గల్లీ మైసమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
Vemulawada, Telangana:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ గల్లీమైసమ్మ బోనాల మహోత్సవం, సాయి బాబా స్వామివార్లను ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని వేడుకున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Ambani Temple Tour: తిరుమల ఆలయంలో ముకేశ్ అంబానీ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Mukesh Ambani Visits Tirumala Temple Along With Anant Ambani And Radhika Merchant Watch VideoFood Adulteration: తిరుపతిలో దారుణం..హోటళ్లలో కుళ్లిన మాంసంతో బిర్యానీ..నాన్-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్!
Tirupati, Andhra Pradesh:Food Adulteration Tirupati: మస్త్ మస్త్ మటన్ బిర్యానీ, ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ అని హోటళ్లకు వెళ్లి లొట్టలేసుకుని తింటున్నారా? బోటీ భలేగా ఉంది.. పాయ అద్దిరిపోయిందంటూ తెగ జుర్రేస్తున్నారా? అయితే నాన్-వెజ్ ప్రియులారా.. ఒక్క నిమిషం ఆగండి! మీరు తింటున్నది తాజా మాంసం కాకపోవచ్చు, అది మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కాలకూట విషం కూడా కావచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వెలుగుచూసిన కల్తీ మాంసం దందా వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
డబ్బే పరమావధిగా భావిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్లు టన్నుల కొద్దీ కుళ్లిపోయిన మాంసాన్ని దర్జాగా హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులపై తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో అధికారులు.. నగరంలోని పెద్ద పీర్ల చావడి ప్రాంతంలో ఉన్న మటన్ మార్కెట్పై శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని చూసి అధికారులు సైతం ఒక్కసారిగా విస్తుపోయారు.
వెలుగుచూసిన షాకింగ్ నిజాలు..
పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకే తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్లు, బోటీలను ఎన్నో రోజులుగా ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చూపించడానికి కూడా వీల్లేనంతగా కుళ్లిపోయిన ఆ మాంసం నుండి కిలోమీటర్ల మేర కంపు కొడుతోంది. కొన్ని దుకాణాల్లో ఫ్రీజర్లలో గడ్డకట్టుకుపోయిన కుళ్లిన మాంసాన్ని బయటకు తీయడానికి తుప్పుపట్టిన ఇనుప చువ్వలను వాడారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
15 దుకాణాలు సీజ్..!
ఈ ఆకస్మిక దాడుల్లో భాగంగా మొత్తం 15 దుకాణాల్లో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 1,000 కిలోలకు పైగా (ఒక టన్ను) కల్తీ మటన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తూ, కల్తీ దందాకు పాల్పడుతున్న సదరు మటన్ షాపుల యజమానులపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా కల్తీగాళ్లలో మార్పు రావడం లేదు. అందుకే బయట నాన్-వెజ్ తినేటప్పుడు, కొనేటప్పుడు వినియోగదారులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం!
Also Read: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ CM పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్ల పోటీపై క్లారిటీ!
Also REad: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Remuneration Item Song: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
Hyderabad, Telangana:Highest Remuneration For Item Song: సినిమా ఇండస్ట్రీల్లో ఐటమ్ సాంగ్స్ కేవలం అభిమానులను అలరించడానికే కాదు.. కొన్నిసార్లు ఇవి సినిమా విజయానికి, మరోవైపు ప్రమోషన్లకు ప్రధాన బలంగా మారుతుంటాయి. మొన్నటి 'మున్నీ బద్నామ్ హుయీ' నుండి నిన్నటి 'ఆజ్ కీ రాత్' వరకు.. ఎన్నో పాటలు సినిమా కంటే పెద్ద హిట్గా నిలిచాయి. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రత్యేక గీతాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నిమిషాల పాట కోసం ఈ భామలు అందుకునే పారితోషికం కోట్లలో ఉంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఐటమ్ సాంగ్స్ ద్వారా భారీగా క్రేజ్, రెమ్యునరేషన్ అందుకున్న టాప్ హీరోయిన్ల వివరాలను తెలుసుకుందాం.
1) సమంత రూత్ ప్రభు - రూ. 5 కోట్లు
ఐటమ్ సాంగ్స్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా సమంత సరికొత్త రికార్డు సృష్టించింది. 'పుష్ప: ది రైజ్' సినిమాలోని 'ఊ అంటవా మావా ఊహూ అంటవా' పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమంత కెరీర్ లోనే ఇది మొదటి స్పెషల్ సాంగ్ కావడం విశేషం. కేవలం 3 నిమిషాల నిడివి గల ఈ పాట కోసం సమంతకు ఏకంగా రూ. 5 కోట్లు చెల్లించారట.
2) సన్నీ లియోన్ - రూ. 3 కోట్లు
ఐటమ్ సాంగ్స్ అనగానే సన్నీ లియోన్ పేరు మొదటగా వినిపిస్తుంది. ఆమె కెరీర్ను మలుపు తిప్పిన 'బేబీ డాల్' పాట 2010వ దశకంలోనే అతిపెద్ద హిట్ డ్యాన్స్ ట్రాక్లలో ఒకటిగా నిలిచింది. ఆమె పాపులారిటీ పీక్స్లో ఉన్న సమయంలో ఒక్కో ఐటమ్ సాంగ్కు రూ.3 కోట్ల వరకు పారితోషికం వసూలు చేసేవారని టాక్.
3) మలైకా అరోరా - రూ. 2.5 కోట్లు
బాలీవుడ్లో ఐటమ్ నంబర్ల ట్రెండ్ను పూర్తిగా మార్చేసి, దేశవ్యాప్తంగా ఊపు ఊపిన పాట 'మున్నీ బద్నామ్ హుయీ'. 2010లో వచ్చిన 'దబంగ్' సినిమాలోని ఈ పాటలో మలైకా అరోరా చేసిన మాస్ స్టెప్స్, హుక్ స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే ఈ పాట కోసం మలైకాకు రూ.2.5 కోట్లు చెల్లించారు. అయితే ఈమె 'దబంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' ఐటెంసాంగ్లోనూ నటించడం గమనార్హం.
4) కత్రినా కైఫ్ - రూ.2 కోట్లు
'అగ్నిపథ్' సినిమాలోని 'చిక్నీ చమేలీ' పాట బాలీవుడ్ క్లాసిక్ ఐటమ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. కత్రినా కైఫ్ వేసిన అద్భుతమైన మాస్ స్టెప్స్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం కత్రినా రూ.2 కోట్లు అందుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
5) నోరా ఫతేహి - రూ. 2 కోట్లు
ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆర్టిస్టులలో నోరా ఫతేహి ఒకరు. ఆమె డాన్స్తో యూట్యూబ్లో రికార్డులు సృష్టించిన 'దిల్బర్ దిల్బర్' పాట ఇప్పటికీ అందరి నోళ్లలో మారుమోగుతూనే ఉంది. ఈ వైరల్ సాంగ్ కోసం నోరాకు రూ. 2 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
6) తమన్నా భాటియా - రూ.1 కోటి
ఇటీవల 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన పాటల్లో 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' ఒకటి. తమన్నా భాటియా తన గ్లామర్, ఉత్సాహభరితమైన నృత్యంతో ఈ పాటను సినిమా కంటే పెద్ద హిట్ చేసింది. ఈ క్రేజీ సాంగ్ కోసం తమన్నా సుమారు రూ. 1 కోటి పారితోషికం అందుకుందని తెలుస్తోంది.
వీరితో పాటు 'జలేబీ బాయి' పాటతో వెండితెరపై హాట్ డ్యాన్స్తో మెప్పించిన మల్లికా షెరావత్ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ ద్వారా కోట్లాది రూపాయల పారితోషికాన్ని అందుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా చేస్తారా గురూ!
Also REad: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Rains: తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం.. వణికిన నెల్లూరు జిల్లా
Nellore, Andhra Pradesh:Rain Alert: వర్షాకాలం ఆంధ్రప్రదేశ్లో జోరందుకుంది. వర్షాకాలం ప్రారంభమే భారీ వర్షాలు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దీని ప్రభావం ఏపీపై పడింది. దీంతో తిరుమల కొండతోపాటు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ మూడు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడిన తిరుపతి నగరవాసులకు ఈ వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఊరట లభించింది. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్, లక్ష్మీపురం సర్కిల్, మాధవనగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో కాలినడకన వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఏడుకొండలపై..
తిరుమలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన జోరు వానతో తిరుమలలోని ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు.
నెల్లూరులో
తిరుమల, తిరుపతితోపాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
DA HIKE 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DA పెంపుపై MODI సర్కార్ కీలక నిర్ణయం.. సాలరీ ఎంత పెరుగుతుందంటే?
Secunderabad, Telangana:DA HIKE 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వేతనాలు సవరించేందుకు ఎనిమిదవ పే కమిషన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి దాదాపు 6 నెలల సమయం గడిచింది. మరో ఏడాది కాలంలోగా 8వ పే కమిషన్ సంబంధించి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులే ఇంకా అమలు అవుతున్నాయని చెప్పాలి.
అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి డీఏ పెంపుదల ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. 2026 ఏడాదికి సంబంధించిన మొదటి డి ఏ రెండు శాతం పెంచుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం డిఏ 58శాతం నుంచి 60శాతానికి చేరుకుంది. డీఏ అంటే డియర్ నెస్ అలవెన్స్ అని అర్థం. పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఉద్యోగులకు డిఏ.. పెన్షనర్లకు డిఆర్ చెల్లిస్తుంటారు.
2026 సంబంధించి ఇప్పటికే ఒక దఫా డి ఏ చెల్లించారు. అయితే మొత్తం 58% గా ఉన్న డి ఏ 60 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 18వేల రూపాయల వేతనం పొందే ఒక ఉద్యోగి అదనంగా 360 రూపాయల వేతనం పెరుగుతుంది. ఈ లెక్కన ఆరు నెలలకు గాను గమనిస్తే 2610 రూపాయలు అదనంగా లభిస్తాయి. ఇక రెండో దఫా కిందా జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు వర్తించే డి ఏను మరో మూడు శాతం పెంచినట్లయితే అప్పుడు డిఏ 60% నుంచి 63 శాతానికి పెరుగుతుంది .
ఈ లెక్కన గమనిస్తే 18 బేసిక్ వేతనం లభించే ఉద్యోగికి మూడు శాతం డి ఏ పెంచినట్లయితే నెలకు 540 రూపాయలు అదనంగా లభిస్తాయి. అంటే దీని ఆరు నెలల మొత్తానికి లెక్కించినట్లయితే 5400 అవుతుంది. మరోవైపు 8వ పే కమిషన్ సంబంధించి తమ విజ్ఞప్తులను కమిషన్కు తెలియజేసేందుకు జూన్ 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్పటివరకు ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఎనిమిదవ పే కమిషన్ కి తెలియజేయడానికి అవకాశం ఉంది.
అయితే ఇది అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే ఛాన్స్ ఉంది. ఎలాంటి మెమొరండంలో స్వీకరించేందుకు కమిషన్ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ తెలియజేస్తూ ఎనిమిదో వేతన సంఘానికి ఆన్లైన్ ద్వారా మెమోరండమ్స్ పంపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగ సంఘాలు ఈసారి వేతన విషయంలో గట్టిపట్టు పడుతున్నాయి. ఏడవ వేతనం సంఘం సిఫారసు చేసిన 2.57 కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని పెద్దెత్తునా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మరి వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: ఇంటిని నడిపే మహిళలు దేశ నిర్మాతలు .. కోర్టు వ్యాఖ్యలు వింటే గర్వపడతారు..!!
Also Read: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anil Ravipudi GV Prakash: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా మూవీ ప్రమోషన్స్ చేస్తారా గురూ :)!
Hyderabad, Telangana:Anil Ravipudi GV Prakash Promo: టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ బోర్ కొట్టవు. ఆ ఇద్దరూ కలిశారంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే, ఫ్యామిలీ ఆడియన్స్కు పండగ రావాల్సిందే! అలాంటి ఒక క్రేజీ కాంబోనే విక్టరీ వెంకటేష్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మనశంకర వరప్రసాద్' వంటి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి.
ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సారి ఇదొక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో వెంకటేష్తో పాటు నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో, సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
జంధ్యాల సీన్ రీ-క్రియేషన్!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను చిత్ర బృందం పంచుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Thank you, @AnilRavipudi sir, for the warm welcome and for making even a Music Director announcement this entertaining❤️🔥
Had a great time shooting this fun concept, and looking forward to many more such memorable moments together. 😄
Extremely happy to join hands with you for… pic.twitter.com/dXQbODOZoO
— G.V.Prakash Kumar (@gvprakash) June 12, 2026
సముద్రం ఒడ్డున జీవీ ప్రకాష్ను పాతిపెట్టినట్లు చూపిస్తూ, దివంగత దర్శకుడు జంధ్యాల గారి చిత్రంలోని ఒక క్లాసిక్ కామెడీ సీన్ను వీరిద్దరూ రీ-క్రియేట్ చేశారు. అనిల్ రావిపూడి తనదైన శైలిలో చేసిన ఈ వెల్కమ్ వీడియో నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది.
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో పాటు జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. వీరిద్దరి సరసన కీర్తి సురేష్, కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also REad: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?
Also REad: 'పెద్ది' సినిమాకు జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఒక్క సినిమాకే హీరోకి పోటీగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ambani Family: ఆధ్యాత్మిక యాత్రలో ముకేశ్ అంబానీ కుటుంబం.. తిరుమల, శ్రీకాళహస్తి సందర్శన
Srikalahasti, Andhra Pradesh:Ambani Family Temple Tour: అపర కుబేడరుడు.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టింది. ప్రముఖ క్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఏపీలోని తిరుమల ఆలయంతోపాటు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఆయా ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పారిశ్రామికవేత్త కుటుంబానికి తిరుమల క్షేత్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ మరియు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, శ్రీకాళహస్తి పర్యటన కోసం గురువారం రాత్రి అంబానీ కుటుంబం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి తిరుమల కొండపైకి చేరుకున్న వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. మొదట తిరుమల వేంకటేశ్వర స్వామిని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఆయనతోపాటు కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంబానీ కుటుంబసభ్యులు అభిషేక సేవలో పాల్గొని స్వామి సేవలో తరించారు.
ఘన స్వాగతం
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ కుటుంబానికి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ అధికారులు వారికి పట్టువస్త్రంతో సత్కరించి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం ఏర్పడింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తిలో పూజలు
దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి శుక్రవారం ఉదయం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వచ్చారు. ఆలయానికి వచ్చిన అనంత్ అంబానీ బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసునాంబ అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి దగ్గర ఆలయ వేద పండితులు ఆశీర్వాదం చేయగా.. ఈవో, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలతోపాటు చిత్రపటాన్ని అందజేశారు.
పులి సంచారం
తిరుపతిలో చిరుత పులి సంచారం మరోసారి స్థానికులు, విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే ఐకానిక్ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్లోకి చిరుతపులి ప్రవేశించింది. క్యాంపస్లోని భవనాల మధ్య చిరుత కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతి నగరంలో చిరుత పులుల సంచారం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్లో చిరుత ప్రత్యక్షమవడంతో విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. యూనివర్సిటీలోని ప్రముఖ చొప్పల రత్నం బిల్డింగ్ ఐ, జీ బ్లాక్ మధ్య చిరుతపులి సంచరిస్తుండటాన్ని గమనించిన విద్యార్థులు, స్థానికులు భయపడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ చిరుతపులి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి క్యాంపస్ పరిసరాల్లో నిఘా పెంచాలని, విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తిరుమల కిటకిట
వేసవి సెలవుల ప్రభావం తిరుమల ఆలయంలో కొనసాగుతోంది. తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటలు సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి, ఔటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం, ఆక్టోపస్ బిల్డింగ్, గోగర్భం డ్యాం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు.
FIFA World Cup 2026: ఫుట్బాల్ మ్యాచ్లో హద్దు దాటిన లేడీ ఫ్యాన్..ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా స్టేడియంలో రచ్చ..వీడియో!
Burtinle, Nugaal:FIFA World Cup Lady Fan Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఫిఫా ప్రపంచకప్ 2026' టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. గ్రూప్-ఏ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లోనే ఆతిథ్య మెక్సికో జట్టు 2-0 గోల్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ ఆట పరంగానే కాకుండా.. రిఫరీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, గ్యాలరీలో ఒక మహిళా అభిమాని చేసిన హంగామాతో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్యాలరీలో హద్దులు దాటిన లేడీ ఫ్యాన్!
మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెక్సికో మిడ్ఫీల్డర్ ఎరిక్ లిరా అందించిన పాస్తో జూలియన్ క్వినోనెస్ అద్భుతమైన తొలి గోల్ సాధించాడు. ఆ సమయంలో గ్యాలరీలోని మెక్సికన్ మహిళా అభిమాని ఒకరు ఆనందంతో హద్దులు దాటి ప్రవర్తించింది. గోల్ పడిన సంతోషంలో ఒళ్లు మరిచి, తన ప్రైవేట్ భాగాలను (ఛాతిభాగం) బహిర్గతం చేస్తూ చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారి సెగలు పుట్టిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె కావాలనే అలా చేసిందని కొందరు విమర్శిస్తుండగా, మెక్సికన్ సంస్కృతిలో ఇది సాధారణమే అని మరికొందరు సమర్థిస్తున్నారు.
No one brings the energy like Mexico fans ♥️ pic.twitter.com/43nhUQBuG2
— World Cup 2026 (@ofootball__) June 11, 2026
ఒకే మ్యాచ్లో 3 రెడ్ కార్డ్లు..
ఈ మ్యాచ్లో మెక్సికో విజయం కంటే రిఫరీ నిర్ణయాలే ఎక్కువగా హాట్ టాపిక్గా మారాయి. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత అరుదుగా.. ఈ మ్యాచ్లో రిఫరీ ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు నేరుగా 'రెడ్ కార్డ్' చూపించి మైదానం వెలుపలికి పంపారు. కనీసం 'ఎల్లో కార్డ్' హెచ్చరికలు కూడా ఇవ్వకుండా రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు, ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. "ఈ మ్యాచ్లో రిఫరీకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వాలి" అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.
వివాదాలు పక్కన పెడితే, ఆతిథ్య మెక్సికో జట్టు ఈ మ్యాచ్లో కొన్ని అద్భుతమైన మైలురాళ్లను అందుకుంది. మ్యాచ్ 67వ నిమిషంలో రాబర్టో అల్వరాడో ఇచ్చిన క్రాస్ను 35 ఏళ్ల సీనియర్ ప్లేయర్ హిమెనెజ్ నమ్మశక్యం కాని రీతిలో హెడర్ ద్వారా గోల్గా మలిచాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వయసులో గోల్ కొట్టిన కొద్దిమంది ఆటగాళ్ల సరసన ఆయన నిలిచాడు.
మెక్సికోకు చెందిన కేవలం 17 ఏళ్ల గిల్బెర్టో మోరా ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. దీని ద్వారా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా మోరా సరికొత్త రికార్డు సృష్టించాడు.
సౌతాఫ్రికా కొంపముంచిన తప్పులు
దక్షిణాఫ్రికా జట్టు మొదట్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. వారి గోల్కీపర్ రోన్వెన్ విలియమ్స్ చేసిన చిన్న పొరపాట్లు, డిఫెండర్ల మధ్య సమన్వయ లోపం ఆ జట్టును దెబ్బతీశాయి. లభించిన పరిమిత అవకాశాలను గోల్స్గా మలచడంలో సౌతాఫ్రికా స్ట్రైకర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్లోనే 2-0తో ఘన విజయం సాధించడంతో మెక్సికో జట్టు, వారి అభిమానులు ఈసారి కప్పు తమదేనన్న ధీమాతో సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు..రొనాల్డోతో పోటీపడుతున్న తమిళ అబ్బాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Singareni: కాగితాల్లో కొండంత.. క్షేత్రస్థాయిలో గోరంత.. సింగరేణి అక్రమాలపై కొప్పుల ఈశ్వర్!
Karimnagar, Telangana:CBI Probe Singareni: సింగరేణి కాలరీస్ సంస్థ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో జరుగుతున్న బొగ్గు నిల్వలా మాయాజాలంతో పాటు ఇతర అక్రమాలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రామగుండం లోని సింగరేణి సంస్థ OCP-5 ప్రాజెక్టును ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి.. అక్కడ ఉన్న బొగ్గు నిల్వలను నిషితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులకు, వాస్తవాలకు పొంతన లేకపోవడాన్ని చూసిన ఆయన ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.
కాగితాల్లో కొండంత.. క్షేత్రస్థాయిలో గోరంత..
అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం తీరుపై విమర్శల వర్షం కురిపించారు. అధికారిక రికార్డుల ప్రకారం.. సదరు ప్రాజెక్టులలో ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపించారని.. కానీ వాస్తవానికి అక్కడ కనీసం 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా అందుబాటులో లేదని ఆయన బట్టబయలు చేశారు.. లక్షలాది టన్నుల బొగ్గు ఎటు పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగితాలలో ఒక లెక్కలు.. క్షేత్రస్థాయిలో మరోలా ఉండడం అసలు ఏంటని ప్రశ్నించారు.. రికార్డుల్లో కొండంత బొగ్గు నిల్వలు చూపిస్తూ.. క్షేత్రస్థాయిలో మాత్రం పైసా నమ్మకం లేని రీతిలో వ్యవహరిస్తున్నారని.. ఇంతటి భారీ కుంభకోణం వెనక ఎవరి హస్తము ఉందో తేలాలి అని.. కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు..
నష్టాల ఊబిలోకి నెట్టేసేందుకు..
సింగరేణి సంస్థను లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి నెట్టేసేందుకు కొందరు అధికారులతో పాటు దళారులు కుమ్మక్కయ్యారని.. ఆయన మీడియా ముఖంగా ఆరోపించారు. రికార్డులను తారుమారు చేస్తూ.. నిల్వలను తక్కువ చేసి చూపిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.. ఈ అక్రమాలకు బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని.. ఎందుకు సిబిఐ దర్యాప్తు ఒకటే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు..
తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటూ.. సంస్థ ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. తక్షణమే ఈ నిల్వల మాయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కొప్పుల ఈశ్వర్ గట్టిగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్రమే దగ్గరుండి ప్రత్యేకమైన దర్యాప్తును జరిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న నాయకులతో పాటు కార్మికుల సంఘాల ప్రతినిధులు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jagtial: జగిత్యాల మామిడికి ఇంటర్నేషనల్ బ్రాండ్.. రైతు సదస్సులో కవిత కీలక వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Kavitha Praises Jagtial Mangoes Latest News: ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్ల ప్రేమికులకు ఎంతగానో ఇష్టమైన జగిత్యాల మామిడి కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొనియాడారు.. నల్గొండ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించిన రైతు సమన్వయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యానవనల పంటల ప్రాముఖ్యతను, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో పండే మామిడి రకాల విశిష్టతను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు..
టేబుల్ టాప్ వెరైటీ..
జగిత్యాల జిల్లాలోని పండే మామిడి కాయలకు.. ముఖ్యంగా టేబుల్ టాప్ వెరైటీ రకానికి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని కవిత గుర్తు చేశారు. ఇక్కడ పండ్ల లో ఉండే తీయని రుచితో పాటు నాణ్యత, అలాగే ఎక్కువ రోజులపాటు పాడవకుండా ఉండే నిల్వ సామర్థ్యం దీనికి దేశీ విదేశీ మార్కెట్లలో తిరుగులేని ఆదరణను తెచ్చిపెట్టాయని ఆమె వివరించారు. ఈ రకమైన పండ్లు కేవలం విక్రయాలకే కాకుండా ఎగుమతులకు కూడా ఎంతో అనుకూలమైన వని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ మామిడి పండ్లు అన్ని రకాల కంటే ఎంతో అద్భుతమైన రంగును కలిగి ఉంటాయని ఆమె తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర దక్కాలి..
అత్యంత నాణ్యమైన పంటను అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలని కవిత పిలుపునిచ్చారు.. రైతులు ఎంతో శ్రమచేసి పండించే మామిడి పంటకు మార్కెట్లో సరైన.. లాభసాటి గిట్టుబాటు ధర లభించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు లబ్ధి చేకూరేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతాన్ని మామిడి ఉత్పత్తిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని కవిత సూచించారు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లని ఏర్పాటు చేయడం ద్వారా జగిత్యాల జిల్లాను దేశంలోనే అతిపెద్ద మామిడి హబ్ గా తీర్చిదిద్దే అద్భుత అవకాశాలు ఉన్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నట్లు సమాచారం.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jammikunta: కోటీశ్వరులు వద్దు.. ఆ రూ.2,500 ఇస్తే చాలు.. రేవంత్ సర్కార్పై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!
Hyderabad, Telangana:Mlc Jeevan Reddy Latest News: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించి.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ.. మహిళలకు ఇచ్చిన కీలకమైన హామీలను అటకెక్కించారని మండిపడ్డారు..
మేనిఫెస్టోలో నేను ఉన్నా.. అమలులో ఎందుకు లేదు?
ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసినప్పుడు.. ఆ మేనిఫెస్టో రూపకల్పన కమిటీలో తాను కూడా ఒక కీలక భాగస్వామిని ఆయన గుర్తు చేశారు. ప్రజలు మేలు చేయాలని ఉద్దేశంతోనే ఆనాడు అనేక హామీలను పొందుపరిచామని.. అయితే నేడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలను నీరు కారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నిబంధనలతో పాటు హామీలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోటీశ్వరులు వద్దు.. రూ.2,500 ఇస్తే చాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి వేదికపై మహిళలను కోటీశ్వరులు చేస్తామంటూ గొప్పలు చెబుతున్నారని.. కానీ ఆ మాటల్లో అంత బోగస్ తప్ప నిజం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడం కంటే.. కనీసం లక్షల అధికారులను చేసిన చాలని ఆయన ఎద్దేవ చేశారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,500 అందిస్తామని నమ్మ బలికిందని.. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం అవుతున్న ఆ ఉసే ఎత్తడం లేదని.. పెద్దపెద్ద మాటలు చెప్పడం ఆపి.. ముందుగా మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కార్యకర్తలకు పిలుపు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయామని గ్రహించారని ఆయన అన్నారు.. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని.. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Indian Players In FIFA 2026: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు..రొనాల్డోతో పోటీపడుతున్న తమిళ అబ్బాయి!
Zürich, Zürich:Indian Players In FIFA World Cup 2026: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం 'ఫీఫా ప్రపంచ కప్ 2026' అట్టహాసంగా ప్రారంభమైంది. జూన్ 12 అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) మొదలైన ఈ సుదీర్ఘ టోర్నమెంట్లో మొత్తం 48 జట్లు తలపడుతున్నాయి. జూలై 20 వరకు జరిగే ఈ మహా సంగ్రామంలో లీగ్ దశ ముగిసేసరికి 32 జట్లు నాకౌట్కు, ఆ తర్వాత 16 జట్లు తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తాయి.
లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కైలియన్ ఎంబాపే, నెయ్మార్, లామిన్ యమాల్ వంటి దిగ్గజాలను ఒకే వేదికపై చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే, ఈ మెగా టోర్నీలో మన భారత ఫుట్బాల్ జట్టు ఆడనప్పటికీ.. దేశంలోని ఫుట్బాల్ అభిమానులకు గర్వకారణంగా నిలుస్తూ నలుగురు భారత సంతతి ఆటగాళ్లు వేర్వేరు దేశాల తరఫున బరిలోకి దిగుతున్నారు. అందులోనూ ఇద్దరు దక్షిణాది మూలాలు ఉన్నవారు కావడం విశేషం.
ఆ నలుగురు పుట్బాల్ హీరోల వివరాలు ఇవే..
1) నిషాన్ వేలుపిళ్ళై (ఆస్ట్రేలియా) - తొలి తమిళ ప్లేయర్
ఆస్ట్రేలియా (మెల్బోర్న్)లో పుట్టి పెరిగిన నిషాన్ తండ్రి శశినాథ్ వేలుపిళ్ళై శ్రీలంక తమిళ సంతతికి చెందినవారు. అతని వయసు 25 ఏళ్లు. తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్. అక్టోబర్ 2024లో చైనాతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన నిషాన్, 83వ నిమిషంలో అద్భుతమైన గోల్ కొట్టి తన జట్టును ప్రపంచ కప్నకు అర్హత సాధించేలా చేశాడు. ఫీఫా ప్రపంచ కప్లో ఆడుతున్న తొలి తమిళ మూలాల ఆటగాడు ఇతనే. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ను జూన్ 14న టర్కీతో ఆడనుంది.
2) శామ్యూల్ ముత్తుసామి (డీఆర్ కాంగో) - రొనాల్డోతో ఫైట్!
శామ్యూల్ తండ్రి ముత్తుసామి (29 ఏళ్లు) తమిళ మూలానికి చెందిన ఇండో-గ్వాడెలోపే సంతతికి (19వ శతాబ్దంలో కరేబియన్ దీవులకు వలస వెళ్లిన దక్షిణ భారత కార్మికులు) చెందినవారు. తల్లి కాంగో దేశస్థురాలు. శామ్యూల్ ప్రస్తుతం ఫ్రెంచ్ పౌరసత్వం కలిగి ఉండి, యూరోపియన్ లీగ్స్లో ఆడుతున్న ముత్తుసామి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. జూన్ 17న జరిగే మ్యాచ్లో ముత్తుసామి ప్రాతినిధ్యం వహిస్తున్న డీఆర్ కాంగో జట్టు.. క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్తో తలపడనుంది.
3) దాసిన్ ముహమ్మద్ జంషెడ్ (ఖతార్) - కేరళ ముద్దుబిడ్డ
ఖతార్ రాజధాని దోహాలో జన్మించిన దాసిన్ (19 ఏళ్లు) తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. తండ్రి జంషీద్ (తలస్సేరి), తల్లి షైమా (కన్నూర్). ఫీఫా ప్రపంచ కప్ ఆడబోతున్న కేరళకు చెందిన మొట్టమొదటి ఆటగాడు దాసిన్ కావడం గమనార్హం. ఖతార్ అండర్-17, అండర్-19 జట్లలో ఆడి సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు.
4) సర్ ప్రీత్ సింగ్ (న్యూజిలాండ్) - పంజాబీ పవర్
న్యూజిలాండ్ (ఆక్లాండ్)లో స్థిరపడిన పంజాబ్లోని జలంధర్కు చెందిన భారతీయ దంపతులకు సర్ప్రీత్ సింగ్ (27 ఏళ్లు) జన్మించాడు. ప్రపంచ కప్లో ఆడుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన భారత సంతతి ఆటగాళ్లలో సర్ ప్రీత్ సింగ్ ఒకడు. న్యూజిలాండ్ తరఫున 24 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఇతనికి ఉంది. జూన్ 16న ఇరాన్తో జరిగే మ్యాచ్తో న్యూజిలాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
భారత్లో లైవ్ ఎక్కడ చూడాలి?
భారతదేశంలోని ఫుట్బాల్ ప్రేమికుల కోసం జీ ఎంటర్టైన్మెంట్ (ZEE) ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసింది. యునైట్8 స్పోర్ట్స్ 1 & 1 HD (Unite8 Sports), యునైట్8 స్పోర్ట్స్ 2 & 2 HD టీవీ ఛానళ్లలో ఫుట్ బాల్ ప్రపంచకప్ను ప్రత్యక్ష ప్రసారంగా చూడొచ్చు. అలాగే ఓటీటీ యాప్ జీ5 (ZEE5)లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
అయితే ఈ ప్రపంచకప్ చూడాలనుకున్న ప్రేక్షకులకు అతి తక్కువ ధరలకే జీ5 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. రూ.799 సబ్స్క్రిప్షన్ ప్లాన్తో 3 నెలలకు గానూ గరిష్టంగా 3 డివైజ్ల్లో మ్యాచ్ చూసేందుకు అనుమతి ఉంది. అలాగే ఏడాది సబ్స్క్రిప్షన్ కోసం రూ.1,699 చెల్లిస్తే 4 డివైజ్ల్లో ఈ మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేయోచ్చు.
మన దేశ జట్టు ఆడకపోయినా, మన రక్తం పంచుకున్న నలుగురు ఆటగాళ్లు ప్రపంచ అత్యున్నత వేదికపై మెరవనుండటం భారతీయులందరికీ గర్వకారణం!
Also Read: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Speech: ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీ పోటీ.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర: కేటీఆర్
Baddipadaga, Telangana:KTR Breaking News: 'తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మీనాక్షి నటరాజన్పై కోపం ఉన్నవాళ్లు బీజేపీ నాయకులు ఉప్పు అందించారు. రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'మొన్నటి వర్షానికి హైదరాబాద్ అవస్థలకు రేవంత్ నిర్ణయాలే కారణం. రేవంత్ రెడ్డికి ప్రజెంట్ నగరంపై అవగాహన లేదు. ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీపై ఫోకస్. ఎయిర్పోర్టు మెట్రో పూర్తయితే ప్రజల ఇబ్బందులు తొలగేవి. కానీ ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడు' అని గుర్తుచేశారు. రెండు చెరువులు బాగు చేసి పోజులు కొడుతున్నారు. నాడు మేము 100 చెరువులు అభివృద్ధి చేశాం' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
మాకేం సంబంధం?
హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'హైడ్రాను జిందా తిలిస్మాత్లా వాడుతున్నారు. 60 నియోజకవర్గాల్లో 'సర్', సభ్యత్వ నమోదు సమావేశాలు పూర్తి. సభ్యత్వ నమోదు యాప్ టెస్టింగ్ దశలో ఉంది. సభ్యత్వ నమోదు తర్వాత కమిటీలు, ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. మాకేం సంబంధం' అని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్లో బ్లాక్షిప్ ఎవరో రేవంత్ రెడ్డి ఒట్టు వేస్తారా? మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైంది కాదు' అని ప్రకటించారు. ప్రతిదానికి సిట్ వేస్తారు కదా మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్ వేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి చెప్పి ఉంటారు.
కాంగ్రెస్ మూడో స్థానంలో
'సభ్యత్వ నమోదు సంఖ్య ముఖ్యం కాదు క్రియాశీల సభ్యులే ముఖ్యమని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ జారుడు బండపై ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సచ్చిపోయిన బీఆర్ఎస్ అయితే తెల్లారిలేస్తే మాపై ఏడవడం ఎందుకు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని కథం చేసి శిథిలాల కింద
'రైతు డిస్కం అని పెట్టీ మోటార్లకు మీటర్లు పెడుతారు. కేసీఆర్ ఏ డిస్కం పెట్టకుండానే 24 గంటలు కరెంట్ ఇచ్చారు. భట్టి విక్రమార్క మూడు ఇళ్లు కట్టుకుంటున్నారు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి రాజసౌధాలు కట్టుకుంటున్నాడు. 71 సార్లు ఢిల్లీకి తిరిగిన రేవంత్ రెడ్డి 71 రూపాయలు తేలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కథం చేసి శిథిలాల కింద పెట్టడం ఖాయం అని జోష్యం చెప్పారు. 'దేశంలో వ్యవస్థలపై యువతకు ఆక్రోశం వస్తే యువతలో తిరుగుబాటు వస్తుందని తాను గతంలోనే చెప్పానని.. నేను అలా చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. ఇప్పుడు కాక్రోచ్ లాంటి పార్టీ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న నాయకుడు శ్రీధర్ బాబు ఒక్కరే' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హిట్లర్ మాటలను సమర్ధించడం బాధాకరమని పేర్కొన్నారు. 'షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు చెప్తా. పార్టీలో జరుగుతున్న నిజాలు బయటకు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పైసలతోనే పదవులు వస్తాయి' అని కేటీఆర్ వివరించారు. పేమెంట్ కోటాలోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని తెలిపారు.
ఊరుకునేది లేదు
'జూలైలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. 'జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డీలిమిటేషన్లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదు' అని స్పష్టం చేశారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేసే.. ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ప్రకటించారు.
Kane Williamson Retires: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఠాత్ వీడ్కోలు
Wellington, Wellington Region:Kane Williamson Retires News: ఆధునిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ మధ్యలోనే, తక్షణమే అమల్లోకి వచ్చేలా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచారు.
ఎలాంటి ఆర్భాటాలు, ముందుగా ప్రకటించిన వీడ్కోలు పర్యటనలు లేకుండా.. తన ఆట శైలి లాగే ఎంతో నిశ్శబ్దంగా అంతర్జాతీయ రంగానికి ఆయన స్వస్తి పలికారు. లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాతే, విలియమ్సన్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
"నేను దీని గురించి కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. న్యూజిలాండ్ తరఫున ఆడిన ప్రతి మ్యాచ్లో నా సర్వశక్తులు ఒడ్డి ఆడాను. ఇంతకంటే తక్కువ స్థాయిలో (నాణ్యత తగ్గించి) కొనసాగడం నాకు ఇష్టం లేదు. నా సొంత నిర్ణయంతో, గౌరవంగా తప్పుకుంటున్నందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను" అని కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించారు.
'ఫ్యాబ్ ఫోర్'లో పడిన మొదటి వికెట్
ప్రపంచ క్రికెట్ను శాసించిన నలుగురు ఆధునిక బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లను కలిపి 'ఫ్యాబ్ ఫోర్' గా పిలుస్తారు. ఈ నలుగురిలో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20) నుండి పూర్తిగా వైదొలిగిన మొదటి ఆటగాడిగా విలియమ్సన్ నిలిచారు. సాంప్రదాయక క్రికెట్ సాంకేతికతకు నిదర్శనమైన విలియమ్సన్ లేని లోటును పూరించడం ప్రపంచ క్రికెట్కు అంత సులువు కాదు.
కివీస్ క్రికెట్లో 'స్వర్ణయుగం' ముగిసింది!
2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్, 16 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో ఎన్నో రికార్డులను తిరగరాశారు. 378 అంతర్జాతీయ మ్యాచ్లలో న్యూజిలాండ్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తంగా 19,346 పరుగులు (బ్లాక్ క్యాప్స్ చరిత్రలోనే అత్యధికం) రాబట్టాడు. అందులో 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. 2021లో భారత్పై తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) గెలిపించిన ఘనతకు కూడా అతనికే దక్కింది. 2016 నుండి 2024 మధ్య కాలంలో కివీస్ జట్టును రెండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్, మూడు సెమీ-ఫైనల్స్కు నడిపించిన కెప్టెన్గా రికార్డులకు ఎక్కాడు.
తదుపరి ఇన్నింగ్స్ ఏంటి?
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్-బై చెప్పినప్పటికీ, విలియమ్సన్ వివిధ లీగ్ క్రికెట్లలో ఆటగాడిగా కొనసాగుతారు. అయితే, ఆయన భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన మలుపు భారత్లోనే ఉంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వ్యూహాత్మక సలహాదారుగా విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందే విలియమ్సన్ లక్నో ఫ్రాంచైజీకి వ్యూహాత్మక సలహాదారుగా సంతకం చేశారు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో ఆయనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ భారం తగ్గడంతో, ఇకపై లక్నో సూపర్ జెయింట్స్ (IPL)తో పాటు వారి కో-ఫ్రాంచైజీ అయిన సౌతాఫ్రికా లీగ్లోని 'డర్బన్ సూపర్ జెయింట్స్' (SA20) వ్యవహారాల్లోనూ విలియమ్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. మైదానంలో తన బ్యాటింగ్తో అలరించిన ఈ మాజీ కివీస్ కెప్టెన్, ఇప్పుడు తెరవెనుక ఒక గ్లోబల్ క్రికెట్ వ్యూహకర్తగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.
Also Read: FIFA World Cup 2026: ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అట్టహాసంగా ప్రారంభం..48 దేశాలు..104 మ్యాచ్లతో
Also Read: విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక్క లైక్తో ఆమె జీవితమే మారిపోయింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Speech: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్లకు జనసేన పోటీపై క్లారిటీ!
Tirupati, Andhra Pradesh:Pawan Kalyan Speech At Tirupati: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, గత ఎన్నికల పొత్తులు, కూటమి ఏర్పాటు వెనుక ఉన్న అసలు రహస్యాలు, భవిష్యత్ లక్ష్యాలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయడంపై వచ్చిన విమర్శలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "జనసేన కేవలం 21 సీట్లకే పరిమితమైందంటూ చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆ రోజు మేము సీట్ల కోసం రాజీపడలేదు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి మేము చేసిన రాజకీయ త్యాగమే, ఈ రోజు కూటమి సాధించిన చారిత్రాత్మక విజయానికి బలమైన పునాదిగా మారింది. అధికారాన్ని పంచుకోవడం మా లక్ష్యం కాదు.. బాధ్యతను పంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా అసలు లక్ష్యం" అని పవన్ స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలోనే సమస్యలు తీరాలి!
అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గ్రామమే దేశ ప్రగతికి కేంద్ర బిందువు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చే నిర్ణయాలు గ్రామ పంచాయతీ స్థాయిలోనే జరగాలని ఆయన అన్నారు.
"ప్రస్తుతం ప్రతి చిన్న సమస్యకూ ప్రజలు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను బలహీనపరిచి, మొత్తం వ్యవస్థను ఎమ్మెల్యేల చుట్టూ కేంద్రీకరించడం సరైన పద్ధతి కాదు. ఏ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఆ గ్రామాల్లోనే పరిష్కారమయ్యేలా మార్పు రావాలి" అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ ఉక్కుపై సమిష్టి విజయం..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ సమిష్టిగా కృషి చేస్తున్నాయని పవన్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వ సమిష్టి ప్రయత్నాలు ఫలించాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, యువత ఉపాధి, రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
2024 ఎన్నికల తీర్పు ఏపీలో ఒక కొత్త తరం భవిష్యత్తుకు నమ్మకాన్ని ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నా.. సరైన సమయంలో తమ ఓటు హక్కుతో చరిత్రను తిరగరాయగలరని గత ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే ఈ కూటమి ప్రభుత్వమని ఆయన అభివర్ణించారు.
Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
