సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి పండుగ
Rudrangi, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. సాయిబాబా పూజలు చేస్తున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా నగరంలోని మార్కండేయ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5-30 గంటలకు క్షీరాభిషేకం, పుష్పార్చన ఉదయం 10 గంటలకు విభావరి ఎస్.అన్నప్రసాద వితరణ, మధ్యాహ్న హారతి కార్యక్రమం నిర్వహించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Suvendu Adhikari PA: కాబోయే సీఎం సువేందు అధికారి పీఏపై కాల్పులు, మృతి
Chhotobainan, West Bengal:Suvendu Adhikari PA: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా ముగియగా.. అనంతరం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రోజులుగా అక్కడక్కడ నిరసనలు, ఆందోళనలతోపాటు దాడులు జరుగుతుండగా ఓ సంచలన సంఘటన చోటుచేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి దారుణ హత్యకు గురయ్యాడు. తుపాకీ కాల్పులు జరపడంతో సువేందు అధికారి పీఏ మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ను ఉలిక్కిపడేలా చేయగా.. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి.. అద్భుత విజయంతో టాప్లోకి సన్రైజర్స్
పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారికి కొన్నేళ్లుగా వ్యక్తిగత కార్యదర్శిగా చంద్రనాథ్ రాఠే పని చేస్తుండేవాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సువేందు ఉన్నప్పటి నుంచి చంద్రనాథ్ రాఠే పీఏగా పనిచేస్తుండేవాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడంతోపాటు సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండడంతో పీఏ చంద్రనాథ్ రాఠే బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇంటికి వెళ్లే సమయంలో బుధవారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. చంద్రనాథ్ రాఠే లక్ష్యంగా కాల్పులు చేయడం కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్గ్రామ్ అనే ప్రాంతంలో అర్ధరాత్రి పూట కొందరు దుండగులు దూసుకువచ్చారు. కారులో వెళ్తున్న చంద్రనాథ్ రాఠే లక్ష్యంగా కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలకు కుప్పకూలాడు. వెంట ఉన్న బుద్ధదేవ్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రనాథ్ రాఠేను ఆస్పత్రికి తరలించేలోపు మరణించడంతో తీవ్ర విషాదం అలుముకుంది. బుద్ధదేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన పీఏపై కాల్పులు జరపడంతో మరణించిన విషయాన్ని సువేందు అధికారి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో తన పీఏ మృతదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: TVK Success Secret: తమిళనాడులో టీవీకే విజయ్ సునామీ వెనుక ఒకే ఒక్కడు.. ఎవరాయన?
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం సువేందు అధికారి పీఏపై నాలుగు సార్లు కాల్పులు జరిపారు. వాటిలో ఒకటీ మిస్సవగా మూడు బుల్లెట్లు పీఏ చంద్రనాథ్ రాఠేపై దాడి చేశారు. కదులుతున్న కారుపైన కాల్పులు జరపడం స్థానికంగా.. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. తన పీఏ దారుణ హత్యకు గురవడంపై సువేందు అధికారి స్పందించారు. ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించగా.. వారు విచారణ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన మూడో రోజుకే అసంతృప్తులు చెలరేగుతున్నాయి. అధికారం చేపట్టకముందే ఇలా దాడులు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fertilizer Urea Scam: జీ న్యూస్ స్టింగ్ ఆపరేషన్..బ్లాక్ మార్కెట్లో రైతులు సబ్సీడీ యూరియా..రూ.22,000 కోట్ల దందా..
Hyderabad, Telangana:Fertilizer Urea Scam Revealed: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియా గురించి ఇప్పుడో బిగ్ న్యూస్ బయటకొచ్చింది. జీ న్యూస్ ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్వహించిన 'ఆపరేషన్ కిసాన్'లో రైతుల కోసం ఉద్దేశించిన చౌక యూరియాను అక్రమంగా తరలిస్తున్నట్లు బహిర్గతం అయ్యింది. దేశంలోని ప్రముఖ ప్లైవుడ్, MDF ఫ్యాక్టరీలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి.
జీ న్యూస్ నిర్వహించిన ఈ సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా.. రాత్రిపూట మినీ ట్రక్కులలో యూరియాతో నిండిన పసుపు రంగు సంచులను ఫ్యాక్టరీలకు పంపుతున్న అనేక దృశ్యాలు నిఘా కెమెరాలలో రికార్డు చేశారు. రైతులకు సబ్సిడీపై అందిస్తున్న యూరియానే ఈ సంచులలోనిదని ఈ స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైంది.
రైతుల కోసం సబ్సీడీలో యూరియాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది. అయితే ఒక బస్తా యూరియా ఖరీదు సుమారు రూ.3,800 ఉండగా.. దాన్ని రైతులకు సబ్సీడీ ద్వారా రూ.266 లకే అందజేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
ఈ యూరియాను MDF, ప్లైవుడ్ పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తారని విచారణలో తేలింది. పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్ గ్రేడ్ యూరియా ఎంతో ఖరీదైనదిగా అమ్ముడవుతుంది. అయితే రైతులకు భారీ సబ్సీడీతో ఎంతో తక్కువ ధరకి లభిస్తుంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా.. యూరియా బ్లాక్ మార్కెట్లో భారీగా అమ్ముడవుతుండగా, ఆ దందా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది నల్లబజారులో అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దేశంలో అత్యధికంగా తయారు చేసే "ప్లైవుడ్ కేంద్రం"గా పిలువబడే హర్యానాలోని యమునానగర్కు స్టింగ్ ఆపరేషన్లో భాగంగా జీ న్యూస్ బృందం చేరుకుంది. అక్కడికి చేరిన తర్వాత సీక్రెట్ కెమెరాల ద్వారా కొందరు బ్రోకర్లు మాట్లాడుతూ.. ఈ దందా ఓ పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఓ వ్యక్తి వెల్లడించారు. అలాగే ఏవైనా దాడులు జరిగే అవకాశం ఉంటే ముందుగా తమకి సమాచారం అందుతుందని తెలిపారు.
స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా.. యూరియా అక్రమ రవాణాలో డీలర్లు, బ్రోకర్లు, రవాణాదారులు, కొన్ని ఫ్యాక్టరీల కీలక పాత్ర గురించి ఇప్పుడు బహిర్గతమైంది. ఇలా యూరియాను అక్రమంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముడవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.20,000 కోట్లు నష్టపోతుందని దర్యాప్తులో తేలింది. అయితే ఇదే విషయమై సంబంధిత కంపెనీలు లేదా వ్యవసాయ శాఖలు ప్రస్తుతానికి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగా మరిన్ని విశేషాలు బయటకు రావాల్సి ఉందని స్టింగ్ ఆపరేషన్ చేసిన జీ న్యూస్ టీమ్ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TVK Vijay News: టీవీకే విజయ్కు ఎదురుదెబ్బ..సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు గవర్నర్ నో!
Hyderabad, Telangana:TVK Vijay Oath Ceremony: తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన నేపథ్యంలో సీఎంగా టీవీకే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకలేదు. దీంతో అతడి ప్రమాణస్వీకారం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.SRH Vs PBKS: పంజాబ్ను ఉతికి ఆరేసిన సన్రైజర్స్ బ్యాటర్లు.. మరి విజయం సాధిస్తుందా?
Hyderabad, Telangana:Sunrisers Hyderabad vs Punjab Kings Live Updates: వరుస విజయాలతో దూకుడుగా వెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్లో కలకత్తా చేతిలో ఊహించని ఓటమి ఎదురైంది. ఆ ఓటమి నుంచి కోలుకుని ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో తలపడింది. బుధవారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయగా.. సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు పరుగులను కట్టడి చేయగా.. కొన్ని క్యాచ్లు చేజార్చుకోవడంతో భారీ నష్టం పొందింది. సన్రైజర్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Telangana Heavy Rains: తెలంగాణ అకాల వర్షాలు..అనుకోని వర్షాలతో రైతులు ఆగంమాగం!!
Hyderabad, Telangana:Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ఇప్పుడు రైతుల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పలు చోట్ల కురిసిన వర్షాలకు తోడు ఈదురు గాలులు తోడు కావడంతో పలు చోట్ల స్తంభాలు నేలకొరిగాయి. అంతేకాదు అకాల వర్షాలకు ఆరుగాలం పంటలు పండించిన రైతులకు చివరకు దు:ఖమే మిగిలింది.Prashant Kishor Kavitha: కేసీఆర్కు చెక్ పెట్టేందుకు కవిత సరికొత్త ప్లాన్..రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు!
Hyderabad, Telangana:Prashant Kishor Kavitha TRS Party: తెలంగాణ రాజకీయాల్లో సంచలన సృష్టిస్తూ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యయనాన్ని తెరలేపారు. తాను కొత్తగా స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు ఫేమస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పీకే వ్యూహాలతో కవిత కొత్త పంథా..
గతంలో అనేక పార్టీలకు విజయ తీరాలను చేర్చిన ప్రశాంతి కిషోర్ ఇప్పుడు కవితకు వ్యక్తిగత రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించరున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికీ రెండు సార్లు కీలక భేటీలు జరగటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈసారి పీకే తన ఐప్యాక్ (I-PAC) బృందంతో కాకుండా వ్యక్తిగత స్థాయిలో నేరుగా కవితకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ నెల నుంచి ఆయన తన వ్యూహాలను పదును పెట్టమన్నారు.
వ్యూహకర్త రాకతో మరణ సమీకరణాలు..
క్షేత్రస్థాయి పర్యవేక్షణ: ప్రజల నాడిని పసిగట్టడంలో సిద్ధహస్తుడైన ప్రశాంత్ కిషోర్.. కవిత కోసం ప్రత్యేక సర్వేలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.
సోషల్ మీడియా పవర్: ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కవిత టీంకు పీకే రాకతో మరింత సాంకేతిక బలం వ్యూహాత్మక వేగం తోడవనుంది.
ప్రత్యర్థులకు కౌంటర్: ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా బలమైన ముద్రవేసేలా ప్రణాళికలను సిద్ధమవుతున్నాయి.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) విస్తరణ..
కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రాథమిక ఆమోదం తెలిపింది. పార్టీ పేరును అభ్యంతరాలకు ముగిసిన వెంటనే కవిత పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పీకే వంటి ఎన్నికల మాంత్రికుడి సలహాలు తీసుకోవడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తును మరింత పటిష్టం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఈ సరికొత్త పొత్తు ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మారుస్తుందో వేచి చూడాలి. పీకే మార్గదర్శకత్వంలో కవిత తన సొంత పార్టీని అధికారం చేరువ చేస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read: Crocodile Attack: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల బూట్లు..ఎంతమందిని మింగేసిందో తెలుసా?
Also Read: Vijay Trisha Age Gap: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Andhra Pradesh Investment: ఏపీలో పెట్టుబడుల ప్రభంజనం..రూ.2 లక్షల కోట్లతో 39,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:Andhra Pradesh Investment Hub: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 మెగా ప్రాజెక్టులను ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్రంలో రూ.2,01,023 కోట్ల పెట్టుబడులు రానున్న దీనివల్ల సుమారు రాష్ట్రంలో 39,000 పైగా ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ముఖ్యమైన ప్రాజెక్టులు
విశాఖపట్నం వేదికగా రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ ను నిర్మించబోతుంది. అందులో భాగంగా రూ. 1,08,010 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. అలాగే సోలార్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ సంస్థ దాదాపు 51,300 కోట్ల పెట్టుబడితో శ్రీ సత్యసాయి ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టనుంది. దీని ద్వారా దాదాపు 20,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
అదేవిధంగా అదానీ గ్రూప్ సంస్థ హైడ్రో పంపు స్టోరేజ్ కడపలో నిర్మితం కానుంది. ఇందులో భాగంగా రూ.12,297 కోట్ల పెట్టుబడితో 3,375 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు తో యమాన్కో ఇండియా తిరుపతిలో 9398 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపుగా 5,820 ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అలాగే తిరుపతిలో అపోలో టైర్స్ తయారీ సంస్థ 6,100 కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు రానుంది. చివరిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తయారీ యూనిట్ను రూ.2,508 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 3,000 మందికి జాబులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రంగాల వారీగా విశ్లేషణ..
ఐటీ రంగం: విశాఖపట్నం ఐటీ హబ్ గా ఎదిగేల రిలయన్స్ భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఇది రాష్ట్ర డిజిటల్ మౌలిక సదుపాయాలు వెన్నెముకగా నిలవనుంది.
ఆటోమొబైల్ హబ్గా తిరుపతి: రాయల్ ఎన్ఫీల్డ్, అపోలో టైర్స్ వంటి దిగ్గజ సంస్థల రాకతో తిరుపతి జిల్లా పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కనుంది. క్యారియర్ ఎయిర్ కండిషనర్ సంస్థ కూడా ఇక్కడే తన యూనిట్ను ప్రారంభించనుంది.
గ్రీన్ ఎనర్జీ: కడప శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు విజయనగరం, నెల్లూరు, పలనాడు ప్రాంతాల్లో బయో ఫ్యూయల్, సోలార్ హైడ్రో ప్రాజెక్టుల ద్వారా పర్యావరణహితమైన ఇంధన రంగానికి పెద్ద పీట వేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్: అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో స్నేహ ఫామ్స్ వంటి యూనిట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను విలువ జోడించి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Crocodile Attack: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల బూట్లు..ఎంతమందిని మింగేసిందో తెలుసా?
Also Read: Vijay Trisha Age Gap: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో పదవుల పండుగ.. 28 నామినేటెడ్ పోస్టులు ఎవరికి వచ్చాయంటే?
Baddipadaga, Telangana:Telangana Nominated Posts: తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పండుగ జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన కూడా పదవులు రాక నిరాశ చెందుతున్న కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం శుభవార్త వినిపించింది. 17 కార్పొరేషన్ చైర్మన్లతోపాటు వైస్ చైర్మన్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. వారికి పదవులు కట్టబెడుతూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. మరి 17 కార్పొరేషన్లకు ఎవరెవరిని నియమించారో తెలుసుకుందాం.
Also Read: Union Cabinet: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ శుభవార్త.. మంత్రివర్గంలో కీలక నిర్ణయం
రాష్ట్రంలోని కీలకమైన కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మశాలి, వెలమ, మున్నూరు కాపు, పెరిక, గీత కార్మిక, యాదవ, వాల్మికి బోయ, వడ్డెర తదితర కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్, వైస్ చైర్మన్లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోపాటు యువ నాయకత్వానికి కూడా ప్రాధాన్యం లభించింది. బండి రమేశ్, జువ్వాడి నర్సింగ్ రావు వంటి సీనియర్ నాయకులకు అవకాశం కల్పించగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన గట్టు తిమ్మప్పకు పదవి లభించింది. ప్రభుత్వం నియమించిన 17 కార్పొరేషన్ చైర్మన్లు, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లు నియమించగా వారెవరెవరో తెలుసుకుందాం.
Also Read: TVK Success Secret: తమిళనాడులో టీవీకే విజయ్ సునామీ వెనుక ఒకే ఒక్కడు.. ఎవరాయన?
మున్నూరు కాపు కార్పొరేషన్: ఛైర్మన్ బొమ్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్: అల్లం భాస్కర్
కమ్మ కార్పొరేషన్: ఛైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్: పరుచూరి మురళి
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్: ఛైర్మన్ బస్వరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్: పొన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్
హ్యాండ్లూమ్ కార్పొరేషన్: ఛైర్మన్ గూడెం వెంకటరమణ, వైస్ చైర్పర్సన్: జక్కని అనిత
పద్మశాలి కార్పొరేషన్: చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్:
పెరిక కార్పొరేషన్: ఛైర్మన్ కొంగర వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్: బుడ్గం శ్రీనివాస్
వెలమ కార్పొరేషన్: ఛైర్మన్ జువ్వాడి నర్సింగ్రావు,
యాదవ కార్పొరేషన్: ఛైర్మన్ రఘునాథ్ యాదవ్, వైస్ చైర్మన్: గజ్జి భాస్కర్ యాదవ
వాషర్మెన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్: చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్, వైస్ చైర్మన్: బంగారు బాబు
గీత కార్మిక కార్పొరేషన్: చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్: కేసం నాగరాజు గౌడ్
మేర-సంగ కార్పొరేషన్: వెంకట్ రాజం, వైస్ చైర్మన్: ఎం లక్ష్మీనారాయణ
వాల్మీకి బోయ కార్పొరేషన్: గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్: బోయ నగేశ్
వడ్డెర కార్పొరేషన్: గుంజా రేణుక, వైస్ చైర్మన్: బత్తుల వెంకటేశ్
లైవ్ స్టాక్ కార్పొరేషన్: చరణ్ కౌశిక్ యాదవ్
తెలుగు అకాడమీ చైర్మన్: ప్రొఫెసర్ వెంకటరమణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Crocodile Attack: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల బూట్లు..ఎంతమందిని మింగేసిందో తెలుసా?
Mookgophong, Northern Cape:Crocodile Attack In South Africa: దక్షిణాఫ్రికాలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ఇప్పుడు మొసలికి ఆహారం అవ్వడం ప్రజలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది. అతడు స్థానిక హోటల్ యజమానిగా గుర్తించగా.. ఇప్పుడాయన మొసలిగా ఆహారంగా మారాడు. దాదాపుగా 15 అడుగుల పొడవు సుమారు 1000 పౌండ్ల బరువున్న (అనగా 454 కిలోల బరువు) ఆ మొసలిని హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏం జరిగిందంటే?
స్థానిక అధికారుల కథనం ప్రకారం.. 59 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త హోటల్ యజమాని గాబ్రియేల్ బాటిస్టా నది వంతెన దాటుతూ ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతని జాడ కోసం ఎంత వెతికినా దొరకపోవడంతో నది ఒడ్డున ఓ మొసలి భారీగా ఉబ్బిన పొట్టతో కనిపించింది. ఆ భారీ మొసలిని అధికారులు గుర్తించిన తర్వాత బటిష్టాను ఆ ముసలి మింగేసి ఉండవచ్చు అంతా భావించారు. ఆ అనుమానంతో దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ ద్వారా ఆ ముసలిని కట్టి బయటికి తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది. కొద్దిసేపు తర్వాత హెలికాప్టర్ నుంచి తాడుతో మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఆ తర్వాత మొసలిని చంపి పొట్టను కోసి చూడగా అధికారులు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాటిస్టా శరీర భాగాలు భావిస్తున్న ప్రక్కటెముకలు, రెండు చేతులు. మాంసం ముద్దలతో పాటు ఆయన వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అందరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే. ఆ ముసలి కడుపులో ఏకంగా ఆరు జతల బూట్లు లభించాయి దీనిని బట్టి ఆ ముసలి గతంలో అనేక మందిని దాడి చేసి, మింగేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
NEW: Police airlift a crocodile with the body of a 59-year-old businessman inside.
Local police in South Africa say they suspected the crocodile ate the man after observing it from drones. They then shot it and airlifted it off.
When they landed back on the ground, the… pic.twitter.com/12NBTQbmis
— Collin Rugg (@CollinRugg) May 4, 2026
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. దాదాపుగా 13 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అయితే ఒక మనిషి తాలూకు నిర్లక్ష్యం అనగా వరదలో వంతెన దాటడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అలాంటి సాహస కృత్యం ద్వారా మొసలికి ఆహారంగా మారాడని చెబుతున్నారు. మరికొందరు మాత్రం మొసలి ఎంతో మందిని మింగేసింది అని అభిప్రాయపడ్డారు.
Also Read: Vijay Trisha Age Gap: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
ALso Read: Bank Strike 2026: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Trisha Age Gap: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
Hyderabad, Telangana:Vijay Trisha Age Difference: ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సినీ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ స్థాపించింది. తమిళ వెట్రి కజగం పేరిట స్థాపించిన ఈ రాజకీయ పార్టీతో పాటు ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియా వేదిక దగ్గర నుంచి జాతీయ స్థాయి వార్తా ఛానళ్లలో తమిళనాడు విజయ్ పార్టీ సంచలనంగా మారింది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిషతో విజయ్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ ఇటీవలే తన భార్య సంగీతకు విడాకులు కోరగా.. ఆమె విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణం అంటూ వచ్చిన రూమర్లతో హీరో విజయ్, త్రిషల మధ్య కచ్చితంగా రిలేషన్ ఉందంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో తలపతి విజయ్, త్రిష కృష్ణన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. తలపతి విజయ్ రాజకీయ విజయాన్ని నటి త్రిష కూడా జరుపుకోవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తలపతి విజయ్, త్రిష కృష్ణన్లు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ జంట గురించి అన్నిచోట్లా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీటన్నిటి మధ్య టీవీకే విజయ్, హీరో త్రిషా కృష్ణన్ మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య చాలా వయసు వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.
టీవీకే విజయ్ 1974 జూన్ 22న జన్మించారు. దీని ప్రకారం.. తలపతి విజయ్ ప్రస్తుత వయస్సు 51 ఏళ్లు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో ఫేమస్ అయిన విజయ్.. ఇప్పుడు నటనకు గుడ్బై చెప్పి.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ విధంగా తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించి మొదటి ఎన్నికలోనే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సీట్లను గెలుపొందడంలో విజయం సాధించలేకపోయారు.
మరోవైపు నటి త్రిషా కృష్ణన్ విషయానికి వస్తే.. ఆమె 1983 మే 4న జన్మించా, రు. దీని ప్రకారం.. త్రిషా కృష్ణన్ ప్రస్తుత వయస్సు 43 ఏళ్లు. ఈ క్రమంలో త్రిష, తలపతి విజయ్ మధ్య 8 ఏళ్ల వ్యత్యాసం ఉంది.
ప్రస్తుతంగా తలపతి విజయ్ వ్యక్తిగత జీవితం నిరంతరం చర్చనీయాంశంగా ఉంది. తలపతి విజయ్, ఆయన మాజీ భార్య సంగీత మధ్య సంబంధంలో మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు విడాకుల బాట పట్టనుందని భావిస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఏది లభించలేదు.
విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్) సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రం విజయ్ కెరీర్ను తమిళ స్థాయి పెంచడమే కాకుండా.. చిత్ర పరిశ్రమకు ఒక సూపర్హిట్ జోడీని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ జంట 'అప్పడి పోడు' పాటకు డ్యాన్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఆ తర్వాత విజయ్, త్రిషలు 'తిరుపాచి' (2005), 'అది' (2006), 'కురువి' (2008), లియో (2023) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
Also Read: Bank Strike 2026: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Strike 2026: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!
Hyderabad, Telangana:SBI Bank Strike 2026 Update: భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెకు పిలుపునిచ్చింది. మే 25, 26 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటిచింది. అయితే మే 23 నాలుగో శనివారం.. మే 24న ఆదివారం కావడం వల్ల ఆ రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో మే 23 నుంచి మే 26 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.
ఈ క్రమంలో దేశంలోనే 50 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఆయా నాలుగు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగుల సంఘం సిబ్బంది కొరత, పెన్షన్లు, నియామకాలు, సేవా నిబంధనలకు సంబంధించి 16 డిమాండ్లను ముందుకు తెచ్చింది. అందువల్ల, ఈ నెల చివరి వారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలకు అంతరాయం కలగవచ్చు.
బ్రాంచ్ సంబంధిత లావాదేవీల విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే, ఏటీఎంలతో పాటు బ్యాంకుకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలు పనిచేస్తాయని భావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, విత్డ్రా, రుణాలకు సంబంధించిన బ్యాంక్ డ్రాఫ్ట్ల జారీ, భౌతిక పత్రాల పని వంటి సేవలు ప్రభావితం కావచ్చు.
ఎస్బిఐలోని ఉద్యోగుల సంఘం మొత్తం 16 డిమాండ్లను బహిర్గతం చేసింది. వాటిలో సహాయక సిబ్బంది నియామకాలను పెంచడం, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడం, వేతన వ్యత్యాసాలను తొలగించడం వంటి సమస్యలను వారు ప్రస్తావించారు. ఉద్యోగులకు వైద్య ప్రయోజనాలు, మొత్తం పని పరిస్థితులను మెరుగుపరచాలని కూడా వారు డిమాండ్లలో ప్రధానంగా కోరుతున్నారు.
పెన్షన్కు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయాలని కూడా ఎస్బీఐ ఉద్యోగలు సంఘం డిమాండ్ చేస్తోంది. NPS (జాతీయ పింఛను వ్యవస్థ) కింద మరింత సౌలభ్యం, మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని వారు కోరారు. మెరుగైన కెరీర్ పురోగతి అవకాశాలు, పెన్షన్ లెక్కింపు పద్ధతులలో మార్పుల అవసరాన్ని వారు తెలియజేశారు. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల నియామకాలలో తగ్గుదలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ సమ్మె జరిగితే, బ్యాంక్ శాఖలు అందించే సేవల్లో వినియోగదారులు అంతరాయాలను ఎదుర్కోవచ్చు. నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్లు, డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేయడం వంటి ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు.
రుణాలకు సంబంధించిన పత్రాల పని కూడా ప్రభావితం కావచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ ఛానెళ్లు యథావిధిగా పనిచేయాల్సి ఉంది. అయితే, బ్యాకెండ్ ప్రాసెసింగ్లో మందకొడితనం కారణంగా కొన్ని లావాదేవీలలో జాప్యం జరగవచ్చు. అందువల్ల, అత్యవసరమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు.
ఇవి SBI ఉద్యోగుల డిమాండ్లు అయినప్పటికీ, ఐదు రోజుల పని విధానానికి మారాలనే అత్యవసర డిమాండ్ బ్యాంకు ఉద్యోగులందరి నుండి కూడా బలంగా వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్, RBI, కమోడిటీ మార్కెట్, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల వంటి ఆర్థిక రంగానికి సంబంధించిన మిగిలిన విభాగాలు శని, ఆదివారాల్లో మూతపడనుండగా.. మిగిలిన మొదటి, మూడో శనివారాల్లో బ్యాంకులు మాత్రం ఎందుకు తెరిచి ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SRH Vs PBKS Preview: పంజాబ్ ప్లేఆఫ్స్కు వెళ్తుందా? హైదరబాద్ మరో విజయం సాధిస్తుందా? పంజాబ్ Vs హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఇదే?
Hyderabad, Telangana:SRH Vs PBKS Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆతిథ్య సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పంజాబ్ కింగ్స్ టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్లుకు అనుగుణంగా.. భారీ స్కోరు చేసేందుకు వీలుగా అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ను అందిస్తుందని అంచనా.
గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన పోరులో 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయి, ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సన్రైజర్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆడిన 10 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచిన సన్రైజర్స్.. ప్లేఆఫ్స్కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గత సీజన్ రన్నరప్ అయిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుత లీగ్లో ఆడిన 9 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచి, ఈ ఏడాది టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా ఉంది. అంతే కాకుండా పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. జట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ ఓటముల పరంపరకు బ్రేక్ వేయాలని ఆ జట్టు చూస్తోంది.
ఐపీఎల్ లీగ్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 25 మ్యాచ్లు జరిగ్గా.. అందులో హైదరాబాద్ 17 సార్లు నెగ్గగా.. పంజాబ్ జట్టు 8 సార్లు విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ రెడీ చేస్తున్నారని భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ మ్యాచ్లో బౌండరీల వరద పారే అవకాశం ఉంది. ఇరు జట్లకు బ్యాటింగ్ లైనప్ బాగున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో భారీగా స్కోర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.
సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు అంచనా..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్.
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు అంచనా..
ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Cabinet: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ శుభవార్త.. మంత్రివర్గంలో కీలక నిర్ణయం
Wadgaon, Maharashtra:Indian Railways: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రైల్వే వ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కొన్ని ప్రాజెక్టులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను విస్తరించడంలో భాగంగా తెలంగాణ, ఏపీ మీదుగా పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసేలా రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
Also Read: TVK Success Secret: తమిళనాడులో టీవీకే విజయ్ సునామీ వెనుక ఒకే ఒక్కడు.. ఎవరాయన?
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ), భారత రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసేలా రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఏపీకి భారీ ప్రయోజనం లభించనుంది.
ప్రాజెక్టుల వివరాలు
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 901 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు (3వ, 4వ లైన్లు) నిర్మించబడతాయి.
==> గుంతకల్ - వాడి (3వ , 4వ లైన్): ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా సాగుతుంది.
==> నాగ్దా - మథుర (3వ , 4వ లైన్): మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది.
==> బుర్హ్వాల్ - సీతాపూర్ (3వ, 4వ లైన్): ఉత్తరప్రదేశ్లో రద్దీని తగ్గిస్తుంది.
Also Read: Election Results 2026: ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే?
గణాంకాలు
మొత్తం ఖర్చు: రూ.23,437 కోట్లు
గడువు: 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
ప్రయోజనం పొందే ప్రాంతాలు: 6 రాష్ట్రాల్లోని 19 జిల్లాలు, 4,161 గ్రామాలు, సుమారు 83 లక్షల జనాభాకు మేలు జరుగుతుంది.
సరుకు రవాణా: ఏడాదికి అదనంగా 60 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది.
ఈ మూడు ప్రాజెక్టులతో పారిశ్రామిక వృద్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, ఇనుము వంటి వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. అంతేకాకుండా పర్యాటక రంగానికి ఊతమిచ్చింది. మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి మఠం), కాసాపురం ఆంజనేయ స్వామి ఆలయం, మథుర, బృందావనం, మహాకాళేశ్వర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రైల్వే రవాణా పెరగడంతో సుమారు 37 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గుతుంది. 185 కోట్ల కిలోల కార్బన్డైయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది కనుక తగ్గితే 7 కోట్ల మొక్కలు నాటడంతో సమానం.
పీఎం-గతి శక్తిలో భాగంగా ఈ ప్రాజెక్టులు రూపొందించారు. 'పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్' కింద కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇది సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుంది. ఈ మల్టీట్రాకింగ్ పనులతో రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Proddutur Murder Case: భార్య లావుగా ఉందని దారుణం.. పాలకోవాలో విషం కలిపి, కిల్లర్ భర్త వేసిన స్కెచ్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
Hyderabad, Telangana:Husband killed Wife For Being Fat In Proddutur: యూట్యూబ్లో హత్య చేయడం ఎలా అని సెర్చ్ చేశాడు.. జవాబు దొరికిన వెంటనే రూ.80 పెట్టి మరీ హైదరాబాద్ నుంచి విషం కొనుగోలు చేశాడు. చివరికి ఆ భార్యకు ఇష్టమైన పాలకోవా లోనే ఆ విషాన్ని కలిపి ఇచ్చాడు. ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ కిరాతక భర్త ఉదాంతం వింటే ఒళ్ళు గగుర్పాటుస్తోంది. అసలు భార్యాభర్తల పై ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. యూట్యూబ్ క్రైమ్ స్కెచ్ ఫాలో అయ్యి పాలకోవాలో విషం కలిపి మరి మర్డర్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇతడు చేసిన దారుణ ఘటన వైరల్ అవుతోంది. పోలీసుల ప్రకారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉండే కిరణ్ కుమార్, పద్మజా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ప్రధానంగా పద్మజ లావుగా ఉందన్న సాకుతో ఆమెను వదిలించుకోవడానికి కిరణ్ ప్లాన్ వేశాడు. అందుకే ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించిన ప్లాన్ వేశాడు. దీనికి యూట్యూబ్ ని ఆసరాగా చేసుకున్నాడు. గంటలకొద్దీ ఎలా మర్డర్ చేయాలా అని సెర్చ్ చేశాడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రూ.80 వేలు పెట్టు మరీ కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. అంతే కాదు తన భార్యకు ఇష్టమైన పాలకోవాలోనే ఆ విషం కలిపి తినిపించాడు. చివరికి ఆమె అపస్మారక స్థితిలో వెళ్లిపోయినా.. చనిపోయిందా? లేదా? అని నిర్ధరించుకోవడానికి దిండుతో ఆమె ముఖంపై అదిమి మరీ చంపేశాడు.
Also Read: తీర్పులు ఇచ్చే చేతులే ప్రాణాలు తీసుకున్నాయి.. జడ్జి అమన్ కుమార్ శర్మ సూసైడ్ మిస్టరీ!
Also Read: బర్గి డ్యామ్లో ఘోర ప్రమాదం.. 30 మందితో వెళ్తున్న క్రూయిజ్ బోల్తా.. ఏడుగురి మృతదేహాల వెలికితీత!
హత్య తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయిందని అందరినీ నమ్మబలికాడు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పద్మజ చనిపోయిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పోలీసులకు కిరణ్ కుమార్ను కూడా విచారించారు. ఇక ఎట్టకేలకు నిందితుడు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. తన భార్య లావుగా ఉందని.. తనను తరచూ అనుమానిస్తుందనే కారణంతోనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. కేవలం భార్య లావుగా ఉందని ఇలాంటి దారుణ ఘటనకు ఒడిగట్టాడు. రాను రాను భార్య భర్తల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. ఈ భర్త వేసిన ప్లాన్ చూస్తే ఒళ్ళు గగ్గురుపొడుస్తోంది. అసలు భార్యాభర్తల మధ్య నమ్మకమే పోతుంది. అయితే వీళ్లు చేసిన దారుణాల వల్ల అనాథలుగా పిల్లలు మారుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP POLYCET 2026: ఏపీ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల.. నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోండిలా! డైరెక్ట్ లింక్ ఇదే!
Hyderabad, Telangana:AP POLYCET 2026 Results Announced:ఎట్టకేలకు ఏపీ పాలిసెట్ 2026 సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల చేసింది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు వెంటనే స్కోరు కార్డ్స్ కూడా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం మంత్రి లోకేష్ 10 గంటల సమయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ https://polycetap.ap.gov.in/Default.aspx నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ రకాల పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి గాను ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
🔊 AP POLYCET–2026 Results Announced! 📢
This year, a record 1,77,581 candidates registered and 1,63,008 appeared for the examination held on 25.04.2026 — the highest participation ever. Of these, 1,48,950 have qualified, with an overall pass percentage of 91.37%.👏 Delighted…
— Lokesh Nara (@naralokesh) May 5, 2026
