గల్లీ మైసమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ గల్లీమైసమ్మ బోనాల మహోత్సవం, సాయి బాబా స్వామివార్లను ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని వేడుకున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Jeevan Reddy Likely To Resign: అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను లాక్కున్న కాంగ్రెస్ పార్టీకి పాపం తగిలినట్టు ఉంది. అక్కడ స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పటికే పార్టీ మారుతారని పుకార్లు వస్తుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చించేయడంతో అది ఖాయంగా కనిపిస్తోంది. ఆత్మగౌరవానికే భంగం వాటిల్లిన నేపథ్యంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా చేయనుండడం కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం లభించకపోవడంతో కాంగ్రెస్లో సీనియర్లు పునరాలోచనలో పడ్డారు.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
తనను అవమానిస్తూ.. జగిత్యాలలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి బుద్ధి చెబుతున్నారు. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రతాపం ఏమిటో చూపినా కూడా పార్టీ అధిష్టానం ఖాతరు చేయకపోవడంతో జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాలలోని తన నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేశారు. పాత బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించి కేవలం తన ఫొటో మాత్రమే ఉండేలా ఫ్లెక్సీలు ముద్రించారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
ఫలించని బుజ్జగింపు
పార్టీని వీడేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనా కూడా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో సోమవారం ఉదయం జీవన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ వీడరాదని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే మీనాక్షి నటరాజన్ బుజ్జగింపు చర్యలను జీవన్ రెడ్డి పట్టించుకోలేదు. 'నలభై ఏళ్ల కాంగ్రెస్ ప్రయాణానికి మీరిచ్చే బహుమతి ఇదేనా? ఇక కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చాలు' అంటూ ఫోన్లో మీనాక్షికి ఘాటుగా సమాధానమిచ్చినట్లు చర్చ జరుగుతోంది.
ముహూర్తం అప్పుడే!
కాంగ్రెస్కు రేపో మాపో గుడ్బై చెప్పేయనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికేందుకు అంగీకరించారని.. ఆయన చేరిక లాంఛనంగా కనిపిస్తోంది. సంప్రదింపులు పూర్తవడంతో జగిత్యాలలో ఫ్లెక్సీలు చించేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరడం ఖాయమే. ఈనెల 25 వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం నిర్ణయమైందని సమాచారం. పార్టీలో చేరిన అనంతరం జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టనున్నారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Women Heart Attack Death: యముడు ఎప్పుడూ పిలుస్తాడేమో కానీ ఊహించని పరిస్థితిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆరోగ్యంగా.. అందరి మధ్యలో ఉన్న వారు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్నారు. అలా ఓ శుభకార్యానికి అతిథిగా వచ్చిన వివాహిత ఫొటో దిగి శుభాకాంక్షలు చెబుతున్న క్రమంలో కుప్పకూలిపోయారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె వేదికపైనే పడిపోయారు. ఆమెను లేపి చూడగా అప్పటికే మరణించారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా కూడా అక్కడి వైద్యులు అదే విషయాన్ని చెప్పారు. దీంతో ఒక్కసారిగా శుభకార్యం కాస్త విషాదంగా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సుష్మిత వివాహితురాలు. ఆమె ఖమ్మంలో జరిగిన బంధువుల శుభకార్యంలో పాల్గొన్నారు. ఇంట్లో జరుగుతున్న గృహ ప్రవేశ వేడుకకు హాజరై సందడి చేశారు. అందరితో కలిసి సరదాగా గడుపుతూ.. ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు బంధువులతో కలిసి సుష్మిత ఫొటో దిగేందుకు వచ్చారు. కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు చెప్పి ఫొటో దిగుతుండగా ఉన్నఫళంగా ఆమె కుప్పకూలిపోయారు. పడిపోతున్న ఆమెను బంధువులు పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆమె కిందపడిపోయారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
ఏం జరిగిందో తెలియదు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సుష్మితను లేపే ప్రయత్నం చేయగా.. చలనం లేదు. వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. ఈ హఠత్పరిణామానికి కుటుంబసభ్యులు, బంధువులు షాక్లో ఉండిపోయారు. అందరితో కలివిడిగా ఉంటూ సుష్మిత కొన్ని క్షణాల్లోనే ఈ లోకాన్ని విడిచిపోవడం అంతా విస్మయానికి గురయ్యారు.
గుండెపోటుతో హఠాన్మరణం పొందడంతో సుష్మిత కుటుంబసభ్యులు కన్నీటి సంద్రంలో మునిగారు. ఆమె ఆకస్మిక మరణానికి తీవ్రమైన గుండెపోటు కారణంగా తెలుస్తోంది. అయితే ఫంక్షన్లో ఆమె కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనిషికి చావు ఇలా కూడా వస్తుందా? అని సందేహం వ్యక్తమవుతోంది. యముడు ఇలా సంతోషంలో ఉన్న సమయంలో ఎలా ప్రాణం తీసుకెళ్తాడోనని ఆ వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన అందరినీ కలచివేస్తోంది. కాగా ఇప్పటివరకు పురుషులకు మాత్రమే గుండెపోటు వస్తుందని చర్చ జరుగుతుండగా.. ఖమ్మంలో జరిగిన సంఘటనతో మహిళలకు కూడా గుండెపోటు వస్తుందని రుజువైందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Hailstorm Rains: వేసవికాలం ప్రారంభమే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జల్లులతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షం పడగా.. కొన్నిచోట్ల వడగళ్లు పడ్డాయి. ఈ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
హైదరాబాద్తోపాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం సాయంత్రం వాన పడింది. కొన్నిచోట్ల దంచికొట్టగా.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరికి గురయిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే అకాల వర్షాలతో రైతులు భయపడిపోయారు. పంట చేతికి వస్తున్న సమయంలో వర్షం పడడంతో పంట నష్టం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. బోరబండ, ఎర్రగడ్డ, సనత్నగర్, బంజారాహిల్స్, తార్నాక, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో చినుకులతోపాటు మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో ఈ వర్షం తీవ్రంగా ప్రభావం చూపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో వ్యసాయానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం రాగా.. ఇప్పుడు మరోసారి వర్షం పడడంతో రైతుల నడ్డి విరిగింది. అర్ధ గంట సేపు వాన దంచికొట్టడమే కాకుండా పెద్ద పెద్ద సైజులో వడగళ్లు పడ్డాయి.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా హవేళి ఘన్పూర్ మండలంలో భారీ వర్షంతోపాటు పెద్ద పెద్ద వడగళ్లు పడ్డాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్, నాగిరెడ్డిపేట మండలాల్లో మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ చేసిన సూచనల ప్రకారం ఆదివారంతోపాటు సోమవారం కూడా వర్షం పడింది. రానున్న రోజుల్లో కూడా పలుచోట్ల వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Harish Rao vs Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని.. అయినా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు రేవంత్ రెడ్డి దాసోహమయ్యాడని.. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ మీటింగ్ మినిట్స్ వచ్చి నెల దాటినా రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపాడాలి.. లేఖల డ్రామాలు కట్టిపెట్టాలని కోరారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నదీ జలాల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి హక్కుల సాధనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని సాక్ష్ల్యాలు, ఆధారాలతో వివరించారు. చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని రేవంత్ రెడ్డి వైఖరితో కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుందని ప్రకటించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
'ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ నిరంతరం శ్రమించారు. కృష్ణా నదిలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ సాధించి, నీటి పునఃపంపిణీ జరిగేలా చూశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను కేసీఆర్ గారు శాశ్వతంగా కాపాడారని చెప్పారు. గోదావరిలో నీటిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను స్థిరపరచడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి 400 టీఎంసీల ప్రాజెక్టులకు కేసీఆర్ అనుమతులు సాధించారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ ఇప్పుడు గోదావరి జలాలపై పడింది. ఇంత జరుగుతుంటే ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతకానితనం ఏపీ ప్రభుత్వానికి ఆసరాగా మారింది' మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసింది. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచుకునేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గం' అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. ఢిల్లీ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం పోలవరం, నల్లమల్ల సాగర్ అంశాలను ఎజెండాలో పెట్టినా కూడా తెలంగాణ ప్రభుత్వం మీటింగ్లో కూర్చుంది. తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా చేసి రేవంత్ రెడ్డి దొంగ చేతికే తాళాలు ఇచ్చాడు' అని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ హక్కులను కాలరాయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
'కృష్ణా నదిలో కనీసం 34 శాతం తాత్కాలిక వాటాను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతోంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగిస్తూ.. నల్లమల్ల సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి పనులు ముమ్మరం చేస్తున్నామని గర్వంగా చెప్పారు. మరి తెలంగాణ గవర్నర్ స్పీచ్లో.. నల్లమల్ల సాగర్ను అడ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోమని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పించలేకపోయింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో.. ఎన్ని లేఖలు రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలి' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Assembly Session: అసెంబ్లీ సమావేశాలు చాలా తక్కువ రోజులే నిర్వహిస్తున్నారని.. మరో పది రోజులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించేది కొన్ని రోజులు మాత్రమేనని తెలిపారు. 'ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పింది. వాటిలో రెండు ఆదివారాలు, రెండు పండుగలు పోతే అసెంబ్లీని ఎన్ని రోజులు నడుపుతారని అడిగాం' అని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం పీఏసీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తన వాదనలు చెప్పిన అనంతరం అసెంబ్లీలో మీడియాతో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని చెప్పాం. ఆదివారాలు అసెంబ్లీ పెట్టాలని కోరాం. మార్చి 30వ తేదీ వరకు సభ నడుపుతామని చెబుతున్నారు. మేము కనీసం మార్చి 31 వ తేదీ వరకు సభ పెట్టాలని కోరాం. సీఎంతో మాట్లాడి చెప్తామని చెప్పి 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పింది. 22వ తేదీ ఆదివారం అసెంబ్లీ ఉంటుంది. హౌస్ కమిటీలు ఆలస్యమయ్యాయని చెప్పడంతో వేస్తామని చెప్పారు' అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వెల్లడించారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
'రేపు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకపోవడంతో ప్రశ్నించాం. అన్స్టార్డ్ క్వశ్చన్స్, జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటివరకు రాలేదు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రైవేట్ మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరాం' అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 'బీఆర్ఎస్ పార్టీ తరపున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాం. మేము మాట్లాడుతుంటే సీఎం, సంబంధిత శాఖా మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పాం' అని వెల్లడించారు.
ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్కు చెప్పాం. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ తరపున అడిగాం. అసెంబ్లీ లైబ్రరీ పరిస్థితి దారుణంగా ఉందని బీఏసీలో ప్రభుత్వానికి చెప్పాం. బీఏసీ మినిట్స్ ఫాలో కాకపోతే వచ్చే బీఏసీని బాయ్ కాట్ చేస్తామని చెప్పాం. అసెంబ్లీని 9 గంటలకు పెట్టాలని బీఏసీలో డిమాండ్ చేశాం. అసలు ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ను పెట్టలేదని చెప్పాం. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్. ప్రివిలేజ్ మోషన్స్ విషయంలో స్పీకర్ బాధ్యత తీసుకోవాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kendra Sahitya Akademi 2025 Award: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి దక్కడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాహిత్యానికి జాతీయ పురస్కారం లభించడంతో సిద్దారెడ్డికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తన మిత్రుడు సిద్దారెడ్డికి అవార్డు లభించడంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
'కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని.. ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గొప్ప విషయం. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి' అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రశంసించారు. 'మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యంతో ప్రజలను ఆలోచింపజేస్తూ.. ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిద్ధారెడ్డి చూరగొన్నారు' అని కేసీఆర్ కొనియాడారు.
కేటీఆర్ అభినందన
నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ తెలిపారు. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడంతో శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
'నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేసి తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన నందిని సిధారెడ్డి కృషి మరువలేనిది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజా కవిగా సిద్ధారెడ్డి' అని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. 'సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సిధారెడ్డి గెలుచుకోవడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం. తెలంగాణ అస్తిత్వాన్ని.. సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన సిద్దారెడ్డికి పురస్కారం దక్కడం సముచితం' అని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు.
శుభాకాంక్షలు సర్: హరీశ్ రావు
అవార్డు దక్కించుకున్న నందిని సిధారెడ్డిని శుభాకాంక్షలు సర్ అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు. ''నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి వెలకట్టలేనిది. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. శుభాకాంక్షలు సర్' అని ప్రకటన చేశారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభినందన
'తెలంగాణ మట్టి వాసనను భూమి స్వప్నంగా కన్న కవి.. మనుషుల మధ్య 'సంభాషణ' తెగిపోకుండా అక్షర వారధి కట్టిన సాహితీవేత్త సిద్దిరెడ్డి. ప్రాణహిత తీరాల్లో అలల ఉత్సాహాన్ని.. 'నీటిమనసు'లోని అలజడిని పట్టుకున్న అక్షర శిల్పి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం గర్వకారణం' అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రకటించారు. 'కరోనా కాలపు కన్నీటి దృశ్యాలు, మనిషి ఎదుర్కొన్న జీవన బీభత్సాన్ని 'ఆనిమేష' దీర్ఘ కవితలో అత్యంత ఆర్ద్రంగా ఆవిష్కరించారు. 'ఒక బాధ కాదు', అది సమాజపు సామూహిక వేదన అని చాటిన సిదారెడ్డి కృషీవలత్వానికి ఈ గౌరవం దక్కడం తెలంగాణ సాహిత్యానికే వన్నె తెచ్చింది' అని అభినందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 Winner Prediction: ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ఇటీవలే ఘనంగా ముగిసింది. వరుసగా రెండోసారి భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి క్రికెట్ అభిమానులను రంజింపజేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ సిద్ధమవుతుంది. ఈ ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభం ముందే మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా కప్ గెలిచే సూచనలు లేవని వెల్లడించాడు. ఇంతకీ అతనెవరో తెలుసా?
మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. గత సీజన్లో విన్నర్గా నిలిచిన ఆర్సీబీ జట్టు మరోసారి తమ సత్తా చాటాలని కృషి చేస్తోంది.
IPL 2026 విన్నర్ ఆ టీమ్!
రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నా ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడం కష్టమని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ క్రమంలో ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆకాష్ చోప్రా వెల్లడించాడు.
అయితే ఏ జట్టు ఈసారి విన్నర్గా నిలవబోతుందనే ప్రశ్నకు ఆకాష్ చోప్రా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఏ జట్టు గెలుస్తుందో తనకు తెలియదని అంటున్నారు. బహుశా ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ గెలుచుకోవచ్చని అన్నాడు. తన అభిప్రాయం అదే అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీజన్లో సంజూ శాంసన్ అత్యధిక రన్స్ రాబట్టి ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటాడని.. అలాగే జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.
2025లో జరిగిన ఐపీఎల్ సీజన్లో సీఎస్కే జట్టు పరమచెత్తగా ఆడింది. ఆడిన 14 మ్యాచ్ల్లో 10 ఓడిపోయి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. అయితే ఈసారి జట్టులోకి సంజూ శాంసన్ రాకతో ఏమైనా స్పెషల్గా జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ సీజన్తో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
CSK జట్టులో ఎవరెవరు ఉన్నారంటే?
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, సంజూ శాంసన్, డెవాల్ట్ బ్రెవిస్, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, జమీవ్ ఖో ఓవర్టన్, రామకృష్ణ కిహో ఓవర్టన్, ఖాన్, ముష్కే ఫౌల్కేస్, గుర్జబ్నీత్ సింగ్, ఎస్. గోపాల్, మాట్ హెన్రీ, అఖేల్ హొస్సేన్, రాహుల్ చాహర్.
Also Read: LPG Cylinder Price: సామాన్యుడికి షాకింగ్ న్యూస్..ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000 అమ్మకం..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
AP Govt Employees: తమ డిమాండ్లు, సమస్యలపై ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతన సవరణ సంఘం, డీఏ పెంపుతోపాటు ఐఆర్, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. ఉగాదిలోపు తమకు హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. బకాయిల ఊసే లేదని తమ ఆవేదనను వివరించారు.
తాడేపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయంలో జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతటి దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు ఉద్యోగ సంఘం నాయకులుగా తాము సమాధానం చెప్పలేకపోతున్నట్లు తెలిపారు.
'పీఆర్సీ దూరమవుతుందనే ఆందోళన అందరిలో ఉంది. ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి' అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. సరెండర్ లీవులు, డీఏలు పెండింగ్లో ఉన్నాయని.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు రావడం లేదని వివరించారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు.
ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయీ అందలేదని.. రిటైరైన వారు రావాల్సిన బెనిఫిట్లు తీసుకోకుండానే మరణిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు. పాలనలో తాము ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తమకు సహకారం లేదని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానే కాదు.. ముంచిన ప్రభుత్వం అని ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకుముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇవ్వడం లేదు' బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి అని తెలిపారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందని తమకు ఆందోళన నెలకొందని.. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రకటిస్తూ వచ్చాయని గుర్తుచేశారు. రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమేనని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందని.. సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నామని.. ఇప్పుడు ఊరుకునేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని.. అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని.. ఉగాదికి ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bengali Wedding Lip Kiss Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో అప్పుడే పెళ్లైన నవ దంపతులు.. నిగ్రహంగా ఉండలేక పెళ్లిపీటలపై లిక్ కిస్లతో రెచ్చిపోయారు. పెళ్లిలో పెద్దల ముందే ఈ పాడుపని చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఏం జరిగింది?
నేటితరం యువత పెళ్లి తర్వాత నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యాన్ని నలుగురిలో (సోషల్ మీడియాలో షేర్ చేయడం) పెద్ద ట్రెండ్ అయ్యింది. అలాంటి కొన్ని విచిత్రమైన పనులు వీడియోలుగా మారి ఇప్పుడు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో అప్పుడే పెళ్లైన ఓ జంట చేసిన పాడుపని గురించి నెట్టింట రకరకాలుగా చర్చ జరుగుతుంది.
వివరాల్లోకి వెళితే..అదొక బెంగాలీ పెళ్లి. పెళ్లిపందిరిలో ఘనంగా ముస్తాబై, నూతన వధూవరులు వివాహంతో ఒక్కటైన క్షణం అది. అయితే అకస్మాత్తుగా ఆ జంట బంధువులున్నారని పట్టించుకోకుండా పెళ్లిపీటలపై వధూవరులు ఇద్దరూ లిప్ కిస్ లు పెట్టుకుంటున్నారు. పందిట్లో పెద్దలు, పిల్లలు ఉన్నారనే ఇంగితం లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. పెళ్లికూతురు తీరును చూస్తే ఆమె అంతటితో ఆగేలా కనిపించలేదు. అలాగే పెళ్లికొడుకు కూడా తానేం తక్కువ తినలేదంటూ ముద్దుల్లో రెచ్చిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపుగా 35 సెకన్ల పాటు సాగిన ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు హిందూ వివాహ ఆచారాల సాంప్రదాయ పవిత్రతకు విరుద్ధమని ఆగ్రహిస్తున్నారు. సంప్రదాయ భారతదేశంలో పాశ్చాత్య పోకడలు తగవని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ ముద్దులాట ఏంటని పలువురు తిట్టిపోస్తున్నారు. అలాగే మరికొందరు ఈ నూతన వధూవరులకు మద్దతుగా నిలుస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Cylinder Price: సామాన్యుడికి షాకింగ్ న్యూస్..ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000 అమ్మకం..ఎక్కడంటే?
LPG Cylinder Price 7000 News: దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఈ కొరత హోటల్ పరిశ్రమను పెద్ద సంక్షోభంలోకి నెట్టివేసింది. ఒకప్పుడు సాధారణ మిస్డ్ కాల్తో గ్యాస్ సిలిండర్లను పొందిన హోటల్ యజమానులు ఇప్పుడు సరఫరాలను పొందటానికి ఇబ్బంది పడుతున్నారు. దీని వలన రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఇదే అదునుగా కొందరు దళారులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ను రూ.7,000లకు బ్లాక్లో అమ్మకాలు చేస్తున్నారు.
కొంతమంది మధ్యవర్తులు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం ద్వారా డబ్బు దండుకుంటున్నారని హోటల్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు బెంగళూరులో కమర్షియల్ LPG సిలిండర్ అధికారిక ధర దాదాపు రూ.1,900 విక్రయిస్తుండగా.. ఇప్పుడు కొరత ఉందని గ్రహించిన దళారులు సిలిండర్లను బ్లాక్లో అమ్మకానికి ఉంచారు. ఒక్కో గ్యాస్ సిలిండర్ను రూ.7,000కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలాంటి కృత్రిమ కొరత ఏర్పరిచిన వారిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని హోటల్ యజమానాలు డిమాండ్ చేస్తున్నారు.
బెంగళూరుతో పాటు మైసూరు నుండి కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. హోటల్ యజమానులు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.4,000 నుండి రూ.5,000 వరకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సెండర్లు, రెస్టారెంట్లపై ఆర్థిక భారం పెరుగుతుందని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక హోటళ్లు ఆహార ధరలను భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టిఫిన్స్ అమ్మకాలపై ప్లేట్కు రూ.10 చొప్పున పెంచేశారు. కొన్ని హోటల్ యజమానులు గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నారు. అలా చేసినా అల్పాహారాల ధరలు రూ.5 నుంచి రూ.20 పెంచుతున్నట్లు కస్టమర్లు వాపోతున్నారు.
అయితే కొన్ని హోటళ్లలో కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా ఇంటికి ఉపయోగించిన LPG గ్యాస్ సిలిండర్లను చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార, పౌర సరఫరాల శాఖ పలుచోట్ల దాడులను నిర్వహించి అనేక సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు సిటీలో దాదాపుగా 316 సిలిండర్లను జప్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ క్యాంటీన్లు, ప్రసాదం పంపిణీ చేసే దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ముఖ్యమైన సంస్థలకు కమర్షియల్ LPG సిలిండర్లలో దాదాపు 20 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR Fires On Congress Govt: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేడు (మార్చి 16) గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత స్వీచ్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయినా అందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నట్లుగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడా వీడియోను వైరల్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యామాల్లో వైరల్గా మారిన వీడియో ప్రకారం.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై చేసిన విమర్శలు ఈ వీడియోలో ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పాత్రను ఎండగట్టారు. అంతకుముందు ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని కేసీఆర్ విమర్శించారు.
1956లో జవహర్లాల్ నెహ్రూ హయాంలో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపారని, ఆనాడు విద్యార్థులు, మేధావులు వ్యతిరేకించినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. అలాగే 1969 ఉద్యమంలో ఇందిరా గాంధీ "నో తెలంగాణ" అని చెప్పి ఉద్యమాన్ని అణచివేశారని, వందలాది మంది విద్యార్థులు చనిపోవడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు.
గత ప్రభుత్వాల వైఫల్యాలు..
ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ అధినేత విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి బషీర్బాగ్లో రైతులను కాల్చి చంపిన ఘటనను గుర్తుచేశారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసి, కంపల్షన్ (కచ్చితమైన పరిస్థితి) క్రియేట్ చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు.
మరోవైపు దేశంలో తెలంగాణ ప్రస్తుతం తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రగామిగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద రూ.5 కోట్లు ఇస్తున్నామని, ఇది భారతదేశంలో మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG vs Induction Cooking: మన దేశంలో చాలామంది వంటగదిలో LPG గ్యాస్ సిలిండర్నే ఉపయోగిస్తున్నారు. దాదాపుగా గ్రామాల్లో కూడా కట్టెల పొయ్యిని పక్కన పెట్టి గ్యాస్ పొయ్యిలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సిటీల్లో ఇండక్షన్ కుక్టాప్ బాగా ఫేమస్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇటీవలే ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఎప్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందనే వార్తలు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లపై డిమాండ్ భారీగా పెరిగి పోయింది. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కరెంట్ పొయ్యిలతో పోలిస్తే గ్యాస్ సిలిండర్ ఒక నెల రోజులు పనిచేస్తుంది. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.900 నుంచి రూ.1,100 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు, ఇండక్షన్ కుక్టాప్ కరెంట్తో నడుస్తుంది. కాబట్టి దీనికి కరెంట్ బిల్లు కట్టాల్సిన పని ఉంది. అయితే దీని వాడకంలో యూనిట్కు రూ.6 నుంచి రూ.9 వరకు వసూలు చేస్తున్నారు.
ఇండక్షన్ కుక్టాప్ల ప్రయోజనాలు
LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), ఇండక్షన్ కుక్టాప్ల మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం వాటి వంట సామర్థ్యంలో ఉంది. LPG స్టవ్లో, దాదాపు 50 నుండి 60 శాతం శక్తి మాత్రమే నేరుగా వంట కోసం వినియోగిస్తారు. మిగిలినది వేడిమిగా చుట్టుపక్కల వాతావరణంలోకి కలిసి పోతుంది. అయితే ఇండక్షన్ స్టవ్ అందుకు భిన్నంగా 80 నుంచి 90 శాతం వరకు వేడిని నేరుగా వంట పాత్రలపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇండక్షన్ స్టవ్లపై ఆహారం త్వరగా ఉడుకుతుందని చాలామంది అంటుంటారు. గ్యాస్ సిలిండర్తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ ఎంతో పొదుపుగా వినియోగం అవుతందని.. రోజూ వారి ఆహారాన్ని రెడీ చేసేందుకు తక్కువ సమయం తీసుకుంటుందని పలువురు భావిస్తారు.
అయినా దేశంలోని వంటగదుల్లో ఇప్పటికీ 90 శాతం గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా మంది వీటికి అలవాటు పడడం సహా ఇండక్షన్ స్టవ్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అవగాహన లేకపోవడం మరో కారణం కావచ్చు. దీంతో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది హైబ్రిడ్ కిచెన్ సెటప్లను వినియోగిస్తున్నారు. రోజువారీ వంటలకు ఇండక్షన్ స్టవ్, స్పెషల్ వంటకాలకు LPG సిలిండర్లను వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ కోతల కారణంగా LPG సిలిండర్కే ఎక్కువ మొగ్గు చూపుతారు.
ఏది డబ్బు ఆదా చేస్తుంది?
14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర దాదాపు రూ.900 నుంచి రూ.1,000 లకు మార్కెట్లో లభిస్తుంది. అయితే, ఈ సిలిండర్ సాధారణంగా ఒక నెల పాటు వినియోగానికి వస్తుంది. ఇంతలో ఇండక్షన్ స్టవ్పై వంట చేయడానికి దాదాపు 78 యూనిట్ల విద్యుత్ అవసరం. విద్యుత్ ధర యూనిట్ కు రూ.8 అయితే, ఖర్చు 78 × 8 = రూ. 624. అంటే LPG సిలిండర్ తో పోలిస్తే మనం దాదాపు రూ.289 ఆదా చేయవచ్చు.
మరోవైపు దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కొందరు PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్) ఉపయోగిస్తున్నారు. ఇది గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. అయితే, దీని ధర అంతర్జాతీయ LNG మార్కెట్తో సమానంగా ఉంది.
Also Read: Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఒకేఒక్క మహిళ? ఎవరీ ప్రియాంక రెడ్డి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook