icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Transgenders: ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఉస్మానియాలో ఉచితంగా లింగ మార్పిడి సర్జరీలు!

Hyderabad, Telangana:

Telangana Govt Telugu Latest News: సమాజంలో తీవ్ర వివక్షకు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక, మానవయ్య నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ట్రాన్స్ జెండర్లకు లింగమార్పిడి చికిత్స పూర్తిగా ఉచితంగా అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కీలకమైన కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఉచితంగా శస్త్రచికిత్స..
సాధారణంగా లింగ మార్పిడి ప్రక్రియ అనేది సుదీర్ఘమైనది, అత్యంత ఖరీదైనది.. దీనికోసం నిర్వహించే హార్మోనల్ తెరపి తో పాటు SRS సర్జరీలకు ఖర్చులను సాధారణ ప్రజలు భరించడం దాదాపు అసాధ్యం.. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఈ చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి ప్రత్యేక లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా అర్హులైన ట్రాన్స్ జెండర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్సలతో పాటు మందులు అందుతాయి..

కార్పొరేట్ స్థాయి వైద్యం..
ప్రస్తుతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ తరహా లింగమార్పిడి సర్జరీలకు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించలేక.. సరైన వైద్య సదుపాయాలు లేని చోట తక్కువ ఖర్చులతో సర్జరీలు చేయించుకొని ఎంతోమంది ట్రాన్స్ జెండర్లు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గించి.. వారికి అధునాతన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిరుపేద ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వం పెద్ద అండగా నిలిచింది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

ప్లాస్టిక్ సర్జరీలు కూడా..
ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటికే ట్రాన్స్ జెండర్‌ల కోసం ప్రత్యేకమైన క్లినిక్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ ఉచిత సర్జరీల నిర్ణయంతో ప్లాస్టిక్ సర్జరీలతో పాటు ఎండోక్రినాలజీ, సైకియాట్రీ, గైనకాలజీ విభాగాల నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆధ్యాధునిక శాస్త్ర చికిత్సలు జరగబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ అద్భుతమైన నిర్ణయంపై ట్రాన్స్ జెండర్ హక్కుల సంఘాలతో పాటు సామాజిక విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తాము గౌరవంగా బ్రతకడానికి ఇదొక గొప్ప అవకాశం అని వారు  కొనియాడుతున్నట్లు తెలుస్తోంది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
0
Report

Ts Police Recruitment: తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర.. త్వరలోనే 5,000 పోస్టులతో తొలి విడత నోటిఫికేషన్!

Hyderabad, Telangana:

Ts Police Recruitment Latest News: తెలంగాణలో కొలువుల వేటలో ఉన్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖను మరింత బలోపేతం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా భారీ భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 19వేల కంటే ఎక్కువ పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా తొలి విడత సుమారు 5000 పోస్టుల భర్తీకి అడుగులు పడుతున్నాయి..

ఐదు వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..
మొదటి విడత కింద భర్తీ చేయబోతున్న ఐదు వేల కానిస్టేబుల్‌తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన సమగ్ర నివేదికను పోలీస్ నియామక బోర్డు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారికంగా ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం.. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు ద్వారా ఉద్యోగ ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది..

సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి.. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతను ప్రతిష్ట చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను, అలాగే ఈగల్ ఫోర్స్ ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా ఎంపికయ్యే అభ్యర్థులకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు టెక్నికల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నట్లు సమాచారం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్..
గత కొంతకాలంగా నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ఈ వార్త పెద్ద ఊరటన ఇస్తోంది.. నోటిఫికేషన్ వెలుపడే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులు అప్పుడే కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.. అంతేకాకుండా తమ శారీరక, రాత పరీక్షల సాధనను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రావడంతో పాటు వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేయడం ఖాయమని కనిపిస్తోంది.. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Saraswati Yoga 2026: మిథున రాశిలో సరస్వతి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, కుబేరులవ్వడం ఖాయం!

Hyderabad, Telangana:

Rare Saraswati Yoga 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలతో పాటు వాటి సంయోగాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. మే నెల చివరి వారంలో చాలా అరుదైన శుభప్రదమైన కొన్ని గ్రహాల సంచారం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని గ్రహాలు కదలికలు కూడా చేస్తాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే మే 29వ తేదీన బుద్ధితో పాటు వాక్కుకు అధిపతిగా భావించే భూతగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించింది. అలాగే  శుక్రుడితో పాటు గురుడు ఇప్పటికే  మిథున రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి. ఫలితంగా మే 29న మిథున రాశిలో బుధుడు కూడా సంచారం చేయడంతో మూడు గ్రహాలు కలయిక జరిగింది. ఈ సంచార కలయికనే సరస్వతి యోగాన్ని ఏర్పాటు చేసిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా వేరవేరబోతున్నాయి.

సరస్వతి యోగం అంటే ఏమిటి? 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్ఞానానికి అధిపతి అయిన గురుడితో పాటు బుద్ధికి అధిపతి అయిన బుధుడు.. సృజనాత్మకత కళకు సూచికగా చెప్పుకునే.. శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఎంతో శక్తివంతమైన ఈ సరస్వతి యోగం ఏర్పడుతుంది.. ఈ యోగం జ్ఞానంతో పాటు విద్యా, కళా, సంగీతం, రచన సమాచార రంగాల్లో ఉన్న వారికి ఒక వరంలా మారుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా మెరుగుపడడమే కాకుండా ఎప్పుడు పొందలేదు జ్ఞానాన్ని కూడా సొంతం చేసుకుంటారు. 

వృషభ రాశి 
ఈ గ్రహల సంయోగంతో వృషభ రాశి వారికి రెండవ స్థానంలో సరస్వతి యోగం ఏర్పడడం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలపరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది.. అంతే కాకుండా డబ్బు సంపాదించడంతో పాటు పొదుపు చేయడంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.. వీరు ఆకస్మికంగా గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు పూర్వీకుల ఆస్తుల నుంచి వారసత్వంగా భూములు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల్లో బలమైన ఆకర్షణ కూడా పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలతో పాటు అసంపూర్తిగా ఉన్న పనుల్లో త్వరగా విజయాలు సాధించగలుగుతారు.

మిథున రాశి 
మిధున రాశి వారికి ఈ గ్రహాల సంయోగంతో విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవం లభించడమే కాకుండా వ్యక్తిత్వ వికాసం విపరీతంగా పెరుగుతుంది. పనుల్లో అద్భుతమైన ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాతో పాటు మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే రచన రంగాల్లో పనులు చేసే వారికి కూడా గణనీయమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహరాశి 
సింహరాశి వారికి 11వ స్థానంలో సరస్వతి యోగం ఏర్పడడం కారణంగా కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే వీరు కొత్త శాశ్వతమైన ఆదాయ మార్గాలు కూడా పొందగలుగుతారు. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ల నుంచి డబ్బులు పొందడమే కాకుండా స్నేహపూర్వకమైన సంబంధాలు పొందగలుగుతారు. అలాగే కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కూడా జరుగుతాయి.

కన్య రాశి 
కన్యా రాశి వారికి పదవ స్థానంలో సరస్వతి యోగం ఏర్పడడం కారణంగా వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో ఎంతో మేలు జరుగుతుంది.. ముఖ్యంగా వీరికి కోరుకున్న కోరికలు చాలా కాలం తర్వాత నెరవేరబోతున్నాయి.. పనుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి.. దీంతో పాటు అధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు లభించి విశేషమైన ధన లాభాలు పొందుతారు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు ఖరారు కావడమే కాకుండా వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Vaibhav Suryavanshi: ఆరెంజ్ క్యాప్‎తో కన్నీళ్లు దాచుకుంటూ...గ్రౌండ్‌లోనే వెక్కివెక్కి ఏడ్చిన వైభవ్.. గుండెల్ని పిండేస్తున్న సీన్ ఇది..!!

BBhoomi4h ago
Lakshmapur, Telangana:

Vaibhav Suryavanshi: మే 29వ తేదీ శుక్రవారం ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్ లో ఆ జట్టు ఐపీఎల్ జర్నీ అత్యంత బాధాకరంగా ముగిసిందనే చెప్పాలి. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలుకా బాధ 15ఏండ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో కనిపించింది. గుజరాత్ విజయం ఖరరాైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డకౌట్ లో ఒంటరిగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు. తనలో తాను బాధను దిగమింగుకున్నాడు. మొదట తన ఆరెంజ్ క్యాప్ తో కన్నీళ్లు దాచుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఓటమిని తట్టుకోలేక ముఖానికి టవల్ అడ్డుపెట్టుకుని బోరున విలపించాడు. ఈ ఒత్తిడితో కూడిన నాకౌట్ మ్యాచులోనూ ఈ చిన్నోడు అద్బుత ఇన్నింగ్స్ ఆడినా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. 

ఎస్ఆర్ హెచ్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 97 పరుగులతో చెలరేగిపోయిన వైభవ్.. గుజరాత్ తో జరిగిన ఈ మ్యాచులోనూ అదే జోరును కొనసాగించాడు. భయం లేని బ్యాటింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి.. తీవ్ర ఇబ్బందుల్లో పడ్డా... ఈ బుడతడి సంచలనం ఎదురుదాడికి దిగి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఒకానొక దశలో రాజస్థాన్ తక్కువ పరుగులకే కుప్పకూలినట్లు కనిపించినా.. వైభవ్ మిడిల్ ఓవర్ లో గేర్ మార్చాడు. ఓవైపు వికెట్లు పడుతును్నా.. ఏమాత్రం భయపడకుండా సంయమానం పాటించాడు. గుజరాత్ బౌలింగ్ అటాన్ కు తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాడు. 18 ఓవర్ లో కాగిసో రబడా వేసిన షార్ట్ డెలివరీకి వైభవ్ వెనుతిరిగాడు. 

Also Read: RBI Polymer Notes: త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ

కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు  చేసి పెవిలియన్ బాట పట్టాడు. వైభవ్ ఆడిన చివరి నాలుగు ఐపీఎల్ ఇన్నింగ్స్ లో సెంచరీ మార్కును చిటికెలో చేజార్చుకోవడం ఇది మూడోసారి. కేవలం 4 పరుగుల తేడాతో మరోసారి సెంచరీని అందుకోలేకపోయాడు. ఆ బాధ వైభవ్ ముఖంలో కనిపించింది. దీంతో ఎంతో నిరాశగా, మైదానాన్ని విడిచిపెట్టాడు. 

Also Read: 10వ తరగతి పాసైన మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ .7,000

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

RBI Warning Fake Notes: రూ. 500 నోట్లపై ఆర్బీఐ బిగ్ అలర్ట్.. కీలక విషయం వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

RBI Warning Fake Notes: 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రూ. 500 నోట్ల చలామణి 11.2 శాతం పెరిగి.. , కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద వాటాను నిలుపుకుంది. అయితే, ఈ డినామినేషన్‌లో నకిలీ నోట్ల కేసులు కూడా వేగంగా పెరిగాయి. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  వార్షిక నివేదికలో వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఏడాది క్రితం 6,34,458 లక్షలుగా ఉన్న రూ. 500 నోట్ల సంఖ్య, మార్చి 2026 చివరి నాటికి 7,05,482 లక్షలకు పెరిగింది. విలువ పరంగా చూస్తే, ఈ నోట్ల మొత్తం చలామణి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 31.72 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడు అది రూ. 35.27 లక్షల కోట్లకు చేరుకుంది.

చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500 నోట్ల వాటా అత్యధికంగా 41.2 శాతంగా ఉందని ఆర్‌బిఐ తెలిపింది. విలువ పరంగా చూస్తే, వాటి వాటా 86 శాతానికి పైగా ఉంది. అయితే, ఇదే కాలంలో గుర్తించిన నకిలీ రూ. 500 నోట్ల సంఖ్య 20 శాతానికి పైగా పెరిగింది. మొత్తమ్మీద, బ్యాంకింగ్ వ్యవస్థలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య గత ఏడాది 217,396 నుండి 2025-26 నాటికి 5.7 శాతం పెరిగి 229,746కు చేరింది. వీటిలో, ₹500 నోట్ల సంఖ్య అత్యధికంగా 141,907కు చేరుకుంది.

నకిలీ కరెన్సీ కేసుల పెరుగుదల:
రూ. 20 నకిలీ నోట్లలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించగా, రూ. 100, రూ. 50, రూ. 200 నకిలీ నోట్లు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది. రూ. 2,000 నోట్ల రద్దు కూడా ఈ డినామినేషన్‌లో నకిలీ నోట్లను గణనీయంగా తగ్గించింది. ఆర్‌బిఐ ప్రకారం, 2025-26లో చలామణిలో ఉన్న నోట్ల పరిమాణం 10.5 శాతం, విలువ 11.9 శాతం పెరిగాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఉన్న బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.

Also Read: 10వ తరగతి పాసైన మహిళలకు ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ .7,000

ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 2000 నోట్ల ఉపసంహరణ కొనసాగుతుంది:
2023 మేలో ప్రారంభమైన రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగిందని నివేదిక పేర్కొంది. 2026 మార్చి నాటికి, ఈ డినామినేషన్‌లోని మొత్తం నోట్లలో 98.45 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. నాణేలలో కూడా పెరుగుదల కనిపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం నాణేల సంఖ్య 4.5 శాతం, వాటి విలువ 11.4 శాతం పెరిగింది. మొత్తం నాణేలలో దాదాపు 80 శాతం వాటా ఒకటి, రెండు, ఐదు రూపాయల నాణేలదే.

గత ఏడాదితో పోలిస్తే 2025-26లో నోట్ల ముద్రణకు డిమాండ్ తక్కువగా ఉందని, దీని ఫలితంగా ముద్రణ వ్యయం గత ఏడాది రూ.6,379 కోట్ల నుండి రూ. 4,875 కోట్లకు తగ్గిందని ఆర్‌బిఐ తెలిపింది. అధిక విలువ గల నోట్ల ముద్రణకు డిమాండ్ తగ్గగా, చిన్న విలువ గల నోట్లకు పెరుగుతున్న అవసరాన్ని ప్రతిబింబిస్తూ రూ. 10 నోట్ల ముద్రణ పెరిగింది. అంతేకాకుండా, పాడైన నోట్ల పారవేయడం కూడా సుమారు 28.6 శాతం తగ్గింది.

