icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Jadcherla Vaishnavi Murder: జడ్చర్ల మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్.. యువతిని హత్య చేసిన తేజ మృతి! పూర్తి వివరాలు..

Hyderabad, Telangana:

Jadcherla Vaishnavi killer Teja Dies: తనను నమ్మించి మోసం చేసిందనే ఆరోపణతో జడ్చర్లలో శనివారం వైష్ణవి(22) అనే యువతిని హైదరాబాద్‌కు చెందిన తేజ గొంతు కోసి నిన్న సాయంత్రం హత్య చేశాడు. గతంలో వీళ్లిద్దరూ హైదరాబాదులో ఒకే చోట పని చేసేవారు. ఆ పరిచయంతో ప్రేమ పేరుతో వేధించాడని సమాచారం. పోలీసుల ప్రకారం ప్రేమ పేరుతో యువతిని వేధించిన యువకుడు ఆమె గొంతు కోసి హత్య శనివారం హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. రామచంద్రయ్య, శ్రీలత దంపతుల కూతురు వైష్ణవి(22) ఓ ప్రైవేట్ కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన తేజ(28) ప్రేమ పేరుతో వెంటపడుతున్నట్లు సమాచారం. 

అయితే, తనను దూరం పెడుతూ వస్తోందనే కోపంతో తేజ శనివారం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న వైష్ణవిని కత్తితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో వైష్ణవి కింద పడిపోగా స్థానికులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు సమాచారం. హత్య చేసి తేజ పారిపోతున్న క్రమంలో స్థానికులు వెంబడించి పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి బండరాళ్లతో దాడి చేశారు. దీంతో అతడు కూడా తీవ్ర గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడ్డ తేజను చికిత్స నిమిత్తం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తేజా కూడా మృతి చెందాడు. అయితే, తనను వైష్ణవి ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిందని యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. కాగా.. నిన్న జడ్చర్లలోని నిమ్మబావి గడ్డలో వైష్ణవి అనే యువతిని హైదరాబాద్‌కు చెందిన యువకుడు హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య పరిచయమా? లేదా ప్రేమా? అసలు కారణం బయటకు రావాల్సి ఉంది. కానీ, క్షణికావేశంతో తేజ తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరు ప్రాణాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి.  రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం! రెండు కోచ్‌లకు వ్యాపించిన మంటలు

Also Read: సిటీలో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. డాక్టర్‌కే మత్తుమందిచ్చి సినీ ఫక్కీలో 60 తులాల బంగారం ఊడ్చేశారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Dhanalakshmi Rajayogam: మే 18 నుంచి ధనలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, అదృష్టం!

Hyderabad, Telangana:

Dhanalakshmi Rajayogam Effect On Zodiac: మే 18వ తేదీ నుంచి ధనలక్ష్మి రాజయోగం ప్రారంభం కాబోతోంది. మిథున రాశిలో గురు గ్రహం శుక్ర గ్రహ కలయిక కారణంగా ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది.. ఈ యోగంతో ద్వాదశరాశుల వారికి ఆశ్చర్యం కలిగించే ధన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది అన్ని శక్తివంతమైన రాజయోగాల్లో చాలా శుభ్రమైనదిగా భావిస్తారు. మే 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి వృత్తిలో పురోగతితో పాటు భారీ ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి రాజయోగ ప్రభావంతో మే 18 నుంచి కొన్ని రాశుల వారు తప్పకుండా ధనవంతులవుతారట. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి తప్పకుండా పరిష్కారం కూడా కలుగుతుంది. ముఖ్యంగా తీవ్ర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఈ సమయంలో వాటి నుంచి విముక్తి లభించి.. మానసికంగా చాలా వరకు మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పరిష్కారం లభించబోతోంది.

ఈ రాశులవారికి పండగే..
మేష రాశి 
ధనలక్ష్మి రాజయోగం కారణంగా మేషరాశి వారికి అనేక విధాలుగా అదృష్టం కలిసి రాబోతోంది.. ముఖ్యంగా కెరీర్ పరంగా పెద్ద పురోగతి లభించడమే కాకుండా ఆఫీసుల్లో పనులు సజావుగా సాగుతాయి. మీకు నచ్చిన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఈ వారం ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది. 

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలోనే ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే.. తప్పకుండా ఈ సమయంలో పూర్తవుతుంది. దీంతోపాటు కార్యాలయంలో మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే వృత్తి జీవితంలో గొప్ప పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఇంటి సంబంధిత సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తికి సంబంధించిన అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అద్భుతమైన శుభసమయంగా మారబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అనేక విధాలుగా లాభదాయకంగా ఉండబోతోంది. ఈ వారం ప్రారంభంలోనే సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితం ఎంతో లాభదాయకంగా మారబోతోంది. కొత్త కోరికలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు తమ పనులన్నీ సమయానికి పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Venus Transit 2026: పునర్వాసు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశుల వారికి లక్కీ లాటరీ తగిలినట్లే!

Hyderabad, Telangana:

Venus Transit In Punarvasu Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే శుక్ర గ్రహాన్ని అత్యంత శుభగ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా శక్తివంతమైనవి, శుభప్రదమైనవిగా భావిస్తారు. ఇదిలా ఉంటే శుక్రుడు, గురు గ్రహానికి సంబంధించిన పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రాన్ని కూడా చాలా శుభప్రదమైనదిగా జ్యోతిష్యులు చెబుతున్నారు.. మే 31వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో సంతోషం శ్రేయస్సు ప్రేమ సంపదకు కారకుడైన శుక్రుడు పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో భారీ మొత్తంలో డబ్బులు వించబోతోంది అలాగే ప్రేమ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం పొంది అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి ఊహించని జాక్పాట్..
మిథున రాశి 
పునర్వాసు నక్షత్రంలో శుక్రుడి సంచారం మిధున రాశి వారికి గొప్ప గొప్ప ఫలితాలను అందించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వృత్తి జీవితం ఇప్పుడు సానుకూలంగా మారుతుంది. మీరు మీ భవిష్యత్తు గురించి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయాన్ని కూడా గడుపుతారు. సమస్యలన్నీ ఈ సమయంలో సులభంగా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రుడి నక్షత్రం మార్పు కారణంగా వృత్తి జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. ఈ సమయంలో డబ్బు కూడా విపరీతంగా ఆదా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా జీవితంలో శాంతి నెలకొంటుంది. అలాగే ప్రేమ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్న వివాదాలు కూడా చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పురోగతి లభించడమే కాకుండా పెద్ద మొత్తంలో ప్రమోషన్స్ లభిస్తాయి.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచార ప్రభావంతో స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోంది. వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం సంపూర్ణంగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో సంబంధాలు మరింత మెరుగుపడి అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గౌరవం పెరగడమే కాకుండా వృత్తిపరంగా గొప్ప గొప్ప అవకాశాలు లభించవచ్చు. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులు మీకు అనుకూలంగా మారి వారి ద్వారా అద్భుతమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు..

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి జీవితం లాభదాయకంగా మారుతుంది. ప్రేమ సంబంధాలు సజావుగా సాగడమే కాకుండా ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం  అంచలంచెలుగా పెరగడంతో ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా లభిస్తాయి. వీరు ఈ సమయంలో ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Tirumala: టీటీడీ సంచలన ప్రకటన.. శ్రీవాణి టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలపై క్లారిటీ, ఆ వార్తలన్నీ అబద్ధం!

Hyderabad, Telangana:

TTD Strongly Condemns Allegations Against Srivari Ttickets Booking System: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం దేశ నలుమూలలే కాదు ప్రపంచ స్థాయిగా భక్తులు శ్రీవారి దర్శన నిమిత్తం వస్తారు. అయితే శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శన టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ టికెట్లు కేవలం ఒక్క నిమిషంలోనే మాయం చేస్తుంది. కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే టీటీడీ దీనికి సంబంధించి తాజాగా స్పందించింది. ఆన్‌లైన్ విధానాన్ని ఎలా అమలు చేస్తున్నారో వివరించింది.

ముందు యాక్సెస్‌ చేసేవారికే ముందు టిక్కెట్లు..
2019 మే నెలలో టీసీఎస్ సహకారంతో ప్రారంభించిన ఈ శ్రీవాణి ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపింది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆఫ్ లైన్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు కూడా జారీ చేయడానికి కూడా మార్పు చేశామంది. ఎవరైతే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ముందుగా యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వచ్చే విధంగా సాఫ్ట్‌వేర్ తయారు చేశామన్నారు. కేవలం ఒకటిన్నర నిమిషంలో ముందు వచ్చిన వారికే టికెట్ లాక్ అవుతూ ఉందని చెప్పారు. తదుపరి పేమెంట్ గేట్ వే విజయవంతంగా డబ్బులు చెల్లించిన వారికే టికెట్లు జారీ చేస్తున్నామన్నారు. చెల్లింపు జరగని సమయంలో టికెట్లను తిరిగి పూల్‌లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇందులో మానవ ప్రమేయం లేదు, సిస్టం ఆటోమేటిక్‌గా పనిచేస్తుందన్నారు.

2019 టీసీఎస్ సాఫ్ట్‌వేర్లు మాత్రమే తాము వినియోగిస్తున్నాం, ఇప్పటికీ కొత్త సాఫ్ట్‌వేర్ రాలేదు, ఎప్పటికప్పుడు భక్తుల నుండి వచ్చే సలహాలు, సూచనలు తీసుకొని మరి మార్పు చేస్తున్నామన్నారు. ఇక పది నిమిషాల తర్వాత టికెట్ల జారీ చేయడం వాస్తవమే పేమెంట్ వద్ద చెల్లింపు సమయంలో సాంకేతిక లోపం వల్ల టీటీడీకి డబ్బు జమ అయినట్లు మెసేజ్ రాకుంటే వెంటనే ఆ టికెట్లను ఫూల్ లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

అంతేకాదు  జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారని చెప్పడం విరుద్ధం, ఎంటెక్, ఎంఎస్‌లో వీరికి ఇన్ఫర్మేషన్ సిస్టం, కంప్యూటర్ సైన్స్ అర్హత, 32 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని జీఎంఐటి ఎఫ్ఎసిగా నియమించడం జరిగిందన్నారు. అంతేకాదు భక్తుల సౌకర్యం టీటీడీ ఆటో ఫిల్లింగ్, కాపీ పేస్ట్ ప్రక్రియ విధానాలను పూర్తిగా రద్దు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూన్నారు. సిస్టం ఆడిట్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తుందన్నారు.

తిరుమల ఆగస్టు నెల కోట దర్శనం వివరాలు..
రేపటి నుంచి ఆగస్టు నెల కోట ప్రత్యేక దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు. సుప్రభాతం, తోమాల అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి రేపు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్లో టికెట్లు విక్రయిస్తారు. ఇక లక్కీ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరు అవుతాయి.

Read more: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆగస్టు నెల దర్శన టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది, ఏ రోజు ఏ కోటా అంటే?

Read more: తిరుమల మాడవీధులను ఇకపై ఈ పేర్లతో పిలుస్తారు.. టీటీటీ కీలక నిర్ణయం..

 మే 21వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజాల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక వర్చువల్ సేవ కోటా స్లాట్ లో కూడా మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్ల కోటను ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. శ్రీవారు ట్రస్టు దర్శన టోకెన్లు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు కూడా విడుదల చేస్తారు.

ఇక మే 25వ తేదీన తిరుమల ప్రత్యేక దర్శనం రూ. 300 టికెట్లు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతాలలో గదుల కోటను కూడా విడుదల చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి అర్చిత సేవలు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
0
Report

MP Lavu Krishna Devarayalu: ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మంచి మనసు..ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచిత చదువుకు హామీ!

Narasaraopeta, Andhra Pradesh:

MP Lavu Krishna Devarayalu Latest News: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్నదే తమ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా ఎస్టీ విద్యార్థులకు నరసరావుపేటలోని ఎస్.ఎస్.ఎన్ (SSN) కళాశాలలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఎస్టీ ప్రతిభావంతులను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌లో 600 పైబడి మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీటు కల్పించి, ఉచిత విద్యను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల చదువులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి రాకూడదని, ధైర్యంగా పైచదువులకు పంపాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. అందులో ఏకంగా 287 మంది (83% పైగా) ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులకు, రాత్రింబవళ్లు కష్టపడి వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కనీసం డిగ్రీ వరకు చదివించాలి.. 
ఎస్టీ కుటుంబాల నుంచి ఒక్కో గ్రామానికి కనీసం నలుగురు చొప్పున చదువుకొని ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలన్నదే తమ కోరికని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆకాంక్షించారు. వారిని చూసి గ్రామంలోని మరో పది మంది స్ఫూర్తి పొంది చదువుకుంటారని చెప్పారు. ఎస్టీ విద్యార్థులు కనీసం డిగ్రీ వరకైనా పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సులువవుతుందని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదే వేదికపై నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని స్థానిక ఉపాధ్యాయులు.. ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేటలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.

Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంపు?

Also Read: ఏపీలో అతిపెద్ద బంగారు గనీ..తవ్వేకొద్ది వచ్చి పడుతున్న బంగారం..సీఎం కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Peddi Chiru Leaks: 'పెద్ది' మూవీ ట్రైలర్‌పై చిరూ లీక్స్..వీడియో చూసి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..డైరెక్టర్‌కి క్షమాపణ!

Hyderabad, Telangana:

Peddi Trailer Chiru Leaks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన 'చిరు లీక్స్'తో హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. మే 18న ముంబైలో ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. అయితే, అంతకంటే ముందే ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకోవడమే కాకుండా, ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను కూడా లీక్ చేశారు.

'పెద్ది' ట్రైలర్ చూసిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన ఎక్సైట్‌మెంట్‌ను ఆయన పెట్టిన పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. "పెద్ది ట్రైలర్ చూసాను! జస్ట్ వావ్..అంతే. 3 నిమిషాలు… ప్యూర్ ఫైర్‌ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్.. అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి" అని 'పెద్ది' టీమ్‌పై ప్రశంసల వర్షం కురింపించారు.

అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి వివరిస్తూనే.. ఓ డైలాగ్‌ను మెగాస్టార్ చిరంజీవి లీక్ చేశారు. చిరూ లీక్స్‌కు పని చెప్పి చాలా రోజులు అవుతుందని చిరంజీవి చమత్కరించారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ 'పెద్ది' ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. 
Chiru leaks peddi trailer

"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..." అనే డైలాగ్‌ లీక్ చేసి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని మరింత పెంచారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌లోని డైలాగ్ లీక్ చేయడం వల్ల 'పెద్ది' సినిమా డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి సారీ చెప్పారు. "Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ 'పెద్ది' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఇందులో కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మే 18న సినిమా ట్రైలర్ విడుదల చేయనుండగా.. జూన్ 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Also Read: టాలీవుడ్ నిర్మాతతో గొడవ పెట్టుకున్న త్రిష..సినిమాలో హీరోయిన్‌గా తీసుకోలేదని రచ్చ!

Also Read: విజయ్ నుంచి హన్సిక వరకు..విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు వీళ్లే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Monsoon Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు..రాష్ట్రంలో వర్షాలు కురిసేది అప్పటి నుంచే..

Ram Krishna Pur, Andaman and Nicobar Islands:

Southwest Monsoon Update: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. దీనితో దేశంలో వర్షాల సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. అయితే మన తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చేరేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు అండమాన్, నికోబార్ దీవుల్లోని మెజారిటీ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోనూ ఇవి ప్రవేశించాయి. మరో 3-4 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.

మే చివర్లో కేరళలోకి ఎంట్రీ!
సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈసారి వాతావరణ మార్పుల వల్ల అంతకంటే ముందే భారత్‌ను పలకరించబోతున్నాయి. ఈ ఏడాది మే 26 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తేదీకి ఒక నాలుగు రోజులు అటుఇటుగా (మే చివరి వారంలో) ఎప్పుడైనా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు రాక ఎప్పుడు?
కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత సాధారణంగా దేశమంతటా విస్తరించడానికి సమయం పడుతుంది. కేరళను తాకిన దాదాపు 7 నుండి 10 రోజుల్లో రుతుపవనాలలోని రాయలసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈసారి మే నెలాఖరులోనే కేరళకు వస్తే, జూన్ మొదటి వారంలోనే ఏపీలో తొలి రుతుపవన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో ప్రవేశించిన కొద్దిరోజులకే తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. సెప్టెంబర్ వరకు ఈ వర్షాల కాల సీజన్ అలాగే కొనసాగుతుంది.

గత ఏడాది కూడా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల కారణంగా సాధారణ సమయం కంటే 8 రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత అంత త్వరగా నైరుతి రుతుపవనాలు రావడం గత ఏడాదే కావడం విశేషం.

వాతావరణ శాఖ నుంచి చల్లటి సమాచారం రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు రుతుపవనాలు తోడ్పతాయి. దీంతో రుతుపవనాల రాక కోసం తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంపు?

