సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి పండుగ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. సాయిబాబా పూజలు చేస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా నగరంలోని మార్కండేయ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5-30 గంటలకు క్షీరాభిషేకం, పుష్పార్చన ఉదయం 10 గంటలకు విభావరి ఎస్.అన్నప్రసాద వితరణ, మధ్యాహ్న హారతి కార్యక్రమం నిర్వహించారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Rs 547 Crore Cyber Fraud: ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నిరక్షరాస్యుల కన్నా చదువుకున్న వారే సైబర్ మోసగాళ్లకు చిక్కి దారుణంగా మోసపోతున్నారు. మొన్న ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సతీమణి కొన్ని కోట్ల రూపాయలు మోసపోగా తాజాగా మారుమూల ప్రాంతంలో ఏకంగా వందల కోట్ల సైబర్ నేరం జరిగింది. రూ.547 కోట్ల సైబర్ నేరం జరగడం తీవ్ర సంచలనం రేపగా.. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pension Hike: ప్రైవేటు ఉద్యోగులకు భారీ జాక్పాట్.. ఐదు రెట్లు కనీస పింఛన్ పెంపు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సైబర్ నేరంపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసు పూర్వపరాలు వెల్లడించారు. సైబర్ నేరంపై మోదుగు సాయి కిరణ్ అనే వ్యక్తి 2025 డిసెంబర్ 24వ తేదీన ఫిర్యాదు ఇచ్చాడు. అతడి ఫిర్యాదుతో ఈ సైబర్ నేరం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా మందిని ఉద్యోగం పేరుతో బ్యాంక్ ఖాతాలు తీసుకుని.. వాటి ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిందని కమిషనర్ వెల్లడించారు.
Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
పోట్రూ మనోజ్ కల్యాణ్, ఉడతనేని వికాస్, మేడా భానుప్రియ ఈ సైబర్ మోసాలకు ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రకటించారు. కల్యాణ్ ఖాతాల్లో రూ.114 కోట్లు, అతడి భార్య భానుప్రియ ఖాతాల్లో సుమారు రూ.44.5 కోట్లు, కల్యాణ్ బావమరిది మేడా సతీష్ ఖాతాల్లో రూ.130 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాల్లో రూ.80 కోట్ల లావాదేవీలు జరిగాయని కమిషనర్ వివరించారు. ఇప్పటికీ సుమారు రూ.547 కోట్ల మేర సైబర్ నేరం జరిగిందని.. ఇంకా విచారణ జరుగుతుండడంతో మోసపోయిన లెక్క అనేది ఇంకా తేలాల్సి ఉందని తెలిపారు.
Also Read: Sankranti Gift: సంక్రాంతి పండుగకు తెలంగాణ మంత్రి శుభవార్త.. ఏమిటో తెలుసా?
కాంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్లకు డబ్బులు బదిలీ చేసి కమీషన్లు తీసుకున్నారని, క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా కూడా అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరించారు. వీరి కింద పనిచేసే ఉద్యోగులను నియమించి.. ఒక్కో వ్యక్తి నుంచి 10 బ్యాంక్ ఖాతాలు చొప్పున సేకరించినట్లు.. కాంబోడియాలోని కాల్ సెంటర్ల ద్వారా ఓటీపీ ఫ్రాడ్, డిపాజిట్ ఫ్రాడ్, ఏపీకే ఫ్రాడ్లకు పాల్పడినట్లు కమిషనర్ తెలిపారు. ఎవరూ తమ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు ఇవ్వకూడదని.. మ్యూల్ అకౌంట్గా ఖాతా ఇచ్చినా అది నేరమని స్పష్టం చేశారు. చిన్న చిన్న కమీషన్లకు ఆశపడి ఇలాంటి నేరాల్లో ఇరుక్కుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.
ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ తప్పించుకునే అవకాశం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. గత నెల 24వ తేదీన ఇదే పోలీస్ స్టేషన్లో పోట్రు ప్రవీణ్ అనే వ్యక్తి సైబర్ నేరం కింద అరెస్టవడం.. ఇప్పుడు పోట్రు కల్యాణ్పై సైబర్ కేసు నమోదు కావడం చూస్తుంటే ఈ ప్రాంతంలో మరెంతమంది సైబర్ నేరస్తులు ఉన్నారోనని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Siddipet Politics: మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత ఫోకస్..సిద్ధిపేటపై టార్గెట్ పెట్టిన మాజీ ఎమ్మెల్సీ!
King Cobras In Bathroom Video Watch: సాధారణంగా మనమంతా బాత్రూం కి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండా వెళ్లి పనులు కానిస్తూ ఉంటాము. కానీ ఇటీవల కాలంలో అడవులు విస్తీర్ణత పూర్తిగా తగ్గిపోవడం.. జనావాసాలు పెరగడం కారణంగా విశ్వసర్పాలు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. అలాగే మరికొన్ని విష సర్పాలు అయితే ఏకంగా బాత్రూంలోకి కూడా వస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షార్ట్ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ ఇంట్లోని బాత్రూంలో ఏకంగా రెండు భారీ విషసర్పాలు తిష్ట వేసి ఉండడం మీరు క్లియర్గా చూడొచ్చు. ఇందులో ఒక పాము అత్యంత భయానకంగా పడక విప్పి బుసలు కొడుతూ కెమెరా వైపు చూస్తూ ఉండడం భయాన్ని కలిగిస్తోంది. సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా సంచారం చేసేందుకు చీకటిగా తేమగా ఉండే ప్రదేశాలను ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ రెండు పాములు తేమగా ఉన్న బాత్రూమ్ ని నివాసస్థలంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో పాములు ఇలాగే సంచారం చేస్తూ ఉంటాయి. అందుకే అక్కడి ప్రజలు నిత్యం పాములు బాత్రూంలోకి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లోనైతే.. పాములు ఇలా బాత్రూంలోకి దూరి అందులోకి వెళ్లిన మనుషులపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన సంగతి మన సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలను కూడా చూసి ఉన్నాం.. ఏది ఏమైనా ఇలా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఇళ్లను కట్టుకునేవారు బాత్రూంకి వెళ్లే క్రమంలో ఒకటికి రెండుసార్లు చూస్తూ వెళ్లాల్సి ఉంటుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ప్రజాధరణ పొందింది. అంతేకాకుండా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా జనాలు అయితే ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోని కూడా చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amrit Bharat Express Andhra Pradesh: ఏపీ ప్రయాణికులకు భారత రైల్వే శాఖ సంక్రాంతి పండుగ వేళ అదిరిపోయే శుభవార్త అందించింది. సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లను మరో మూడు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైళ్లు తమిళనాడు నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు.
కొత్త రైళ్లు - ప్రయాణించే మార్గాలు:
ఈ మూడు రైళ్లు ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లనుండటంతో రాష్ట్ర ప్రయాణికులకు గొప్ప రవాణా సౌకర్యం కలగనుంది. ఇంతకీ ఆ కొత్త రైళ్లు నడిచే రూట్ మ్యాప్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తిరుచిరాపల్లి – న్యూ జలపాయ్గురి (పశ్చిమబెంగాల్):
ఈ రైలు తమిళనాడులోని కీలక పట్టణాలను కలుపుతూ ఏపీలోకి ప్రవేశిస్తుంది. చిదంబరం, తాంబరం, చెన్నై ఎగ్మోర్, విల్లుపురం, తంజావూరు మీదుగా వచ్చి ఏపీలో విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. అనంతరం భువనేశ్వర్, ఖరగ్పూర్ మీదుగా న్యూ జలపాయ్గురి చేరుకుంటుంది.
2. తాంబరం – సంత్రాగచ్చి (పశ్చిమబెంగాల్):
చెన్నై పరిసర ప్రాంతాల నుండి బెంగాల్ వెళ్లే ప్రయాణికులకు ఇది చాలా ఉపయోగకరంగా మారనున్నాయి. చెన్నై ఎగ్మోర్, విజయవాడ, భువనేశ్వర్, ఖరగ్పూర్ వంటి స్టాప్స్లో ఈ ట్రైన్ ఆగుతుంది.
3. నాగర్కోయిల్ – న్యూ జలపాయ్గురి:
కన్యాకుమారి సమీపంలోని నాగర్కోయిల్ నుండి బయల్దేరే ఈ రైలు సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. మధురై, దిండిగల్, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం మీదుగా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం మీదుగా ప్రయాణించి పశ్చిమబెంగాల్ చేరుకుంటుంది.
ఏపీ ప్రయాణికులకు కలిగే లాభాలు..
తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యం: అమృత్ భారత్ రైళ్లు సామాన్యుల బడ్జెట్కు అనుగుణంగా (Non-AC) ఉంటాయి. వీటిలో మొబైల్ హోల్డర్లు, ఆకర్షణీయమైన సీట్లు, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. ఈ రైళ్లకు అటు ఇటు రెండు ఇంజన్లు ఉండటం వల్ల వేగంగా ప్రయాణిస్తాయి, దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సంక్రాంతి సమయంలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ అదనపు రైళ్లు పెద్ద ఊరటనిస్తాయి.
తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, ఆ రైళ్లు ఏపీ మీదుగా వెళ్లడం మన రాష్ట్ర ప్రయాణికులకు అదృష్టంగా మారింది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ రైళ్ల పూర్తి సమయ పట్టికను రైల్వే శాఖ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
Also Read: RRB Group D Recruitment: రైల్వేలో 22,000 ఉద్యోగాల మేళా..10వ తరగతి చదివితే చాలు..జీతం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
King Cobra Video Watch: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి.. ముఖ్యంగా ప్రకృతి జీవరాశుల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కోట్ల జీవరాసులతో ప్రకృతి అడవులు నిండి ఉంటాయి. ముఖ్యంగా మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అరుదైన జంతువులను కూడా చూస్తూ ఉంటాం.. అయితే అడవుల్లో వనరులు విపరీతంగా తగ్గడం కారణంగా ఆహార కోరత కూడా ఏర్పడుతూ వస్తుంది. దీని కారణంగా కొన్ని జంతువులు అడవుల నుంచి దగ్గరగా ఉండే జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా పాములైతే విచ్చలవిడిగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన పాములను చాలామంది వన్యప్రాణి సంరక్షకులు రెస్క్యూ చేసి అడవుల్లో వదిలిపెడుతున్నారు. తాజాగా అడవి నుంచి ఓ పైపు ద్వారా ఇంట్లోకి సంచారం చేసేందుకు ప్రయత్నిస్తున్న పాముకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీడియో ప్రారంభంలో..ఒక ఎర్రటి పైపు నుంచి పాము తలపెట్టి బయటికి రావడం మీరు గమనించవచ్చు. సాధారణంగా ఆ పాము ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పైపు వెళ్ళేందుకు అనుగుణంగా లేకపోవడంతో.. అదే పైపు గుండా ముందుకు తలపెట్టి.. ఆ ప్రమాదకరమైన పాము నెమ్మదిగా బయటికి వస్తువు కనిపించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఇళ్లలోకి పాములు ఇలా పైపుల నుంచే వస్తున్నాయి. అయితే ఈ పాము కూడా ఆ పైపు గుండా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించింది. కాకపోతే సరైన దారి లేకపోవడం కారణంగా మళ్ళీ అదే పైపు గుండా బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటగా ఆ పాము పైపుల నుంచి బయటికి వచ్చేందుకు ఎంతగానో కష్టపడింది. అంతేకాకుండా అందులో నుంచి తలపెట్టి పైపు చివరి భాగంలో అటు ఇటు చూడడం మీరు గమనించవచ్చు. శరీరం పైపులో గట్టిగా ఇరుక్కుపోయిన.. ఏమాత్రం వదలకుండా తన కండరాల శక్తిని వినియోగించి నెమ్మదిగా ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఇలా ఆ పాము చిన్నగా పైపు చివరి భాగం గుండా అందులో నుంచి బయటికి వచ్చేసింది. ఇలా వస్తున్న సందర్భంలో అక్కడే ఉన్న స్థానికులు మొబైల్ ద్వారా చిత్రీకరించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోని వైరల్గా మారింది.
సాధారణంగా అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారు తప్పకుండా చలి కాలాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లోకి పాములు సంచారం చేయకుండా ఉండడానికి, వీడియోలో కనిపిస్తున్న పైపులు వంటివి ఉంటే తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి పాములు దూరి దాడి చేసే అవకాశాలున్నాయి. అయితే, ఈ వీడియోకు సంబంధించిన ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. యూట్యూబ్ ఛానల్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Is It Good To Withdraw PF For Personal Loan: చాలామంది ఉద్యోగులు తమకున్న వ్యక్తిగత రుణాలు (Personal Loans) లేదా హోమ్ లోన్ ఈఎంఐల భారం తగ్గించుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ (PF) సొమ్మును విత్ డ్రా చేస్తుంటారు. నెలవారీ ఈఎంఐల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుందని సంబరపడతారు కానీ, దీర్ఘకాలంలో ఇది మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు PF డబ్బును ముట్టుకోకూడదు?