రియల్, ఫేక్ రూ. 500 నోట్లను ఎలా గుర్తించాలి? 

ఆర్బిఐ తెలిపిన వివరాల ప్రకారం.. అసలైన రూ. 500 నోట్లలో పలు సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. అందులో

-మహాత్మాగాంధీ ఫొటో

-సెక్యూరిటీ థ్రెడ్

-రంగే మారే సిరా

-వాటర్ మార్క్

ఉబ్బుగా ఉండే ప్రింటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉంటాయి. నోటు కలర్, కాగితం క్వాలిటీ లేదా ప్రింటింగ్ లో ఏవైనా అనుమాస్పద మార్పులు కనిపించినట్లయితే వెంటనే జాగ్రత్త పడాలని ఆర్బిఐ సూచిస్తోంది. 

Also Read: RBI Polymer Notes: త్వరలోనే మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గుతున్నపసిడి ధరలు.. నేడు మే 30వ తేదీ హైదరాబాద్, విజయవాడలో ధరలు ఇవే..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఊరట కలిగించే విషయం. బంగారం ధరలు గత రెండు మూడు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అటు విజయవాడలోనూ తగ్గాయి. 10 గ్రాముల స్వచ్చమైన 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,56,060 పలుకుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ. 1,43,050 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,17,040 వద్ద ఉంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,84,900 రూపాయలు పలుకుతోంది.

ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 1.62 లక్షలకు చేరింది. ఇదిలా ఉండగా, ఎంసీఎక్స్ లో 24-క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర ఈ ఉదయం 0.59శాతం లేదా రూ. 925 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,56,000కు చేరింది. గత ట్రేడింగ్ రోజున ఇది 10 గ్రాములకు రూ. 1,56,925 వద్ద ముగిసింది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,57,790కి పెరిగింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఇది 10 గ్రాములకు రూ. 1,56,463కి చేరుకుంది. 

24 క్యారెట్ల (999) బంగారం 10 గ్రాములకు రూ. 156463

23 క్యారెట్ల (995) బంగారం 10 గ్రాములకు రూ. 155836

22 క్యారెట్ల (916) బంగారం 10 గ్రాములకు రూ. 143320

18 క్యారెట్ల (750) బంగారం 10 గ్రాములకు రూ. 117347

14 క్యారెట్ల (585) బంగారం 10 గ్రాములకు రూ. 91531

అమెరికా-ఇరాన్ ఒప్పందం త్వరగా కుదిరే అవకాశం, దేశీయ మార్కెట్లో పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ అంచనాల కారణంగా, శుక్రవారం జాతీయ రాజధాని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1.62 లక్షలకు చేరింది. స్థానిక మార్కెట్ నిపుణుల ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర  10 గ్రాములకు రూ.1,600 పెరిగి రూ.1,62,900కు చేరింది. ఈద్-ఉల్-అజ్హా పండుగ కారణంగా గురువారం బులియన్ మార్కెట్లు మూసిఉన్నాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో, స్పాట్ గోల్డ్ ధర దాదాపు ఒక శాతం పెరిగి ఔన్సుకు $4,530.72కు చేరింది.

స్పాట్ డిమాండ్ బలహీనంగా ఉండటం.. స్పెక్యులేటర్లు తమ డీల్స్ పరిమాణాన్ని తగ్గించుకున్నారు. దీని కారణంగా శుక్రవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 259 మేర తగ్గి రూ. 62,507కి పడిపోయింది. ఎంసీఎక్స్ లో జూన్ డెలివరీ కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 259 లేదా 0.17 శాతం తగ్గి రూ. 1,56,666కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో బంగారం ధర 0.28 శాతం పెరిగి ఔన్సుకు $ 4,508కి చేరింది. స్పాట్ డిమాండ్ బలహీనంగా ఉండటం వల్లే బంగారం ఫ్యూచర్స్ ధరలు పడిపోయాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు సంబంధించిన పరిణామాలు, ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై వెలువరించిన అంచనాలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో పెళ్లిళ్లకు డిమాండ్ ఉంటుందనే అంచనాల కారణంగా ఈ విలువైన లోహాల ధరలు బలంగా నిలబడ్డాయని అన్నారు. మార్కెట్ మౌలిక అంశాలు ధరలకు మద్దతునిస్తూనే ఉన్నందున, సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ అమ్మకాల ఒత్తిడిని తాము చూడటం లేదని  చెప్పారు.  సేఫ్ హెవెన్  డిమాండ్, పారిశ్రామిక రంగ అవకాశాల మద్దతుతో వెండి కూడా బంగారం ధోరణినే అనుసరించే అవకాశం ఉంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

RBI Polymer Notes: సామాన్యులకు అలర్ట్.. మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.. TOP 5 లాభాలు ఇవే..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

Plastic currency notes India: భారత రిజర్వు బ్యాంక్.. దేశ ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు నిరంతరం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ చెల్లింపులు, ఈ రూపాయి సక్సెస్ తర్వాత ఆర్బిఐ మరో సరికొత్త విప్లవానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది. మన చేతుల్లో నగదు రూపంలో అంటే.. నోట్ల రూపంలోని సాంకేతికతలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశంలో కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్ ను .. కాగితపు నోట్లను వాడకంలో ఉన్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని.. ఆర్బిఐ త్వరలోనే దేశవ్యాప్తంగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టబోతోంది. 

ఈ నోట్లను ఒక ప్రత్యేక ప్లాస్టిక్ పదార్థంతో తయారు చేస్తారు. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్టు ప్రకారం.. ఈ కొత్త నోట్లను ఎలా తయారు చేస్తారు? అవి ఎలా ఉంటాయి.. ప్రస్తుత నోట్లకు ఎలా భిన్నంగా ఉంటాయి.. సాధారణ వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఆర్బిఐ తీసుకోబోతున్న ఈ చర్య కరెన్సీ చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 

పాలిమర్స్ నోట్లు ఎలా ఉంటాయి? 
ఆర్బిఐ కొత్త ప్రవేశపెట్టబోతున్న పాలిమర్ నోట్లు.. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లకు ఎలా భిన్నంగా ఉంటాయో తెలుసుకుందాం. మనం రోజు వాడుతున్న నోట్లు పూర్తిగా కాగితంతో తయారు చేసినవి కావు. అందులో పత్తి,  కొన్ని రసాయనాల మిశ్రమంతో తయారు చేశారు. అందుకే ఆ నోట్లు నీటిలో తడవగానే పాడైపోతాయి. జేబులో మడిచిపెట్టినప్పుడు వాటి గట్టిదనం కోల్పోతాయి. ఎక్కువ రోజులు చెలామణిలో ఉన్న తర్వాత మురికిగా, పాతబడిపోతాయి. 

అయితే పాలిమర్ నోట్లు ఈ నోట్లకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీటిని ఒక ప్రత్యేకమైన సింథటిక్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఈ నోట్లు కూడా ప్రస్తుతం వాడుతున్న నోట్ల మాదిరిగానే కాగితం వలే కనిపిస్తాయి. కానీ వాటి బలం ఎక్కువగా ఉంటుంది. డిజైన్ లో కూడా మరింత ఆధునికత ఉంటుంది. ఫేక్ కరెన్సీని అరికట్టేందుకు అత్యంత అధునాతన సేఫ్టీ ఫీచర్లతో ఈ నోట్లను ప్రవేశపెట్టబోతోంది ఆర్బిఐ. 

పాలిమర్ కరెన్సీ వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం: 

1. చెరగవు, కరగవు: పాలిమర్ నోట్ల అతిపెద్ద ప్రయోజనం  వాటి బలం. నీటిలో తడిసినా చెరగవు. బట్టలు ఉతికేటప్పుడు, వర్షంలో తడిసినప్పుడు జేబులో ఉంచినా పాడైపోవు. పాలిమర్ నోట్లు పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ తో ఉంటాయి. నీళ్లు, కాఫీ, టీ వాటిపై ఒలికినా.. ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాదు వాటిని చించినా పాడైపోవు. చాలా కాలం మన్నికగా కొత్త నోట్ల వలే ఉంటాయి. 

2. తక్కువ నిర్వహణ, దీర్ఘకాలం మన్నిక: ఈ నోట్లు అంత ఈజీగా పాడైపోవు. కాబట్టి జీవితం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నోట్ల కంటే కనీసం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాగితపు నోట్లు త్వరగా మురికిగా, జిడ్డుగా మారుతాయి. అందుకే ఆర్బిఐ వాటిని పదే పదే వెనక్కి తీసుకుంటుంది. కానీ పాలిమర్ నోట్లు దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి  కాబట్టి ప్రభుత్వానికి, ఆర్బిఐకి నోట్ల ముద్రణ ఖర్చులతో కోట్లాది రూపాయాలు ఆదా అవుతాయి. 

ALSO READ: రైల్వే సిబ్బంది..ప్రమోషన్లు, పాస్‌పోర్ట్ NOCల కోసం కేంద్రం తెచ్చిన కొత్త సిస్టమ్ ఇదే

3. మురికి బ్యాక్టీరియా నుంచి రక్షణ: ప్రస్తుతం ఉన్న కాటన్ నోట్లు నిరంతరం చేతులు మారడం వల్ల దుమ్ము పట్టి, ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్‌లు వాటిపై పేరుకుపోతాయి. కానీ పాలిమర్ నోట్లకు రంధ్రాలు లేని ఉపరితలం ఉంటుంది. అంటే అవి దుమ్ము, చెమట లేదా మురికిని ఆకర్షించవు. ఈ నోట్లు పూర్తిగా పరిశుభ్రంగా ఉంటాయి. అంతేకాదు వీటిని సులభంగా శుభ్రం చేయవచ్చు.

4. ఫేక్ కరెన్సీని అరికట్టడం:  దేశంలో ఫేక్ కరెన్సీ చలామణి పెద్ద సమస్యగా ఉంది. పాలిమర్ నోట్ల ముద్రణ సాంకేతికత ఎంత సంక్లిష్టంగా, అధునాతనంగా ఉంటుందంటే, నకిలీ నోట్లను తయారుచేసేవారు వాటిని యథాతథంగా ఫేక్  చేయడం దాదాపు అసాధ్యం. ఈ నోట్లలో సాధారణ కాగితం లేదా ప్రింటర్లను ఉపయోగించి కాపీ చేయలేని పారదర్శక కిటికీలు, హోలోగ్రామ్‌లు ఉంటాయి. ఇది దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను రెండింటినీ బలోపేతం చేస్తుంది.

5. పర్యావరణ అనుకూలం: ఇవి ప్లాస్టిక్‌లా అనిపించినప్పటికీ.. పాలిమర్ నోట్లు పూర్తిగా రీసైక్లింగ్ చేయవచ్చు. ఈ నోట్లు పాతపడితే  లేదా పనికిరాకుండా పోయినప్పుడు, వాటిని నాశనం చేయడానికి బదులుగా రీసైక్లింగ్ చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. 

ALSO READ:  పాకిస్తాన్‌ను ఆదుకుంటున్న గాడిదలు.. దేశ GDPకి బూస్టర్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Supreme Court: మగవాళ్ళు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారు? వరకట్నం వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య..!!

BBhoomi16h ago
Lakshmapur, Telangana:

 Supreme Court dowry harassment judgment: వరకట్నం కోసం వేధించి చంపుతున్న హత్యలపై దేశ సర్వోన్నత న్యాయం ఆందోళన వ్యక్తం చేసింది. యువకులు, అమ్మాయిలను వివాహం చేసుకుని.. తీసుకున్న కట్నకానుకలు చాలదు అన్నట్లు మళ్లీ కట్నం తీసుకురావాలంటూ భార్యలను వేధించడం, వారి కుటుంబాలను అవమానించడం వంటి ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం  చేసింది. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది.  ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ కుటుంబానికి సంబంధించిన వరకట్న వేధింపులు హత్యకేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్నం ఈ వ్యాఖ్యలు చేశారు. 

అధిక వరకట్నం కోసం వధువు కుటుంబాన్ని బిచ్చగాళ్లు అనడంపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నవారి కుటుంబాల్లోనే ఈ వరకట్న వేధింపులు  పెరగడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్ గడ్ లో పెళ్లి జరిగిన 3 సంవత్సరాలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించింది. ఈ కేసును విచారించిన కోర్టు, నిందితులకు వార్నింగ్ వంటి మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్ లతో కూడిన న్యాయస్థానం ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ భర్త కుటుంబ సభ్యుల తీరును తప్పుబట్టింది. సమాజంలో ఇంకా కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రశ్నిస్తూ జస్టిస్ నాగరత్న భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

2010లో ఛత్తీస్ గఢ్ లో వివాహం జరిగిన 3 సంవత్సరాలకు ఓ మహిళ తన అత్తగారింట్లో ఉరివేసుకుని చనిపోయింది. భర్త అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నంకోసం ఆ మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పెళ్లి జరిగిన 3ఏళ్లకే మరణించడంతో ఇది వరకట్న మరణమేనని ట్రయల్ కోర్టు నిర్ధారించింది. మరణానికి  కొన్నిరోజుల ముందు కూడా డబ్బు కోసం వేధించినట్లు బాధిత కుటుంబ సభ్యులు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసులో భర్త కుటుంబ  సభ్యులకు సెక్షన్ 304 బి , 306 , 498ఏ కింద కోర్టు శిక్ష విధించింది. దీన్ని ఛత్తీస్ ఘడ్ కోర్టు కూడా సమర్థించింది. 

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భర్త తమ్ముడు సుప్రీంను ఆశ్రయించారు. తనపై కేవలం సెక్షన్ 498ఏ మాత్రమే ఉదని.. అది కూడా వర్తించదని అతని తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఈ వాదనను కొట్టిపారేసింది. మీ పై కేవలం 498ఏ కింద 3ఏళ్ల శిక్ష మాత్రమే పడినందుకు మీరు సంతోషం వ్యక్తం చేయాలని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అమ్మాయి కుటుంబాన్ని ఆర్ధికంగా వేధించే తీరును ఎండగడుతూ.. అమ్మాయి తరపు వారు తమ కూతురిని కాపాడుకునేందుకు 60వేలు ఇస్తామని బతిమిలాడితే.. మీరేమో వారిని భిక్షగాళ్లు అని పిలుస్తారా.. చదువుకున్న కుటుంబాల్లో కూడా ఇలా ప్రవర్తించడం ఆందోళనకరమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  అబ్బాయిలు ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు.. వరకట్నం పేరుతో వరుడి తరపు వారు వధువుపైనా ఆమె కుటుంబంపై ఒత్తిడి తీసుకువస్తారా. వధువును ఆమె కుటుంబాన్ని పీడించడమే లక్ష్యమా అంటూ చీవాట్లు పెట్టింది. ఇలాంటి కేసుల్లో కఠినమైన సందేశం వెళ్లాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సదరు అప్పీల్ ను కొట్టివేసింది. 

Also Read:  మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Pawan Kalyan: 'ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కాలిగోటికి సరిపోడు.. పవన్‌ కల్యాణ్‌ ఓ ప్యాకేజీ స్టార్‌!

Mahbubnagar, Telangana:

Prof Nageshwar Case: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అని తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదని స్పష్టం చేశారు. నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే ముందు ప్రొఫెసర్‌ కన్న ముందు తనను అరెస్టు చేయాలని సవాల్‌ చేశారు. ఆంధ్రవాళ్లు ఇంకా తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి వెళ్లిపోవచ్చు కదా అని పవన్‌ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సూచించారు.

Also Read: TV Serial Chance: టీవీ సీరియల్‌ పేరిట డాక్టర్‌కు కుచ్చుటోపీ.. తీగలాగితే

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం పాత బజార్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు సీఎస్‌ఆర్ ఫౌండేషన్ అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్‌ మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య సాగుతున్న వివాదంపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి కాదని స్పష్టం చేశారు. ఆయన ఒక పొలిటికల్ ఎనలిస్టు అని.. ఆయనపై కేసులు ఎలా పెడతారని? ప్రశ్నించారు.

Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఏం జరిగిందంటే?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబుతో.. తర్వాత అమిత్ షాతో ఆ తర్వాత వైఎస్‌ జగనతో కూడా ప్యాకేజీ తీసుకుంటాడేమో అని పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను అరెస్టు చేయాల్సి వస్తే ఆయన ఇంటి ముందు తానే ముందు వచ్చి అరెస్టు అవుతానని ప్రకటించారు. 'అమరావతికి అన్ని కోట్లు ఎందుకని.. ఆంధ్రవాళ్లు అందరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కదా. ఇక్కడే తాము 5000 ఎకరాలు ఇస్తామని ఇక్కడే రాజధాని కట్టుకొని ఇక్కడ నుంచి ఏపీ పరిపాలన కొనసాగించండి' అని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సూచించారు. 

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజీనామా పర్వం ఏమైనా ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన సమర్థవంతంగా జరుగుతోందని.. రేవంత్‌ రెడ్డి రాజీనామా అనే అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లేదు అని అనిరుధ్‌ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి.. ఆయన ఇంటి ముందు నేను నిలబడతా. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తే గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలైతది' అని హెచ్చరించారు. అయినా మీరంతా ఉండేది హైదరాబాద్‌లోనే కదా? అన్ని డబ్బులు పెట్టి అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారు? అని నిలదీశారు.

0
0
Report

Vaibhav Suryavanshi Diet: ఆ వయసులో అంత సిక్సర్ల పవర్ ఎలా సాధ్యం? వైభవ్ సూర్యవంశీ సీక్రెట్ ఫుడ్ మెనూ లీక్..!!

BBhoomi18h ago
Lakshmapur, Telangana:

Vaibhav Suryavanshi Diet Chart:  ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఒకే ఒక్కడు పరుగుల వరద సృష్టిస్తూ మార్మోగిపోతున్నాడు.. అతనే వైభవ్ సూర్యవంశీ. నిండా 15 ఏళ్లు కూడా నిండని ఈ బీహార్ కుర్రాడు మైదానంలోకి దిగిండంటే... సీనియర్ బౌలర్లు సైతం వణికిపోతున్నారు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన హై-టెన్షన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ మామూలూ విధ్వంసం సృష్టించలేదు.  29 బంతుల్లో 97 పరుగులు బాది దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సర్లు ఉన్నాయంటే బుడ్డోడి బ్యాటింగ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టచ్ చేస్తే చాలు బంతి స్టాండ్స్‌లో నుంచి బస్టాండ్లోకి దూసుకుపోయింది. ఇక ఈ రోజు జరగబోయే కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ చిచ్చరపిడుగు  ఏ రేంజ్‌లో చెలరేగుతాడోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ చిన్నోడి చేతుల్లోకి ఇంత పవర్ ఎలా వచ్చింది? టచ్ చేస్తే సిక్స్ ఎలా సాధ్యమవుతోంది? ఇంత చిన్న వయసులోనే అంత అద్భుతమైన ఫిట్నెస్ వెనకున్న ఆ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. 

ఇష్టమైన ఫుడ్‌కు త్యాగం .. 15 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయికి:

ఒక 15 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ప్లేయర్‌గా ఎదిగి..  ఈ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాడంటే దాని వెనుక ఎంతో కఠినమైన శ్రమ, క్రమశిక్షణ ఉంది. సాధారణంగా ఈ వయసులో ఉండే మిగతా టీనేజ్ కుర్రాళ్లు ఎలాంటి టెన్షన్లు లేకుండా ఇష్టమైన ఫుడ్ తింటూ.. గాలి తిరుగులు తిరుగుతూ, స్కూల్ కు వెళ్తూ ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతుంటారు. కానీ సూర్యవంశీ మాత్రం అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించడం కోసం తన చిన్ననాటి ఇష్టాలను.. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎన్నో త్యాగాలు చేశాడు.

బీహార్‌లో అత్యంత పాపులర్ వంటకం  లిట్టి చొఖా . అక్కడ దీనిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వైభవ్‌కు కూడా ఇదంటే అమితమైన ఇష్టం. కానీ, క్రికెట్‌కు అవసరమైన అల్టిమేట్ ఫిట్‌నెస్ కోసం అతడు దానికి పూర్తిగా దూరమయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన తండ్రి సంజీవ్ ఒక ఇంటర్వ్యూలో గర్వంగా పంచుకున్నారు. ప్రస్తుతం వైభవ్ ఎంతో బ్యాలెన్స్‌డ్ డైట్  తీసుకుంటూ, రోజూ క్రమం తప్పకుండా జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నాడని ఆయన తెలిపారు. అలాగే వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా మాట్లాడుతూ.. వైభవ్‌కు పిజ్జా అంటే పిచ్చి అని.. కానీ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఎదగడం కోసం పిజ్జాను కూడా త్యాగం చేశాడని చెప్పారు. అంతేకాదు.. ఈ యంగ్ సెన్సేషన్ అసలు మటన్ కూడా ముట్టడట.

సిక్సర్ల సునామీకి.. ఆ  స్ట్రెంత్ కావాల్సిందే: 

ఒక ఇంటర్నేషనల్ క్లాస్ బ్యాట్స్‌మన్‌గా క్రీజులో నిలబడాలంటే ఫిట్‌నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా కోర్ స్ట్రెంత్  కాళ్లు, భుజాలు, చేతుల్లో అసాధారణ బలం ఉండాలి. ఆ స్ట్రెంత్ పవర్‌ఫుల్‌గా ఉంటేనే భారీ సిక్సర్లు, ఫోర్లు బాదేటప్పుడు బాడీ బ్యాలెన్స్ కోల్పోకుండా పవర్‌ను జనరేట్ చేయవచ్చు. దీనితో పాటు హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. బౌలర్ వేసే బంతి వేగాన్ని, స్పిన్‌ను మైక్రో సెకన్లలో అర్థం చేసుకుని షాట్ ఆడటానికి ఇది సహాయపడుతుంది. అలాగే సింగిల్స్, డబుల్స్ కోసం వేగంగా పరిగెత్తే చురుకుదనం, గంటల తరబడి క్రీజులో అలసిపోకుండా నిలబడే స్టామినా కోసం వైభవ్ రోజూ జిమ్ వర్కౌట్స్, నెట్ ప్రాక్టీస్, రన్నింగ్ మరియు స్ట్రెచింగ్ వంటివి కఠినంగా పాటిస్తున్నాడు.

Also Read: ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. పీఎం మోదీ పిలుపుతో క్యూ కడుతున్న టాప్ కంపెనీలు..

ఏంటీ ఈ బుడ్డోడి డైట్ సీక్రెట్?

వైభవ్ తన ఫిట్‌నెస్ కోసం టాప్ ఇంటర్నేషనల్ అథ్లెట్ల తరహాలోనే హై-ప్రోటీన్ డైట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన రోజువారీ మెనూలో ఇవి తప్పనిసరిగా ఉంటున్నాయి:

ప్రోటీన్ రిచ్ ఫుడ్స్: కండరాల బలానికి అవసరమైన గుడ్లు, చికెన్, పాలు, పనీర్, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటాడు.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌ కు దూరం : పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే సాంప్రదాయ వంటకాలు, ఆయిలీ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కు బదులుగా బాదం, వాల్‌నట్స్ వంటి పోషక విలువలున్న నట్స్‌ను స్నాక్స్‌గా తీసుకుంటాడు.

క్లీన్ కార్బోహైడ్రేట్స్: బాడీకి అవసరమైన ఎనర్జీ కోసం కార్బ్స్‌ను పూర్తిగా మానేయకుండా.. తక్కువ మోతాదులో బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ రొట్టెలు, చిలగడదుంపల  వంటి క్లీన్ కార్బ్స్ తీసుకుంటాడు.

ఫ్రూట్స్ , హైడ్రేషన్: బాడీ మెటబాలిజం బాగుండటానికి ప్రతిరోజూ డైట్‌లో పండ్లను భాగం చేసుకుంటాడు.

మెంటల్ స్ట్రెంత్ వెనుక సీక్రెట్ అదే: 
ఈ అద్భుతమైన డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్ వల్లే వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఎంతటి భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా, కొంచెం కూడా అలసిపోకుండా ఎనర్జిటిక్‌గా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. దీనికి తోడు ఆయన నిద్ర  విషయంలోనూ, బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తాగే నీటి విషయంలోనూ చాలా ఖచ్చితమైన నియమాలు పాటిస్తాడట. అందుకే గ్రౌండ్‌లోనే కాదు, మెంటల్‌గా కూడా వైభవ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటూ, ఎంతటి మ్యాచ్ ఒత్తిడినైనా చాలా కూల్‌గా జయిస్తున్నాడని డైట్ నిపుణులు చెప్తున్నారు.

Also Read:  మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

PMAY Urban Yojana: PMAY-అర్బన్ పథకం అంటే ఏమిటి? PM Awas Yojana కింద ఇల్లు కావాలా? అర్హతలు, దరఖాస్తు పూర్తి ప్రాసెస్ ఇదే..!!

BBhoomi20h ago
Lakshmapur, Telangana:

PMAY Urban Yojana: నగరాల్లో నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో  ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అనే స్కీమును ప్రవేశపెట్టింది.  ఈ పథకం అందరికీ గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో 25 జూన్ 2015న ప్రారంభించింది.  దేశంలోని ప్రతి పట్టణ కుటుంబానికి గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో PMAY-అర్బన్ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి పట్టణ కుటుంబానికి అన్ని ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సురక్షితమైన, పటిష్టమైన ఇల్లు ఉండాలన్నది ఈ స్కీము ప్రధాన ఉద్దేశ్యం. నేటికీ.. దేశంలోని అనేక నగరాల్లో లక్షలాది మంది ప్రజలు మురికివాడలలో లేదా అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. అటువంటి కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడంలో ఈ పథకం చాలా కీలకంగా మారింది. 

PMAY-అర్బన్ పథకం అర్హులు ఎవరు? 
PMAY-అర్బన్ ప్రయోజనాలు కొన్ని షరతులకు లోబడి ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ప్రత్యేకంగా ఆర్థికంగా బలహీన వర్గం, అల్ప ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గం-1 మధ్య ఆదాయ వర్గం-2, పట్టణ మురికివాడలలో నివసించే ప్రజల కోసం రూపొందించింది. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే, లబ్ధిదారునికి భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటికే పక్కా ఇల్లు ఉండకూడదు. ఎవరైనా గతంలో ఏదైనా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాన్ని పొంది ఉంటే, వారు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు. 

PMAY-అర్బన్ పథకం ప్రధాన అంశాలు

ఈ పథకం ప్రయోజనాలు అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరేలా దీనిని వివిధ భాగాలుగా విభజించారు.

1. లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం:
ఈ పథకం కింద, భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. వారు తమ సొంత ఇళ్లను నిర్మించుకోవచ్చు లేదా మెరుగుపరచుకోవచ్చు.

2. భాగస్వామ్యంలో సరసమైన గృహనిర్మాణం:
ఈ పథకం కింద, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల, బిల్డర్లతో కలిసి సరసమైన గృహాలను నిర్మిస్తుంది, వాటిలో కొన్ని EWS కుటుంబాల కోసం కేటాయిస్తారు. 

3. ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ 
ఈ పథకం కింద, మురికివాడలను అదే ప్రదేశంలో పునరాభివృద్ధి చేసి, అక్కడ నివసిస్తున్న ప్రజలకు కొత్త పక్కా ఇళ్లను అందిస్తారు.

4. వడ్డీ రాయితీ పథకం 
ఈ పథకం కింద, ప్రభుత్వం గృహ రుణాలపై వడ్డీ రాయితీలను అందించి, ఇల్లు కొనడాన్ని లేదా కట్టుకోవడాన్ని సులభతరం చేస్తుంది. దీనివల్ల ఈఎంఐ భారం గణనీయంగా తగ్గుతుంది.

PMAY-అర్బన్ పథకానికి అర్హత:
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. దరఖాస్తుదారు భారత పౌరుడై ఉండాలి. కుటుంబ ఆదాయం EWS, LIG, లేదా MIG వర్గాల పరిధిలోకి రావాలి. కుటుంబ సభ్యులలో ఎవరికీ సొంత శాశ్వత గృహం ఉండకూడదు. వారు ఇంతకు ముందు మరే ఇతర కేంద్ర గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు. మీరు దరఖాస్తు చేస్తున్న నగరంలో నివాసం ఉండటం తప్పనిసరి. ఆధార్ కార్డు ద్వారా గుర్తింపు ధృవీకరణ తప్పనిసరి.

Also Read: ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. పీఎం మోదీ పిలుపుతో క్యూ కడుతున్న టాప్ కంపెనీలు..

PMAY-అర్బన్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?

-ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ

-ముందుగా PMAY-అర్బన్ పోర్టల్‌కు వెళ్లండి.

-PMAY-U 2.0 కోసం దరఖాస్తు చేసుకోండి అనే ఎంపికను ఎంచుకోండి.

-ఆధార్ OTPతో గుర్తింపును ధృవీకరించండి.

-మీ వ్యక్తిగత సమాచారం, కుటుంబ సమాచారం, ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని పూరించండి.

-బ్యాంకు ఖాతా, రుణ సమాచారాన్ని నమోదు చేయండి (వర్తిస్తే).

-సరైన ప్రణాళికను ఎంచుకోండి.

-అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

-ఫారం సమర్పించి, దాని కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read:  మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.

ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని వారు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు:-

-సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి.

-రూ. 25 + GST ​​చెల్లించి దరఖాస్తు ఫారం పొందండి.

-ఫారమ్‌ను సరిగ్గా పూరించండి.

-అవసరమైన అన్ని పత్రాలను జతచేయండి.

-దీనిని CSCకి సమర్పించండి.

-PMAY-అర్బన్ పథకానికి అవసరమైన పత్రాలు

-దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు అవసరం:-

ఆధార్ కార్డు

-గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి)

-ఆదాయ ధృవీకరణ పత్రం

-చిరునామా రుజువు

-బ్యాంకు పాస్‌బుక్ మరియు ఖాతా స్టేట్‌మెంట్

-పాస్‌పోర్ట్ సైజు ఫోటో

-అఫిడవిట్ (గతంలో పక్కా ఇల్లు లేదని)

-EWS/LIG/MIG సర్టిఫికేట్ (వర్తిస్తే)

-జీతం స్లిప్ లేదా ITR (మధ్యతరగతి వారికి)

PMAY-అర్బన్ స్కీమ్ దరఖాస్తు తర్వాత ప్రక్రియ
దరఖాస్తును సమర్పించిన తర్వాత, సంబంధిత శాఖ ద్వారా మొత్తం సమాచారం ధృవీకరిస్తారు. అర్హులుగా తేలితే, పథకం ప్రకారం లబ్ధిదారునికి సహాయం అందుతుంది. కొన్ని సందర్భాల్లో, రుణంపై వడ్డీ రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాకు లేదా రుణ ఖాతాకు బదిలీ చేస్తారు. దరఖాస్తుదారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే, వారు తమ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ లేదా పట్టణ స్థానిక సంస్థ  కార్యాలయాన్ని సందర్శించి సహాయం పొందవచ్చు.

PMAY-అర్బన్ పథకం ప్రాముఖ్యత
పీఎంఏవై-అర్బన్ పథకం నగరాల్లో నివసిస్తున్న లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. ఈ పథకం కేవలం ఇళ్లను అందించడానికే పరిమితం కాకుండా, ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. శాశ్వత నివాసం ఉండటం భద్రతను పెంచడమే కాకుండా, సామాజిక, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన పథకం. ఇది ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. సులభమైన దరఖాస్తు ప్రక్రియ, వడ్డీ రాయితీలు, ప్రభుత్వ మద్దతుతో, ఈ పథకం లక్షలాది మందికి ఆశాకిరణంగా మారింది. మీరు అర్హులైతే, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, మీ కలల ఇంటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయవచ్చు.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Air India Express Sale: బస్సు టికెట్టు ధరకే విమానం ఎక్కొచ్చు..సగం ధరకే విమానం టికెట్‌తో ఎయిర్ ఇండియా సరికొత్త ఆఫర్!

Hyderabad, Telangana:

Air India Express Sale 2026: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వేసవి సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 'ఎక్స్‌ప్రెస్ సేల్' పేరుతో ఏకంగా 50 లక్షల సీట్లను సగం ధరకే (50% తగ్గింపుతో) అందిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సదరు విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలు విమానయాన రంగానికి చెందిన మరికొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్స్‌ప్రెస్ సేల్ వివరాలు..
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లతో పాటు అదనపు ప్రయోజనాలను సంస్థ కల్పిస్తోంది. 'లైట్ ఫేర్స్' (చెక్-ఇన్ బ్యాగేజీ లేని టిక్కెట్లు), 'వాల్యూ ఫేర్స్' బుకింగ్‌లపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను మే 27 నుండి మే 31, 2026 వరకు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. బుక్ చేసుకున్న టిక్కెట్లపై జూన్ 15 నుండి అక్టోబర్ 10, 2026 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు.

సేల్‌లో అదనపు ప్రయోజనాలు..
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ (airindiaexpress.com) లేదా వారి మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వినియోగదారులకు 'కన్వీనియన్స్ ఫీజు' (సేవా రుసుము) పూర్తిగా ఉచితంగా వెసులుబాటు కల్పించింది. మే 27న అధికారిక వెబ్‌సైట్/యాప్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ లభించగా, మే 28 నుండి అన్ని ప్రధాన ట్రావెల్ పోర్టల్స్‌లో ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది.

అయితే టాటా నియుపాస్ మెంబర్‌షిప్ ఉన్న ప్రయాణికులకు ఈ సేల్‌లో ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. లాగిన్ అయిన సభ్యులకు బిజినెస్ క్లాస్ ఛార్జీలపై 20% తగ్గింపు లభిస్తుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విశాలమైన లెగ్‌రూమ్, ఉచిత వేడి భోజనం, అదనపు లగేజీ అనుమతితో పాటు ఇతర సేవలను కల్పిస్తారు. విమాన బుకింగ్‌లపై అదనంగా రూ.300 వరకు తగ్గింపుతో పాటు 8% వరకు 'NeuCoins' సంపాదించుకోవచ్చు. గౌర్‌మేయర్ హాట్ మీల్స్, నచ్చిన సీటు ఎంపికతో పాటు అదనపు సామాను (10 కేజీల ఎక్స్‌ప్రెస్ చెక్-ఇన్ బాగేజ్ + 3 కేజీల క్యారీ-ఆన్ బాగేజ్) వంటి సేవలపై 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇజ్రాయెల్‌కు సర్వీసుల నిలిపివేత..
పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా అనిశ్చితి కారణంగా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టెల్ అవీవ్ - ఢిల్లీ మార్గంలో నడిచే తన విమాన సర్వీసుల నిలిపివేతను జూలై నెలాఖరు (జూలై 31, 2026) వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

గతంలో ఈ సర్వీసులను జూన్ ముగింపు వరకే నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అక్కడ భద్రతా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించారు. ఇజ్రాయెల్ విమాన కార్యకలాపాల షెడ్యూల్ సవరణ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయినట్లు సంస్థ సీనియర్ అధికారులు వెల్లడించారు.

Also Read: ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ డబ్బు ఏటీఎం ద్వారా ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?

Also Read: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..కనీస జీతం రూ.69,000కి పెంపు..18 నెలల బకాయిలు అకౌంట్లో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

TV Serial Chance: టీవీ సీరియల్‌ పేరిట డాక్టర్‌కు కుచ్చుటోపీ.. తీగలాగితే తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిగిన సైబర్ నేరం

Visakhapatnam, Andhra Pradesh:

Cyber Crime On Serials Chance: సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి ఓ వైద్యురాలిని నమ్మించాడు.. తనదైన మాటలతో బుట్టలో వేసుకున్నాడు. అనంతరం ఆమె అకౌంట్ల నుంచి విడతల వారీగా డబ్బులు వేయించుకున్నాడు. ఆమెకు సీరియల్స్‌ ఇష్టం కావడంతో సీరియల్స్‌లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి డబ్బులు వేయించుకుని అనంతరం పత్తా లేకుండాపోయాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఆమె డబ్బులతో అతడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ ఉదంతం విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్టణంలో ఓ కార్ల షోరూమ్‌ ఉంది. ఆ షోరూమ్‌లో ఓ వ్యక్తి రూ.22 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కార్ల షోరూమ్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ ఏఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించాడు. ఆ డబ్బు పంపిన అకౌంట్‌ నంబర్‌ ఆధారంగా ఖమ్మంలోని ఓ మహిళా డాక్టర్‌ను సంప్రదించారు. మీరే నిందితురాలు అని ఏఎస్‌ఐ నిలదీయగా.. అయ్యో తాను అసలైన బాధితురాలినని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం జరిగింది ఏమిటో తెలుసుకుందాం.

బాధితురాలి కథనంతో..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెంది ఓ డాక్టర్‌ భార్యకు సోషల్‌ మీడియా ద్వారా విశాఖపట్టణంలోని మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త పెరగడంతో ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాడు. ఆమెకు సీరియల్స్‌ ఇష్టమని గుర్తించి 'మీకు సీరియల్స్‌లో నటించే అవకాశం ఇస్తా' అని నమ్మబలికాడు. ప్రముఖ ఛానల్‌లో సీరియల్స్‌లో ఓ పాత్ర ఇప్పిస్తానని ఆశచూపి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని నిందితుడు ఆమెకు చెప్పాడు.

ఇక్కడే ట్విస్ట్..
అలా ఆమెతో జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌ వరుసగా డబ్బులు పంపించుకున్నాడు. కొద్ది రోజులకు ఆమె అకౌంట్‌ నుంచి రూ.22 లక్షల డబ్బును విశాఖలోని కార్ల షోరూమ్‌ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. దీంతో ఓ ఖరీదైన కారు డాక్టర్‌ డబ్బులతో కొనుగోలు చేశాడు. అయితే అవకాశం ఇస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో ఆమె సైబర్‌ నేరగాడి వలలో చిక్కినట్లు గ్రహించారు. వెంటనే వైద్యుడి భార్య తెలంగాణ సైబర్‌ సెల్‌ను ఆశ్రయించారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు నిందితుడు కొనుగోలు చేసిన కార్ల షోరూమ్‌ అకౌంట్‌ను కూడా ఫ్రీజ్‌ చేశారు. తమ అకౌంట్ ఫ్రీజ్‌ కావడంతో కార్ల యజమాని విశాఖలోని కంచరపాలెం పోలీసులను తెలంగాణకు పంపించారు. దీంతో అసలు కథ బయటపడింది. బాధితురాలి కథను తెలుసుకున్న పోలీసులు నిందితుడు జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌ కోసం వెతుకుతున్నారు. ఇటు విశాఖపట్టణం పోలీసులు.. అటు తెలంగాణ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుని కార్ల యజమానితోపాటు తెలంగాణలోని వైద్యుడి భార్యకు కూడా న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

అత్యధికులు విద్యావంతులే
కాగా సైబర్‌ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మోసానికి పోవడానికి రెడీగా ఉన్నామన్నట్టు బాధితుల వ్యవహార శైలి కనిపిస్తోంది. అయితే సైబర్‌ నేరస్తుల బారిన పడుతున్న వారిలో అత్యధికులు విద్యావంతులే ఉంటుండడం గమనార్హం. ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా సులువుగా సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. కళ్ల ముందు మోసపోతున్నా తెలియకుండా పోతున్నారు.

0
0
Report

Medical Miracle: వైద్యులకే మైండ్ బ్లాక్.. కడుపునొప్పి అని వెళ్తే.. లోపల ఏకంగా 1.3 కిలోల రాయి!

Hyderabad, Telangana:

Medical Miracle Latest News: సాధారణంగా కిడ్నీల్లోనో.. మూద్రాశయాంలోనో.. రాళ్లు ఏర్పడడం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. అవి సాధారణంగా మిల్లీమీటర్లు లేదా కొన్ని సెంటీమీటర్ల పరిమాణంలో.. రవ్వంత సైజులో ఉంటాయని అప్పుడప్పుడు డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ చైనాలోని వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఒక విచిత్రకరమైన, అత్యంత అరుదైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి మూత్రాశయం నుంచి ఏకంగా 1.3 కిలోల బరువున్న  భారీ రాయిని వైద్యుని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. ఈ పరిమాణంలో రాయి ఉండటం చూసి ఆపరేషన్ చేసిన డాక్టర్లే తీవ్ర ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది..

చైనాకు చెందిన 56 ఏళ్ళు వయస్సు కలిగిన చన్ అనే రైతు గత మూడేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. మూత్ర విసర్జన చేసే సమయంలో అతడికి భరించలేని నొప్పి వచ్చేదట.. అయితే అది సాధారణ ఇన్ఫెక్షన్ లేదా చిన్నపాటి సమస్యగా భావించిన చెన్.. ఆసుపత్రికి వెళ్లకుండా స్థానికంగా దొరికే మందులను వాడుతూ కాలం వెళ్ళదీశాడు.. అలా మూడేళ్ల పాటు నరకయాతన అనుభవించేశాడు. ఇటీవలే కాలంలో ఆ నొప్పి మరింత తీవ్రం కావడంతో.. తట్టుకోలేక స్థానిక పెద్ద ఆసుపత్రిని ఆశ్రయించేసాడు.. 

బాధితుడికి స్కానింగ్‌తో పాటు ప్రత్యేకమైన ఎక్స్‌రే నిర్వహించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.. అతడి మూత్రాశయం మొత్తం ఒక పెద్ద భారీ రాయితో నిండి ఉండటాన్ని గమనించారు.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో.. నిపుణులైన సర్జన్ల బృందం అత్యవసరంగా ప్రత్యేకమైన సర్జరీ నిర్వహించింది. గంటల పాటు శ్రమించి.. అతని పొట్ట భాగం నుంచి ఆ భారీ రాయిని బయటకు తీశారు.. ఆ బయటికి తీసిన రాయి వింత రంగులో కనిపించడం విశేషం..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఇలా బయటికి తీసిన రాయిని బరువు తూచగా.. ఏకంగా 1.3 కిలోల బరువు ఉన్నట్లు తేలింది.. ఇంత పెద్ద రాయిని కడుపులో పెట్టుకొని మూడేళ్ల పాటు ఎలా భరించాడో అని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం కావడంతో రైతు చెన్ కోరుకుంటున్నాడని.. ఆ నరకం నుంచి విముక్తి లభించిందని వైద్యులు వెల్లడించారు. నీరు తక్కువగా తాగడంతో పాటు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల, వివిధ రకాల జీవనశైలి అలవాట్ల వల్ల ఇలాంటి రాళ్లు ఏర్పడతాయని.. నొప్పి వస్తే నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా వైద్యులు హెచ్చరిస్తూ వస్తున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top