Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Peddapalli505188

కరీంనగర్‌లో బతుకమ్మ పండుగ: మహిళల ఆనందం మరియు సంబురాలు!

Oct 03, 2024 06:29:23
Kamanpur, Telangana
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఇందిరానగర్ కాలనీలో పరిధిలో ఎర్రకోటలో ఆడపడుచులు ఆనందంతో బతుకమ్మ పాటలతో, కోలాటాలతో సంబురంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మను బుధవారం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించారు. బతుకమ్మ వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడపడుచులు మహిళలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 14, 2026 16:01:43
Nunna, Vijayawada, Andhra Pradesh:

School Holiday Tomorrow: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి మరుసటి రోజును ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ (GAD) ఉత్తర్వులు జారీ చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజున విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఫిబ్రవరి 16, 2026 (సోమవారం) మహాశివరాత్రి తర్వాతి రోజున ఆప్షనల్ హాలిడే గా ప్రకటించారు. అంటే, సెలవుల జాబితా ప్రకారం అర్హత ఉన్న వారు ఈ సెలవును వాడుకోవచ్చు.

ఎందుకు ఈ నిర్ణయం?
సాధారణంగా మహాశివరాత్రి నాడు శివాలయాల్లో భక్తులు రాత్రంతా 'లింగోద్భవ కాల' పూజలు, జాగరణలు నిర్వహిస్తారు. రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మరుసటి రోజున కార్యాలయాలకు లేదా విధులకు హాజరుకావడం ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. భక్తులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ వెసులుబాటు కల్పించింది.

సెలవుల క్యాలెండర్‌లో మార్పులు
ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే సాధారణ సెలవుల, ఐచ్ఛిక సెలవుల (Optional Holidays) జాబితాలో భాగంగా ఈ అప్‌డేట్‌ను చేర్చారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి (ఆదివారం) సందర్భంగా సాధారణ సెలవు ఉండగా..  ఫిబ్రవరి 16న శివరాత్రి తర్వాతి రోజు (సోమవారం) ఆప్షన్ హాలీడేని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఉత్తర్వులతో శివ భక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని, మరుసటి రోజున హాయిగా విశ్రాంతి పొందే అవకాశం కలిగింది. అయితే ఇది ఐచ్ఛిక సెలవు కాబట్టి, ఆయా కార్యాలయాల నిబంధనలకు లోబడి దీనిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Also Read: Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!

Also Read: Gold Investment India: భారత్‌లో రూ.452 లక్షల కోట్ల పసిడి..ప్రపంచంలోనే అత్యధికంగా 'బంగారు'కొండలు ఇక్కడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 14:33:43
Nunna, Vijayawada, Andhra Pradesh:

Free Admission In Private School In AP: ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. విద్యా హక్కు చట్టం (RTE) - 2009 కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల వేల రూపాయల ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడే పేద కుటుంబాలకు తమ పిల్లలను నాణ్యమైన స్కూళ్లలో చదివించే అవకాశం లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) కోసం ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

రిజర్వేషన్ల వివరాలు (25% కోటా)
మొత్తం కేటాయించిన సీట్లలో వివిధ వర్గాలకు కింది విధంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ (SC) కేటగిరీలో 10 శాతం, ఎస్టీ (ST)కి 4 శాతం, బీసీ మైనారిటీలు & ఇతరులు 6 శాతం,  అనాథలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు 5 శాతంగా నిర్ణయించారు.

దరఖాస్తుకు ఉండాల్సిన అర్హతలు
1) గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి.
2) పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
3) వయోపరిమితి విద్యార్థికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
4) స్టేట్ సిలబస్ జూన్ 2, 2020 నుండి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
5) సీబీఎస్‌ఈ (CBSE) ఏప్రిల్ 1, 2020 నుండి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

అవసరమైన పత్రాలు
దరఖాస్తు సమయంలో కింది సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి.