Also Read: ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

KKR Vs GT Prediction: గుజరాత్‌ టీమ్‌కు గోల్డెన్ ఛాన్స్..గెలిస్తే అగ్రస్థానానికి, కోల్‌కతా ట్విస్ట్ ఇస్తుందా?

Kolkata, West Bengal:

KKR Vs GT Prediction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే నేడు జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తప్పక గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతా‌లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్, కోలకతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ప్లేఆఫ్స్ రేసులో చిన్న అవకాశం కోసం కేకేఆర్ చూస్తుండగా.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని గుజరాత్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ సునీల్ నరైన్‌కు ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 200 మ్యాచ్ ఘనతను సాధిస్తాడు. 

ఐపీఎల్ గణాంకాల ప్రకారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే అది ఇతర టీమ్స్ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 11 మ్యాచ్‌ల నుండి 9 పాయింట్లతో ఉన్న కేకేఆర్, తమ మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిస్తే 15 పాయింట్లకు చేరుకోగలదు. ఒకవేళ ఏ టీమ్ 16 పాయింట్లను సాధించడం విఫలమైతే నాలుగో స్థానానికి కేకేఆర్ అధికారికంగా చేరుతుంది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆడే అవకాశం దక్కుతుంది. ఈ క్రమంలో మిగిలిన జట్లేవి 16 పాయింట్ల సాధించకపోతే కేకేఆర్ జట్టుకు ఛాన్స్ వస్తుంది. 

మరోవైపు, గుజరాత్ వాస్తవంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. వారు ఇప్పటికే 12 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో సాధించగా.. మరో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో అడుగుపెట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఐపీఎల్‌ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఇప్పటికీ 6 సార్లు తలపడ్డాయి. వీటిలో గుజరాత్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. కోల్‌కతా కేవలం ఒకే మ్యాచ్‌లో గెలుపొందడం గమనార్హం. ఈ గణాంకాలను చూస్తే గుజరాత్ టైటాన్స్ జట్టు కేకేఆర్‌పై పైచేయి సాధించింది. కానీ, ప్రస్తుత సీజన్‌ ఆరంభంలో కేకేఆర్ తడబడినా.. తాజాగా జరిగిన మ్యాచ్‌ల్లో రాణిస్తుంది. 

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు అంచనా..
ఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగక్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. (ఇంపాక్ట్ ప్లేయర్: సౌరభ్ దూబే).

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కాగిసో రబాడా, మహ్మద్ సిరాజ్. (ఇంపాక్ట్ ప్లేయర్: ప్రసిద్ కృష్ణ).

Also Read: పెళ్లిపీటలు ఎక్కనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్..ప్రేయసితో పెళ్లికి పాండ్యా రెడీ..

Also Read: హైదరాబాద్ Vs బెంగళూరు మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో ఖాళీ..ధరలు భారీగా పెంపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Thalliki Vandanam: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంచుతామన్న సీఎం!

Narasannapeta, Andhra Pradesh:

Thalliki Vandanam Amount: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో పాటు తల్లికి వందనం పథకం గురించి ఓ కీలక ప్రకటన చేశారు. 

'స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. "రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి. 'స్వచ్ఛాంధ్ర'తో ప్రారంభించి, 2047 నాటికి 'స్వర్ణాంధ్ర' సాధించడమే మన లక్ష్యం" అని పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

తాను ఎక్కడ ఉన్నా పేదల సేవ గురించే ఆలోచిస్తానని.. ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా, గౌరవప్రదంగా అర్హులకు పింఛన్లు అందుతున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు.

'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
గతంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న 'తల్లికి వందనం' పథకంపై సీఎం చంద్రబాబు నరసన్నపేట వేదికగా మరికొన్ని కీలక మార్గదర్శకాలను, ఆలోచనలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రతి పాఠశాల విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే, ఈ రూ.15,000 సాయాన్ని ఇంకా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం సంచలన ప్రకటన చేశారు.

అదే విధంగా పిల్లలను కనిపెంచాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బిడ్డలు ఆస్తి కానీ భారం కాదని ఆయన అన్నారు. ఈ క్రమంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించిన సీఎం.. మూడో బిడ్డ పుడితే రూ.30,000.. నాలుగో బిడ్డకు రూ.40,000 అందజేస్తామని ఆయన ప్రకటించారు. 

Also Read: ఏపీలో అతిపెద్ద బంగారు గనీ..తవ్వేకొద్ది వచ్చి పడుతున్న బంగారం..సీఎం కీలక ప్రకటన!

Also Read: రూ.15,803 కోట్లతో పుట్టపర్తిలో డిఫెన్స్ పెట్టుబడి..ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంఖుస్థాప

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cobra Video: కింగ్ కోబ్రా పడగపై ముట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌.. చివరికి ఏం జరిగింది? వీడియో..

Hyderabad, Telangana:

 King Cobra Hood Video Watch Now: కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్.. మరోసారి అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములను పట్టడంలో తనదైన శైలిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఓ ఇంట్లో చొరబడిన భారీ కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో షాక్కు గురవుతున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియో వివరాల ప్రకారం.. ఒక నివాస గృహంలోకి సుమారు 7 నుంచి 8 అడుగుల పొడవున్న అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా చొరబడింది. సమాచారం అందుకున్న వావా సురేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా.. కేవలం చేతులతోనే ఆ పామును పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో పాము పడకపై చేయి వేసి అదుపు చేస్తుండగా.. ఆ కింగ్ కోబ్రా ఒక్కసారిగా కోపంతో సురేష్ పైకి దూసుకు వచ్చింది.. అత్యంత వేగంగా దాడి చేసేందుకు ప్రయత్నించిన ఆ సర్పం నుంచి ఆయన ఎంతో చాకచక్యంగా.. అన్ని సెకండ్ల పరిధిలోనే పక్కకు తప్పుకున్నారు. కొద్దిగా అటు ఇటు అయినా ఆయన ప్రాణాలకే ముప్పు వాటి లేదని వీడియో చూస్తే అర్థమవుతూ వస్తోంది.

ఈ వీడియో గతంలో ఎప్పటిదో అయినప్పటికీ.. ఎవరో కావాలనే ఇప్పుడు పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్ తో పాటు షేర్లతో వైరల్ గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు సురేష్ ధైర్యాన్ని మెచ్చుకున్నప్పటికీ.. అంతటి ప్రమాదకరమైన పాములతో వ్యవహరించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గతంలో కూడా వావా సురేష్ పలుమార్లు పాముకాటుకు గురై.. మృత్యు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారని ఎన్నో వార్తలు వచ్చాయి.

 
 
 
 
 

ఈ వీడియో చూసిన వన్యప్రాణి నిపుణులు సైతం స్పందిస్తూ వస్తున్నారు. కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములను పట్టుకునేటప్పుడు స్నేక్ ఉక్స్, చేతి తొడుగులు వంటి రక్షణ పరికరాలను తప్పకుండా వాడాలని.. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని వారి అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ కింగ్ కోబ్రా వర్సెస్ సురేష్ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

  

0
0
Report
Advertisement

Cobra Video: బుల్లెట్ బైక్‌లో దూరిన నాగుపాము.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం!

Hyderabad, Telangana:

 Cobra In Bullet Bike Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వింత విశేషాలు వైరల్ అవుతాయో ఊహించడం చాలా కష్టం. తాజాగా బైక్‌లో దర్శనమిచ్చిన అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక బుల్లెట్ మోటార్ సైకిల్‌లో భారీ నాగుపాము దూరిన ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చినీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

సాధారణంగా వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేసినప్పుడు సీట్ల కిందనో.. ఇంజన్ భాగంలోనో చిన్నపాటి జీవులు చేరడం చూస్తూ ఉంటాం.. కానీ ఇక్కడ ఏకంగా అత్యంత విషపూరితమైన నాగుపాము బుల్లెట్ బండిని తన నివాసంగా మార్చుకుంది.. రోడ్డుపై నిలిపించిన ఆ బుల్లెట్ మోటార్ సైకిల్‌లో నాగుపాము అటు ఇటు కదులుతూ ఉన్న దృశ్యాలను అటుగా వెళుతున్న కొందరు గమనించారు. మొదట అది ఏదో వైర్ అనుకోని పొరపాటు పడినప్పటికీ.. అది కదలడం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు.. పాము చూసి భయాందోళనతో బైకుకు దూరంగా ఉండిపోయారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

విషయం క్షణాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో ఆ బుల్లెట్ బండిలో ఉన్న పాములు చూసేందుకు జనం భారీగా గుమ్మికూడడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. స్థానిక స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే వార అక్కడికి తమకు కావాల్సిన పరికరాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు..

 
 
 
 
 

బైక్ వెనక సీటు కింద నాగుపాము గట్టిగా చుట్టుకొని పడుకోవడంతో దానిని బయటికి తీయడం రెస్క్యూటివ్‌కు పెద్ద సవాలుగా మారింది. పాముకు ఎటువంటి గాయం కాకుండా అలాగే అక్కడ ఉన్నవారికి ప్రమాదం జరగకుండా స్నేక్ క్యాచర్స్ ఎంతో చాకచక్యంగా.. అరగంట పాటు శ్రమించి కష్టపడి మరి ఆ నాగుపాముని సురక్షితంగా బయటికి తీశారు. అలా బయటికి తీసిన నాగుపామును ఒక ప్లాస్టిక్ సంచిలో బంధించి సురక్షితమైన ప్రదేశంలో తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే.. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

  

0
0
Report

Kaleshwaram: కాళేశ్వరంలో కాకతీయుల శిల్పకళా వైభవం.. రూ.1.20 కోట్లతో అత్యాధునిక మ్యూజియం!

Hyderabad, Telangana:

Kaleshwaram Museum Latest Telugu News: ప్రముఖ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాలేశ్వరంలో కాకతీయుల కాలం నాటి అరుదైన పురాతన విగ్రహాలతో పాటు అద్భుతమైన శిల్ప సంపదను భద్రపరిచేందుకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.. ఇందులో భాగంగా ఒకటి పాయింట్ 20 కోట్ల భారీ వ్యాయామంతో ఒక ప్రతిష్టాత్మక మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో లభించిన, శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక కళాఖండాలను భక్తులతో పాటు పర్యాటకులు ఒకే చోట వీక్షించేలా ఈ అత్యాధునిక మ్యూజియంలో తీర్చిదిద్దుతున్నారు. 

కాలేశ్వర పరిసర ప్రాంతాల్లో గతంలో జరిగిన తవ్వకాలతో పాటు ఆలయ పునర్నిర్మాణ సమయాల్లో కాకతీయ శిల్పాకళా వైభవానికి ప్రతీకంగా భావించే అనేక విగ్రహాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. కాలగర్భంలో కలిసిపోకుండా వీటిని సంరక్షించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యూజియంలో విగ్రహాలను ప్రదర్శించడమే కాకుండా.. వాటి చరిత్రక నేపథ్యంతో పాటు కాలం, ప్రాముఖ్యతను వివరించే డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పరిశోధనలకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన జ్ఞాన వేదికగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు..

త్వరలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్న సరస్వతీ నది పుష్కరాల నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుష్కరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది భక్తులు కాళేశ్వర క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉండడంతో.. వారందరికీ తెలంగాణ ప్రాచీన సాంస్కృతితో పాటు కాకతీయుల కళా నైపుణ్యాన్ని పరిచయం చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం..

Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

ప్రస్తుతం సివిల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.. ఇంటీరియల్ తో పాటు లైటింగ్ వ్యవస్థ, విగ్రహాల అమరిక కోసం ప్రత్యేక నిపుణుల బృందం పర్యావేక్షిస్తోంది. కాలేశ్వరం వచ్చి భక్తులకు ముక్తేశ్వరుని దర్శనంతో పాటు మన పూర్వీకుల శిల్పకళా నైపుణ్యాన్ని చూపించాలన్నదే మా లక్ష్యం అని అధికారులు తెలుపుతున్నారు. పుష్కర ఘాట్లకు సమీపంలోనే ఈ మ్యూజియం నిర్మిస్తున్నామని.. పనులను నిరంతరం పర్యావేక్షిస్తూ గడువులోగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.. ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే కాలేశ్వరం ఆధ్యాత్మిక, పర్యాటక రంగంలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 - https://apple.co/3loQYe ఆపిల్ లింక్..

0
0
Report

Snake Attract Plants: ఇంట్లో ఈ చెట్లు ఉంటే పాముల ఎక్కడ ఉన్నా వచ్చేస్తాయి..పాములకు విపరీతంగా నచ్చే మొక్కలు!

Hyderabad, Telangana:

Plants Attract Snakes: మన ఇంటి పెరట్లోని పచ్చని చెట్లు, మొక్కలు ఇళ్లకు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. అవి మనుషులకు మనశ్శాంతిని కలిస్తాయి. ఉదయాన్నే వికసించే పువ్వుల సువాసన, పచ్చని ఆకుల గుండా వీచే గాలి మనలోని ఒత్తిడిని, మనసులో ఆందోళనను తగ్గిస్తాయి. మనం ఎంతో ప్రేమతో పెంచే కొన్ని మొక్కలు మనకు మాత్రమే కాకుండా భూమిపై ఉన్న ఇతర జీవులకు కూడా ఆకర్షిస్తాయి. వాటి సువాసనతో జీవాలు వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని రకాల పువ్వులు, దట్టమైన పొదల నుండి వెలువడే సువాసన అయస్కాంతంలా పాములను ఆకర్షిస్తుంది. అయితే ఎలాంటి మొక్కలు, పువ్వులు ఇంట్లోకి పాములను ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గున్నెరా చెట్లు గొడుగు ఆకారంలో విశాలంగా పెరుగుతాయి. ఇవి గుబురుగా పెరగడం వల్ల వాటి కింద నీడ ఎక్కువగా ఉండడం సహా ఆ చెట్ల కింద ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో నేల చల్లగా ఉన్నప్పుడు పాములు విశ్రాంతి తీసుకునేందుకు వీలు ఉండదు. కానీ, గున్నెరా పువ్వుల దగ్గర వచ్చే కీటకాలు, తేనటీగలు, కప్పలు, బల్లులను పాములు వేటాడి తింటాయి. అందుకోసం పాములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే మనుషుల సంచారం తక్కువగా ఉన్న చోట పాములు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి.

మల్లెపువ్వుల సువాసన పాములను ఎక్కువగా ఆకర్షిస్తుంది. మల్లె పువ్వులు ప్రధానంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వికసించి వాటి సువాసనను గుబాళింపజేస్తాయి. అదే సమయంలో, పాములు కూడా ఆహారం కోసం బయటకు వస్తాయి. అందువల్ల, మల్లె పూల పొదలలో పాములు తరచుగా కనిపిస్తాయని కొందరు చెప్పే మాటల్లో లేదా మీరే స్వయంగా చూసే ఉంటారు. ఈ తీగల తేమ, చల్లదనం కూడా పాములను ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, మల్లె పూల పొదలు దట్టంగా ఉంటాయి. ఇది కూడా పాములు అక్కడ ఉండేందుకు ఇష్టపడతాయి. 

గంధపు చెట్లు సహజంగా చాలా చల్లగా ఉంటాయి. శీతల రక్త జీవులైన పాములు, తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి ఈ చెట్ల వద్దకు వస్తాయి. గంధపు చెట్టు నుండి వెలువడే గంధపు వాసన పాములను ఆకర్షిస్తుంది. గంధపు మొక్కలు పెరిగే ప్రాంతం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఇది పాములకు చాలా అనువైనది. గంధపు చెట్టు బెరడు మరియు దాని చుట్టూ ఉండే దట్టమైన ఆకులు, పాములు పగటిపూట నిద్రపోవడం సహా శత్రువుల నుండి దాక్కోవడానికి అనువుగా ఉంటాయి.

తీగల మొక్కలు గోడల మీద లేదా నేల మీద చాలా దట్టంగా పెరుగుతాయి. ఆ తీగలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. పాములు ఈ దట్టమైన తీగల మధ్య కొరకగలవు. అంతేకాకుండా, ఈ తీగలు నేలపై సూర్యరశ్మి పడకుండా అడ్డుకుంటాయి, దీనివల్ల లోపల ఎప్పుడూ తేమగా, చల్లగా ఉంటుంది. ఇది పాములను ఆకర్షిస్తుంది. చిన్న కీటకాలు, బల్లులు, ఎలుకలు ఈ ఐవీ పొదల మధ్య నివసిస్తాయి. పాములు వాటిని వేటాడటానికి వస్తాయి. కాబట్టి, ఇలాంటి మొక్కలను ఇంటి చుట్టుపక్కల పెంచడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని.

Also Read: Carrot Juice: ఎండల్లో క్యారెట్ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్యానికి అమృతమే!

Also Read: Grapes Juice: వేసవిలో రోజూ ద్రాక్ష జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top