icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505307
Bandi SrikanthBandi SrikanthFollow21 Jul 2024, 11:09 am

సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేకే మహేందర్ రెడ్డి

Rudrangi, Telangana:

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలకు కట్టుబడి ఉంటుందని, గత ప్రభుత్వం చేసిన అప్పును తగ్గించుకుంటూ మొదటి విడత రూ.32 వేల కోట్లను మాఫీ చేసిందన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, మిగిలిన రెండు విడతల్లో రూ.2 లక్షల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందని స్పష్టం చేశారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Nokia నుంచి అదిరిపోయే ఫోన్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్, 45 రోజుల బ్యాటరీ లైఫ్!

Hyderabad, Telangana:

Nokia 300 4G Launched Latest News: మొబైల్ రంగంలో ఒకప్పటి రారాజు నోకియా (Nokia) మార్కెట్లోకి సరికొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 300 4G పవర్‌బ్యాంక్ (Nokia 300 4G Power Bank) పేరుతో ఈ పవర్‌ఫుల్ ఫోన్‌ను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో కంపెనీ లిస్ట్ చేసింది. ప్రస్తుతానికి ఈ మొబైల్ ఫిలిప్పీన్స్ మార్కెట్లో లాంచ్‌ అయిన్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత శక్తివంతమైన బాడీతో పాటు అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా దీనిని రూపొందించిన్నట్లు తెలుస్తోంది.

ధర, ఇతర వివరాలు..
ఫిలిప్పీన్స్ మార్కెట్లో నోకియా 300 పవర్‌బ్యాంక్ ఫోన్ ధరను PHP 1,990గా నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.. మన భారతీయ కరెన్సీలో దీని విలువ కేవలం రూ.3,000 మాత్రమే ఉంటుందని సమాచారం. అక్కడ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Shopeeలో ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.. వినియోగదారుల కోసం ఈ మొబైల్‌ను బ్లాక్, గ్రీన్‌తో పాటు గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.

అదిరిపోయే డిస్‌ప్లే..
ఈ నోకియా 300 4G ఫోన్ చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. చేతిలో పట్టుకోవడానికి వీలుగా యాంటీ-స్లిప్ డిజైన్‌తో రగ్గడ్ బాడీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇందులో 2.4 ఇంచుల QVGA డిస్‌ప్లేను తీసుకు వచ్చింది.. అంతేకాకుండా, దీనికి IP65 రేటింగ్ అందిచారు.. దీనివల్ల ఫోన్‌పై దుమ్ము పడినా లేదా నీటి చినుకులు పడినా ఫోన్ పాడవకుండా సురక్షితంగా ఉంటుందని సమాచారం.

45 రోజుల బ్యాటరీ లైఫ్.. 
ఈ ఫోన్‌లోని అత్యంత అద్భుతమైన ప్రత్యేకత దీని బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో చిన్న సైజు స్మార్ట్‌ఫోన్లలో ఉండేలాంటి 3700mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం విశేషం. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. ఈ ఫోన్ ఏకంగా 45 రోజుల పాటు స్టాండ్‌బై టైమ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా 26 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక బటన్ ఉంటుంది.. దాన్ని నొక్కితే, ఈ ఫోన్‌ను 5W వేగంతో ఇతర ఫోన్లను ఛార్జ్ చేసే  పవర్‌బ్యాంక్‌ లాగా (Reverse Wired Charging) వినియోగించవచ్చు..

ఐఫోన్ కంటే శక్తివంతమైన టార్చ్ లైట్..
సాధారణ ఫీచర్ ఫోన్లతో పోలిస్తే.. ఈ ఫోన్‌లోని టార్చ్ లైట్ 5 రెట్లు ఎక్కువ కాంతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. చివరికి ప్రముఖ ప్రీమియం ఫోన్  ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) టార్చ్ లైట్ కంటే కూడా ఇది రెండింతలు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుందని నోకియా సంస్థ సంచలన ప్రకటన చేయడం విశేషం. ఈ టార్చ్ లైట్‌ను వరుసగా 23 గంటల పాటు ఆన్ చేసి ఉంచినా బ్యాటరీ తట్టుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Indian Army SSC Officers: పరీక్ష లేకుండా ఆర్మీ ఉద్యోగం..నెలకు రూ.లక్షన్నర జీతం..డిగ్రీ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్!

Hyderabad, Telangana:

Indian Army SSC Officer Jobs 2026: భారత సైన్యంలో ఆఫీసర్ హోదాలో దేశానికి సేవ చేయాలనుకునే యువతీ యువకులకు ఇండియన్ ఆర్మీ అద్భుతమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా మొత్తం 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనుండడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకతగా నిలుస్తోంది.

ముఖ్యమైన వివరాలు..
మొత్తం ఖాళీలు: 350
ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూ & మెడికల్ టెస్ట్
ప్రారంభ వేతనం: నెలకు దాదాపు రూ.1,50,000/- వరకు (ఇతర అలవెన్సులు, క్వార్టర్స్ సౌకర్యం అదనం)

అర్హతలు & వయోపరిమితి..
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2027 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
గమనిక: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత, వారి అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి SSB ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి వైద్య పరీక్షలు (Medical Test) నిర్వహించి, తుది నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయం నుంచే జీతభత్యాలు అందుతాయి.

ముఖ్యమైన తేదీలు & అప్లికేషన్ లింక్..
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7, 2026

అధికారిక వెబ్‌సైట్: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం www.joinindianarmy.nic.in ని సందర్శించవచ్చు.

Also Read: ఏటీఎంలో ఏసీలో దర్జాగా నిద్రపోతున్నాడు.. ఇలా కూడా ఉండారా గురూ!

Also REad: ఓటరు లిస్టులో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్టేనా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

కేవలం రూ.18,999 లకే 7000mAh బ్యాటరీ 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో Realme P4 Lite 5Gపై క్రేజీ డీల్!

Hyderabad, Telangana:

Realme P4 Lite 5g Massive Discount: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్     సంస్థ ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న Realme కంపెనీకి  సంబంధించిన రియల్‌మీ P4 లైట్ 5G (Realme P4 Lite 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని స్థాయిలో భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.. ఏకంగా రూ. 17 వేల రూపాయల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ విశేషాలు, ఆఫర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

రూ. 17,000 పైగా తగ్గింపు.. 
రియల్‌మీ P4 లైట్ 5G (6GB ర్యామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్ అసలు MRP ధర రూ.36,999 అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ఏకంగా రూ.29,999కే పొందవచ్చు. దీంతో మీరు భారీ ధర తగ్గింపు లభిస్తుంది. దీనికి అదనంగా మరికొన్ని బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులో ఉంచింది.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లేదా SBI బ్యాంక్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే.. అదనంగా మరో రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే.. ఈ శక్తివంతమైన 5G ఫోన్‌ను కేవలం రూ.18,999 లకే సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్‌ లభిస్తుంది.

7000mAh భారీ బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకుని అవకాశం లభిస్తుంది.. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం.. 144Hz రీఫ్రెష్ రేట్‌తో ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందుబాటులో ఉంది.

శక్తివంతమైన ప్రాసెసర్.. 
రియల్‌మీ P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది.. కాబట్టి గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుందని కంపెనీ తెలిపింది. ఇందులోని 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ సహాయంతో 2TB వరకు పెంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కనెక్టివిటీ ఫీచర్లు..
సెక్యూరిటీ కోసం ఫోన్‌లో సైడ్‌కు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ (MIL-STD 810H) సపోర్ట్‌ కూడా ఉంది. దీనివల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5.3తో పాటు హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో 7000mAh బ్యాటరీతో పాటు 5G ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ డీల్‌గా భావించవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా..హైదరాబాద్ భక్తులకు తీవ్రగాయాలు.. వీడియో..

Hyderabad, Telangana:

Tirumala Ghat road accident: తిరుమలకు చాలా మంది రోడ్డు మార్గంలో, నడక మార్గంలో అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్టు గుండా వెళ్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనాలకు 24 గంటల వరకు సమయం పడుతుంది. మరోవైపు రూ. 300 దర్శనాలకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా ఎస్ఎస్ డీ టోకెన్లు ఉన్న భక్తుల దర్శనాలకు 4 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం కారు అదుపు తప్పి బోల్తా పడింది.

 

ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  భక్తులు తమకారులో తిరుమల శ్రీవారిని దర్శించుకొవడానికిి బయలు దేరారు. ఇంతలో తిరుమలలోని రెండో  ఘాట్ రోడ్డులోని 39వ మలుపు వద్ద లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి సెఫ్టీ గోడను బలంగా ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనతో  ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వెంటనే అక్కడున్న భక్తులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో ఆ మార్గంలో కొంచెంసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాట్ రోడ్డులో ఉన్న సిబ్బంది కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Read more: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. టికెట్ల కోసం ఆ వెబ్‌సైట్ మాత్రమే వాడండి!

ఈ ప్రమాదంలో ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు సైతం తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. మరోవైపు తిరుమలలో ప్రమాదం గాయపడ్డ భక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

Japan Open 2026: జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు..2019 తర్వాత సింధు ఖాతాలోకి మరో రికార్డు!

Shinjuku City, Tokyo:

Japan Open 2026 Winner: భారత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఖాతాలో మరో ట్రోఫీ వచ్చి చేరింది. జపాన్ వేదికగా జరిగిన బ్యాడ్మింటన్ ఓపెన్ 2026లో పీవీ సింధు విజేతగా నిలిచింది. తాజాగా ఫైనల్‌లో జపాన్‌కు చెందిన అకానె యమగుచిని 21-17, 21-17 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత అంతటి స్థాయిలో అతిపెద్ద ట్రోఫీఇదే కావడం గమనార్హం. 

గత రెండేళ్లుగా, పీవీ సింధు చుట్టూ వినబడుతున్న ఒకేఒక ప్రశ్న.. సింధు ఛాంపియన్‌గా నిలుస్తుందా? అయితే ప్రశ్న ఆమె ఇంకా అతిపెద్ద టైటిళ్లను గెలవగలదా లేదా అనే దాని గురించి కాదు, ఆమె తన అత్యుత్తమ ఫామ్‌ను తిరిగి పొందడానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించే. నిరంతర గాయాలు, ఆధునిక క్రీడ కఠినమైన పరిణామం, 2024 వరకు కొనసాగుతున్న టైటిల్ కరువు వంటివి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన ఆమె, తనను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారిణులలో ఒకరిగా నిలిపిన నైపుణ్యాలను పునఃసృష్టించగలదా అని చాలా మందిని సందేహించేలా చేశాయి. ఇప్పుడు అలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒక్క జపాన్ ఛాంపియన్‌షిప్‌తో సింధు సమాధానం చెప్పింది.  ఆదివారం టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో, సింధు దానికి సమాధానం ఇచ్చింది.

జపాన్ ఓపెన్‌లో అపారమైన శక్తి, వ్యూహాత్మక ప్రతిభ, ప్రచండ మానసిక స్థైర్యం కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదర్శనతో.. 31 ఏళ్ల భారత స్టార్ క్రీడాకారిణి సింధు, జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచిని వరుస గేమ్‌లలో 21-17, 21-17 తేడాతో ఓడించి, తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో ఎందుకంటే ఇది ఆమెకు మొట్టమొదటి సూపర్ 750 టైటిల్ కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను గెలిచిన చరిత్రలోనే తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది.

సింధు చివరి టైటిల్‌ను 2024లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో గెలుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత జపాన్ ఓపెన్‌లో సాధించిన ఈ విజయమే ఆమెకు అతిపెద్ద టైటిల్.

స్టీప్ క్రాస్-కోర్ట్ డ్రాప్స్, అద్భుతమైన స్మాష్‌ల కాంబినేషన్‌ను ఉపయోగించి.. సింధు మొదటి గేమ్‌లో యమగుచి ఆటను నిరంతరం దెబ్బతీసింది. మొదటి గేమ్ చివరి వరకు హోరాహోరీగా సాగింది, కానీ ఒత్తిడి పెరిగినప్పుడు పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో కీలకమైన పాయింట్లను వరుసగా గెలుచుకుని మొదటి గేమ్‌ను 21-17 తేడాతో కైవసం చేసుకుంది. ఒక గేమ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, సింధు తన గేమ్‌ను ఏ మాత్రం చేజారకుండా చూసుకుంది. ఆ తర్వాత స్పష్టమైన ఆధిక్యంతో రెండో గేమ్‌లోనూ దూకుడుగా ఆడి.. యమగుచి తప్పిదాలను విజయంగా మలచుకుంది.

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తాను ప్రదర్శించిన అద్భుతమైన వ్యూహాత్మక పటిమను మరోసారి కనబరుస్తూ, ఆమె రెండో గేమ్‌ను 21-17తో గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ మూడవ ర్యాంకర్ అయిన ప్రత్యర్థిని ఆమె సొంత గడ్డపైనే ఓడించడం ద్వారా, తాను తిరిగి సత్తా చాటానని సింధు బ్యాడ్మింటన్ ప్రపంచానికి గట్టిగా చాటిచెప్పింది.

Also REad: ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ముందు జట్టులో కీలక మార్పులు.. సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్!

ALso REad: రూ.28 లక్షలకు చేరిన ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర..అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

200MP కెమెరాతో Oppo Find X10 సిరీస్ త్వరలో లాంచ్.. ఫీచర్లు చూస్తే షాకే!

Hyderabad, Telangana:

Oppo Find X10 Series Launch Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) గ్లోబల్ మొబైల్ మార్కెట్‌లో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది.. తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన ఒప్పో Find X10 (Oppo Find X10) స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది విడుదలకు ముందే టెక్ మార్కెట్‌లో అద్భుతమైన పేరును సంపాదించింది.. తాజాగా ఈ మొబైల్ చైనాకు చెందిన ప్రముఖ  SRRC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో ఈ ఫోన్ లాంచ్‌కు సర్వం సిద్ధమైనట్లు సమాచారం.. లీకైన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ఫోన్ ఊహించని ఫీచర్లు, కళ్లు చెదిరే కెమెరా సెటప్‌తో త్వరలోనే వినియోగదారుల ముందుకు రానుంది.

లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్  డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో Find X10 స్మార్ట్‌ఫోన్ చైనాలో SRRC సర్టిఫికేషన్ పొందిందని తెలిపాడు. ఈ సైట్‌లో ఫోన్ మోడల్ నంబర్ PMW110గా నమోదైనట్లు లీక్‌ చేసిన వివరాల్లో పేర్కొన్నాడు. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్‌లో హై-స్పీడ్ కనెక్టివిటీ కోసం N79 5G బ్యాండ్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒప్పో కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వారాల్లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం నాలుగు మోడళ్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మొట్టమొదటి 2nm చిప్‌సెట్..
ఈ స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో మీడియాటెక్ సంస్థకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన, డైమెన్సిటీ 9600 ప్రో (MediaTek Dimensity 9600 Pro) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అత్యంత అధునాతనమైన 2nm ప్రాసెస్ టెక్నాలజీపై ఈ చిప్‌సెట్ రూపొందించిన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ ఫాస్ట్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా.. బ్యాటరీ వినియోగం చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.. ముఖ్యంగా పెద్ద గేమ్స్ ఆడేవారికి, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఇది అద్బుతమైన ఎక్పీరియన్స్‌ను అందిస్తుంది.

అదిరిపోయే కెమెరా..
ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఒప్పో ఈ ఫోన్‌లో కెమెరాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్ (200MP) HPC ప్రైమరీ కెమెరా సెటప్‌ను అందించే అవకాశాలు ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.. డిజిటల్ కెమెరాలను తలదన్నేలా.. అత్యంత స్పష్టమైన ఫొటోలు, 8K వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉండబోతున్నాయి..

డిజైన్, డిస్‌ప్లే హైలైట్స్..
ఈ సిరీస్ ఫోన్ల డిస్‌ప్లే 6.32 అంగుళాల నుంచి 6.89 అంగుళాల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా, ఫోన్ స్క్రీన్ బెజెల్స్ దాదాపు లేనట్లుగా కనిపించడానికి ఒప్పో ప్రత్యేకంగా LIPO బెజెల్ టెక్నాలజీ (LIPO Bezel Technology)ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ లుక్ అత్యంత ప్రీమియంగా.. స్క్రీన్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని సమాచారం. మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఒప్పో Find X10.. ప్రీమియం విభాగంలో Apple, సాంసంగ్‌ వంటి దిగ్గజాలకు గట్టి పోటీగా రావడం ఖాయమని కనిపిస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Bharatgas Lite ZIP సేవలు.. ఇక సిలిండర్ డెలివరీ మరింత ఈజీ..!!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

Bharatgas Lite ZIP: భారత ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక కీలక ముందడుగు వేసింది. తమ కస్టమర్ల కోసం సరికొత్త వంటగ్యాస్ అనుభూతిని అందించేందుకు భారత్ గ్యాస్ లైట్ జిప్ పేరుతో నెక్ట్స్ జనరేషన్ ప్రీమియం ఎల్పీజీ సేవలను ముంబై వేదికగా ప్రారంభించింది. డైరెక్టర్ సుభంకర్ సేన్ సమక్షంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా ఈ సర్వీసును ప్రారంభించారు. భారత్‌గ్యాస్ లైట్ జిప్ అనేది బీపీసీఎల్ వారి భారత్‌గ్యాస్ లైట్ కాంపోజిట్ సిలిండర్ ఆధారంగా రూపొందించింది. ఇదే వాడుకునేందుకు సులభంగా ఉంటుందని.. తప్పు పట్టే స్వభావం ఉండదని.. కంపెనీ చెబుతోంది. అంతేకాదు దీని బాడీ పారదర్శకంగా ఉండటంతో సిలిండర్ లో ఇంకా ఎంత గ్యాస్ మిగిలి ఉంది అనేది బయటకు స్పష్టంగా కనిపిస్తుంది. పేలుడు నిరోధక సాంకేతికతతో మరింత సురక్షితంగా దీన్ని రూపొందించారు.  

నేటి వేగవంతమైన జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు, తమ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేని, ప్రీమియం ఎల్‌పిజి అనుభవాన్ని అందించడమే దీని లక్ష్యమని బీపీసీఎల్ తెలిపింది. భారత్‌గ్యాస్ లైట్ జిప్‌ను మొదట ముంబైలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మరిన్ని కుటుంబాలకు దీని ప్రీమియం ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి, 2026 ఆగస్టు 15 నాటికి ఈ సేవను 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు విస్తరిస్తామని బీపీసీఎల్ తెలిపింది.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం సహకారంతో.. క్విక్-కామర్స్ యాప్‌లో ఆన్-డిమాండ్ ఎల్‌పిజి సిలిండర్ డెలివరీని ప్రారంభించింది. దాని తర్వాత బిపిసిఎల్ కూడా ఇదే తరహా సర్వీసును ప్రారంభించింది. ఈ రంగంలో ఇది మొట్టమొదటి సేవ కావడం గమనార్హం. ఈ భాగస్వామ్యంలో భాగంగానే హెచ్‌పిసిఎల్   కొత్త 10-కేజీల కాంపోజిట్ సిలిండర్,  హెచ్‌పి నవ్య  కూడా ప్రారంభించింది. దీనిని మొదటగా బెంగళూరులో ఇప్పటికే ఉన్న 5-కేజీల మెటల్ సిలిండర్‌తో పాటు విడుదల చేశారు.

ఇన్‌స్టామార్ట్-హెచ్‌పిసిఎల్ భాగస్వామ్యం కింద, ఆర్డర్ చేయడానికి వినియోగదారులకు ముందుగా ఉన్న గృహ ఎల్‌పిజి కనెక్షన్ అవసరం లేదు. దీనివల్ల, అధికారిక కనెక్షన్ లేని విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిన్న కుటుంబాలకు ఈ సేవ అందుబాటులోకి వస్తుంది. ప్రారంభ ఆర్డర్‌లు కొత్త సిలిండర్ కొనుగోళ్లుగా పూర్తి చేస్తాయి. వీటికి గుర్తింపు ధృవీకరణ,  డెలివరీ రుజువు అవసరం ఉంటుంది. తదుపరి ఆర్డర్‌లు రీఫిల్‌లుగా పరిగణిస్తారు.డెలివరీ సమయంలో ఖాళీ సిలిండర్‌ను తిరిగి తీసుకుంటారు.

Also Read: తెలంగాణ PRCపై ఉద్యోగులు గంపెడాశలు.. ఈసారైనా ప్రభుత్వం కరుణిస్తుందా?

Also Read:  ఇది స్కూలా లేక IAS, IPS ల తయారీ కేంద్రమా?

Also Read: సీపీఎస్ రద్దు కోసం జన జాగరణ యాత్ర..ఆగస్టు 23న హైదరాబాద్‌లో మహా సభ..!!

Also Read:  తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

ఆగస్టు 2 నుంచి కేతువు గోల్డెన్ పీరియడ్.. ఈ 4 రాశుల వారికి తిరుగుండదు, అఖండ విజయాలు!

Hyderabad, Telangana:

Ketu Nakshatra Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువుల సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల మార్పులతో పాటు నక్షత్ర సంచారాల కారణంగా ఏర్పడిన ప్రభావం కూడా ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 2వ తేదీ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 08 నిమిషాలకు కేతువు మాఘ నక్షత్రంలోని రెండవ పాదంలోకి సంచారం చేస్తాడు..

ఈ నక్షత్ర సంచారం కారణంగా అనేక రకాలు ప్రభావితమవుతాయి. అంతేకాకుండా అద్భుతమైన ధన లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో నాలుగు రాశులవారికి కూడా సర్వయుగం కాబోతోంది. అక్టోబర్ 3వ తేదీ వరకు కేతువు ఇదే స్థానంలో ఉండడం వల్ల అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. 

ఈ రాశులవారికి బోలెడు లాభాలు:
మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి కేతు సంచారం గోల్డెన్ పీరియడ్‌గా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపార రంగంలో ఊహించని భారీ లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.. సమాజంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది.. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో మనశ్శాంతి లభిస్తుంది. 

మేష రాశి (Aries) 
కేతువు నక్షత్ర పాద మార్పుల కారణంగా మేష రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ప్రతి పనిలోనూ విజయాలు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన వృద్ధిని అందిస్తుంది.. ఉద్యోగస్తులు తమ కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. వీరికి ఈ సమయంలో తప్పకుండా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న పాత సమస్యలు, సందిగ్ధతలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius) 
ధనుస్సు రాశి వారికి కేతు నక్షత్ర సంచారం అఖండ విజయాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా విజయం సాధించడానికి.. అనేక మార్గాలు సొంతం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యోగ ప్రభావంతో ఉద్యోగాలు మారాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.. ప్రస్తుత ఉద్యోగంలోనే ప్రమోషన్‌తో పాటు జీతాలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

కన్యా రాశి (Virgo)
కేతు నక్షత్ర సంచారంతో కన్యా రాశివారికి ఆగస్టు 2 నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు కూడా సులభంగా తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

వక్రగతిలోకి శని.. జూలై 26 నుంచి ఈ 5 రాశుల వారికి కాసుల వర్షం.. ఊహించని ధనలాభం!

Hyderabad, Telangana:

Saturn Retrograde 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల్లోకెల్లా అత్యంత నెమ్మదిగా కదిలే శని దేవుడు త్వరలోనే మార్పులు చేయబోతోంది.. జూలై 26, 27 మధ్య రాత్రి 1:25 గంటలకు శని గ్రహం వక్రీలోకి వెళ్లబోతోంది.. ఈ వక్రగతి కారణంగా దాదాపు 4 నెలల 10 రోజుల పాటు కొన్ని రాశులవారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగగా డిసెంబర్ 11 ఉదయం 5 గంటల వరకు మీన రాశిలో వక్రగతిలోనే ఉండబోతోంది. 

సాధారణంగా శని వక్ర అంటే చాలా రాశులవారు భయపడతారు.. కానీ ఈ సారి జూలై నుంచి జరగబోయే ఈ మార్పు 5 రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని, కెరీర్ విజయాన్ని పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొన్ని రాశులవారు ఊహించని అదృష్టాన్ని పొందుతారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మకర రాశి:
మకర రాశివారికి ఈ సమయంలో అన్ని రకాల మానసిక, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌లో ఊహించని పురోగతి కూడా లభిస్తుంది. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న పాత విభేదాలు, మనస్పర్థలు తొలగిపోయి బంధం మరింత బలపడే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

తులా రాశి: 
తులా రాశి వారికి శని దేవుడి అనుగ్రహంతో భౌతిక సుఖాలతో పాటు విలాసాలు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. జీవితంలో సౌకర్యాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో పడిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వృషభ రాశి: 
వృషభ రాశివారికి శనివ్రగతి కారణంగా భారీ ప్రయోజనాలను చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. సుదీర్ఘకాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.. ఇంటర్వ్యూలలో విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మీన రాశి: 
ప్రస్తుతం మీన రాశివారికి ఏల్నాటి శని రెండో దశ కొనసాగుతోంది. సాధారణంగా ఇది కష్టకాలంగా భావించినప్పటికీ.. శని వక్రీ కావడం వల్ల దీని తీవ్రత చాలా వరకు తగ్గుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ 4 నెలల కాలంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగ పనులు వేగం పుంజుకుంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు మీ వ్యాపార వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

ఆనందపురం హైవేపై ఘోర ప్రమాదం..లారీని ఢీకొట్టిన కారు, నలుగురు మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు!

Hyderabad, Telangana:

Visakhapatnam Road Accident: ఈ మధ్యకాలంలో పరిశీలిస్తే, తెల్లవారుజామున, అర్ధరాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్డు పక్కన వాహనాలు ఆపి ఉంచడం వల్ల లేదా మద్యం సేవించి నిద్రమత్తులో వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని ఒక కారు బలంగా ఢీకొట్టడం వల్ల, ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. ఈ ఘోర ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్న పరిధిలో జరిగింది. ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం ప్రాంతంలో ఈ ఘటన సంభవించడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 

పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం.. పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతం నుండి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో జరుగుతున్న ఒక శుభకార్యానికి హాజరు కావడానికి ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో వారు ఆనందపురం ప్రాంతానికి చేరుకున్న వెంటనే, గండిగుండం వద్దకు రాగానే కారు అకస్మాత్తుగా డ్రైవర్ నియంత్రణ తప్పింది. దీనివల్ల కారు వేగంగా వెనుక నుండి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా, డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఆయన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల జాబితాలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. తీవ్రమైన గాయాలతో ఉన్న ఎమ్మెల్యేను ప్రాణాపాయం నుండి కాపాడటానికి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, సమగ్రమైన దర్యాప్తును ప్రారంభించారు.

0
0
Report

England Vs India ODI: ఇంగ్లాండ్‌తో మూడో వన్డే ముందు జట్టులో కీలక మార్పులు..వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ఆల్‌రౌండర్!

Hyderabad, Telangana:

England Vs India 3rd ODI: ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరగబోయే నిర్ణయాత్మక మూడో వన్డేకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టులోకి తీసుకుంది. ఆదివారం జరగబోయే ఈ మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచిన జట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.

కార్డిఫ్ వన్డేలో గాయం..
కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 26 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ కుడి కాలు హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 5 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేసిన సుందర్, గాయం తీవ్రత వల్ల కాలుకు పట్టీలు (స్ట్రాపింగ్) కట్టుకోవాల్సి వచ్చింది.

కనీసం డ్రెస్సింగ్ రూమ్ మెట్లు ఎక్కడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడిన అతడు, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. ప్రస్తుతం సుందర్ గాయం తీవ్రతను అంచనా వేయడానికి స్కాన్ పరీక్షలు చేయించుకోనున్నాడని, తదుపరి చికిత్స కోసం నిపుణులైన వైద్యులను సంప్రదిస్తాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

జట్టులోకి హర్ష్ దూబే.. కానీ రేసులో కుల్‌దీప్!
వాషింగ్టన్ సుందర్ స్థానంలో విదర్భకు చెందిన ఎడమచేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేకు జట్టులో చోటు లభించింది. ఇటీవల ఆఫ్ఘానిస్తాన్‌పై జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన దూబే.. ధర్మశాలలో జరిగిన ఆ వన్డేలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.

అయితే, దూబే జట్టులోకి వచ్చినప్పటికీ లార్డ్స్ వన్డే తుది జట్టు (Playing XI)లో చోటు దక్కించుకోవడం అంత సులువు కాదు. పిచ్ పరిస్థితుల దృష్ట్యా సీనియర్ చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మూడో వన్డేకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.

Also Read: రూ.28 లక్షలకు చేరిన ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర..అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్!

Also Read: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ వార్తలను BCCI ఖండన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా కావడానికి అందెశ్రీ నాకు స్ఫూర్తి: రేవంత్‌ రెడ్డి

Ghatkesar, Telangana:

Hyderabad: 'తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరపిరంగులై గడీలను బద్దలు కొట్టాయి. ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి అందెశ్రీ నాకు స్ఫూర్తి' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలు రాసిన అందెశ్రీ ప్రజల్లో చైతన్యం నింపారని ప్రశంసించారు. ఆయన పాట మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది అని ప్రశంసించారు.

హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోంది' అని వివరించారు. తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప… గడీలలో దొరల కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారని చెప్పారు.

'మనందరం దండు కట్టి విష సర్పాలను తుదముట్టించాలని అందెశ్రీ అన్న మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి. నా కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించా. ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే  గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. 'మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చినవ్ కదా? తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

'మేం నోటిఫికేషన్లు ఇచ్చినం రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. పేపర్ లీకేజీలతో రూ.వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా? నిరుద్యోగులపై మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా?' అని ప్రతిపక్షాలపై రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. మేం అధికారంలోకి వచ్చాక అడ్డంకులను తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

'పదేళ్లు మీరు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? ఏడాదిలో 70 వేల ఉద్యోగాలు మేం ఎలా భర్తీ చేశాం? మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు? తెలంగాణ అప్పుల్లో ఎలా కూరుకుపోయింది?' అని తెలంగాణ ముఖ్యమంత్రి నిలదీశారు. 'మేక తోలు కప్పుకున్న తోడేళ్లను నేను అడుగుతున్నా. గజ్వేల్‌లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే బాధ్యత మా యువకులు చూసుకుంటారు. తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసింది?' అని ప్రశ్నించారు.

'అమెరికాలో బాత్రూమ్‌లు కడిగే ఆయన కొడుకును మంత్రిని చేసింది. రబ్బరు చెప్పులతో  తిరిగిన వాళ్లను, సోడా పోసినోళ్లని మంత్రులను చేసింది. నేను ఉన్నంతవరకు ఈ తెలంగాణ తులసీ వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం' అని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీకు ఎవరు స్ఫూర్తి… నిజాం, ఖాసీం రిజ్వీనా మీకు స్ఫూర్తి? నీకు మాకు పోలిక ఎంది.. పోటీ ఏమిటి? మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదు' అని తెలిపారు.

'తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది. నిజామ్‌ను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డది. తెలంగాణ చైతన్యం ముందు మీరెంత? మళ్లీ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 'తెలంగాణను ఎవరూ చెరబట్టలేరు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దు. ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుంది' అని నిరుద్యోగులకు సూచించారు.

'పదేళ్లు బిడ్డ కవితకు పదవి ఇచ్చుకున్నారు. కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీకు గుర్తుకు రాలేదా?' అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. 'మా ప్రభుత్వంలో శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం. చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం. కోదండ రామ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేసుకున్నాం' అని గుర్తుచేశారు. 'ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి? మీ కుటుంబం దోచుకునేందుకా? మీ కుటుంబం పదవుల కోసమా?' అని ప్రతిపక్షాలను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. '2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం. ఇదే భవిష్యత్, ఇదే చరిత్ర' అని ప్రకటించారు.

0
0
Report
Advertisement

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త-  ఆరోగ్య పథకానికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ!

Baddipadaga, Telangana:

Jackpot To Govt Employees: ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇటీవల అట్టహాసంగా ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రారంభించిన కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొత్త ఆరోగ్య పథకం ఎలా వర్తిస్తుంది? దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటో మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం మార్గదర్శకాలు తెలుసుకుందాం.

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలులో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల నుంచి రెండుసార్లు చందా మినహాయించిన సందర్భాల్లో అదనంగా వసూలైన మొత్తాన్ని రిఫండ్ చేయడానికి పూర్తి విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి చందా ఎంత?
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్ల కనీస జీతం/ కనీస పింఛన్‌లో 1.5 శాతం మొత్తాన్ని ఉద్యోగుల ఆరోగ్య పథకానికి చందాగా మినహాయిస్తున్నారు.

డబుల్ డిడక్షన్ జరిగే పరిస్థితులు
ఈ క్రింది సందర్భాల్లో ఒకే కుటుంబానికి రెండుసార్లు ఆరోగ్య పథకానికి చందా మినహాయించే అవకాశం ఉంటుంది.
భార్య, భర్త ఇద్దరూ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు
ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్‌గా ఉండడం
ఒకే వ్యక్తి సర్వీస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందుతున్న సందర్భం
ఒకే కుటుంబంపై రెండుసార్లు ఈహెచ్‌ఎస్‌ చందా మినహాయించిన ఇతర సమానమైన సందర్భాలు.

రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు రీఫండ్ విధానం
సంబంధిత డీడీఓ (డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్సింగ్‌ ఆఫీసర్‌)కు దరఖాస్తు సమర్పించాలి
దరఖాస్తుతో పాటు జీవిత భాగస్వామి ఉద్యోగం/ పెన్షన్ ఆధారాలు, ఆరోగ్య కార్డు ఐడీ, ఇతర అవసరమైన ధృవపత్రాలు జత చేయాలి.

డీడీఓ చేయాల్సింది
ఉద్యోగి సమర్పించిన వివరాలను సర్వీస్ రికార్డులు, పత్రాలతో పరిశీలించి అర్హత నిర్ధారించాలి.
అర్హత ఉంటే ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ఈహెచ్‌ఎస్‌ రీఫండ్‌ ఆప్షన్ ద్వారా సప్లిమెంటరీ బిల్ సమర్పించి రీఫండ్ చెల్లించాలి.

పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్లకు
సంబంధిత ట్రెజరీ ఆఫీస్‌ / పింఛన్‌ పేమెంట్‌ ఆఫీస్‌కు దరఖాస్తు ఇవ్వాలి.
అవసరమైన పత్రాలను జత చేయాలి.
అధికారులు ధృవీకరణ అనంతరం ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా రీఫండ్ బిల్లు రూపొందించి చెల్లింపు చేస్తారు.

ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రత్యేక ఈహెచ్‌ఎస్‌ రీఫండ్‌ ఆప్షన్
రీఫండ్ క్లెయిమ్‌ల కోసం ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రత్యేకంగా ఈహెచ్‌ఎస్‌ రీఫండ్‌ మాడ్యూల్ అందుబాటులో ఉంటుంది.

డీడీఓలు ఈ మాడ్యూల్ ద్వారానే రీఫండ్ బిల్లులు సమర్పించాలి.
ముందుగా ఉద్యోగి వివరాలు నమోదు చేసి, అర్హత ధృవీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే రీఫండ్ బిల్లు రూపొందించాలి.

డీడీఓలకు కీలక ఆదేశాలు
భవిష్యత్తులో ఈహెచ్‌ఎస్‌ డబుల్ డిడక్షన్ జరగకుండా డీడీఓలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి.
నిర్లక్ష్యంతో మళ్లీ డబుల్ లేదా అదనపు డిడక్షన్ జరిగితే దానికి సంబంధిత డీడీఓనే బాధ్యుడిగా పరిగణించి ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరిస్తుంది.
ఒక నెలలోపు రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలి

0
0
Report

మంచిర్యాల కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు? ఎంపీ Vs ఎమ్మెల్యే..

Peddapalli, Telangana:

Mancherial Latest News: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీక్రిష్ణ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని గూడెం గ్రామంలో పర్యటించాల్సి ఉండగా.. ఆయన పర్యటనను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన గూడెం వద్ద ఎంపీ వంశీక్రిష్ణ స్వాగతం కొరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చింపివేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రోటోకాల్ వివాదం.. 
ఈ వివాదానికి ప్రధాన కారణం సమన్వయ లోపమేనని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు గానీ.. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు గానీ.. ఎంపీ వంశీక్రిష్ణ పర్యటనకు సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో పర్యటనలు చేయడం సరైంది కాదని... అందుకే ఈ పర్యటనను అడ్డుకుంటున్నామని.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనుచరులు భారీ సంఖ్యలో తరలివచ్చి.. MLAకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

దీంతో ఎంపీ పర్యటనకు ముందే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. MP వంశీక్రిష్ణ ఇంకా గూడెం గ్రామానికి చేరుకోకముందే.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఉద్రిక్తతను తగ్గించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ వ్యవహారంపై జిల్లా రాజకీయ నేతలతో పాటు విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మధ్య చాలా సంవత్సరాలుగా రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం బహిరంగ రహస్యమే.. వివేక్ వెంకటస్వామి కుమారుడైన వంశీక్రిష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఈ సఖ్యత కుదరకపోగా.. విభేదాలు మరింత ముదిరాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావాలనే తన అనుచరుల ద్వారా ఎంపీ పర్యటనను అడ్డుకుంటూ జిల్లాలో తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వర్గ పోరు కాంగ్రెస్ అధిష్ఠానానికి సరికొత్త తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top