1. చక్రవడ్డీ (Compounding) ప్రయోజనం కోల్పోతారు. ప్రస్తుతం పీఎఫ్ సొమ్ముపై ప్రభుత్వం ఏడాదికి 8.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది చక్రవడ్డీ పద్ధతిలో పెరుగుతుంది. మీరు ఇప్పుడు తీసే చిన్న మొత్తం, మీ రిటైర్మెంట్ సమయానికి కోట్లాది రూపాయల నిధిగా మారే అవకాశాన్ని దూరం చేస్తుంది.
2. రిటైర్మెంట్ నిధికి గండి: పీఎఫ్ అనేది మీ వృద్ధాప్య అవసరాల కోసం రూపొందించబడిన సామాజిక భద్రతా నిధి. అప్పుల కోసం దీనిని వాడటం వల్ల, పదవీ విరమణ తర్వాత మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి? (EPFO Rules)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం.. పీఎఫ్ డబ్బును విచ్చలవిడిగా తీయడానికి వీల్లేదు. వ్యక్తిగత రుణాలు/క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడానికి పీఎఫ్ నుండి డబ్బు తీయడానికి అనుమతి లేదు. కేవలం గృహ రుణాల చెల్లింపు కోసం మాత్రమే కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఉపసంహరణకు అనుమతిస్తారు.
హోమ్ లోన్ వర్సెస్ పీఎఫ్: ఏది లాభం?
హోమ్ లోన్ తీర్చడం కంటే పీఎఫ్ డబ్బును అకౌంట్లోనే ఉంచడం లాభదాయకమని నిపుణులు చెప్పడానికి కారణాలు ఇవే..
వడ్డీ వ్యత్యాసం: హోమ్ లోన్ వడ్డీ రేటు కంటే పీఎఫ్ ఇచ్చే వడ్డీ రేటు (8.25%) కొన్నిసార్లు ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది. పీఎఫ్ డబ్బు సురక్షితమైన రాబడిని ఇస్తుంది.
పన్ను ప్రయోజనాలు: పాత పన్ను విధానంలో (Old Tax Regime) హోమ్ లోన్ అసలు, వడ్డీపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. లోన్ క్లియర్ చేస్తే ఈ పన్ను ప్రయోజనాలను కోల్పోతారు.
పెరిగే భారం: వయస్సు పెరిగే కొద్దీ ఈఎంఐ భారం తగ్గుతుంది (ఇన్ఫ్లేషన్ కారణంగా), కానీ పీఎఫ్ నిధి పెరగడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది.
ముగింపు
అత్యవసర పరిస్థితుల్లో (వైద్య ఖర్చులు లేదా పిల్లల వివాహం వంటివి) తప్ప, కేవలం అప్పుల భారం తగ్గించుకోవడానికి పీఎఫ్ నిధిని వాడటం తెలివైన పని కాదు. అప్పుల కోసం ఇతర మార్గాలను అన్వేషించడం లేదా ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం.
Also Read: RRB Group D Recruitment: రైల్వేలో 22,000 ఉద్యోగాల మేళా..10వ తరగతి చదివితే చాలు..జీతం ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RRB Group D Recruitment 22,000 Posts: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారతీయ రైల్వే శాఖ తీపి కబురు అందించింది. RRB గ్రూప్-డి (లెవల్-1) రిక్రూట్మెంట్ 2026 ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దీనికి సంబంధించి CEN 09/2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జనవరి 2026
దరఖాస్తులు ప్రారంభం: 21 జనవరి 2026
చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2026
ఖాళీల వివరాలు & అర్హతలు
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, పాయింట్స్మన్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI (NCVT/NAC) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు కూడా అర్హులే. 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. (SC/ST/OBC/PWBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం..
అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ (1/3) కలదు. విశేషమేమిటంటే, ఈ పరీక్షను తెలుగుతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో రాసుకోవచ్చు.
శారీరక సామర్థ్య పరీక్ష (PET): శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: ధృవీకరణ పత్రాల పరిశీలన.
వైద్య పరీక్షలు (Medical Exam): రైల్వే ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్ట్ ఉంటుంది.
జీతం, ఇతర ప్రయోజనాలు
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి.
ప్రాథమిక జీతం (Basic Pay): రూ. 18,000.
అదనపు అలవెన్సులు: డియర్నెస్ అలవెన్స్ (DA), హెచ్ఆర్ఏ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, మెడికల్ సౌకర్యాలు.
మొత్తం జీతం: అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు సుమారు రూ.22,500 నుండి రూ.25,380 వరకు అందుతుంది.
దరఖాస్తు రుసుము & ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
జనరల్ అభ్యర్థులకు: రూ.500
SC/ST/మహిళలు/దివ్యాంగులు/మైనారిటీలకు: రూ. 250
దరఖాస్తు విధానం: ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. అనంతరం ఫోటో, సంతకం వంటి పత్రాలను అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pension Hike 5 Times: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులతోపాటు ప్రైవేటు ఉద్యోగులకు భారీ శుభవార్త. కొత్త సంవత్సరం 2026తోపాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈపీఎఫ్ఓకు సంబంధించిన కనీస పింఛన్ భారీగా పెరగనుందని సమాచారం. ఈ పెంపుదలతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం కలగనుంది. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు రెట్ల పింఛన్ పెంపు అనే అంశం ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: KTR: నీ డ్రామాలు, అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
ఉద్యోగుల భవిష్య నిధి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు పింఛన్దారులకు ఉంటుంది. ఈ సంస్థలో సభ్యులైన వారందరికీ భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈపీఎఫ్ సభ్యులకు నిధులు అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని రూ.5,000కి పెంచవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పెంపుపై బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఇంకా పొంగులేటితో పొసగలేదా?
ప్రస్తుతం ఈపీఎఫ్లో 75 లక్షలకు పైగా సభ్యులు పెన్షన్ ప్రయోజనాలను పొందుతున్నారు. పీఎఫ్ ఉద్యోగి సంస్థలు చాలా కాలంగా ఈపీఎస్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తుండగా.. తాజాగా దానికి మోక్షం లభించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ సమావేశాల్లో ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాధానంలో చెప్పినా ఆ సమస్యను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది.
Also Read: Kakinada TDP: కాకినాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్సీ వర్సెస్ ఎంపీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం కనీస మొత్తాన్ని రూ.5,000కి పెంచుతారని కొన్నాళ్లుగా ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. కనీస ఈపీఎస్ మొత్తం రూ.1,000 ఉండగా దీనిని పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తుండగా.. ఈ ప్రయోజనాన్ని కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. 58 సంవత్సరాల వయస్సు తర్వాత ఖాతాలో పెన్షన్ జమ చేయడం ప్రారంభమవుతుంది.
పెంపు ఎంత?
కేంద్ర ప్రభుత్వం కనీస నెలవారీ పెన్షన్ను రూ.2,000 నుంచి రూ.3 వేలకు పెంచవచ్చని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు అది రూ.5,000 కు పెరగవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోందని సమాచారం. సాధారణ బడ్జెట్ తర్వాత కనీస పింఛన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. 2014లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్ పెంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KTR vs Revanth Reddy: 'తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి వెనుకటి రోజులు తెస్తానని.. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్ని అమలు చేయకుండా విజయవంతంగా ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా కొండా సురేఖ.. ఇంకా పొంగులేటితో పొసగలేదా?
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనను గౌరవించి ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని.. జాబ్ క్యాలెండర్పై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బట్టల షాపు ప్రారంభోత్సవానికి వెళ్లిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్ కి పోలేకపోయిండు అని గుర్తుచేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని… కానీ ఆ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు అని కేటీఆర్ ఉన్నారు.
Also Read: Kakinada TDP: కాకినాడ టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎమ్మెల్సీ వర్సెస్ ఎంపీ
రేవంత్ రెడ్డి రైతులను రైతు కూలీలను కౌలుదారులను విద్యార్థులను మహిళలను వృద్ధులను ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరిని మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు రావు కానీ బూతుల భాష ఒక్కటే వచ్చు అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కనిపిస్తే ధైర్యం వస్తదని పేర్కొన్నారు.
Also Read: River Water: నదీ జలాల వివాదంపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి కీలక విజ్ఞప్తి.. ఏమిటో తెలుసా?
24 నెలల రేవంత్ రెడ్డి వైఫల్య పాలనను కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. సన్నాసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణంగా ప్రజలకు ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ అత్యంత నిష్ఠతో పనిచేశారని చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Virat Kohli Sets New Record: భారత క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన మైలురాయిని చేర్చుకున్నాడు. వన్డే ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కోహ్లీ, తాజాగా మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగడం ద్వారా, భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకాడు.
గంగూలీని వెనక్కి నెట్టిన కోహ్లీ
ఇప్పటివరకు 308 వన్డే మ్యాచ్లతో సౌరవ్ గంగూలీ ఐదో స్థానంలో ఉండగా, కోహ్లీ తన 309వ వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా గంగూలీని ఆరో స్థానానికి నెట్టి తాను ఐదో స్థానానికి చేరుకున్నాడు. విశేషమేమిటంటే, ప్రస్తుతం టాప్-6 జాబితాలో కొనసాగుతున్న ఏకైక యాక్టివ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. తన అద్భుతమైన ఫిట్నెస్, స్థిరమైన ప్రదర్శనతో కోహ్లీ మరిన్ని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకుపోతున్నాడు.
భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన దిగ్గజాలు
భారత క్రికెట్ చరిత్రలో వన్డే ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడి, జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చిన టాప్-6 ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
| ర్యాంక్ | ఆటగాడి పేరు | ఆడిన వన్డే మ్యాచ్లు |
| 1 | సచిన్ టెండూల్కర్ | 463 |
| 2 | ఎంఎస్ ధోనీ | 347 |
| 3 | రాహుల్ ద్రవిడ్ | 340 |
| 4 | మహ్మద్ అజారుద్దీన్ | 334 |
| 5 | విరాట్ కోహ్లీ | 309* |
| 6 | సౌరవ్ గంగూలీ | 308 |
ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేక శైలి
సచిన్ టెండూల్కర్: 463 మ్యాచ్లతో ప్రపంచ రికార్డు సృష్టించడమే కాకుండా, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన వీరుడిగా చరిత్రకెక్కారు.
ఎంఎస్ ధోనీ: 347 మ్యాచ్లు ఆడిన ధోనీ, కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గా భారత్కు 2011 వన్డే ప్రపంచకప్తో సహా అనేక ఐసీసీ ట్రోఫీలను అందించారు.
రాహుల్ ద్రవిడ్: 'ది వాల్'గా పేరుగాంచిన ద్రవిడ్ 340 మ్యాచ్ల్లో తన నిబద్ధతతో భారత మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేశారు.
మహ్మద్ అజారుద్దీన్: 334 వన్డేలు ఆడిన అజార్, తన రిస్ట్ వర్క్ బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలోనూ అనేక విజయాలు సాధించిపెట్టారు.
విరాట్ కోహ్లీ: ప్రస్తుత తరం రన్ మెషిన్ కోహ్లీ, దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్లో మరో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. గంగూలీ వంటి దిగ్గజం రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ, రాబోయే రోజుల్లో అజారుద్దీన్, ద్రవిడ్ రికార్డులను కూడా అధిగమించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget 2026 Petrol Increase: కేంద్ర బడ్జెట్ (2026-27) ప్రవేశపెట్టడానికి కౌంట్డౌన్ మొదలైన వేళ, సామాన్యులకు ఇంధన ధరల సెగ తగిలేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ను సమర్పించనున్న నేపథ్యంలో, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఓ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.
లీటరుకు రూ.3 - 4 పెరిగే అవకాశం!
ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోవడంలో భాగంగా, ఆటో ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) లీటరుకు 3 నుండి 4 రూపాయల వరకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సుమారు రూ.50,000 కోట్ల నుండి రూ.70,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ధరల పెంపునకు కారణాలేంటి?
2025 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ప్రభుత్వ ఆదాయ వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో కేవలం 56 శాతానికే పరిమితమయ్యాయి. గత ఏడాది (60%) తో పోలిస్తే ఇది తక్కువగా ఉండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. జీడీపీలో ఆర్థిక లోటును 4.4 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వానికి భారీగా నిధులు అవసరం.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు $61 డాలర్ల వద్ద తక్కువగా ఉండటంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ మార్జిన్లను ఆర్జిస్తున్నాయి. ఈ ప్రయోజనాన్ని పన్ను రూపంలో ప్రభుత్వం తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది.
