజీనామా చేస్తారని చర్చ జరుగుతోంది. తన ఉనికి ప్రశ్నార్థకమైన సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OG Part 2 Shooting: పవర్స్టార్ అభిమానులకు గుడ్న్యూస్..పవన్ కోసం నాని సినిమా పక్కపెట్టిన సుదీప్..షూటింగ్ ఎప్పుడంటే?
Hyderabad, Telangana:OG Part 2 Shooting Update: నేచురల్ స్టార్ నాని అభిమానులకు ఇప్పుడు 'ఓజీ' డైరెక్టర్ సుదీప్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో నాని - సుజీత్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'బ్లడీ రోమియో' షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.
వాయిదాకు కారణం ఏంటి?
ప్రస్తుతం హీరో నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "ది పారడైజ్" అనే భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మొదట 2026 వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2026 ఆగస్టు 21కి వాయిదా పడింది. నాని తన పూర్తి కాల్షీట్లను "ది పారడైజ్" సినిమాకే కేటాయించాల్సి రావడంతో, సుజీత్ సినిమా ఆలస్యమైంది.
'OG 2'పై ఫోకస్
'బ్లడీ రోమియో' షూటింగ్ ప్రారంభానికి 2026 ఆఖరు లేదా 2027 ప్రథమార్థం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో దర్శకుడు సుజీత్ ఖాళీగా ఉండకుండా తన తదుపరి భారీ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం 'OG' సీక్వెల్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను సుజీత్ వేగవంతం చేశారని తెలుస్తోంది. 'OG' సినిమాపై ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని, సీక్వెల్ను మరింత పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో రూపొందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తూనే, నాని డేట్స్ దగ్గరకి వచ్చినప్పుడు 'బ్లడీ రోమియో'ను పట్టాలెక్కించేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి నాని లైనప్లో మార్పులు జరగడం వల్ల 'బ్లడీ రోమియో' కోసం ఫ్యాన్స్ మరికొన్నాళ్లు నిరీక్షించక తప్పదు. అయితే, 'ది పారడైజ్' నుంచి వస్తున్న అప్డేట్స్ నాని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాని కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.
Also Read: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
Also REad: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. ఏపీలో 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన!
Nuzendla, Andhra Pradesh:AP Govt Job Notification: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాష్ట్రంలో 3,220 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం భారీగా భర్తీ చేయనుంది. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలతోపాటు ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఏయే యూనివర్సిటీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హులు ఎవరు? జీతం ఎంత అనే వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్సిటీల వారీ ఖాళీల వివరాలను వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నోటిఫికేషన్లలోని న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక లోపాలను సవరించి, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అత్యధికంగా ఆర్జీయూకేటీలో 660 పోస్టుల భర్తీ చేయనుండగా.. అతి తక్కువగా 63 పోస్టులు ద్రవిడయన్ విశ్వవిద్యాలయంలో భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రకటన త్వరలోనే రానున్నాయి. అర్హులు ఎవరు? జీతం ఎంత? తదితర వివరాలు ఆయా విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యా శాఖ ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ? ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
ఆర్జీయూకేటీ - 660
ఆంధ్ర విశ్వవిద్యాలయం- 523
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం - 265
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం- 219
జేఎన్టీయూ -ఎ - 203
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం- 175
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ - 138
జేఎన్టీయూ (గురజాడ-విజయనగరం) 138
యోగి వేమన విశ్వవిద్యాలయం - 118
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం -106
రాయలసీమ విశ్వవిద్యాలయం- 103
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - 103
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం- 99
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ - 99
జేఎన్టీయూ(కె) - 98
కృష్ణా వర్సిటీ - 86
డాక్టర్ అబ్దుల్ హక్ - 63
ద్రవిడ - 24
మొత్తం ఖాళీలు 3,220
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amanpreet Singh Gill: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
Hyderabad, Telangana:Amanpreet Singh Gill Death: భారత క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. భారత అండర్ 19 జట్టు మాజీ ఆటగాడు, మీడియం పేసర్ అమన్ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్లో కన్నుమూశారు. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం క్రీడలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కోహ్లీ, యువరాజ్లకు సహచరుడు
అమన్ ప్రీత్ సింగ్ గిల్ తన కెరీర్ ఆరంభంలో భారత స్టార్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ను షేర్ చేసుకున్నారు. 2007లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అండర్-19లో సభ్యుడిగా ఉండేవాడు. రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి వారితో కలిసి ఆయన ఆడారు. దేశవాళి క్రికెట్లో పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న సమయంలో దిగ్గజా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ను అమన్ ప్రీత్ సింగ్ పంచుకున్నారు. అమన్ ప్రీత్ సింగ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకోకపోయినా, దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Shocked and saddened to hear about Amanpreet Gill’s passing. Sending prayers and strength to his family and loved ones. Rest in peace. Om Shanti 🙏
— Virat Kohli (@imVkohli) May 7, 2026
అమన్ ప్రీత్ సింగ్ చేసేవాళ్ల క్రికెట్లో పంజాబ్ జట్టు తరఫున 2006 నుంచి 2008 మధ్యలో ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 11 వికెట్లను పడగొట్టారు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో అప్పటి కింగ్స్ 11 పంజాబ్.. ప్రస్తుత పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లో సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు.
Deeply saddened to hear about Amanpreet Singh Gill’s passing. Shared the dressing room in our early days, he was a quiet, hardworking cricketer who loved the game. My heartfelt condolences to his family and loved ones. Rest in peace 🙏🏻 Om Shanti#AmanpreetSinghGill@pcacricket
— Yuvraj Singh (@YUVSTRONG12) May 6, 2026
అమన్ ప్రీత్ సింగ్ గిల్ మరణం వార్త తెలియగానే విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. "పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) అమన్ ప్రీత్ మరణాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ఒక లేక విడుదల చేసింది. పంజాబ్ క్రికెట్ ఆటగాడిగా, సెలక్టర్గా అమన్ ప్రీత్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం" అని పేర్కొంది.
Also Read: RCB Vs MI 2026: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!
Also Read: CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: ప్రకృతి వింత.. ఆవు పాలు తాగుతున్న కింగ్ కోబ్రా.. షాక్ అవుతున్న నెటిజన్లు!
Hyderabad, Telangana:Cobra Drinking Cow Milk Viral Video: ప్రకృతిలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేకపోతూ ఉంటాం.. సాధారణంగా పాము కనిపిస్తే మనుషులైన.. జంతువులైన భయంతో ఆ మెడ దూరం పరిగెడతాయి. ఇక క్రూరమైన విష సర్పం ఎదురైతే ప్రాణభయంతో వణికిపోవడం సర్వసాధారణమే.. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం ఎందుకు భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఒక ప్రమాదకరమైన కింగ్ కోబ్రా.. పచ్చిక మైదానంలో మేతమేస్తున్న ఆవు వద్దకు చేరి నేరుగా పొదుగు నుంచే పాలు తాగిన అరుదైన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి..
ఒక మైదానంలో ఆవు ప్రశాంతంగా మేస్తోంది.. అదే సమయంలో అక్కడికి ఒక భారీ నాగుపాము వచ్చింది.. సాధారణంగా పామును చూసినప్పుడు పశువులు భయపడి అరుస్తూ ఉంటాయి.. లేదంటే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆవు మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటుండగా.. ఆ నాకు పాము మెల్లగా ఆవు వెనక కాళ్ల మధ్యలోకి వెళ్లి పొదుగు పట్టుకొని పాలు తాగడం మొదలుపెట్టింది..
ఈ దృశ్యంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాము ఆవును ఏమాత్రం కాటు వేయడానికి ప్రయత్నించలేదు.. అటు ఆవు కూడా పాము తన పాలు తాగుతున్నప్పటికీ ఎంతో సాధారణంగా నిలబడి మేతమేయడం మీరు చూడొచ్చు. సాధారణంగా నాగుపాము కాటు వేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతూ ఉంటాయి.. కానీ ఇక్కడ ఆ రెండు మూగజీవుల మధ్య ఒక వింతైన అనుబంధం కనిపిస్తుంది. ఈ ఆరుదైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొంతమంది తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వైరల్ అవ్వడం ప్రారంభమైంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ తో పాటు వేళలో కామెంట్ లతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. సాధారణంగా రెండు మూగ జీవుల మధ్య ఉన్న ప్రేమ అంతో ఇంతో కాదని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. పురాణాల్లో పాములకు పాలు పోసే ఆచారాల గురించి విన్నాం కానీ ఇలా ప్రత్యక్షంగా ఆవు పాలు తాగడం చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OnePlus 16 ప్రభంజనం.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో స్మార్ట్ఫోన్ ప్రపంచంలో కొత్త రికార్డు!
Hyderabad, Telangana:OnePlus 16 Leaks: ప్రస్తుతం సోషల్ మీడియాలో వన్ ప్లస్ స్మార్ఫోన్కు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.. ముఖ్యంగా త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోయే OnePlus 16 సిరీస్ మోడల్స్కు సంబంధించిన వివిధ స్మార్ఫోన్స్ ఫీచర్స్ లీక్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా కూడా ఈ సిరీస్కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. ముఖ్యంగా ఈ అత్యంత శక్తివంతమైన సిరీస్ అక్టోబర్లోని విడుదల కాబోతోంది. ఈ స్మార్ఫోన్స్లో గతంలో ఉన్న మోడల్స్ ఫీచర్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా డిజైన్ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ OnePlus 16 స్మార్ఫోన్లోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. దానికి కెమెరా సెట్ అప్. అవును వన్ప్లస్ 16లో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫోటోగ్రఫీని ఊహించని స్థాయికి తీసుకెళ్లేందుకు ఇందులో ఎన్నో రకాల ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. దూరంగా ఉన్న వస్తువులను సైతం స్పష్టంగా నాణ్యంగా చిత్రీకరించేందుకు ఇందులో ఎన్నో రకాల కెమెరా సెన్సార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా ప్రధాన కెమెరా తో పాటు అదనంగా 50MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
ఇక ఈ OnePlus 16 స్మార్ట్ఫోన్స్కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. వన్ ప్లస్ కంపెనీ గతంలో ఫ్లాగ్ షిప్ మొబైల్స్లో కేవలం 5000mAh బ్యాటరీ ని మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, త్వరలో విడుదల కాబోయే ఈ స్మార్ఫోన్ సిరీస్ ఎంతో శక్తివంతమైన 9000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ వన్ ప్లస్ 16 సిరీస్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో (Snapdragon 8 Elite Gen 6 Pro) ప్రాసెసర్ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఈ శక్తివంతమైన ఫీచర్ గేమింగ్తో పాటు మల్టీ టాస్కింగ్ అత్యంత అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా ఈ OnePlus 16 మొబైల్ డిస్ప్లే అన్ని స్మార్ఫోన్స్ కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 1.5K రిజల్యూషన్ OLED డిస్ప్లేతో విడుదల చేసే అవకాశాలున్నాయి. అలాగే ఇది 240Hz రిఫ్రెష్ రేట్ ఉండటం మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకర్షించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ స్మార్ఫోన్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ 24 జీబీ ర్యామ్తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఈ స్మార్ఫోన్ను అక్టోబర్లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ సమయంలోనే కంపెనీకి సంబంధించిన వివిధ రకాల ఫీచర్స్, ధర వివరాలను కూడా వెల్లడించబోతున్నట్లు సమాచారం..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: BRS వర్సెస్ BJP.. కరీంనగర్లో భారీగా పోలీసుల మోహరింపు!
Karimnagar, Telangana:Karimnagar Political Clash Telugu News: కరీంనగర్ జిల్లా కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. రెండు పార్టీల మధ్య చెలరేగిన రాజకీయ సెగలు చివరికి గాలి వానలా మారి.. నగరాన్ని రణరంగాన్ని తలపించేలా చేశాయి.. భారత రాష్ట్ర సమితితో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య తలెత్తిన తీవ్ర గర్షణతో కరీంనగర్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు సవాలుగా మారింది. దీని కారణంగా లాఠీ చార్జ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది..
స్థానిక రాజకీయ అంశాలతో పాటు పరస్పర విమర్శల నేపథ్యంలో.. రెండు పార్టీల కార్యకర్తలు వీధుల్లోకి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మీరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో పరిణామాలు సాధారణ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో పాటు క్యాంప్ ఆఫీస్, ఇతర కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే అవకాశం ఉందన్న నిగావర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు..
ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భారీ బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎంపీ కార్యాలయాల వద్ద వందలాదిమంది పోలీసు బలగాలను మొహరించారు. అంతేకాకుండా కార్యాలయాలకు వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. కార్యాలయాల పరిసరాల్లోకి అపరిచిత వ్యక్తులు గాని.. కార్యకర్తలు గాని రాకుండా 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అదనపు బలగాలను రప్పించి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఇప్పటికే మొహరింపజేసినట్లు తెలుస్తోంది.
ఉద్రిక్తతలు మరింత ముదురకుండా ఉండేందుకు పోలీసు ఉన్నత అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నగరంలోని ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకమైన నిఘవ్యవస్థను కూడా ఉంచిన సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. అంతర్గతంగా రాజకీయ సెగలు ఇంకా చల్లారలేదు.. మీరు పార్టీల ముఖ్య నేతలు తమ కార్యకర్తలను శాంతింప చేయాలని పోలీసులు కూడా కోరుతున్నారు. గంట గంటకు మారుతున్న పరిణామాలతో కరీంనగర్ వాసులు ఉత్కంఠగా గమనిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB Vs MI 2026: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!
Hyderabad, Telangana:RCB Vs MI 2026 Ruled Out: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే తదుపరి మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గత మ్యాచ్కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉండగా.. ఇప్పుడు ఆర్సీబీతో మ్యాచ్కు మరో స్టార్ ఆటగాడు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు, ముంబై మధ్య ఈ ఆదివారం మ్యాచ్ జరగనుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు.. సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కీలక మ్యాచ్కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముంబై రెగ్యులర్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, మే 4న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన గత మ్యాచ్కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా పాండ్యా ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. అదే కారణంతో హార్దిక్ ఆర్సీబీ మ్యాచ్కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ముంబై ఆడిన గత మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సూర్య కుమార్ యాదవ్ రాబోయే ఆర్సీబీ మ్యాచ్కు దూరం కానున్నడని సమాచారం. అయితే దీనిపై ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. మొన్నటి వరకు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లు పరిస్థితి కనిపించినా.. లక్నోపై విజయంతో మరోసారి రేసులో ఉన్నామని ప్రత్యర్థులకు తెలియజేసింది.
హార్దిక్ లేదా సూర్య మాత్రమే కాకుండా, కొంతమంది విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు ప్రముఖ భారత ఆటగాళ్లు కూడా ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్కు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్లో కెప్టెన్గా ఎవరుంటారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లేని సమయంలో.. జట్టుకు తాత్కాలిక కెప్టెన్ ఎవరు అవుతారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. రోహిత్ శర్మతో పాటు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను దక్కించుకునే అవకాశం ఉంది.
Also Read: CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?
Also REad: TVK Vijay Oath: ఎట్టకేలకు సీఎంగా విజయ్ ప్రమాణం..కానీ, ఆ షరతు పెట్టిన తమిళనాడు గవర్నర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?
Nagalapuram, Tamil Nadu:TVK Vijay CM Salary: దశబ్ద కాలంగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు దీటుగా తన మొదటి ఎన్నికల్లోనే విజయ్ ప్రభంజనం సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠం దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆయన ఆస్తులు వివరాలు అఫిడవిట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి.
విజయ్ నికర సంపద వివరాలు..
టీవీకే విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ.630.20 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.404.58 కోట్లు ఉండగా అందులో రూ.213 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే స్థిరాస్తులు రూ.198.62 కోట్ల చెన్నైలో విలువైన ఖరీదైన భవనాలు, కొడైకెనాల్లో భూములు ఇతర వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటితోపాటు టీవీకే విజయ్ వద్ద బీఎండబ్ల్యూ, లక్సస్, టయోటా వెల్ఫేర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
టీవీకే విజయ్ హీరోగా పనిచేసిన రోజుల్లో ఏడాదికి సుమారు రూ.180 కోట్లు వరకు సంపాదించేవారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఓ ఎమ్మెల్యేకు వచ్చే జీతభత్యాలు పొందుతారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కొన్ని అలెవెన్స్లు కూడా పొందుతారు. ఈ విధంగా వార్షిక ఆదాయం రూ.34 లక్షల వరకు ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా టీవీకే విజయ్ నెలకు సుమారు రూ.2.85 లక్షల జీతం రానుంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఆదాయం భారీగా తగ్గినప్పటికీ.. ఆయన బాధ్యతలు, హోదా మాత్రం అమాంతం పెరిగాయి. తనకున్న అశేష ప్రజలను కేవలం బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం చేయకుండా, ప్రజల కష్టాలను తీర్చే 'జన నాయకుడి'గా నిరూపించుకోవడమే తన లక్ష్యమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. వ్యక్తిగత సంపదను పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనం అని విశ్లేషకులు అతని అభిమానులు భావిస్తున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని జాతీయ కథనాల ఆధారంగా పొందుపరిచింది. దీనిపై స్పష్టమైన సమాచారం కోసం జాతీయ ఎన్నికల కమిషన్ అధికార వెబ్సైట్ను సందర్శించగలరు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)
Also Read: TVK Vijay Oath: ఎట్టకేలకు సీఎంగా విజయ్ ప్రమాణం..కానీ, ఆ షరతు పెట్టిన తమిళనాడు గవర్నర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: నిబంధనలు గాలికి.. ఫీజులు ఆకాశానికి.. విద్యాసంస్థలా? వ్యాపార కేంద్రాలా?
Hyderabad, Telangana:Private School Fee Hike In Karimnagar 2026: జూన్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన సరస్వతీ నిలయాలు కాస్త.. కాసుల వర్షం కురిపించే వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రెగ్యులేటర్ కమిషన్ బిల్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని ఆసరాగా చేసుకుని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి సంవత్సరం ఫీజు పెరుగుదల గరిష్టంగా 8 శాతానికి మించ కూడదు.. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,437 ప్రైవేటు పాఠశాలల్లో పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి. అడ్మిషన్ ఫీజు తో పాటు టర్మ్ ఫీజు, స్పెషల్ యాక్టివిటీ ఫీజుల పేరిట 20 నుంచి 30 శాతం వరకు అదనపు భారాన్ని మోపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి..
పాఠశాలల్లో కేవలం విద్యను మాత్రమే అందించాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ.. యాజమాన్యాలు మాత్రం పుస్తకాలతో పాటు నోట్ బుక్స్, యూనిఫామ్స్, బెల్టులతో పాటు టైల్ కూడా తమ వద్ద కొనాలని హుకుం జారీ చేస్తూ ఉన్నాయి. మార్కెట్ ధరల కంటే రెండు మూడు రేట్లు అధిక ధరలకు వీటిని విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందడంలో ప్రైవేటు పాఠశాలలు ముందు స్థానంలో ఉన్నాయి. లోపాయి గారి ఒప్పందాలతో ప్రైవేట్ ప్రచరణ కర్తలు పుస్తకాలను విద్యార్థులపై రుద్దుతున్నారని విమర్శలు కూడా ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి..
ఫీజులను నియంత్రించేందుకు ఉద్దేశించిన రెగ్యులేటరీ కమిషన్ బిల్ 2025 ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం ప్రైవేటు స్కూళ్లకు వరంగా మారింది. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు అడ్డంకులు పడటం లేదు.. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఫీజులు నియంత్రణ కమిషన్ ద్వారా ప్రతి స్కూలు వసూలు చేస్తున్న ఫీజులను తప్పకుండా ఆడిట్ చేయాలని.. నిబంధనలు అతిక్రమించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TVK Vijay Oath: ఎట్టకేలకు సీఎంగా విజయ్ ప్రమాణం..కానీ, ఆ షరతు పెట్టిన తమిళనాడు గవర్నర్!
Nagalapuram, Tamil Nadu:TVK Vijay Oath Ceremony: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నేడు రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్రను మరోసారి కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ క్రమంలో టీవీకే విజయ్ను గవర్నర్ కొన్ని ప్రశ్నలను సంధించినట్లు సమాచారం. అయితే చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై గవర్నర్ పలు కీలక సందేశాలను లేవనెత్తినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఇవే..
మెజారిటీ పై ప్రశ్నలు: ప్రభుత్వం ఉన్న సమీకరణాల ప్రకారం, 113 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీని ఎలా నిరూపించుకుంటారని విజయం గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ స్థిరత్వం: స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎలా నడపగలరని గవర్నర్ విజయం నిలదీసినట్లు సమాచారం.
మద్దతు లేఖలు: టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న పార్టీలు ఏవి? ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించాలని విజయ్ను గవర్నర్ ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం అందుతుంది.
సంఖ్యా బలంపై గవర్నర్ అడిగిన ప్రశ్నలకు టీవీకే విజయ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇవ్వాలని టీవీకే పార్టీ కోరింది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన గవర్నర్ రాజేంద్ర.. సీఎంగా ప్రమాణస్వీకారానికి విజయ్ను ఆహ్వానించారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో టీవీకే విజయ్ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. విజయ్ గెలిచిన రెండు స్థానాల్లో ఒక దానికి రాజీనామా చేయాల్సిన క్రమంలో మిగిలిన 118 ఎమ్మెల్యేల బలాన్ని టీవీకే నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మెజారిటీ లేకుండా ప్రమాణస్వీకారానికి వెళ్తున్న టీవీకే విజయ్కు ఎలాంటి పరిణామాలు ఎదురుకానున్నాయి? అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటారా? లేదా మరోసారి సరైన మద్దతు లేకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jupiters Transit 2026: పునర్వసు నక్షత్రంలోకి దేవగురువు.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు, అన్నీ విజయాలే!
Hyderabad, Telangana:Jupiter Transit In Punarvasu Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో గురు బలం అంటే ఎలాంటి పనులైనా ఎంతో సులభంగా చేయొచ్చు. అదే ఈ గ్రహం ఆ శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మే 14వ తేదీన దేవగురువు గృహస్పతి తన సొంత నక్షత్రంగా పరిగణించే పునర్వాసులలోని రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. పునర్వాసుల నక్షత్రంలో గురుగ్రహం కదలికలు చేయడం కారణంగా ఈ క్రింది రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయం ఆ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా గురు బలం రెట్టింపు పై.. ఆర్థికంగా ఎన్నో అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలనుంచి పరిష్కారం కూడా లభిస్తుంది.
ఈ రాశులవారికి అద్భుతమైన లాభాలు:
మేషరాశి
గురు బలం రెట్టింపు అవడంతో మేషరాశి వారికి ఈ సమయంలో ధైర్యంతో పాటు సౌకర్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. చాలా కాలంగా ఉద్యోగాల్లో మార్పులు లేవనుకుంటున్న వారికి ఈ సమయంలో అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి..
మిథున రాశి
పునర్వాసు నక్షత్రం మూడవ స్థానంలోకి గురుడు ప్రవేశించడం వల్ల మిధున రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితం గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో అద్భుతమైన ఒప్పందాలు కూడా కుదురుతాయి. ముఖ్యంగా పనుల్లో భాషా నైపుణ్యం విపరీతంగా పెరుగుతుంది.. సామాజిక హోదా కూడా పెరిగి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో సంతాన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో వీరు తప్పకుండా శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు పై అధికారుల సపోర్టు కూడా పొంది.. విశేషమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా సృజనాత్మకత కూడా విపరీతంగా పెరిగి భారీ మొత్తంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితులు మరింత బలోపేతం అవుతాయి..
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ గ్రహం అధిపతిగా ఉంటుంది. అలాంటిది నక్షత్ర మార్పులు కారణంగా వీరి జీవితంపై కూడా ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో శుభ సంఘటనలు కూడా జరుగుతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాల్లో గణనీయమైన ఆర్థిక అభివృద్ధి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా లభించబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026: వృషభ సంక్రాంతి 2026 ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు.. కుబేర యోగం పట్టినట్టే!
Hyderabad, Telangana:Sun Transit in Taurus 2026 Effect On Zodiac Telugu: మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలకు సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి సూర్య గ్రహ సంచారాన్ని జ్యోతిష్య పరిభాషలో సంక్రాంతిగా పిలుస్తారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశి కి మారినప్పుడల్లా అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే, వృషభ రాశిలో సూర్యుడి సంచారాన్ని వృషభ సంక్రాంతిగా పిలుస్తారు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ వృషభ సంక్రాంతి కారణంగా మేష రాశితో పాటు కర్కాటక రాశి, ఇలా ఐదు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతుంది. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తిలో పురోగతితో పాటు కీర్తి ప్రతిష్టలు పెరిగి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది..
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు రెండవ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీనికి కారణంగా వీరికి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా వ్యక్తి గత జీవితంలో దీర్ఘకానికి సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ప్రేమ జీవితానికి కూడా ఇది మంచి సమయంగా మారుతుంది. ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి
సూర్యుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాలలో పనులు చేసే వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహరాశి
సూర్యుడి సంచారంతో సింహరాశి వారికి కూడా వివిధ రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా దశమ స్థానంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల జీవితంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. పనుల్లో గొప్ప విజయాలు కూడా సాధించబోతున్నారు. దీంతోపాటు ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అంకితభావంతో పనులు చేసే వారికి ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఏడవ స్థానంలో సంచారం చేస్తాడు. దీని కారణంగా వీరికి వ్యాపారాలపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామి కొంచెం మొండిగా వ్యవహరించినప్పటికీ అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. సంపాదన కూడా పూర్తిగా పెరిగి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో బలమైన స్థానం ఏర్పరచుకునే అవకాశాలున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Suvendu Adhikari PA: కాబోయే సీఎం సువేందు అధికారి పీఏపై కాల్పులు, మృతి
Chhotobainan, West Bengal:Suvendu Adhikari PA: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా ముగియగా.. అనంతరం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రోజులుగా అక్కడక్కడ నిరసనలు, ఆందోళనలతోపాటు దాడులు జరుగుతుండగా ఓ సంచలన సంఘటన చోటుచేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి దారుణ హత్యకు గురయ్యాడు. తుపాకీ కాల్పులు జరపడంతో సువేందు అధికారి పీఏ మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ను ఉలిక్కిపడేలా చేయగా.. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి.. అద్భుత విజయంతో టాప్లోకి సన్రైజర్స్
పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారికి కొన్నేళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా చంద్రనాథ్ రాఠే పని చేస్తుండేవాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సువేందు ఉన్నప్పటి నుంచి చంద్రనాథ్ రాఠే పీఏగా పనిచేస్తుండేవాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడంతోపాటు సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండడంతో పీఏ చంద్రనాథ్ రాఠే బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇంటికి వెళ్లే సమయంలో బుధవారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. చంద్రనాథ్ రాఠే లక్ష్యంగా కాల్పులు చేయడం కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్గ్రామ్ అనే ప్రాంతంలో అర్ధరాత్రి పూట కొందరు దుండగులు దూసుకువచ్చారు. కారులో వెళ్తున్న చంద్రనాథ్ రాఠే లక్ష్యంగా కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలకు కుప్పకూలాడు. వెంట ఉన్న బుద్ధదేవ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రనాథ్ రాఠేను ఆస్పత్రికి తరలించేలోపు మరణించడంతో తీవ్ర విషాదం అలుముకుంది. బుద్ధదేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన పీఏపై కాల్పులు జరపడంతో మరణించిన విషయాన్ని సువేందు అధికారి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో తన పీఏ మృతదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: TVK Success Secret: తమిళనాడులో టీవీకే విజయ్ సునామీ వెనుక ఒకే ఒక్కడు.. ఎవరాయన?
