సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేకే మహేందర్ రెడ్డి
Rudrangi, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలకు కట్టుబడి ఉంటుందని, గత ప్రభుత్వం చేసిన అప్పును తగ్గించుకుంటూ మొదటి విడత రూ.32 వేల కోట్లను మాఫీ చేసిందన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, మిగిలిన రెండు విడతల్లో రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందని స్పష్టం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్రావు
Vijayawada, Andhra Pradesh:Census 2027 Self-Registration: దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది అవుతుందని.. ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సూచించారు. ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు.
Also Read: Ambati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్లో నమోదు చేశారు. దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు.
Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
ఈ సందర్భంగా తహసీల్దార్ స్వీయ నమోదు ప్రక్రియలోని ప్రాముఖ్యతను, వివరాలను నమోదు చేసే విధానాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణ మాత్రమే కాదని.. రాబోయే కాలానికి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక బలమైన పునాది అని తెలిపారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభమై మే 31వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అధికారులు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఈ జాతీయ కార్యసాధనలో భాగస్వాములు కావాలని టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala Rain: తిరుమల కొండపై కుండపోత వాన.. భక్తుల ఇబ్బందులు
Dharmavaram, Andhra Pradesh:Heavy Rain In Tirumala Temple Roads Filled With Flood Watch VideoAP Cabinet: ఏపీ మంత్రిమండలి నిర్ణయాలు.. ఏమేమీ తీసుకున్నారో తెలుసా?
Amaravathi, Andhra Pradesh:AP Cabinet Meeting Takes Major Decisions About Development ProjectsAmbati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
Nandimandalam, Andhra Pradesh:YSR Ghat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శపథం బూనారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను పోరాటం చేస్తానని శపథం చేశారు. ఈ పోరాటంలో తనపై ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా తాను ధైర్యంగా ఎదుర్కుంటానని ప్రకటించారు. తాము వైఎస్సార్ వారసులం అని.. వైఎస్ జగన్ వెంట నడిచేవాళ్లమని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేశారు.
Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
కడప జిల్లా వేంపల్లిలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్ను అంబటి రాంబాబు సందర్శించారు. వైఎస్సార్ ఘాట్ను సందర్శించి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని అంబటి రాంబాబు ప్రతిజ్ఞ పూనారు. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.
Also Read: RS Praveen Kumar: కేటీఆర్, హరీశ్ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
'వేంపల్లి పోలీస్ స్టేషన్లో రామ మునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాపై కేసు పెట్టారు. ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం దారుణం' అని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 'వైఎస్సార్ వారసులం. వైఎస్ జగన్ వెంట నడుస్తున్న వాళ్లం. అక్రమ కేసులకు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. అరాచక పాలనకు చరమగీతం పాడుతాం' మాజీ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
'చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదు. నిబంధనలు అతిక్రమించే అధికారులను భవిష్యత్తులో చట్టం ముందు నిలబెడతాం. రాష్ట్రంలో సాగుతున్నది కక్షసాధింపు రాజకీయాలే తప్ప.. ప్రజాస్వామ్య పాలన కాదు. ప్రభుత్వ అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం' అని అంబటి రాంబాబు ప్రకటించారు. ఇటీవల గుంటూరులోని సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతడు అరెస్టయి జైలు జీవితం గడిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
Amaravathi, Andhra Pradesh:AP Cabinet Meeting Decisions: రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమావేశమైన మంత్రిమండలి కూడా రాజధాని అంశంపై నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంటూ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు చేస్తూ మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది.
Also Read: RS Praveen Kumar: కేటీఆర్, హరీశ్ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అమరావతిలోని సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై కొన్ని గంటల పాటు చర్చలు జరిపింది. మొత్తం 26 అంశాలపై చర్చించి, అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కృష్ణానది వరద నుంచి రక్షణ (ఫ్లడ్ ప్రొటెక్షన్) పనులకు రూ.443 కోట్ల ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా వివిధ పనులకు రూ.2540 కోట్ల నిధుల విడుదలకు మంత్రిమండలి ఆమోదించింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్ అప్డేట్ ఇదే!
ఇక రాజధాని ప్రాంతంలోని అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రిమండలి సమావేశం అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్కు రూ.798 కోట్ల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు, పోలవరం ప్రాజెక్ట్ బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఉండవల్లి జోన్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికకు ఆమోదం తెలిపింది.
అమరావతి ప్రాంతంలో డ్రెయిన్ సైఫన్ నిర్మాణ పనులకు రూ.76 కోట్లకు, హంద్రీ-నీవా ప్రాజెక్ట్కు రూ.3099 కోట్ల సవరణ అంచనాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హోంశాఖలో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్గ్రేడ్ చేయడానికి, హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో 21 కొత్త పోస్టులను సృష్టికి, పంచాయతీ రాజ్ శాఖలో 20 పోస్టులు సృష్టించడంతోపాటు 9 పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..!
==> న్యూఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయించాలని నిర్ణయం
==> మార్క్ఫెడ్కు రూ.1,800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్కు ప్రభుత్వం హామీ
==> రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పులకు ఆమోదం
==> వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
==> మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనల్లో మార్పులకు నిర్ణయం
==> మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లును ప్రతిపాదన
==> తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపు
==> కడపలో 92 ఎకరాల డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు
==> ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు భూముల బదిలీ ప్రతిపాదనల పచ్చజెండా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RS Praveen Kumar: కేటీఆర్, హరీశ్ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Hyderabad, Telangana:Telangana Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. ఈ క్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు నివాసాల ముందు ఉన్న సీసీ కెమెరాలు కూడా హ్యాకింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
'టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. '350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్ రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు' అని మండిపడ్డారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
'కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు శాఖ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. నంబీ నారాయణన్ అనే ఇస్రో సైన్టిస్ట్పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్ళను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిషాంక్పై కేసు పెట్టి జైలుకు పంపారు' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
'కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ చేయాలి' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 'ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చా' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bellamkonda Srinivas Marriage: తిరుమలలో వివాహం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్
Dharmavaram, Andhra Pradesh:Watch Hero Bellamkonda Srinivas Marriage With Kavya Reddy At TirumalaTirumala Darshan: తిరుమలేశుడిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం
Dharmavaram, Andhra Pradesh:Watch Telangana Deputy CM And Hero Bellamkonda Srinivas Tirumala DarshanSeethakka: రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ: సీతక్క
Hyderabad, Telangana:Congress Seva Dal Meeting: 'రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది. ప్రజల ఐక్యతను దెబ్బతీసి బీజేపీ విద్వేష రాజకీయాలను చేస్తుంది. గాంధీ చూపిన శాంతియుత బాటలో మనం విద్వేష రాజకీయాలను గెలవాలి' అని సీతక్క పిలుపునిచ్చారు. ఈ దేశంలో గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. ఇది దేశ ఆత్మను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఆ దిశలో రక్షణ దళాలుగా సేవాదళ్ కార్యకర్తలు పని చేయాలి' అని సీతక్క సూచించారు.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో సీతక్క పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'సిద్ధాంత బలం ఉంటే ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవచ్చు. పార్టీ త్యాగాలు, త్యాగాల చరిత్రను, పార్టీ గొప్పతనాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలి. ఆ దిశలో కాంగ్రెస్ సేవాదళ్ ముందుండి నడిపించాలి. మీ శిక్షణ కార్యక్రమాలను జిల్లాలకు విస్తరిస్తే మన సైన్యం మరింత బలపడుతుంది' అని సీతక్క తెలిపారు. 'గాంధీ జ్ఞానం, నెహ్రు నిర్మించిన భారతదేశ విధి విధానాలు.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి వెన్నెముక. కానీ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది' అని మండిపడ్డారు.
'గాంధీ ఆలోచనలతో క్రమశిక్షణ కలిగిన సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ అవతరించింది. దేశానికి స్వతంత్రం సాధించటంలో.. దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ పాత్ర అమోఘం. దేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ దేవ్ సేవాదళ్ పాత్ర మరువలేనిది. కాంగ్రెస్ది గాంధీ అహింస సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సేవా దళ్ కూడా అనుసరిస్తుంది. 'కాంగ్రెస్ సేవాదళ్ అంటే దేశభక్తుల సంఘం. జిల్లాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు సేవాదళ్ నిర్వహించాలి. సేవాదళ్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు శ్రీరామరక్ష' అని సీతక్క వివరించారు. క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్ అని ప్రకటించారు. అంతకుముందు సీతక్క చరకా పట్టి నూలు వడికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BRS Party Post: గులాబీ పార్టీలో ఆ పదవి కలిసి రాదా? పోస్టుపై నాయకుల్లో ఆందోళన
Baddipadaga, Telangana:BRS Party: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది. చాలా రోజులు తర్వాత.. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. కారు పార్టీలో చేరిన సందర్భంగా.. జగిత్యాలలో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అంతేకాదు.. ఉత్తర తెలంగాణలో పార్టీ బాధ్యతలు చూడాలని కోరారు.. మొదట్లో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ జనరల్ సెకట్రరీ వస్తుందని ప్రచారం సాగింది.
ఈ పదవికి ఆయన కూడా ఓకే అన్నారని అనుచరులు చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం.. జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించడంతో.. నేతలంతా షాక్ అయ్యారు. అయితే జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పదవి ఇస్తే.. సెంటిమెంట్గా కలిసి రాదనీ.. గతంలో ఈ పదవి చేపట్టిన కే. కేశవరావు విషయంలో ఇదే నిజమైందట. అందుకే జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ కాకుండా.. జనరల్ సెక్రటరీ పోస్టును కట్టబెట్టారని ప్రచారం సాగుతోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్ అప్డేట్ ఇదే!
వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.. కాంగ్రెస్ నేత కే. కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పట్లో సీనియర్ నేతగా ఉన్న కేశవరావుకు ఏ పోస్టు ఇవ్వాలో అర్థం కాక.. గులాబీ బాస్ తర్జనభర్జనలు పడ్డారు. చివరకు కేకే కోసం కొత్తగా బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ అంటూ.. ఓ పోస్టును క్రియేట్ చేసి పదవిని అప్పగించారు. ఆ తర్వాత మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పదవి విషయంలో పరేషన్ అయ్యారు. చివరకు డీఎస్ ను రాజ్యసభకు పంపడంతో కేసీఆర్ కాస్తా రిలాక్స్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో కేసీఆర్ పోస్టింగ్ ఇవ్వడం పెద్ద తలనొప్పిగా మారింది.
తంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలంతా.. బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువకాలం ఇమడలేక పోయారు. అందుకే డీఎస్ కొన్నేళ్లకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో.. కేకే కూడా పార్టీ మారారు.. దాంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇద్దరు నేతలు.. తిరిగి ఆ పార్టీలోకే వెళ్లిపోయారు. అయితే పార్టీలో సెక్రటరీ జనరల్ పోస్టు కట్టబెట్టినా.. కేకే పార్టీ మారడంతో.. కేసీఆర్ బాగా హర్ట్ అయ్యారట. అందుకే జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
Also Read: Singer Mangli: యూట్యూబ్ చానళ్లపై మంగ్లీ ఫిర్యాదు! మేనేజర్ తీవ్ర ఆరోపణలు
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పవర్ లోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే.. పవర్ ఖాయమని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్కు బలమైన రెడ్డి సామజికవర్గం నేత లేరు. హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన చాలా జూనియర్. అందుకే మాజీమంత్రి జీవన్ రెడ్డి సేవలను వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. జీవన్ రెడ్డి లాంటి నేతను ముందుపెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగడితే.. మరింత కలిసి వస్తుందని అనుకుంటున్నారట. అందుకే జగిత్యాల సభలో జీవన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.
కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా సేవచేసిన జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు తగిన గౌరవం ఇస్తామని ప్రకటించారు. అందుకే ఆయనకు సెక్రటరీ జనరల్ పదవి కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తక్షణమే నియమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే సెక్రటరీ జనరల్ పోస్టు.. బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా కలిసి రాలేదని.. అందుకే.. జీవన్ రెడ్డికి ఆ పోస్టు ఇచ్చేందుకు కేసీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: AP Summer Camps: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలో 1,389 సమ్మర్ క్యాంపులు
అయితే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కూడా ప్రధాన కార్యదర్శే.. అంతేకాదు.. జిల్లాకో నేత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారిన జీవన్ రెడ్డికి కూడా జనరల్ సెక్రటరీ పోస్టు కేటాయించారు. అయితే సెక్రటరీ జనరల్ పోస్టు తమకు పెద్దగా కలిసి రాలేదని.. అందుకే జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు..మొత్తం మీద నాలుగుదశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకుని.. కారు పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి భవిష్యత్తులో మంచి పదవి ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. దాంతో 2029 లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి ఖాయమని అనుచరులు తెగ ప్రచారం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Doomsday Fish 2026: మరికొద్ది రోజుల్లో ప్రపంచంలో ప్రళయం..ఒడ్డుకు చేరిన 'దేవుని చేప'..భయాందోళనలో ప్రజలు!
Mexico Beach, Florida:Doomsday Fish Mexico 2026: ప్రకృతి తరచుగా కొన్ని సంఘటనల ద్వారా రాబోయే ప్రమాదాలను మనల్ని హెచ్చరిస్తుంది. అందుకు తగిన విధంగా మనం మేల్కొనకపోతే దాని భారీ మూల్యం చెల్లించక తప్పదు. గతంలోనూ గాడ్ ఫిష్గా పిలిచే ఓ డూమ్స్ డే ఫిష్ సముద్రపు ఒడ్డుకు కొట్టికు వచ్చిన కొన్ని రోజులకే సునామీ వచ్చింది. అదే విధంగా మరోసారి ఆ డూమ్స్డే ఫిష్ లేదా ఓర్ ఫిష్ మరోసారి సముద్ర గర్భం నుంచి భూమి మీదకు వచ్చింది. దీంతో మరోసారి ప్రకృతి నుంచి తీవ్ర ప్రమాదం పొంచిఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రకృతి వైపరీత్యాలకు సూచికగా భావించే అత్యంత అరుదైన "గాడ్స్ ఫిష్" లేదా 'డూమ్స్డే ఫిష్' లేదా ఓర్ ఫిష్, మెక్సికో తీరంలో కనిపించడంతో, ప్రపంచవ్యాప్తంగా భయం నెలకొంది.
అవును.. సాధారణంగా సముద్రంలో వేల అడుగుల లోతులో నివసించే ఈ భారీ చేపలు ఒడ్డుకు వచ్చాయని, ఇది రాబోయే విపత్తుకు సంకేతమని ప్రజలు నమ్ముతున్నారు. వైరల్ అవుతున్న వీడియో మీరు ఖచ్చితంగా చూస్తే, మెక్సికోలోని ఒక అందమైన బీచ్లో పర్యాటకులు, స్థానికులు స్నానం చేస్తూ ఉండగా.. అదే సమయంలో సముద్రపు అలల మధ్య వింతగా కదులుతున్న ఒక భారీ చేప తీరం వైపు తేలుతూ వస్తుంది. పాముల కనిపించే ఈ పొడవాటి, వెండి చేపను చూసి అక్కడి ప్రజలు క్షణకాలం పాటు భయభ్రాంతులయ్యారు. కానీ ఆశ్చర్యకరంగా, అది ఒక్క చేప మాత్రమే కాదు, దాని వెనువెంటనే మరో భారీ చేప కూడా తీరానికి వస్తుంది. రెండు 'ప్రళయ' చేపలు ఒకే సమయంలో తీరానికి రావడం ప్రజలలో భయాన్ని కలిగించింది.
ఈ చేపలను 'ప్రళయపు చేపలు' లేదా 'గాడ్ ఫిష్' అని పిలవడానికి వెనుక ఓ బలమైన కారణం ఉంది. జపనీస్ పురాణాల ప్రకారం.. ఈ చేపలు సముద్రంపైకి వస్తే, త్వరలో భూకంపం లేదా సునామీ సంభవిస్తుందని అర్థం. శాస్త్రీయంగా చెప్పాలంటే, లోతైన సముద్రంలో భూకంప కేంద్రాలు ఉంటాయి. భూకంపానికి ముందే పసిగట్టే ఈ చేపలు ముందుగా ఒడ్డుకు చేరుకొని ప్రజలకు సూచికగా కనిపిస్తాయి.
ప్రస్తుతం, ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు "తర్వాత ఏం జరుగుతుంది?" వంటి వ్యాఖ్యలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది కేవలం యాదృచ్ఛికం అని సమర్థిస్తున్నారు. మొత్తం మీద, ఈ వీడియో ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో, తర్వాత ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.
Also Read: Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: డబ్బు ఇస్తేనే బిల్లు.. కరీంనగర్ ట్రెజరీ కార్యాలయాల్లో కొనసాగుతున్న భారీ దందా!
Karimnagar, Telangana:Corruption In Karimnagar Treasury News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలు ఇప్పుడు అవినీతికి అడ్డాలుగా మారాయ అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే, నిధుల విడుదలలో పర్సెంటేజీల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా బిల్ పాస్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందేననే.. నిబంధనను పరోక్షంగా అమలు చేస్తూ.. నిస్సహాయులను దోచుకుంటున్నారని ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా ఎస్టీవో (STO) కార్యాలయాల్లో ఈ వ్యవహారం దర్జాగా సాగుతోందని బాధితులు సైతం వాపోతున్నారు.. గ్రామపంచాయతీల అభివృద్ధి నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యేల కోట నిధులు, ఉద్యోగుల మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ (GPF) అడ్వాన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. ఇలా ఏ బిల్లు క్లియర్ అవ్వాలన్న కనీసం రెండు నుంచి గరిష్టంగా 10 శాతం వరకు లంచం సమర్పించుకోవాల్సిందేనని సమాచారం. అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో 15 శాతం వరకు కూడా లంచాలు తీసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు..
నిబంధనల ప్రకారం బిల్లులను సకాలంలో ఆమోదించాల్సిన అధికారులు.. లంచం చెల్లించని వారి ఫైళ్లను మాత్రం నెలలు తో పాటు ఏళ్లుగా పెండింగ్లో ఉంచుతున్నారు. ఎంతో అత్యవసరమైన, ప్రాణపాయ స్థితిలో ఉన్న వారి మెడికల్ బిల్లుల విషయంలోనూ మానవత్వం లేకుండా రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ పద్ధతుల్లో అమల్లోకి వచ్చిన.. ట్రెజరీలో మాత్రం మాన్యువల్ పద్ధతిలోనే తెర వెనక సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఊహించని స్థాయిలో ప్రచారం జరుగుతూ వస్తోంది.
Also Read: TGSRTC గుడ్న్యూస్.. కేవలం రూ.10,500కే దక్షిణ భారత యాత్ర .. పూర్తి వివరాలివే!
మా కష్టార్జితం లేదా అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చును తిరిగి పొందడానికి కూడా మళ్లీ లంచం ఇవ్వాలా అని.. కాంట్రాక్టర్లతోపాటు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు సైతం ఈ దందా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల డిమాండ్లకు తలొగ్గి, అప్పులు తెచ్చి మరీ లంచాలు చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండడం లేదని.. ఉన్నత అధికారులు సైతం పట్టించుకోలేకపోవడం వల్లే ఈ అరాచకం కొనసాగుతూ ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నత అధికారులు దృష్టి సారించి ట్రెజరీలో జరుగుతున్న ఈ అవినీతి బాగోతాన్ని అరికట్టాలని ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లు కోరుకుంటున్నారు.
Also Read: TGSRTC గుడ్న్యూస్.. కేవలం రూ.10,500కే దక్షిణ భారత యాత్ర .. పూర్తి వివరాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPS-95 Pension Hike: ఉద్యోగులకు గుడ్న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కి పెంపు..కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు!
Hyderabad, Telangana:EPS-95 Pension Hike Update: ప్రైవేట్ ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) పెన్షన్ అందజేస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షనర్లకు ఆసరాగా ఉండే ఈ పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.7,500 వరకు కనీస పెన్షన్ ను పెంచాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు ఆ పెన్షన్ పెంపుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందే అనే అంశంపై తెగ చర్చ జరుగుతోంది.
ఈపీఎఫ్ఓ కింద పదవీవిరమణ తర్వాత ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.7,500 అందజేయాలని పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎస్-95 పథకం కింద ప్రస్తుతం రూ.1,000 ఆర్థిక అవసరాలకు సరిపోవడం లేదని.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంక్కేందుకు కనీస పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని జాతీయ మీడియాల నివేదికల ప్రకారం.. ఈపీఎస్ కనీస పెన్షన్పై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలో తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాలేదు.
ఎన్ఏసీ అనే జాతీయ ఆందోళన కమిటీ చేసిన ప్రధాన డిమాండ్ ప్రకారం.. ఈపీఎస్-95 పథకం కింద పెన్షన్లకు కనీస నెల పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయి. అలాగే డీఏతో పెన్షన్ను అనుసంధానం చేయాలి అంటే ధరల పెరుగుదల ప్రకారం పెన్షన్ పెంపు కూడా జరగాలనేది వారి వాదన. కోష్యారీ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ చర్చకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఆ కమిటీ ప్రాథమిక కనీస పెన్షన్ రూ.3,000గా సూచించగా.. ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో సంస్థలు రూ.7,500 కనీస పెన్షన్ను డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర కార్మిక మంత్రితో పాటు పీఎంఓ అధికారులతో ఈపీఎస్-95 ప్రతినిధులు కూడా పలుమార్లు సమావేశం జరిపారు. పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షిస్తుందని భరోసా ఇచ్చింది. ఈపీఎఫ్ఓ మాత్రం పెన్షన్ పెంపు చేస్తే నిధుల కొరత భారీగా ఏర్పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపంలో ఉద్యోగులకు పెన్షనర్లకు సాయం చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల తాలూకా అంచనాలు వేస్తోంది. ప్రస్తుతానికి కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేదు. కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని సమాచారం అందుతోంది.
Also REad: Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TGSRTC గుడ్న్యూస్.. కేవలం రూ.10,500కే దక్షిణ భారత యాత్ర .. పూర్తి వివరాలివే!
Hyderabad, Telangana:TGSRTC South India Tour: వేసవి సెలవులతో పాటు ఆధ్యాత్మిక చింతనతో క్షేత్ర దర్శనాలకు వెళ్లాలనుకునే ఉమ్మడి కరీంనగర్ జిల్లా భక్తులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. గోదావరిఖని డిపో పరిధిలోని భక్తుల కోసం ప్రత్యేకంగా దక్షిణ భారత యాత్ర పేరుతో రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. సురక్షితంగా సందర్శించేందుకు ఈ యాత్ర అద్భుతమైన అవకాశమని ఆయన తెలిపారు. అయితే, ఈ యాత్రకు సంబంధించిన అన్ని రకాల వివరాలు, టికెట్ ధర మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన యాత్ర మే ఏడవ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత మే 14వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందని డిపో మేనేజర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఎనిమిది రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. భక్తులు ఎండ వేడిమికి ఇబ్బందులు పడకుండా.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అధునాతన రాజధాని ఏసీ బస్సును సిద్ధం చేసినట్లు తెలిపారు..
ఈ యాత్రలో భాగంగా దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, శక్తివంతమైన పది పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా అరుణాచలంతో పాటు రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, పలని, కాంచీపురంతో పాటు మరికొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలను ఈ యాత్రలో కవర్ చేయబోతున్నట్లు డిపో మేనేజర్ అధికారికంగా తెలిపారు. సాధారణ ప్రైవేట్ యాత్రలతో పోలిస్తే..టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ ఎంతో తక్కువ బడ్జెట్ తో సురక్షితంగా ఉంటుందని డిపో మేనేజర్ వెల్లడించారు.
ఈ యాత్రకు ఒక్కొక్క టికెట్ కు కేవలం రూ.10,500 చార్జ్ చేస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు ప్రభుత్వ రవాణా సంస్థ కావడంతో భక్తులకు నమ్మకమైన సేవలు అందుతాయని యాత్రలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం సాగుతుందని ఆయన అన్నారు ఈ దక్షిణ భారతదేశ యాత్రలో పాల్గొనేవారు తమ సీట్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని కోరారు సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నందున.. ఆసక్తి గలవారు వెంటనే 7382847596, 7913504982 నెంబర్లకు ఫోన్ చేయడమే కాకుండా నేరుగా డిపోను కూడా సందర్శించి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tecno Spark 50 Pro: బడ్జెట్ ధరలో సూపర్ ఫోన్.. టెక్నో స్పార్క్ 50 ప్రో లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే!
Hyderabad, Telangana:Tecno Spark 50 Pro India Launch: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తన పాపులర్ స్పార్క్ సిరీస్లో మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో లింక్ అయిన వివరాల ప్రకారం.. దీనిని కంపెనీ టెక్నో స్పార్క్ 50 ప్రో (Tecno Spark 50 Pro) స్మార్ట్ఫోన్ పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీ తో పాటు బడ్జెట్ సెగ్మెంట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్లో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి మంచి డిజైన్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా భావించవచ్చు.
టెక్నో స్పార్క్ 50 ప్రో స్మార్ట్ఫోన్ అత్యంత ఆకర్షణీయమైన బ్యాటరీతో విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6,000mAh బ్యాటరీతో విడుదల చేయబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దీని బ్యాటరీ దాదాపు రోజంతా ఉండేలా.. ముఖ్యంగా గేమ్స్ ఆడే వారిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ బ్యాటరీని వేగంగా చార్జ్ చేసేందుకు వీలుగా కంపెనీ ఎంతో శక్తివంతమైన 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది.
ఇక ఈ Tecno Spark 50 Pro స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల పెద్ద డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్తో విడుదల కావడం వల్ల వినియోగదారులకు స్మూత్ స్క్రోలింగ్తో పాటు అద్భుతమైన డిస్ప్లే క్వాలిటీని కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్కు సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ మీడియాటెక్ హీలియో G100 చిప్సెట్ ప్రాసెస్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కాబట్టి మల్టీ టాస్కింగ్తో పాటు గేమ్స్ ఆడే వారికి ఈ Tecno Spark 50 Pro మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఈ Tecno Spark 50 Pro స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఫ్రంట్ భాగంలో ప్రత్యేకమైన 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తుంది. అలాగే ఇది ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో 5G కనెక్టివిటీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆధునిక ఫీచర్లతో పాటు స్పెషల్ డిజైన్తో విడుదల కాబోతోంది. ఈ Tecno Spark 50 Pro స్మార్ట్ఫోన్కు సంబంధించిన ధర వివరాలను కంపెనీ అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
