Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajanna Sircilla505307

సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేకే మహేందర్ రెడ్డి

Jul 21, 2024 11:09:31
Rudrangi, Telangana

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలకు కట్టుబడి ఉంటుందని, గత ప్రభుత్వం చేసిన అప్పును తగ్గించుకుంటూ మొదటి విడత రూ.32 వేల కోట్లను మాఫీ చేసిందన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, మిగిలిన రెండు విడతల్లో రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందని స్పష్టం చేశారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 16, 2026 17:02:10
Hyderabad, Pashamylaram, Telangana:

HBD KCR: కాంగ్రెస్‌ అధికార బలం.. గూండాగిరి.. దౌర్జన్యం చేసినా కూడా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీలు గెలిచి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు బర్త్‌ డే గిఫ్ట్‌ ఇస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రకటించారు. రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మునిసిపాలిటీల గెలుపును కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బిఆర్ఎస్‌కే పట్టం కట్టింది' అని తెలిపారు. ప్రభుత్వం 420 హమీలు గుప్పించి ఇప్పటికీ ఏం వాగ్దానం నెరవేర్చలేదని చెప్పారు.

Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్‌ రెబెల్స్‌కు సీతక్క మాస్ వార్నింగ్!

'అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి కిడ్నాప్ చేయటం ఎంత వరకు సమంజసం?' రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. అవినీతికి, గతంలో జరిగిన అభివృద్ధికి మధ్య జరిగిన పోరులో అభివృద్ధి విజయం సాధించిందని తెలిపారు. 'ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం' అని ప్రకటించారు.

Also Read: India vs Pakistan: పాకిస్థాన్‌ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం

'పోలీస్, అధికార విభాగం ప్రభుత్వానికి కట్టుబానిసగా పనిచేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్లలు, ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయి. విలువైన భూములపై రేవంత్‌ రెడ్డి, ఆయన అనుచరులకు తమ భూమిలో కన్నుపడింది. అవినీతికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీయే' అని రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. 'పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయటం సంతోషంగా ఉంది. ఈ విజయానికి బాటలు వేసిన మాజీ మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు. ప్రతిపక్షంలో ఉండి కూడా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మునిసిపాలిటీలలో విజయం సాధించటం ఆనందంగా ఉంది. అన్ని మునిసిపాలిటీలలో ఇస్నాపూర్ మునిసిపాలిటీ గెలుపు చాలా ప్రత్యేకమైనది' అని తెలిపారు.

Also Read: IND vs PAK: చెలరేగిన పాకిస్థాన్‌.. ఇషాన్‌ కిషన్‌ శ్రమించినా భారత్‌ స్కోర్‌ ఏడు వికెట్లకు 175

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 14:51:38
Hyderabad, Telangana:

Chiranjeevi Shoulder Surgery Update: మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా చేతికి కట్టు కట్టుకుని కనిపిస్తుండటంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు ఆయన స్వయంగా తెరదించారు. సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తూ, సర్జరీ జరిగిన విషయాన్ని ధృవీకరించారు.

ఇటీవల అల్లు అరవింద్ కుటుంబం అల్లు శిరీష్ వివాహ ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందించిన సమయంలో, ఆయన చేతికి కట్టు ఉండటాన్ని గమనించిన అభిమానులు కంగారు పడ్డారు. దీనిపై చిరు స్పందిస్తూ అసలు విషయం చెప్పారు.

ఏం జరిగింది?
చిరంజీవి తన భుజానికి సంబంధించి ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన భుజానికి ఆర్థోస్కోపీ జరిగినట్లు వెల్లడించారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ నితిన్‌కు చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి నైపుణ్యం వల్ల సర్జరీ ప్రక్రియ అంతా చాలా సౌకర్యవంతంగా సాగిందని పేర్కొన్నారు.

అంతకుముందు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించినప్పుడు కూడా చేతికి కట్టుతోనే కనిపించారు. నొప్పి ఉన్నప్పటికీ అభిమానులతో ఫోటోలు దిగుతూ ఎంతో ఓపికగా గడిపారు. తాజాగా అల్లు అరవింద్ దంపతులు, శిరీష్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి మొదటి శుభలేఖ అందించారు. మెగా-అల్లు కుటుంబాలు కలిసి కనిపించిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్‌కు చిరు చేతి కట్టు మాత్రం టెన్షన్ పెట్టింది.

ప్రస్తుత పరిస్థితి
చిరంజీవి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పటికే తాను సాధారణ జీవితానికి తిరిగి వస్తున్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో పనుల్లో నిమగ్నమవుతానని భరోసా ఇచ్చారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రేయోభిలాషులకు, దీవెనలు అందించిన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Chiru bobby Movie Update: కృతి శెట్టి కాదు..మెగాస్టార్-బాబీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..ఎవరో తెలుసా?

Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 14:31:48
Srisailam, Andhra Pradesh:

Srisailam Bus Accident Today: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలోకి ఒరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం జరిగిన తీరు
శ్రీశైలం ఘాట్ రోడ్డులోని దోర్నాల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే చోట పెద్ద గుంత ఉండటంతో బస్సు అమాంతం అందులోకి ఒరిగిపోయింది. బస్సు గుంతలోకి ఒరిగిపోవడాన్ని గమనించిన తోటి వాహనదారులు వెంటనే స్పందించారు.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండానే ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతలో ఇరుక్కుపోయిన బస్సును బయటకు తీసేందుకు క్రేన్ల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించాలని అధికారులు సూచిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?

Also Read: Visakhapatnam Railway Zone: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ఆరోజే! రాష్ట్రానికి రాబోయే ప్రయోజనాలివే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 13:06:45
Hyderabad, Telangana:

Tata Motors EV Offers: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహించే దిశగా, ఫిబ్రవరి నెలలో తన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVs) భారీ తగ్గింపులను ప్రకటించింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ.3.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, ఈ నెలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

ఈ నెలకు సంబంధించి అత్యధిక తగ్గింపు టాటా కర్వ్ EV పైనే ఉంది. గరిష్టంగా ₹3.80 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పాత స్టాక్ (మోడల్ ఇయర్) ఉన్న వాహనాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కేవలం కర్వ్ మాత్రమే కాకుండా, మిగిలిన ప్రధాన ఈవీలపై కూడా టాటా ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది. 

నెక్సాన్ EV ఫ్యామిలీ ఈవీ సెగ్మెంట్లో టాప్ లో ఉండే ఈ కారుపై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే పంచ్ EV మైక్రో ఎస్‌యూవీ విభాగంలో క్రేజ్ సంపాదించుకున్న పంచ్ ఈవీపై ఈ నెల ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. చివరిగా టియాగో EV బడ్జెట్ ఈవీ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం.

డిస్కౌంట్లు ఎలా నిర్ణయిస్తారు?
ఈ తగ్గింపులు అన్ని కార్లపై ఒకేలా ఉండవు, కింద పేర్కొన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. 2024 లేదా అంతకంటే పాత మోడల్ ఇయర్ స్టాక్ (MY24) వాహనాలపై డిస్కౌంట్లు అత్యధికంగా ఉంటాయి. ఆఫర్లు నగరాలు, డీలర్‌షిప్‌ల ఆధారంగా స్వల్పంగా మారుతుంటాయి. అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కారు ఎందుకు కొనాలి?
పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఈవీ ఖర్చు చాలా తక్కువే కాకుండా కాలుష్యం లేని ప్రయాణాన్ని అందిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను కల్పిస్తున్నాయి.

మీరు టాటా ఎలక్ట్రిక్ కారు కొనే ఆలోచనలో ఉంటే, మీ సమీప టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించి అక్చువల్ స్టాక్, ఫైనల్ ప్రైస్ గురించి తెలుసుకోవడం ఉత్తమం. ఈ నెలలో లభించే భారీ తగ్గింపులను వినియోగించుకుని లక్షల రూపాయలు ఆదా చేసుకోండి.

Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?

Also Read: Kova Bun Controversy: 'కోవా బన్' వలీకి అండగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు..రూ.25 వేల ఆర్థిక సాయం..యూట్యూబర్లపై ఆగ్రహం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 16, 2026 12:44:04
Mulugu, Telangana:

Congress Party Rebels: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన రెబెల్స్‌కు మంత్రి సీతక్క అలియాస్‌ ధనసరి అనసూయ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన వారిని తాను క్షమించనని ప్రకటించారు. 'వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి..ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క హెచ్చరించారు.

Also Read: Telangana: తెలంగాణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక.. దౌర్జన్యం చేస్తున్న కాంగ్రెస్

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ భిక్షపతితోపాటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ కౌన్సిలర్లను సన్మానించిన అనంతరం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించిన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని ఆలోచించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింత నిప్పుల చంద్రకళను ఎన్నుకున్నట్లు వివరించారు. 'అందరికీ చైర్ పర్సన్ కావాలని ఉంటుంది.. కానీ ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. అవకాశాలు రానివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి' అని కాంగ్రెస్‌ కార్యకర్తలకు సీతక్క భరోసా ఇచ్చారు. 'వెన్నుపోటు రాజకీయాలతో ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు' అని స్పష్టం చేశారు.

Also Read: India vs Pakistan: పాకిస్థాన్‌ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం

'సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారు మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి.. ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క తెలిపారు. 'ములుగు పట్టణ అధ్యక్షుడు చింత నిప్పుల భిక్షపతికి గతంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చిన పార్టీ మారలేదు. మనిషిలో చిత్తశుద్ధి ఉంది. కమిట్‌మెంట్‌తో పని చేశాడు. ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ అన్నలాంటివారు. ఆయన కుమారుడు నల్లెల భరత్‌కు ఇంకా చాలా వయసు ఉంది.. మంచి అవకాశాలు వస్తాయి' అని సీతక్క ఓదార్చారు.

Also Read: Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం

'మనల్ని ఓడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా పనిచేసింది. కోట్లు కుమ్మరించినా ప్రజలు మనకే పట్టం కట్టారు. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా' అని సీతక్క తెలిపారు. తనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని.. అందరూ తనకు సమానమేనని ప్రకటించారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 12:17:55
Hyderabad, Telangana:

Solar Eclipse 2026 Time In India: ఈ ఏడాదిలో సంభవించబోయే మొదటి సూర్యగ్రహణం రేపు (ఫిబ్రవరి 15, 2026) ఏర్పడనుంది. ఈ గ్రహణం విశేషాలు, సమయాలు, భారత్‌లో దీని ప్రభావంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యంగా అభివర్ణిస్తున్నారు. ఈ గ్రహణం సమయంలో సూర్యుడు ఒక మెరిసే ఉంగరంలా కనిపిస్తాడు.

సూర్యగ్రహణం అంటే ఏమిటి?
సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యకాంతి భూమిపై పడకుండా చంద్రుని నీడ అడ్డుకుంటుంది. ఈ స్థితిని సూర్యగ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పకుండా, కేవలం మధ్య భాగాన్ని మాత్రమే కప్పి ఉంచడం వల్ల సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపిస్తాడు. దీనినే వార్షిక సూర్యగ్రహణం అంటారు.

గ్రహణం సమయాలు 
భారత కాలమానం ప్రకారం.. గ్రహణం ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 12:31 గంటలకు ప్రారంభంకానుంది. గ్రహణ కాలం సుమారు 2 నిమిషాల 20 సెకన్ల పాటు అగ్ని వలయంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళకు గ్రహణం పూర్తిగా తొలగిపోతుంది.

భారతదేశంలో కనిపిస్తుందా?
అయితే ఈ అగ్ని వలయ సూర్యగ్రహణం భారత్‌లో నేరుగా కనిపించదు. అంటార్కిటికాలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనా వంటి దేశాల్లో దీనిని వీక్షించవచ్చు. భారతదేశంలోని కొన్ని అత్యంత దక్షిణ ప్రాంతాల్లో చాలా స్వల్పంగా పాక్షిక గ్రహణం కనిపించే అవకాశం ఉంది, కానీ అగ్ని వలయ దృశ్యం మాత్రం కనిపించదు.

సూతక కాలం, నియమాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణానికి 12 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. సూతక కాలంలో, గ్రహణ సమయంలో శుభకార్యాలు నిషిద్ధం. పండితుల ప్రకారం.. ఈ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు తీయడం, ఆహారం తీసుకోవడం వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదని మరియు పదునైన వస్తువులను వాడకూడదని పెద్దలు చెబుతుంటారు.

రాశులపై ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహణాలు వ్యక్తుల రాశిచక్రాలపై ప్రభావం చూపుతాయి. ఈ గ్రహణం ఫాల్గుణ అమావాస్య నాడు ఏర్పడుతుండటంతో కొన్ని రాశుల వారు ఆర్థిక, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.

భారత్‌లో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాల నియమాలను పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత, మతపరమైన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఖగోళ దృశ్యాన్ని ఇష్టపడే వారు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్'ను వీక్షించవచ్చు.

Also Read: Chiru bobby Movie Update: కృతి శెట్టి కాదు..మెగాస్టార్-బాబీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..ఎవరో తెలుసా?

Also Read: Kova Bun Controversy: 'కోవా బన్' వలీకి అండగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు..రూ.25 వేల ఆర్థిక సాయం..యూట్యూబర్లపై ఆగ్రహం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
IPInamdar Paresh
Feb 16, 2026 11:54:02
Hyderabad, Telangana:

Married Woman sales her husband to his lover for 15 crores in Bhopal: ఇటీవల భార్యభర్తల బంధం మరీ ప్రశ్నార్థకంగామారింది. ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకుని ఒకరితో మరోకరు అన్యోన్యంగా ఉండేవారు. ఏదైన గొడవలు జరిగితే నాలుగు గోడల మధ్య సర్దుకుని పోయేవారు . కానీ ఇప్పుడు ప్రతిదానికి గొడవలు పడుతున్నారు. చిన్న చిన్న గొడవలకే డైవర్స్ వరకు వెళ్తున్నారు. కొంత మంది హత్యలు చేయడం లేదా సుపారీలు ఇచ్చి చంపించడం చేస్తున్నారు. మరికొంత మంది  ఈ బాధలుభరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇంకొంత మంది అయితే పెళ్లి చేసుకుని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమ సంబంధంకు అడ్డువస్తే ఏ పనిచేయడానికి కైన వెనుకాడటంలేదు.

పెళ్లై, పిల్లలు ఉన్న, 20 ఏళ్ల పాటు కలిసున్న వారితో కూడా విడిపోతున్నారు.ఈ క్రమంలో భోపాల్ లో జరిగిన ఒక దంపతుల గొడవ వార్తలలో నిలిచింది. భోపాల్ లో ఒక మహిళ తన 23 ఏళ్ల రిలేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా రూ. 1.5 కోట్లకు తన మొగుడ్ని అతని ప్రియురాలికి అప్పగించింది. గతంలో టాలీవుడ్ లో ఎస్వీ కృష్ణారెడ్డి  తెరకెక్కించిన శుభలగ్నం మూవీలో ఆమని తన భర్త జగపతి బాబును అతని ప్రియురాలికి అమ్మేస్తుంది. అచ్చం ఈ మూవీ సీన్ భోపాల్ లో రిపీట్ అయ్యింది. 

23 ఏళ్ల క్రితం భోపాల్ కు చెందిన భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఇకతనభార్యతో ఉండలేదని భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Read more: Trisha in TN BJP Chief: విజయ్‌తో ఎఫైర్ అంటూ వ్యాఖ్యలు.. నైనార్ నాగేంద్రన్‌కు త్రిష కౌంటర్.. ఏమనిందంటే..?

వీరిని కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించింది. కానీ డైవర్స్ కావాలని భర్త పట్టుపట్టాడు. దీంతో భార్య తనకు 1. 5 కోట్లిస్తే డైవర్స్ ఇస్తానని చెప్పింది. ఈ డిమాండ్ కు భర్త,అతని ప్రియురాలు అంగీకరించడంతో ఒప్పందం జరిగింది.తన భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వడంతో పాటు, రూ.27 లక్షల నగదు చెల్లించారు. దీంతో ఫ్యామిలీ కోర్టులో వీరి డైవర్స్ కు మార్గం సుగమమైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంకా ఎన్ని అరాచకాలు చూడాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 11:25:41
Hyderabad, Telangana:

Preethi Mukundan In Chiru Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ముఖ్యంగా డైరెక్టర్ బాబీతో చేయబోయే సినిమాలో చిరంజీవి కూతురి పాత్ర కోసం ఒక ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది.

'వాల్తేరు వీరయ్య' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత చిరంజీవి - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కీలకమైన కూతురి పాత్ర కోసం చాలా రోజులుగా సెర్చ్ జరుగుతోంది.

రేసులో నిలిచిన భామలు
ఈ సినిమాలో చిరు కూతురిగా నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపించాయి. మొదట 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత 'ఛాంపియన్' ఫేమ్ అనస్వర రాజన్ దాదాపు ఖరారైందని అందరూ భావించారు.

ఫైనల్ రేసులో ప్రీతీ ముకుందన్!
తాజా సమాచారం ప్రకారం.. కృతి శెట్టి లేదా అనస్వర రాజన్ కాకుండా, ప్రీతీ ముకుందన్ ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా 'కన్నప్ప' సినిమాలో నటించిన ప్రీతీ ముకుందన్ తన అందం, నటనతో మెప్పించింది. మెగాస్టార్ సినిమాలో కూతురిగా నటించడం అంటే అది కెరీర్ కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మెగాస్టార్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సోషియో ఫాంటసీ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఇది రాబోతోంది.'విశ్వంభర' తర్వాత బాబీ దర్శకత్వంలో చేసే సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో చిరంజీవిని మళ్లీ వింటేజ్ మాస్ లుక్‌లో చూపించేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నారు.

'మన శంకరవరప్రసాద్ గారు'తో కామెడీ, వింటేజ్ మ్యానరిజమ్స్‌తో అలరించిన చిరు, బాబీ సినిమాలో తండ్రి పాత్రలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ప్రీతీ ముకుందన్ ఈ మెగా ఆఫర్‌తో స్టార్ హీరోయిన్ రేసులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Visakhapatnam Railway Zone: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ఆరోజే! రాష్ట్రానికి రాబోయే ప్రయోజనాలివే?

Also Read: Kova Bun Controversy: 'కోవా బన్' వలీకి అండగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు..రూ.25 వేల ఆర్థిక సాయం..యూట్యూబర్లపై ఆగ్రహం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 09:58:20
Nunna, Vijayawada, Andhra Pradesh:

MLC Nagababu Support Kova Bun Vali: కర్నూలుకు చెందిన 'కోవా బన్' వ్యాపారి షేక్ వలీకి జరిగిన అవమానంపై టాలీవుడ్ నటుడు, ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. కేవలం లైకుల కోసం చిరు వ్యాపారి పొట్ట కొట్టడం సరికాదని మండిపడుతూ, వలీకి తన వంతుగా ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్న వలీని కొందరు యూట్యూబర్లు కావాలనే టార్గెట్ చేస్తూ, ఆహార నాణ్యతపై అనుమానాలు రేకెత్తించేలా వీడియోలు చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

నాగబాబు ఆర్థిక సాయం
ఈ వివాదం కారణంగా వలీ తీవ్ర మానసిక వేదనకు గురవ్వడమే కాకుండా, శివరాత్రి వంటి కీలక సమయాల్లో వ్యాపారం చేసుకోలేకపోయారు. వలీ పరిస్థితిని తెలుసుకున్న నాగబాబు, ఆయనను నేరుగా కలిసి రూ.25,000 చెక్కును అందజేశారు. "చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుంది, ఎవరూ భయపడాల్సిన పనిలేదు" అని నాగబాబు ధైర్యం చెప్పారు.

యూట్యూబర్లకు హితవు
మరోవైపు చిరు వ్యాపారులను వేధించే వారిపై నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఆహార నాణ్యతను పరీక్షించడానికి 'ఫుడ్ సేఫ్టీ అధికారులు' ఉన్నారని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం కష్టపడే సామాన్యులను భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

ఈ ఘటనపై ఇప్పటికే లోకేష్, అచ్చెన్నాయుడు వంటి మంత్రులు స్పందించిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. ఈ వివాదాన్ని మతపరమైన కోణంలో చూడవద్దని, ఇది ఒక సామాన్య వ్యాపారికి జరిగిన అన్యాయమని ఆయన కోరారు. దేశంలో కోట్లాది మంది చిరు వ్యాపారులపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు.

యూట్యూబ్ రేటింగ్స్ కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో, ఒక సెలబ్రిటీ హోదాలో నాగబాబు ముందుకు వచ్చి సాయం చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వలీకి అండగా నిలవడం అంటే కోట్ల మంది చిరు వ్యాపారులకు భరోసా ఇవ్వడమేనని నాగబాబు వ్యాఖ్యానించారు.

Also Read: Lokesh On Kova Bun Incident: కోవాబన్ వలీకి అవమానం..మంత్రి లోకేష్ భరోసా.."త్వరలోనే కలుస్తా..కోవా బన్ టేస్ట్ చేస్తా!"

Also Read: Visakhapatnam Railway Zone: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ఆరోజే! రాష్ట్రానికి రాబోయే ప్రయోజనాలివే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 16, 2026 08:43:31
Visakhapatnam, Andhra Pradesh:

South Coast Railway Zone: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway - SCoR) ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1, 2026ని 'అపాయింటెడ్ డే'గా ప్రకటించి, కొత్త జోన్‌ను కార్యరూపంలోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో ఆరు వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కొత్త జోన్ పరిధిలోకి వచ్చే విభాగాలు
ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుండి కొన్ని విభాగాలు విడిపోయి విశాఖ జోన్‌లో కలుస్తాయి. విశాఖ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా జోన్‌లోని కొంత భాగం ఇందులో చేరుతుంది. ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి.

ఇందులో కొంత మార్పు ఏంటంటే రాయచూరు-వాడి మధ్య లైన్ సికింద్రాబాద్ జోన్‌లోనే కొనసాగుతుంది. మోటుమర్రి-కొండపల్లి మధ్య ఉన్న 46 కి.మీ మార్గం విజయవాడ డివిజన్‌లోకి వస్తుంది.

రాష్ట్రానికి కలిగే లాభాలు..
కొత్త జోన్ ఏర్పాటు కేవలం పరిపాలనా పరమైన మార్పు మాత్రమే కాదు, ఇది ఏపీ అభివృద్ధికి కీలకం కానుంది. జోన్‌లో ప్రారంభమయ్యే కొత్త రైళ్లుతో ఏపీలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మరిన్ని కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. 

నిర్ణయాధికారాలు స్థానికంగానే ఉండటం వల్ల రైల్వే ప్రాజెక్టులు, లైన్ల విస్తరణ పనులు వేగవంతం అవుతాయి. అంతేకాకుండా కొత్త జోన్ వల్ల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్ట్‌లకు రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల సరుకు రవాణా సామర్థ్యం పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.

ప్రస్తుత పరిస్థితి
విశాఖలో జోన్ కార్యాలయానికి సంబంధించిన భవన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు, సాంకేతిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరులోగా కేంద్రం నుంచి అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం ఏపీ ప్రజల విజయంగా భావించవచ్చు. దీనివల్ల రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామికంగా కూడా ఏపీ ముందడుగు వేయనుంది.

Also Read: Lokesh On Kova Bun Incident: కోవాబన్ వలీకి అవమానం..మంత్రి లోకేష్ భరోసా.."త్వరలోనే కలుస్తా..కోవా బన్ టేస్ట్ చేస్తా!"

Also Read: Ind Vs Pak Weather Update: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముందు భారీ వర్షం?! కొలంబోలో వాతావరణం ఎలా ఉంది? మ్యాచ్ జరుగుతుందా..లేదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 16, 2026 07:49:45
Coimbatore, Tamil Nadu:

Gravton Motors Partnership: స్వదేశీ ఇంజినీరింగ్ సామర్థ్యంతో.. ప్రాక్టికల్ పనితీరుతో సత్తా చాటుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ గ్రావ్టన్ మోటార్స్ ఈషా మహా శివరాత్రి వేడుకలకు అధికారికంగా భాగస్వామిగా ఎంపికైంది. కోయంబత్తూర్‌లోని ఈశా యోగా సెంటర్‌లో జరిగిన మహాశివరాత్రి 2026 వేడుకలకు అధికారిక ఈవీ మొబిలిటీ భాగస్వామిగా గ్రావ్టన్‌ మోటార్స్‌ భాగమైంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన రాత్రంతా జరిగిన మహా శివరాత్రి వేడుకలకు ముందు నుంచే వాలంటీర్ల రవాణా అవసరాల కోసం గ్రావ్టన్ క్వాంటా వాహనాల ప్రత్యేక ఫ్లీట్‌ను ఏర్పాటుచేసిందివ. విశాలమైన ఈశా క్యాంపస్‌లో వేలాది మంది వాలంటీర్లు సమర్థవంతమైన, సులభమైన, పర్యావరణహిత ప్రయాణానికి క్వాంటాపై ఈషా యోగా సెంటర్‌కు గ్రావ్టన్‌ మోటర్స్‌ ఆధారపడింది.

ఒకే దృక్పథంలో ఉన్న రెండు సంస్థలు ఈ సహకారం కేవలం వాహనాల సరఫరా మాత్రమే కాదు ఇది సుస్థిరతపై రెండు సంస్థల దృక్పథాల కలయికగా మారింది. ఈశా యోగా సెంటర్‌లో ఎద్దుల బండి సేవలు, స్వదేశీ పశువుల పరిరక్షణ వంటి తక్కువ ప్రభావం కలిగిన వ్యవస్థలు సంప్రదాయం, ఆధునికత కలిసి బాధ్యతాయుతంగా ఎలా నడవగలవో చూపిస్తున్నాయి. గ్రావ్టన్ క్వాంటా వాహనం స్వీయంగా అభివృద్ధి చేసిన బీఎల్‌డీసీ మోటార్, ఆధునిక ఎల్‌ఎంఎఫ్‌పీ బ్యాటరీ సాంకేతికతతో భారతీయ రహదారులు, బరువులు, దూరాలను తక్కువ పర్యావరణ ప్రభావంతో ఎదుర్కొనేలా రూపుదిద్దుకుంది. 

ఈ రెండు సంస్థలలోనూ ఒకే నమ్మకం ఉంది. నిజమైన ఆవిష్కరణ మనుషులు, జంతువులు, పర్యావరణంతో బాధ్యతతో పని చేస్తున్నాయి. నిజ జీవిత అవసరాలకు ఈవీలు సరిపోనున్నాయి. క్వాంటా ఇప్పటికే కఠినమైన వాస్తవ పరిస్థితుల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. దీర్ఘదూర ప్రయాణాలు, రోజువారీ వ్యవసాయ, గ్రామీణ వినియోగంలో రైతులు దీన్ని విశ్వసనీయ వర్క్‌హార్స్‌గా ఉపయోగిస్తున్నారు. దృఢమైన నిర్మాణం, బరువు మోయగల సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చు ఇవన్నీ కలిసి మహాశివరాత్రి సమయంలో ఈశా యోగా సెంటర్ వంటి విస్తృత ప్రదేశాల్లో ఉపయోగానికి అనుకూలంగా మారుస్తాయి.

ఈ పార్టనర్‌షిప్‌ లక్ష్యాలు
==> క్యాంపస్‌లో, పరిసర ప్రాంతాల్లో ఇంధన ఆధారిత వాహనాలపై ఆధారాన్ని తగ్గించడం
==> అధిక వినియోగ పరిస్థితుల్లో ఈవీల ప్రాక్టికల్, విస్తృత వినియోగ అవకాశాలను చూపించడం
==> పెద్ద స్థాయి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకల్లో సుస్థిర రవాణా ఎలా సమర్థవంతంగా కలిసిపోగలదో ప్రదర్శించడం 

రియల్ స్టోరీస్, రియల్ ఇంపాక్ట్ అనే విధానానికి అనుగుణంగా.. మహాశివరాత్రి ఏర్పాట్ల సమయంలో క్వాంటాను వినియోగించే వాలంటీర్లు, గ్రౌండ్ టీమ్ సభ్యుల అనుభవాలను గ్రావ్టన్ రియల్ ఫార్మర్స్  డాక్యుమెంట్ చేయనుంది. ఈ కంటెంట్ కేవలం వాహన పనితీరును మాత్రమే కాకుండా దేశంలో అత్యంత క్లిష్టమైన, భారీ స్థాయి ఈవెంట్లలో ఒకటైన ఈ వేడుకకు సేవలందిస్తున్న వారి అనుభవాలను కూడా ప్రతిబింబిస్తుంది. తాజా సమాచారం కోసం అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను సందర్శించవచ్చు: www.instagram.com/gravton_motors/

మహాశివరాత్రి తర్వాత
ఈశా-గ్రావ్టన్ భాగస్వామ్యం మహాశివరాత్రి వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలిక సుస్థిర మొబిలిటీ ప్రయాణానికి ఆరంభంగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఈషా, గ్రావ్టన్‌ సంస్థలకు దృడమైన అనుబంధం ఏర్పడనుంది.

ఈశా-గ్రావ్టన్ భాగస్వామ్యం లక్ష్యాలు
==> పట్టణానికి మాత్రమే కాకుండా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈవీలపై అవగాహన, అంగీకారాన్ని వేగవంతం చేయడం
==> మరిన్ని సంస్థలు, సముదాయాలు శుభ్రమైన రవాణా పరిష్కారాలను అన్వేషించేలా ప్రేరేపించడం 
==> ఈవీలు కేవలం నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా సేవకు అనువైన విశ్వసనీయ సాధనాలుగా నిలుస్తాయని ఒక బలమైన కథనాన్ని నిర్మించడం 

మీడియా ప్రశ్నలు, భాగస్వామ్యాలు లేదా మహాశివరాత్రి 2026లో గ్రావ్టన్ ఈవీ మొబిలిటీ భాగస్వామ్యంపై మరిన్ని వివరాల కోసం www.gravton.com ను సందర్శించండి లేదా info@gravton.com కు మెయిల్ చేయండి. డీలర్‌షిప్‌కు సంబంధించిన వివరాల కోసం www.gravton.com/dealership/ ను సందర్శించండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 15, 2026 17:37:10
Colombo, Western Province:

India Won By 61 Runs: టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు నానా యాగీ చేసి.. అడ్డమైన సాకులు చెబుతూ దూరమైన పాకిస్థాన్‌ తర్వాత తనంతట తానే దిగివచ్చి భారత్‌తో తలపడింది. చివరికి ఏం జరిగింది మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌలింగ్‌లో అద్భుతంగా వేసి భారత జట్టును తక్కువ స్కోర్‌కు కట్టడి చేసింది. కానీ బ్యాటర్లు మాత్రం మోస్తరు లక్ష్యాన్ని సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారు. పవర్‌ ప్లేలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో మిడిలార్డర్‌ పూర్తి ఓవర్లను ఆడేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. తలా కొన్ని పరుగులు చేసినా లక్ష్యానికి కావాల్సిన స్కోర్‌ చేయలేక మ్యాచ్‌ను భారత్‌కు అప్పగించారు. పాకిస్థాన్‌పై మరో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 15, 2026 16:25:22
New Delhi, Delhi:

8th Pay Commission Fraud: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సంఘం మరింత ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 2026 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన సంఘం అతీగతీ లేదు. పాలకవర్గం నియమించి తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను కొందరు అమాయకంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగుల ఆశలను తమ పెట్టుబడిగా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్‌, వాట్సప్‌ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?

ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్‌దారులను సైబర్‌ నేరస్తులు సులువుగా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. 8వ వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో కచ్చితంగా అంచనా (క్యాలికులేట్‌) వేసి చెబుతామంటూ వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారు. మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెబుతామంటూ నేరగాళ్లు వాట్సప్‌లో సందేశం పెడుతూనే.. ‘8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్‌’, ‘శాలరీ రివిజన్‌ టూల్‌’ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను జత చేస్తున్నారు. 

Also Read: BRS Clean Sweep: బీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్‌ రెడ్డి గిఫ్ట్‌

ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన వివరాలు అన్నీ సైబర్‌ నేరస్తులకు చిక్కుతున్నారు. ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఫోన్‌ మొత్తం సైబర్‌ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్‌ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుల సమాచారం, ఎస్‌ఎంఎస్‌, ఓటీపీలు అన్నీ కూడా మోసగాళ్లకు చేరిపోతాయి. దీంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి నగదు బదిలీ జరుగుతున్నాయి. తమ అకౌంట్లు ఖాళీ అవుతుండడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్‌ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?

8వ వేతన సంఘం పేరిట మోసాలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా చోట్ల పలు కేసులు నమోదవడంతోపాటు సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్‌ ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ పంపదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త సైబర్‌ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులను ప్రభుత్వం హెచ్చరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top