ప్రభుత్వానికి కలిగే లాభం ఎంత?
ఫైనాన్షియల్ నివేదిక ఇచ్చిన లెక్కల ప్రకారం.. ఇంధనంపై లీటరుకు రూ.1 సుంకం పెంచితే.. ఏడాదికి రూ. 17,000 కోట్ల ఆదాయం వస్తుంది. లీటరుకు రూ. 4 వరకు పెంచితే అది జీడీపీలో 0.15 నుండి 0.2% ఆదాయానికి సమానం అవుతుంది.
ప్రభావం ఎలా ఉంటుంది?
ఒకవేళ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచితే, చమురు కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టే అవకాశం ఉంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు ఖరీదవ్వడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే, ఈ పెంపుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Horoscope Telugu News 2026: 2026 సంవత్సరం ప్రారంభమై ఇప్పటికి 11 రోజులు కావస్తోంది. ఈ సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో కొన్ని గ్రహాలు తిరోగమన నుంచి సక్రమ మార్గంలోకి కూడా రాబోతున్నాయి. ఇక ఇదే సమయంలో మరికొన్ని గ్రహాలు తిరోగమనం కూడా చేయబోతున్నాయి. ఈ జాబితాలోని అంగారక గ్రహంతో పాటు శని గ్రహం గృహస్పతి విరహాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహంమే రెండవ తేదీన అస్తమించబోతోంది. అలాగే బృహస్పతి గ్రహం ఆగస్టు 12వ తేదీన తిరోగమనం చేయబోతోంది. శని ఏప్రిల్ 22వ తేదీన అస్తమించబోతోంది. మొత్తం మీద ఈ ఏడాదిలో మూడు ప్రధాన గ్రహాలు అస్తమించబోతున్నాయి.
ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో తప్పకుండా అస్తమిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఈ అన్ని గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాష్ట్ర వారికి తప్పకుండా ఆకస్మిక లాభాలు కలుగుతూ ఉంటాయి. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రావడమే కాకుండా. ఖగోళ మార్పులు కూడా వచ్చే అవకాశాలుంటాయి. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆయా రాశుల వారిపై ఈ సమయంలో కీడు ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మూడు గ్రహాలు అస్తమించడం వల్ల ప్రధాన ప్రభావం ఏ రాశుల వారిపై పడుతుందో తెలుసుకోండి.
ఈ రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం..
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన మూడు గ్రహాలు అస్తమించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఆదాయం క్రమంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయ ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోయే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో స్టాక్ మార్కెట్లలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. అలాగే గతంలో చేసిన తప్పులనుంచి పరిష్కారం కూడా పొందుతారు. ఎలాంటి పెట్టుబడులు పెట్టిన ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా మారే అవకాశాలున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మారిపోతాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పొదుపు ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో సంపాదన అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా పొదుపు కూడా ఊహించని స్థాయిలో పెరగడం విశేషం. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం పొందడమే.. కాకుండా కొన్ని ఇంటికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచనాత్మకంగా పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక లాభాలు కూడా పొందుతారు. స్టాక్ మార్కెట్లలో నష్టాలు తగ్గి వీరు లాభాల బాటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో అనుకుంటున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Admission Without Aadhaar: పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి యూపీలోని యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు RTE చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం కావాలంటే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరికీ ఆధార్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. అయితే ఈ కారణంగా పేద, వెనుకబడిన వర్గాల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను గుర్తించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనకు బ్రేక్ వేసింది.
ఇకపై RTE కోటా కింద పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలంటే పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా ఆధార్ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. అంటే ఆధార్ లేకపోయినా పిల్లలు స్కూల్లో అడ్మిషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు లేవనే కారణంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి ఇక ఉండకూడదన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం ఆధార్ అవసరం ఉంటుంది. RTE కింద పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలంటే కనీసం ఒక తల్లిదండ్రుడి ఆధార్, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అంటే అడ్మిషన్కు ఆధార్ అవసరం లేకపోయినా, రీయింబర్స్మెంట్ కోసం మాత్రం ఆధార్ తప్పనిసరి.
ప్రైవేట్ పాఠశాలల్లో RTE అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రభుత్వం మరోసారి స్పష్టంగా తెలిపింది. RTE చట్టంలోని సెక్షన్ 12(1)(c) ప్రకారం, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు మాత్రమే RTE కోటాకు కేటాయిస్తారు. ఈ పరిమితిని ఎట్టి పరిస్థితుల్లోనూ మించరాదని ఆదేశించింది. ప్రతి జిల్లాకు ఎంతమంది పిల్లలను చేర్చుకోవాలన్న లక్ష్యాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. వయస్సు ఆధారంగా కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. 3 నుంచి 4 ఏళ్ల వయస్సు గల పిల్లలు నర్సరీకి అర్హులు. 4 నుంచి 5 ఏళ్ల పిల్లలు ఎల్కేజీకి, 6 నుంచి 7 ఏళ్ల పిల్లలు ఫస్ట్ క్లాస్లో ప్రవేశానికి అర్హులు. ఈ వయోపరిమితిని కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ పేర్కొంది.
దరఖాస్తు చేసిన పిల్లల వివరాల పరిశీలన బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్థాయిలో జరుగుతుంది. ఆ తర్వాత రెండు దశల్లో ఆన్లైన్ లాటరీ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తారు. ఈ లాటరీ ప్రక్రియ పూర్తయ్యాక తుది ఎంపిక జాబితాను జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదిస్తారు. అంటే మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యాశాఖ సీనియర్ అధికారులు చెబుతున్నదేమిటంటే… ఈ మార్పు పూర్తిగా RTE చట్టానికి అనుగుణంగా ఉంది. డాక్యుమెంట్లు లేవనే కారణంతో చదువు కోల్పోయే పరిస్థితి ఇకపై ఉండకూడదు. నిజంగా అవసరం ఉన్న పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు విద్యా ప్రయోజనాలను పొందాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని పేర్కొంది. యూపీ ప్రభుత్వ ఈ తాజా నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. చదువు ఒక హక్కు అనే భావనను మరింత బలంగా అమలు చేయడంలో ఇది కీలక అడుగుగా చెప్పుకోవచ్చు.
Also Read: Budget 2026: పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్.. బడ్జెట్లో ఈ 5 పెద్ద ప్రకటనలు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chaturgrahi Raja Yoga 2026 Effect On Zodiac: కొత్త సంవత్సరం మొదటి నెల మరో 20 రోజులైతే ముగుస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి నెల ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి నెల జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అనేక శుభసంయోగాలు కూడా ఏర్పడతాయి. దీని ప్రభావం ప్రపంచం పైనే కాకుండా మొత్తం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన చతుర్గ్రహి రాజయోగం (Chaturgrahi Raja Yoga 2026) ఏర్పడబోతోంది. ఈ నెలలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు గ్రహాలు కుంభరాశిలో సంయోగం చేయబోతున్నాయి. దీనికి కారణంగానే ఈ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కూడా చాలా మేలు జరుగుతుంది. ఈ యోగం జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఆనందం సంపద ప్రతిష్టకు ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా భారీ మొత్తంలో ధన లాభాలు పొందగలుగుతారు.
ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మిథున రాశి
ఈ శక్తివంతమైన చతుర్గ్రహి రాజయోగం (Chaturgrahi Raja Yoga) ప్రభావంతో మిథున రాశి వారికి కెరీర్ ఊపందుకుంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు కూడా లభించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లభించడమే కాకుండా భాగస్వామ్యుల నుంచి మంచి సపోర్టు లభించి వ్యాపార విస్తరణ కూడా జరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ శక్తివంతమైన Chaturgrahi Raja Yoga ప్రభావంతో సంపాదన ఊహించని స్థాయిలో పెరగబోతోంది ఆస్తిపరంగా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో శాంతి ఆనందం కూడా నెలకొంటుంది ముఖ్యంగా కొత్త ప్రణాళికలు ఈ సమయంలో విజయవంతం అవుతాయి.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వ్యక్తులకు మంచి ప్యాకేజీ తో ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడి.. ఖర్చులు చేసే అవకాశాలున్నాయి.
కుంభరాశి
ఈ Chaturgrahi Raja యోగ ప్రభావంతో కుంభరాశి వారికి కొత్త ఒప్పందాలు కూడా జరుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారు పెద్ద మొత్తంలో ఆర్డర్లు కూడా పొందగలుగుతారు. అలాగే కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకొని భారీ మొత్తంలో సంపాదించగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని విజయాలు కూడా సాధిస్తారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook