సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి పండుగ
Rudrangi, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. సాయిబాబా పూజలు చేస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా నగరంలోని మార్కండేయ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5-30 గంటలకు క్షీరాభిషేకం, పుష్పార్చన ఉదయం 10 గంటలకు విభావరి ఎస్.అన్నప్రసాద వితరణ, మధ్యాహ్న హారతి కార్యక్రమం నిర్వహించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Sanju Samson Century: సంజూ శామ్ సన్ రికార్డు సెంచరీ.. 2026లో చెన్నై బోణి కొట్టిందోచ్!
Chennai, Tamil Nadu:Chennai Super Kings Beat By 23 Runs To Delhi Capitals: హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం చేసి ఢిల్లీ క్యాపిటల్స్పై ఊహించని విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన చెన్నై జట్టు ఢిల్లీపై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణి కొట్టింది. సంజూ శామ్సన్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. మోస్తరు లక్ష్యమైనా కూడా ఢిల్లీ చేధించలేకపోవడం గమనార్హం. అత్యంత ఆసక్తికర మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శామ్సన్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. 56 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విజయం కోసం పరితపిస్తున్న సమయంలో సంజూ శతకం బాదాడం చెన్నై అభిమానులకు వినోదం అందించింది. ఈ సీజన్లో సంజూకు ఇది తొలిసారి. 15 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించగా.. 4 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులకు పరిమితమవగా.. యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి అర్ధ సెంచరీ నమోదు చేసి రిటైన్ అయ్యాడు. అనంతరం శివమ్ దూబే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయకపోవడం గమనార్హం. కెప్టెన్ అక్షర్ పటేల్ తీసిన వికెట్ ఒకటే కావడం విశేషం.
Also Read: KTR Speech: చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.. ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్
మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్లు పూర్తి చేసి 189 పరుగులకు పరిమితమైంది. బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో ఆలౌటైంది. పథూమ్ నిస్సాంక 41 పరుగులతో రాణించగా.. కేఎల్ రాహుల్ (18) భారీ పరుగులు రాణించడంలో విఫలమయ్యాడు. సమీర్ రిజ్వీ (6), కెప్టెన్ అక్షర్ పటేల్ (1), డేవిడ్ మిల్లర్ (17) అతి తక్కువ పరుగులు చేశారు. ఓటమి ఖరారు చేసుకున్న క్లిష్ట సమయంలో త్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా రాణించి 38 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టుకు గెలుపు ఆశలు రేకెత్తించాడు. అశుతోష్ శర్మ 19 పరుగులతో రాణించగా.. అనంతరం వచ్చిన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆకిబ్ నబీ (4), కుల్దీప్ యాదవ్ (4), లుంగీ ఎంగిడి (3), నటరాజన్ (1) చాలా తక్కువ పరుగులు చేసి జట్టును ఓటమి వైపు మళ్లించారు. ఈ మ్యాచ్ విజయం సాధించాలనే కసితో చెన్నై బౌలర్లు బౌలింగ్ వేశారు. తక్కువ పరుగులు ఇస్తూనే వరుస వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. జేమీ ఓవర్టన్ కీలక వికెట్లు తీసి ఢిల్లీ నడ్డి విరిచాడు. అతి తక్కువగా 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీసి రాణించగా.. ఖలీల్ అహ్మద్, గుర్జాప్నిత్ సింగ్, నూర్ అహ్మద్ తలా ఒక్కో వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
మూడు ఓటముల అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ గొప్పగా పుంజుకుని ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. సంజూ శామ్సన్ భారీ సెంచరీతో వినోదం అందించగా.. బ్యాటర్లు, బౌలర్లు సమష్టి కృషి చేయడంతో జట్టుకు తొలి విజయం దక్కింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓటములు, ఒక విజయం సాధించిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఓటమిని ఊహించలేకపోయింది. నాలుగు మ్యాచ్లు ఆడి విజయాలు, ఓటమలు రెండేసి చొప్పున ఉన్న ఢిల్లీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రేపు లక్నో, గుజరాత్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్ ముంబై, బెంగళూరు మధ్య జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PBKS Vs SRH Match: సన్రైజర్స్పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం..కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్!
Tira, Punjab:PBKS Vs SRH Match 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో జరగాల్సిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. ఇప్పుడు సన్రైజర్స్పై గెలిచి సత్తా చాటింది. 220 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా 18.5 ఓవర్లలో ఛేదించి.. ఈ సీజన్లో మరో బలమైన జట్టుగా నిలిచింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 7 పాయింట్లతో రెండో స్థానానికి చేరుతుంది.
న్యూ ఛంఢీఘర్లోని మహారాజ యుధవీంద్ర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులను రాబట్టారు. ఆరంభం నుంచే సన్రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో 28 బంతుల్లో 74 పరుగులు రాబట్టి పవర్ప్లేలో ఎక్కువ స్కోర్ రాబట్టేందుకు కృషి చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్కు తోడుగా బ్యాటింగ్కు వచ్చిన ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు రాబట్టి మెరుగైన భాగస్వామ్యం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39) తమదైన ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో విజయం సాధించారు.
ఆ వెంటనే వచ్చిన సన్రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం వల్ల 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 219 పరుగులతో సరిపెట్టుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, శశాంక్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేవియర్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆదినుంచే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57 పరుగులు; 5 సిక్సర్లు, 5 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (51 పరుగులు; 4 సిక్సర్లు, 4 ఫోర్లు) అర్ధశతకాలతో దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యం రాబట్టి పంజాబ్ కింగ్స్ జట్టుకు టెన్షన్ లేని ఛేజింగ్ స్థాయికి తీసుకొచ్చారు.
ఆ తర్వాత వచ్చిన కూపర్ కాన్లీ 11 పరుగులకే వెనుదిరిగినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనదైన బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో 69 పరుగులు రాబట్టి (5 సిక్సర్లు, 5 ఫోర్లు) తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. నేహాల్ వధేరా 14 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ 16 పరుగులు రాబట్టారు. దీంతో 18.5 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ లీగ్లో తమ మూడో విజయాన్ని నమోదు చేసుకుంటూ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్నారు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దుబే ఒక్క వికెట్ పడగొట్టగలిగారు.
Also Read: RR vs RCB Preview: నేడు ఐపీఎల్లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
keesara Toll plaza Accident: కీసర టోల్గేట్ వద్ద ఘోరం.. BMW కారు మీద పడ్డ సిమెంట్ ట్యాంకర్.. వీడియో ..
Hyderabad, Telangana:Keesara Toll plaza accident cement tanker overturns on bmw car: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంచికచర్ల మండలం, కీసర టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్న ఘటనతో ఆ మార్గంలో భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హైదరాబాద్ కు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ టోల్ వద్దకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న BMW కారుపై బోల్తా పడింది . దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. టోల్ గేట్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో.. అదుపు తప్పి BMW కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా పడింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి BMW కారు నుజ్జునుజ్జు
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, కీసర టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకున్న ఘటన
టోల్ గేట్ వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో.. అదుపు తప్పి BMW కారుపై బోల్తా పడ్డ వాహనం
ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు.. ఎంతమంది… pic.twitter.com/OHpckNS4oi
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 11, 2026
వెంటనే టోల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అతి కష్టం మీద పోలీసులు శ్రమించి BMW కారులో ఉన్న వ్యక్తిని బైటకు తీశారు. అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే ఘటన స్థలంలోనే అతను చనిపోయాడు.
చనిపోయిన వ్యక్తిని ఎల్లారెడ్డికి చెందిన అడ్వకేట్ బి. శ్రీనివాస్ గా గుర్తించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనిపై హైవే అధికారి మాత్రం అతివేగం లేదా డ్రైవర్ తాగి ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. మొత్తంగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
CSK Vs DC Playing 11: చెన్నె సూపర్ కింగ్స్లో ధోనీ ఎంట్రీ ఖరారు..రసవత్తరంగా మారనున్న ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్!
Chennai, Tamil Nadu:CSK Vs DC Match Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నేడు (శనివారం) చెన్నైలో చేపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. పాయింట్స్ పట్టికలో చివరి పదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్లో బోణీ కొట్టాలని చూస్తోంది. అలాగే ఈ మ్యాచ్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టులో చేరుతాడనే వార్త జట్టులో మరింత ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా తమ గత మ్యాచ్లో ఓటమి తర్వాత చెన్నైపై కచ్చితంగా గెలవాలని ఊవ్విళ్లూరుతుంది.
చెన్నై విషయానికి వస్తే వారు ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉన్నందున.. డెవాల్డ్ బ్రెవిస్ను జట్టులోకి ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అయితే అతడు జట్టులోకి ఎప్పుడు చేరుతాడనే దానిపై సీఎస్కే మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఈ సీజన్ కోసం 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన కార్తిక్ శర్మ స్థానంలో అతను జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఢిల్లీ విషయానికొస్తే .. బ్యాటింగ్ ఆర్డర్లో నితీష్ రాణాకు అంతగా కలిసి రాలేదు. అతని స్థానంలో కరీన్ నాయర్ లేదా అభిషేక్ పోరెల్ను తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ గత సీజన్లో మంచి ఐపీఎల్లో రాణించి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు .
చెన్నై Vs ఢిల్లీ తుది జట్లు అంచనా..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్ , సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ , లుంగి ఎన్గిడి, టి.నటరాజన్, ముఖేష్ కుమార్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే , జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ , అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ.
చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి, టి.నటరాజన్, ముఖేష్ కుమార్, అశుతోష్ శర్మ, ఔకిబ్ నబీ దార్, సమీర్ రిజ్లీన్ చవి, ఔకిబ్ నబీ దార్, సమీర్ రిజ్లీన్ చవి జామీసన్, అజయ్ జాదవ్ మండల్, పృథ్వీ షా, త్రిపురాన విజయ్, అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, మాధవ్ తివారీ.
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, మాథ్యూ షార్ట్, అకేల్ హోసేన్, కార్తీక్ సింగ్, ద్ష్ణో శర్మ, రామకృష్ణ, జి.ఎస్.ఎస్. శ్రేయాస్ గోపాల్, రాహుల్ చాహర్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, ఉర్విల్ పటేల్, అమన్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, జకరీ ఫౌల్కేస్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Speech: చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.. ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్
Ibrahimpatnam, Telangana:Ibrahimpatnam Politics: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని జోష్యం చెప్పారు. ఇంకో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ మళ్లీ తిరిగి అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నాడు. ఏఐ ఫోటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు. ఫోర్త్ సిటీ ఒక పెద్ద డ్రామా. తన కుటుంబసభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్ర. నిషేధిత భూముల జాబితాతో బ్లాక్మెయిల్ రాజకీయాలు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
ఇబ్రహీంపట్నంలో గెలిచిన నూతన బీఆర్ఎస్ సర్పంచ్లు, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను శనివారం సన్మానించారు. విజేతలను సన్మానించిన అనంతరం అభినందించి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అన్యాయాల ఫలితంగా మల్లో 50 సంవత్సరాల దాకా తిరిగి అధికారంలోకి రాదు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాను ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏఐ చిత్రాలతో గ్రాఫిక్స్తో ఫ్యూచర్ సిటీ అని కొత్త కుట్రకి రేవంత్ రెడ్డి తెరలేపాడు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా తన కుటుంబసభ్యులు, అనుచరుల భూమి కుంభకోణాల కోసమే' అని ఆరోపించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
అన్ని వర్గాలను మోసం చేస్తూ.. తన కుటుంబసభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయి. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడు' అని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు.
Also Read: IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
'మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు 2 నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరిందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే కచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందని పేర్కొన్నారు.
'ఫార్మా సిటీ పేరుతో రేవంత్ రెడ్డి భూముల దందా చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి చెప్పి మోసానికి పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారు. భూములు పొందడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఫ్యూచరే లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Jeevan Reddy Meeting: మరోసారి కలవనున్న జీవన్ రెడ్డి, కేసీఆర్.. త్వరలోనే పబ్లిక్ మీటింగ్!
Hyderabad, Telangana:KCR Jeevan Reddy Public Meeting: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, జీవన్ రెడ్డి కలయిక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పబ్లిక్ మీటింగ్లో కలవనున్నారట.Chhattisgarh: మైనర్లు స్వచ్ఛందంగా వెళ్తే అది కిడ్నాప్ కాదు: ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు!
Hyderabad, Telangana:Chhattisgarh HC Verdict Latest News: ప్రేమ వ్యవహారాల్లో మైనర్ బాలికలు తమకు తాముగా.. స్వచ్ఛందంగా ఎవరితోనైనా వెళ్ళిపోయినప్పుడు వారిపై కిడ్నాప్ లేదా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేయడం చెల్లదని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కి అగర్వాల్, జస్టిస్ రాధాకృష్ణన్ అగర్వాల్ లతో కూడిన ధర్మాసనం నిందితుడికి ట్రయల్ కోర్టు విధించిన 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కొట్టివేసింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
2022 సంవత్సరంలో చతిస్గఢ్కు చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక.. 24 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.. వీరిద్దరూ సుమారు నెల రోజులపాటు విజయవాడ తో పాటు హైదరాబాదు నగరాల్లో కలిసి నివసించారు. బాలిక కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి రంగంలోకి దిగి.. మైనర్ బాలికతో పాటు 24 ఏళ్ల యువకుడిని గుర్తించి.. యువకుడిపై కిడ్నాప్ కేస్ తో పాటు పోక్సో చట్టం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఈ కేసును విచారించిన స్థానిక ట్రయల్ కోర్టు హిందీతుడిని దోషిగా నిర్ధారిస్తూ దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది..
ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.. ఈ సందర్భంగా హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావిస్తూ జడ్జిమెంట్ అందించింది. బాలిక తన వాంగ్మూలంలో నిందితుడు తనను బలవంతంగా తీసుకెళ్లలేదని.. ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లానని స్పష్టం చేసింది.. నెల రోజుల పాటు బహిరంగ ప్రదేశాలతో పాటు.. రద్దీగా ఉండే నగరాల్లో తిరిగినప్పుడు ఎక్కడ ఆమె ప్రతిఘటించలేదని కోర్టు గుర్తించింది. నిందితుడు ఎటువంటి హింసకు కూడా పాల్పడలేదని.. బాలిక స్వచ్ఛందంగానే అతనితో కలిసి జీవించిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఒక మైనర్ బాలిక తన ఇష్టంతో.. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు.. అది కిడ్నాప్ కిందికి రాదని.. చట్టం ప్రకారం మైనర్ల రక్షణ ముఖ్యమే అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి అని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలు స్వయంగా నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పడంతో.. అతనిపై మోపిన సెక్షన్లు చెల్లవని తీర్పునిస్తూ నిందితుడిని తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.. ఈ తీర్పు ప్రస్తుతం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lemon Prices: అమ్మో నిమ్మకాయ! ధర చూస్తే గుండె గుభేల్.. చుక్కలు చూపిస్తున్న పులుపు!
Hyderabad, Telangana:Lemon Prices Hike Latest News: వేసవి సూర్యుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నాడు.. ఎండలు ముదురుతుండడంతో అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు.. దాహం తీర్చుకునే పానీయాల వరకు దేనికైనా నిమ్మకాయ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం నిమ్మకాయల ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో తక్కువ ధరల్లో లభించే నిమ్మకాయలు.. ఇప్పుడు వాటి ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ధరలు ఆకాశాన్ని తాకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇప్పుడు మార్కెట్లో కేజీ నిమ్మకాయ ఎంత ధరల్లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి మాసంలో నిమ్మకాయ ధరలు కేజీ రూ.10 మాత్రమే ఉండేవి.. ఫిబ్రవరి చివరి వారంలో రూ.30 పలికిన ధరలు.. ఇప్పుడు మార్కెట్లో ఏకంగా రూ.135 వరకు పలుకుతోంది. అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగింది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క నిమ్మకాయ ధర దాదాపు 8 నుంచి 10 రూపాయల మధ్యలో ఉంది. అయితే ఒక్కసారిగా నిమ్మకాయలు ఇంత ధరలకు అమ్మడంతో సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు.. అలాగే కొన్ని చోట్ల అయితే ఒక్కొక్క నిమ్మకాయను 15 రూపాయలకు పైగా విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ధరలు పెరిగిన రైతుల్లో మాత్రం సంతోషం కనిపించడం లేదు.. వాతావరణ మార్పుల కారణంగా నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు సగటున 40 నుంచి 50 బస్తాలు వస్తూ ఉండేవట.. కానీ వాతావరణ మార్పుల కారణంగా 15 బస్తాలు రావడం కూడా గగనమైందని కొంతమంది రైతులు చెబుతూ ఉన్నారు. చీడపీడల నివారణకు మందులు కొట్టడం.. సాగు ఖర్చులు పెరగడం వల్ల వచ్చే ఆదాయం వీటికి సరిపోవడం లేదని వాపోతున్నారు..
అకాల వర్షాలతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల పూత రాలిపోవడం దిగుబడిని తగ్గించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వేసవిలో శరీరానికి చలువచేసే నిమ్మరసం తాగాలనుకుంటున్న వారికి పెద్ద షాకే అని చెప్పొచ్చు. హోటళ్లతోపాటు జ్యూస్ సెంటర్లలో యజమానులు కూడా ధరలు పెరగడం వల్ల నష్టపోతున్నామని.. కస్టమర్ల వద్ద ఆనందంగా వసూలు చేయలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మకాయ ధరలు ఇలాగే పెరిగితే వేసవిలో నిమ్మరసం తాగడం సామాన్యుడికి కలగానే మిగిలిపోయేలా ఉంది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Solar Eclipse 2027: ఆగస్టులో సుదీర్ఘ సూర్యగ్రహణం..పగటిపూట సూర్యుడ్ని మింగేసే చంద్రుడు.. చీకటి పడే రోజు అతిదగ్గర్లోనే!
Hyderabad, Telangana:Solar Eclipse 2027 Time: ఖగోళ సంఘటనల పరంగా 2026 సంవత్సరానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పరిగణిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఇక ఇదే ఏడాది మరో రెండు గ్రహణాలు ఉన్నాయి. అయితే 2027లో సంభవించే సూర్యగ్రహణం సుదీర్ఘకాలం పాటు కొనసాగడం వల్ల గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిని 'శతాబ్దపు గ్రహణం' అని పిలుస్తున్నారు. అందువల్ల 2027లో సంభవించే సూర్యగ్రహణం గురించి ప్రజలలో మరికొంత ఆందోళన, ఇంకొంత ఆసక్తి నెలకొంది.
2026 సూర్య-చంద్ర గ్రహణం ఎప్పుడు?
2026వ సంవత్సరపు ప్రధాన సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఉన్నా.. ఇది భారతదేశంలో నేరుగా కనిపించదు. అలాగే ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఆగస్టు 27, 28 తేదీల రాత్రి సంభవిస్తుంది.
గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్ల్యాండ్, ఐస్ల్యాండ్, ఆర్కిటిక్ ప్రాంతం, యూరప్లోని కొన్ని భాగాలలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి అక్కడ దీని ప్రభావం పరిమితంగా ఉంటుందని అంచనా. చంద్రగ్రహణం మాదిరిగా ఉత్తర, దక్షిణ అమెరికా.. యూరప్, ఆఫ్రికాలోని పశ్చిమ ప్రాంతాలైన తూర్పు పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో కనిపిస్తుంది.
భారత్లో సూతక కాలం ఉంటుందా?
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి మన ప్రజలు సూతకాలం వర్తించదు, అలా సూతకం పాటించాల్సిన అవసరమే లేదు. అంటే ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ దైనందిన కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఆచారాలు నిర్వహించుకోవడంతో పాటు శుభకార్యాలు చేసుకోవచ్చు.
2027 సూర్యగ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది?
ఇక 2027 విషయానికి వస్తే.. ఆగస్టు 2, 2027న సంభవించే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. దీని మొత్తం వ్యవధి సుమారు 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉండవచ్చని అంచనా. దీంతో ఇది సుదీర్ఘ కాలం పాటు నడిచే సూర్యగ్రహణంగా పరిగణిస్తారు. ఈ గ్రహణం సమయంలో చాలా ప్రదేశాలలో పగటిపూట చీకటిగా ఉండవచ్చు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకున్నప్పుడు ఇది జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ఆకాశమంతటా సూర్యాస్తమయం లాంటి ఒక ప్రత్యేకమైన దృశ్యం ఏర్పడుతుంది.
భారతదేశంలో ఈ 2027లో ఏర్పడనున్న గ్రహణం పూర్తిగా కాకుండా పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. అంటే సూర్యునిలోని కొంత భాగం అస్పష్టంగా కనబడుతుందట. దీనివల్ల ఇది ఒక ప్రత్యేకమైన దృశ్యంగా ఉంటుంది, కానీ పూర్తిగా చీకటిగా ఉండదు.
అయితే ఇంతటి సుదీర్ఘ కాలం పాటు కొనసాగే సంపూర్ణ సూర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుందట. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇంతటి అరుదైన సంఘటన ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడుతుందట. అందుకే దీనిని శతాబ్దపు గ్రహణం అని పిలుస్తారట. 2027లో సంభవించనున్న ఈ సుదీర్ఘ సూర్యగ్రహణం సమయంలో ఒక ఆసక్తికరమైన ఖగోళ అద్భుతం ఏర్పడనుందట. ఆ సమయంలో చంద్రుడు భూమికి ఎంతో దగ్గరకు ఉంటాడట. అయితే సూర్యుడు సాపేక్షంగా దూరం కారణంగా.. చంద్రుడు ఆకాశంలో పెద్దగా కనిపించి.. సూర్యుడిని పూర్తిగా కప్పివేసే విధంగా కనిపిస్తాడట. దీని ఫలితంగా భూమధ్యరేఖకు చాలా దూరంలో నీడలా ఏర్పడుతుందట. దీని వల్ల పగటి పూట దాదాపుగా 6 నిమిషాల పాటు చీకటి అలుముకుంటుందట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco M8s Launch: త్వరలోనే Poco M8s విడుదల.. 50MP కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అదుర్స్!
Hyderabad, Telangana:Poco M8s Hit Indian Market: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో తమ వినియోగదారులకు మరో అద్భుతమైన శుభవార్త అందించబోతోంది. మార్కెట్లో ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న M సిరీస్లో భాగంగా సరికొత్త మోడల్ పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇది Poco M8s మోడల్ పేరుతో అందుబాటులోకి. ముఖ్యంగా ఈ మొబైల్కు సంబంధించిన కొన్ని వివరాలు థాయ్లాండ్కు చెందిన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) డేటాబేస్లో కనిపించినట్లు సమాచారం. దీంతో ఈ ఫోన్ త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు స్పష్టమైంది. అయితే, దీనిని కంపెనీ మొదట భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలుస్తోంది.
NBTC వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ 26067PC09G అని మోడల్ నెంబర్తో లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ అయినా మార్కెట్లో వచ్చేముందు ఇటువంటి సర్టిఫికేషన్లు పొందడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ మొబైల్ కూడా ప్రత్యేకమైన సర్టిఫికేషన్ పొందడం విశేషం.. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన విడుదల తేదీని Poco కంపెనీ కొన్ని వారాల్లోనే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ మొబైల్ గతంలో విడుదలైన Poco M8కు అప్గ్రేడ్ వెర్షన్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్స్ కూడా లీకైన సంగతి తెలిసిందే..
ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్స్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ చాలా అద్భుతమైన 6.77 అంగుళాల Full HD+ అమోలెడ్ డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని వెనక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా ఉంటున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీ కోసం ఇందులో కంపెనీ 20MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించింది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5,520mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 సాఫ్ట్వేర్పై పనిచేస్తుంది. ఈ మొబైల్ భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే దీని ధర రూ.18 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది వివిధ రకాల బ్రాండ్లతో ఇటీవల విడుదలైన మొబైల్స్తో పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే, పోకో కంపెనీ అతి త్వరలోనే ఈ స్మార్ట్ఫోన్ లాంచింగ్కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maternal Uncle: బాలికపై అఘాయిత్యం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామ కాటేశాడు
Hyderabad, Telangana:POCSO Case: శారీరక వాంఛ తీర్చుకునేందుకు కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. వావివరసలు చూడడం లేదు.. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎవరినైనా కాటేయడానికైనా సిద్ధమవుతున్నారు. అలా మేనమామ అని ప్రేమగా ఉండే మేన కోడలిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పలుమార్లు బాలికపై దాడి చేసి తన కోరికలు తీర్చుకున్నాడు. ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో కోడిరెక్క నాగేంద్రకు మేన కోడలు ఉంది. బాలిక (మైనర్) అయిన మేన కోడలితో నాగేంద్ర అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. కొద్దిరోజులకు బాలికపై అఘాయిత్యం చేయడం ప్రారంభించాడు. మైనర్గా ఉన్నప్పటి నుంచే ఆమెపై వరుసగా అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో మేన కోడలు ఎవరికీ చెప్పుకోలేకపోయింది. మేనమామ కావడంతో అతడికి భయపడా కుటుంబసభ్యుల ముందు నోరు విప్పలేదు. అయితే తాజాగా ఎలాగోలా కుటుంబసభ్యులు అతడి అఘాయిత్యం తెలియడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
ఇక మేనమామ వేధింపులు తాళలేక ఆ మేన కోడలు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఘటన వేములపల్లి పరిధి కావడంతో ఎల్బీనగర్ నుంచి కేసు అక్కడికి బదిలీ చేశారు. నిందితుడు కోడిరెక్క నాగేంద్రపై పోక్సో చట్టం కింద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేసి వేములపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోదాడలోని డీ మార్ట్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బస్సు ఏలూరుకు బయలుదేరింది. ఎగ్జిట్ డోర్ వద్ద ప్రమాదం జరగడంతో వెనక ఉన్న అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు బస్సు దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Thieves Video: పిల్ల దొంగల చేతివాటం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వీడియో..
Hyderabad, Telangana:Child Thieves Video Watch Here: నేటి కాలంలో నేరగాళ్లు ఏ వయసులో వారైనా సరే.. తమ తెలివితేటలతో సామాన్యులను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతూ వస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే.. దొంగతనానికి వయస్సుతో సంబంధం లేదని గుర్తు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతు వస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక సాధారణ వ్యక్తి షాప్ దగ్గర నిలబడి వస్తువులను కొనుగోలు చేయడంలో మునిగిపోయాడు.. అతను షాపు యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు బాలురు సాధారణంగా అలవాటుగా దుకాణం దగ్గరికి వచ్చినట్లు నటించారు.. అందులో ఒక బాలుడు సదరు వ్యక్తికి అతి సమీపంలోకి వెళ్లి.. ఎంతో చాకచక్యంగా వెనక జేబులో ఉన్న పర్సును బయటికి తీశాడు. అయితే అతను ఆ షాపు యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది..
కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే.. అతని జేబులో నుంచి పర్సును తీయడం మీరు గమనించవచ్చు. ఆ పరీక్షలు తీసిన వెంటనే మరో బాలుడు కూడా అలర్ట్ అయిపోయాడు. దీంతో వారిద్దరు ఏమి ఎరగనట్లుగా అక్కడి నుంచి మెల్లగా జారిపోయారు.. బాధితుడు తన పనిలో తాను ఉండడంతో.. తన పర్సు పోయిందన్న విషయం కూడా అతనికి వెంటనే అర్థం కాలేదు.. ఈ మొత్తం దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ వస్తుంది..
ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా షేర్ అవుతోంది. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ పిల్లల వేగాన్ని చూసి ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరు పిల్లల లేక వృత్తిపరమైన దొంగలా? అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే పిల్లలను ఇలాంటి నేరాల్లోకి దింపుతున్న ముఠాలపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Gudivada Amarnath Jail: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు జైలుశిక్ష ఖరారు.. 6 నెలలు జైలు, రూ.5 వేలు జరిమానా..ఎందుకంటే?
Visakhapatnam, Andhra Pradesh:Gudivada Amarnath Jail News: వైసీపీ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల క్రితం అనగా 2016 ఏప్రిల్లో నమోదైన ఓ కేసులో వాదనలు తాజాగా పూర్తవ్వగా విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. నిందితుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను పరిగణించిన కోర్టు.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయమై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను సత్వరమే అమలు చేయాలని అప్పట్లో వైసీపీ నేతగా ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో నిరసనలు చేశారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహర దీక్ష చేపట్టగా దీనిపై టూటౌన్లో కేసు నమోదయ్యింది.
ఆ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. దీక్షను భగ్నం చేసి వెంటనే కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిరాహార దీక్ష పేరుతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ప్రయత్నించారనే ఆరోపణలతో వైజాగ్ టూటైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు గత ఎనిమిదేళ్లుగా కోర్టులో వాయిదాలు నడుస్తూ ఉంది.
తాజాగా ఈ కేసుపై తుది విచారణ పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం రెండో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. అమర్నాథ్పై చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారించగా.. మాజీ మంత్రి అమర్నాథ్ను దోషిగా తేల్చిన కోర్టు.. అతనికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పరిస్థితుల్లో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
వైజాగ్ అదనపు కోర్టు విధించిన జైలు శిక్షపై స్పందించిన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రజా ప్రయోజనం కోసం అప్పట్లో రైల్వే జోన్ ఏర్పాటు సాధనే థ్యేయంగా చేసిన పోరాటాన్ని తప్పుగా చిత్రీకరించారని అమర్నాథ్ ఆరోపించారు. తమ పోరాటాల వల్లే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే.. న్యాయసలహా మేరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: చేపకు సిగరెట్ తాగించిన వ్యక్తి.. నెటిజన్ల ఆగ్రహం.. వీడియో!
Hyderabad, Telangana:Fish Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నిత్యం ఏదో ఒక వింత వైరల్ అవుతూనే వస్తోంది. అయితే, కొన్ని వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులకు నవ్వు తెప్పించితే.. మరికొన్ని మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అటువంటి కోవాకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఒక చేపకు సిగరెట్ తాగించిన వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశానికి దారితీస్తోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చేపలు నీటిలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయి. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తను పట్టుకున్న చేపలను నేలపై ఉంచి.. దానికి సిగరెట్ తాగించడం మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి వెలిగించిన సిగరెట్లు చేప లోపల పెట్టగా.. అది గాలి కోసం నోరు తెరిచిన ప్రతిసారి సిగరెట్ పొగను లోపలికి పీల్చుకుంటూ మళ్లీ వదులుతోంది. నీటిలో ఉండాల్సిన జీవిని బయటపడేటమే కాకుండా.. దానికి ఇలా పొగను అలవాటు చేయడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో పై సోషల్ మీడియాలో నేటిజల్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వస్తున్నారు..నోరులేని జీవుల పట్ల ఎలాంటి చర్యలు ఏంటని కొంతమంది ప్రశ్నిస్తూ వస్తే.. మరి కొంతమంది కేవలం న్యూస్ తో పాటు లైక్స్ కోసం ఇలా మూగజీవులను హింసించడం నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చేపకు సిగరెట్ తాగించడం ఎంటర్టైన్మెంట్ కాదు.. అదొక రకమైన జంతు హింస అని జంతు ప్రేమికుల అభిప్రాయపడుతున్నారు..
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
సిగరెట్లు నికోటితోపాటు ఇతర రసాయనాలు మనుషులకే కాకుండా జలచరాలకు కూడా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి నుంచి బయటికి తీసినప్పుడే చేపలు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయని.. అటువంటి సమయంలో ఇలా పొగను పీల్చడం వల్ల అవి త్వరగా చనిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ట్విటర్లో విపరీతంగా వైరల్ అవుతుంది. మూగ జీవులను ఇలా హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు..
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