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం సువేందు అధికారి పీఏపై నాలుగు సార్లు కాల్పులు జరిపారు. వాటిలో ఒకటీ మిస్సవగా మూడు బుల్లెట్లు పీఏ చంద్రనాథ్ రాఠేపై దాడి చేశారు. కదులుతున్న కారుపైన కాల్పులు జరపడం స్థానికంగా.. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. తన పీఏ దారుణ హత్యకు గురవడంపై సువేందు అధికారి స్పందించారు. ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించగా.. వారు విచారణ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన మూడో రోజుకే అసంతృప్తులు చెలరేగుతున్నాయి. అధికారం చేపట్టకముందే ఇలా దాడులు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fertilizer Urea Scam: జీ న్యూస్ స్టింగ్ ఆపరేషన్..బ్లాక్ మార్కెట్లో రైతులు సబ్సీడీ యూరియా..రూ.22,000 కోట్ల దందా..
Hyderabad, Telangana:Fertilizer Urea Scam Revealed: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియా గురించి ఇప్పుడో బిగ్ న్యూస్ బయటకొచ్చింది. జీ న్యూస్ ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్వహించిన 'ఆపరేషన్ కిసాన్'లో రైతుల కోసం ఉద్దేశించిన చౌక యూరియాను అక్రమంగా తరలిస్తున్నట్లు బహిర్గతం అయ్యింది. దేశంలోని ప్రముఖ ప్లైవుడ్, MDF ఫ్యాక్టరీలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి.
జీ న్యూస్ నిర్వహించిన ఈ సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా.. రాత్రిపూట మినీ ట్రక్కులలో యూరియాతో నిండిన పసుపు రంగు సంచులను ఫ్యాక్టరీలకు పంపుతున్న అనేక దృశ్యాలు నిఘా కెమెరాలలో రికార్డు చేశారు. రైతులకు సబ్సిడీపై అందిస్తున్న యూరియానే ఈ సంచులలోనిదని ఈ స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది.
రైతుల కోసం సబ్సీడీలో యూరియాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. అయితే ఒక బస్తా యూరియా ఖరీదు సుమారు రూ.3,800 ఉండగా.. దాన్ని రైతులకు సబ్సీడీ ద్వారా రూ.266 లకే అందజేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
ఈ యూరియాను MDF, ప్లైవుడ్ పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తారని విచారణలో తేలింది. పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్ గ్రేడ్ యూరియా ఎంతో ఖరీదైనదిగా అమ్ముడవుతుంది. అయితే రైతులకు భారీ సబ్సీడీతో ఎంతో తక్కువ ధరకి లభిస్తుంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా.. యూరియా బ్లాక్ మార్కెట్లో భారీగా అమ్ముడవుతుండగా, ఆ దందా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది నల్లబజారులో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దేశంలో అత్యధికంగా తయారు చేసే "ప్లైవుడ్ కేంద్రం"గా పిలువబడే హర్యానాలోని యమునానగర్కు స్టింగ్ ఆపరేషన్లో భాగంగా జీ న్యూస్ బృందం చేరుకుంది. అక్కడికి చేరిన తర్వాత సీక్రెట్ కెమెరాల ద్వారా కొందరు బ్రోకర్లు మాట్లాడుతూ.. ఈ దందా ఓ పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఓ వ్యక్తి వెల్లడించారు. అలాగే ఏవైనా దాడులు జరిగే అవకాశం ఉంటే ముందుగా తమకి సమాచారం అందుతుందని తెలిపారు.
స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా.. యూరియా అక్రమ రవాణాలో డీలర్లు, బ్రోకర్లు, రవాణాదారులు, కొన్ని ఫ్యాక్టరీల కీలక పాత్ర గురించి ఇప్పుడు బహిర్గతమైంది. ఇలా యూరియాను అక్రమంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముడవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.20,000 కోట్లు నష్టపోతుందని దర్యాప్తులో తేలింది. అయితే ఇదే విషయమై సంబంధిత కంపెనీలు లేదా వ్యవసాయ శాఖలు ప్రస్తుతానికి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా మరిన్ని విశేషాలు బయటకు రావాల్సి ఉందని స్టింగ్ ఆపరేషన్ చేసిన జీ న్యూస్ టీమ్ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