దరఖాస్తు ఎలా చేయాలి?
అర్హులైన తల్లిదండ్రులు కింది మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తు చేయవచ్చు. ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం నుంచి పేద తల్లిదండ్రులను రక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా సందేహం ఉంటే 1800 425 899 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ALso Read; Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!

Also Read: AP Budget 2026 27: ఏపీ బడ్జెట్ 2026-27..రూ.3,32,205 కోట్లతో భారీ కేటాయింపులు..ముఖ్యాంశాలివే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 14:14:40
Hyderabad, Telangana:

Mahashivratri 2026 Shubh Muhurat: మహాశివరాత్రి 2026 పర్వదినం సందర్భంగా శివ భక్తులు పరమశివుని అనుగ్రహం కోసం వేచి చూస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 15, 16 తేదీల్లో రానుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పూజా ముహూర్తాలు, అభిషేక సమయాలు, పూజా విధానంపై పండితులు అందించిన సమగ్ర సమాచారం తెలుసుకుందాం. శివ-పార్వతుల కళ్యాణం జరిగిన ఈ పవిత్ర దినాన ఉపవాసం, జాగరణ, అభిషేకానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

ఉపవాసం, పూజా సమయాలు
ఉపవాస కాలం ఫిబ్రవరి 15 సాయంత్రం 5:04 గంటల నుండి ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34 వరకు ఉంటుందట. అలాగే ఉపవాస విరామం (పారణ) ఫిబ్రవరి 16 ఉదయం 6:59 నుండి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది.

జలాభిషేకానికి శుభ ముహూర్తాలు
శివరాత్రి నాడు శివలింగానికి జలాభిషేకం చేసేందుకు కింది సమయాలు అత్యంత అనుకూలమైనవి.

ఉదయం 6:14 – 7:14
ఉదయం 8:24 – 9:48
ఉదయం 9:48 – 11:11
ఉదయం 11:11 – మధ్యాహ్నం 12:35

అరుదైన యోగాలు - రాజయోగాలు
ఈ ఏడాది శివరాత్రి నాడు 10 పవిత్ర యోగాలతో పాటు కుంభరాశిలో అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శివయోగం, సర్వార్థసిద్ధి, లక్ష్మీ నారాయణ రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శశ మహాపురుష రాజయోగం. ఇవి భక్తుల జీవితాల్లో సుఖశాంతులను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

శివలింగ పూజా విధానం
ప్రారంభం: తెల్లవారుజామునే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి శివ పూజ సంకల్పం చేసుకోవాలి.

అభిషేకం: పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర), గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ "ఓం నమః శివాయ" మంత్రాన్ని జపించాలి.

పత్ర సమర్పణ: మారేడు దళాలు (బిల్వ పత్రాలు), శమీ పత్రాలు, ధత్తూరం, భాంగ్, తెల్లని పూలతో శివుడిని అర్చించాలి.

హారతి: శివరాత్రి కథను చదువుకుని లేదా విన్న తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి.

శివరాత్రి పురాణ విశిష్టత
ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు శివ-పార్వతుల వివాహం జరిగిందని, అందుకే ఈ రోజున పూజలు చేస్తే వైవాహిక జీవితం బాగుంటుందని నమ్మకం. సముద్ర మథనం లో పుట్టిన హాలాహలాన్ని మింగి లోకాన్ని రక్షించిన శివుడికి కృతజ్ఞతగా దేవతలు రాత్రంతా జాగరణ చేశారని, ఆ జ్ఞాపకార్థమే శివరాత్రి జాగరణ నిర్వహిస్తారు.

Also Read: AP Budget 2026 27: ఏపీ బడ్జెట్ 2026-27..రూ.3,32,205 కోట్లతో భారీ కేటాయింపులు..ముఖ్యాంశాలివే!

Also Read: Hardik Pandya Violation: బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు లవర్‌తో ఇలా! వేటు తప్పదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Feb 14, 2026 13:12:32
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యోగా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తేవాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్, గోలేటి సర్పంచ్ ఏ బాబురావు అన్నారు. శనివారం గోలేటిలోని సి ఈ ఆర్ క్లబ్ లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన ఎంపిక పోటీల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లాలోని ఆరు మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్ యోగాసన, రిథమిక్ యోగాసన అంశాలలో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21 నుంచి 23 వరకు హైదరాబాదులోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగు సీఎం కప్ యోగాసన పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ తిరుపతి యోగా గురువు బోయ ఉమారాణి ప్రోగ్రాం కన్వీనర్ కుమ్మరి మల్లేష్ సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవితేజ తదితరులు పాల్గొన్నారు.
0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 12:46:15
Hyderabad, Telangana:

 Cobra Video Watch Here: ప్రస్తుతం చాలామంది అడవుల్లో నుంచి జనావాసాలకు సమీపంలోకి వచ్చే పాములను రెస్క్యూ చేసి అడవుల్లో వదిలి పెడుతున్నారు. ఈ సమయంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రాణాలకు తెగించి మరి అత్యంత పెద్ద ప్రమాదకరమైన పాములను కూడా పట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కాటేయడానికి ప్రయత్నించిన పాముల నుంచి కూడా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటనాలకు సంబంధించిన అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉంటారు. తాజాగా కూడా ఓ వీడియోలో ఇదే ఘటన రిపీట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన నాగుపాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో.. అది వెనక్కి తిరిగి కాటేయడానికి ప్రయత్నించడం మీరు వీడియోలో చూడొచ్చు.. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఓ వన్యప్రాణి సంరక్షకుడు సమాచారం మేరకు.. ఘటన స్థలానికి వెళ్ళాడు.. అక్కడ ఆయన ప్రమాదకరమైన నాకు పామును గుర్తించి.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించే సమయంలో ఇది జరిగింది..

ఈ వీడియోలో ఆ ప్రమాదకరమైన నాగుపాము ఒకచోట ఉండడం.. అది కెమెరా వైపు చూస్తూ ఉండడం దాని వెనక ఆ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. అయితే, ఇదే సమయంలో ఆ భావం ఒక్కసారిగా అతని వైపు తిరిగి.. దాని తోకను పట్టుకున్న అతని చేతిపై కాటేసేందుకు ప్రయత్నించింది. దీనిని ముందుగానే భావించిన అతను.. వెంటనే ఎంతో జాగ్రత్తని వదిలిపెట్టి చేతులు పైకి చాచాడు.. దీంతో ఆ పాము కాటు బారి నుంచి అతను తప్పించుకోగలిగాడు..

 
 
 
 
 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.. కాబట్టి వన్యప్రాణి సంరక్షకులు పాములను పట్టుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు చూస్తూ పట్టుకోవడం మేలని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పాముకాటుకు గురై తీవ్ర గాయాల పాలైన వారు కూడా ఉన్నారు.. కాబట్టి పాములను పట్టుకునే క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ.. వాటిని రక్షించడం మంచిది.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన చాలామందికి సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాలు కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 12:32:01
Hyderabad, Telangana:

 Cobra On Nandi Video Viral: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు మహాశివరాత్రి ఒకటి. శివపార్వతుల కళ్యాణం ఇదే రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే హిందువులంతా.. దీనిని పవిత్రమైన రోజుగా భావించి శివపార్వతులను పూజిస్తారు. ఈరోజు అందరూ భక్తిశ్రద్ధలతో స్వామిని పూజించడమే కాకుండా ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇక ఈరోజు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. భారీ ఎత్తున భక్తులంతా శివుడికి సంబంధించిన ఆలయాలను సందర్శించి.. జాగారాలను పాటిస్తూ ఉంటారు. ఇంతటి ప్రత్యేకమైన పండుగకు ముందు రోజే ఓ శివాలయంలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము నందిపై పడక విప్పి దర్శనం ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నాగుపాము ఓ చిన్న ఆలయంలో శివలింగం ముందు ఉన్న నందీశ్వరుడిపై పడగవి దర్శనమిచ్చింది. మహాశివరాత్రికి ముందు రోజే ఇలా జరగడం చాలా విశేషమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది భక్తులు వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించగా.. ఓ స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుంది. అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది..

 
 
 
 
 

రెస్క్యూ ఆపరేషన్..
ఓ స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని చూడగా.. ఆ పాము శివలింగం ముందు ఉన్న నందీశ్వరునిపై పడగవిప్పి ఆడుతూ కనిపించింది. అయితే, ఆ యువతి ఆ పాముని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ఆ పామును పడుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చాలామంది అక్కడికి తరలివచ్చారు. ఆ స్నేక్ క్యాచర్ చాలా నెమ్మదిగా నందీశ్వరుడి పై ఉన్న పామును ఎడమ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాము తోకను నెమ్మదిగా వెనక్కి లాగి.. దానిని పట్టుకుని ఎందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో పాము దాడి చేసేందుకు యత్నిస్తుంది..

ఆ నాగుపాము చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల.. పట్టుకునే సమయంలో యువతిపై దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఆ యువతి ఏమాత్రం భయపడకుండా.. ఆ పామును ఎలాగోలా చేత్తో పట్టుకొని.. ఖాళీ ప్రదేశానికి తీసుకువచ్చింది. ఈ సమయంలో ఫామ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తోంది. దీనిని ముందుగానే గమనించిన ఆ యువతి వెంటనే ఆ పాము తోక పట్టుకొని.. ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 12:18:09
Hyderabad, Telangana:

Nava Panchama Raja Yogam Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మార్చి 9వ తేది చాలా శుభప్రదమైనది. ఎందుకంటే ఈ రోజు బుధుడితోపాటు గృహస్పతి గ్రహం 120 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. ఈ రెండు గ్రహాల ప్రభావంతో ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారు అద్భుతమైన  అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. 

120 డిగ్రీల కోణంలోకి రెండు గ్రహాలు రావడం వల్ల ఎంతో శక్తివంతమైన యోగాలు అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని రాశుల వారికి ఊహించని స్థాయిలో మేలు జరుగుతుంది. అయితే, ఈ సమయంలో ఏర్పడిన నవపంచమి రాజయోగంతో ఆర్థికంగా కూడా చాలా మేలు జరగబోతోంది. ఈ యోగం ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
మేష రాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

మిథున రాశి 
మిధున రాశి వారికి బృహస్పతి, బుధుడి అద్భుతమైన నవ పంచమి రాజయోగంతో వ్యక్తిగత జీవితం చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది. అలాగే ఎలాంటి పనుల్లోనైనా అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా కూడా మారవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సింహరాశి 
సింహరాశి వారికి నవ పంచమి రాజయోగం ప్రభావంతో సామాజిక స్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు లభిస్తాయి. పాత పెట్టబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలున్నాయి. అలాగే ఈ సమయంలో ఉన్నతాధికారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. 

తులారాశి 
తులారాశి వారికి చాలావరకు అదృష్టం కలిసి రాబోతోంది. ముఖ్యంగా వీరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

ధనస్సు రాశి 
బృహస్పతి ఎఫెక్ట్‌తో ధనస్సు రాశి వారికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి అనుకూలమైన రోజులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సొంత వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. కొత్త స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రయాణాలు చేసిన మంచి లాభాలు పొందుతారు.

Also Read:  Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

Also Read: Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 10:03:27
Hyderabad, Telangana:

Spa Center Telugu News: నగంలోని మసాజ్‌ సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముసుగును కేపీహెచ్‌బీ పోలీసులు రట్టు చేశారు.. చాలా రద్దిగా ఉండే స్థానిక నివాస ప్రాంతాల మధ్య వెలసిన ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అధికారిక సమాచారంతో పోలీసులు శనివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున నిందుతులు పట్టుబడటంతో పోలీసు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. KPHB పరిధిలోని అసాన వెల్ నెస్ స్పా కేంద్రంగా గత కొన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగుతోంది.. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో నిర్వాహకులు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా పురుషులకు యువతులతో క్రాస్‌ మసాజ్‌ చేస్తామంటూ సోషల్ మీడియాల్లో విటులను ఆకర్శిస్తున్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి.. వారికి అధికంగా డబ్బు ఆశచూపి.. ఈ వ్యభిచార రూపంలోకి  దించుతున్నట్లు విచారణలో తెలిసింది. 

Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!

గత కొన్ని రోజులుగా ఈ స్పాపై పోలీసు నిఘా ఉంచిన్నట్లు తెలుస్తోంది.. అయితే, శనివారం మధ్యహ్నం ఆకస్మికంగా లోపలికి ప్రవేశించి.. ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. వీరు మసాజ్‌ సెంటర్‌ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను చూసి పోలీసులు అధికారులు ఆశ్చర్యపోయారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన మసాజ్‌ సౌకర్యాల కంటే.. అసాంఘిక కార్యకలాపాలకు అనుగుణంగానే ఈ గదులు రూపొందించిన్నట్లు వారు గుర్తించారు. 

ఈ ఆకస్మిక మెరుపు దాడుల్లో పోలీసులు దాదాపు 15 మందికి పైగా యువతులను సురక్షితంగా రక్షించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిని పునరావాస కేంద్రాలకు కూడా తరిలించిన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
IPInamdar Paresh
Feb 14, 2026 09:13:24
Hyderabad, Telangana:

 Delhi woman jumps from fourth floor hotel after argument with boy friend: యువతీ, యువకులు ఎక్కడ చూసిన వాలెంటైన్స్ డే సంబరాల్లో మునిగితెలుతున్నారు. కొంత మంది తమ ప్రియమైన వాళ్లతో ఈ రోజు ఎంజాయ్ చేసేందుకు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తుంటారు. తమ వారికి లవ్ ను ప్రపోజ్ చేస్తారు. ఇదంతా ప్రతిఏటా జరిగిదే. కొంత మంది ప్రేమను యాక్సెప్ట్ చేస్తే ఆనందంతో పొంగిపోతే, మరికొంత మంది తమ ప్రేమను ఒప్పుకోలేని ఆవేశంతో ఎదుటివారిని చంపడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం చేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల యువతి ఏకంగా నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేసింది. 

 

ఢిల్లీలోని ఫర్ష్ బజార్ ప్రాంతంలోని  ఒక హోటల్‌ ఉంది. అందలో యువతి, తన ప్రియుడితో కలిసి నాలుగో అంతస్థులోని గదిలో దిగారు. అయితే.. వీరిద్దరు వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ ఇంతలో వారి మధ్య ఏంగొడవ ఏంజరిగిందో కానీ ఆమె శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హోటల్ విండో నుంచి కిందకు దూకేసింది. ఆమె గటట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు.

ఇంతలో ఆమె లక్ బాగుండి ఆమె నెల మీద కాకుండా అక్కడ ఉన్న కాటున్ డబ్బాలలో పడింది. దీంతో స్వల్పగాయలలో బైటపడింది. వెంటనే ఆమెను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేశారు.

Read more: Women Beneficiaries: మహిళలకు బంపర్ జాక్‌పాట్.. ఎన్నికల వేళ వారి అకౌంట్‌లో ఏకంగా రూ. 5000లు జమా.. డిటెయిల్స్..

యువతి ప్రేమను యువకుడు రిజక్ట్ చేశాడని అందుకే ఆమె నాలుగో అంతస్తు నుంచి దూకేసిందని అక్కడి వారు చెబుతున్నారు. తనను ఇన్నాళ్లు ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలిసి ఈ విధంగా తన ప్రాణాలు తీసుకొవాలని సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెబుతున్నారు. మొత్తంగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 08:22:42
Karimnagar, Telangana:

Bandi Sanjay Latest Telugu News:  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా.. బీఆర్ఎస్,  కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న అక్రమ సంబంధం బట్టబయలైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ, కుట్రలతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఈ మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..

కరీంనగర్ ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు.. స్వతంత్ర అభ్యర్థులు కూడా చేరడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. కానీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు కలిసినా కనీసం 26 సీట్లు కూడా రాలేదు. అయినా.. మేయర్ పదవి కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నారు" అని బండి సంజయ్ విమర్శించారు. ప్రజల తీర్పుకు విరుద్ధంగా కుట్రలు చేస్తే ఒక్క నేతను కూడా రోడ్లపై తిరగనివ్వమని.. ఒక్కొక్కరిని ఉరికిస్తామని ఆయన హెచ్చరించారు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో మహిళలకు ఇస్తానన్న రూ.2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులకు త్వరలో ఇస్తామని అన్న రూ.4,000 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఉద్యోగుల DAలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కోసం లక్షలాది మందిని రోడ్లపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు.

MIMను ఒక జీవం లేని పార్టీగా అభివర్ణించిన ఎంపీ బండి సంజయ్‌.. రజాకార్ల వారసత్వాన్ని మోస్తున్న ఆ పార్టీకి పునరుజ్జీవ ఉత్సవాలు జరుపుకునే అర్హత లేదని స్పష్టం చేశారు.. భాగ్యనగరాన్ని మూడు ముక్కలు చేసి MIMకు రాసివ్వాలని సీఎం చూస్తున్నారని, హైదరాబాద్ ఎవరి సొంత ఆస్తి కాదని హెచ్చరిక చేశారు. అలాగే ఇప్పుడు ముస్లిం మహిళలు చాలా మంది కూడా ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత మోదీ పాలనను కోరుకుంటున్నారని.. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో వారు బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్‌ తెలిపారని పేర్కొన్నారు.

నాడు రెండు ఎంపీ సీట్ల నుంచి నేడు కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చామని గుర్తు చేస్తూ.. 2028లో తెలంగాణలో BJP జెండా ఎగరడం ఖాయమని ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర నిధుల నుంచి రూ.1,400 కోట్లు తెచ్చామని.. చేసిన అభివృద్ధిని బుక్‌లెట్ రూపంలో ఇంటింటికీ పంపామని బండి సంజయ్ వివరించారు.

Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RGRenuka Godugu
Feb 14, 2026 08:05:12
Hyderabad, Telangana:

Free Bus Announced To Physically Challenged In Budget 2026-27: ఏపీ 2026 -27 బడ్జెట్‌లో దివ్యాంగులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని 'ఇంద్ర ధనస్సు' పేరుతో అమలు చేయనున్నట్లు పేర్కొంది. అయితే దివ్యాంగులకు ఇప్పటికే 50 శాతం సబ్సిడీతో ఏపీఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. ఈ స్కీం అమలు చేస్తే మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం లభిస్తుంది. అయితే, ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో అధికారిక ప్రకటన చేయలేదు.

 ఇక దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఏడాది కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు లక్షల పై దివ్యాంగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ఇక ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సులను ప్రయాణాన్ని అమల్లోకి తీసుకువచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

 అయితే గత ఏడాది ఈ ఉచిత సౌకర్యానికి సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత శాఖకు పంపించామని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత ఏడాది లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు రెండు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇందులో ఇప్పటికే వీరు 50 శాతం రాయితీ బస్సు ప్రయాణ సమయంలో పొందుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా రూ.180 కోట్లు ఖర్చు చేస్తోంది. 

 ఇక ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించిన ఏపీ కూటమి సర్కార్. ఈ దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే దివ్యాంగులైన మగవారు కూడా ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం పొందుతారు. అయితే, ఎప్పటి నుంచి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని కూడా ఇచ్చారు. ప్రధానంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి  రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. 

రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా..
అందులో మూలధన వ్యయం రూ.53,915 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు

ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రూ.9.74 లక్షల కోట్లు అప్పుతో ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. మేం చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్న ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అనేక సవాళ్లు ఉన్న అభివృద్ధి సంక్షేమంపై మా లక్ష్యాలలో మార్పు లేదు అని ప్రకటించారు.

Also Read: ఏపీ బడ్జెట్ లెక్కలకు వేళయా.. ఏ రంగానికి ఎన్ని నిధులు..?

Also Read: ఏపీ బడ్జెట్ హైలెట్స్.. ఈ శాఖలకు భారీగా నిధులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 07:45:37
Hyderabad, Telangana:

Huawei Mate 80 Pro Launch: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ హువావే మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ హువావే మేట్ 80 ప్రో పేరుతో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే హువావే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్‌ నెలలో చైనాలో ప్రవేశపెట్టింది. ఈ హువావే మేట్ 80 ప్రో మొబైల్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌ను కూడా కలిగి కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని కెమెరా మాడ్యుల్‌ రింగ్‌ డిజైన్‌తో రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ హువావే స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్పేస్ రింగ్ డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా విడుదలయ్యే ఈ హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ చైనా మోడల్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యుల్‌తో పాటు XMAGE అనే బ్రాండింగ్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ డాన్ గోల్డ్ రంగులో మాత్రమే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు  డిస్ప్లే స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు సమాచారం..

ఫిబ్రవరి 26వ తేదిన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరగబోయే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హువావే వాచ్ జిటి రన్నర్ 2తో పాటు మరికొన్ని పరికరాలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.75-అంగుళాల LTPO AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రొటెక్షన్ కోసం ఇందులో కున్లున్ గ్లాస్‌ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌  కిరిన్ 9030 ప్రో ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా చాలా శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ RYYB ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అదనంగా 40-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు 48-మెగాపిక్సెల్ మాక్రో టెలిఫోటో కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఇందులో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అలాగే 3D డెప్త్-సెన్సింగ్ కెమెరా సెటప్‌ కూడా అందుబాటులో ఉంటుంది.  

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 07:17:09
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP Budget 2026 27 Highlights: ఏపీ అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14, 2026) 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ ఇది. గత ఆర్థిక వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ, వృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా, పారిశ్రామిక వృద్ధి, సంక్షేమ హామీలు, రాజధాని నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.

బడ్జెట్ అంచనాలు & వృద్ధి
మొత్తం వ్యయం రూ.3,32,205 కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి 11.75 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, 2025-26లో ఇది 10.75 శాతంగా ఉండవచ్చని అంచనా. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం 'జీరో పావర్టీ' (పేదరికం లేని రాష్ట్రం) సాధించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

కీలక రంగాలకు కేటాయింపులు
విద్య, వైద్య రంగాలకు ఈసారి బడ్జెట్‌లో సింహభాగం దక్కింది. రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది.
1) 'వీబీ జీ రామ్‌ జీ'- రూ.8,365 కోట్లు
2) గృహ నిర్మాణం- రూ.5,451 కోట్లు
3) ఎన్టీఆర్‌ వైద్య సేవ- రూ.4,000 కోట్లు 
4) జల్‌జీవన్‌- రూ.4,000 కోట్లు
5) స్వచ్ఛ భారత్‌ మిషన్‌- రూ.1,037 కోట్లు
6) విద్యుత్ రంగం - రూ.13,934 కోట్లు
7) రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలకు - రూ.13,546 కోట్లు
8) పరిశ్రమలకు - రూ.3,161 కోట్లు 
9) పాఠశాల విద్యాశాఖ - రూ.32,308 
10) ఎస్సీ కాంపోనెంట్ - రూ.20,644 
11) ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ - రూ.19,306 
12) జల వనరుల శాఖ - రూ.18,224 
13) మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి - రూ.14,539 
14) ఎనర్జీ (విద్యుత్ శాఖ) - రూ.13,934 
15) వ్యవసాయ, అనుబంధ రంగాలు - రూ.13,598 
16) హోమ్ శాఖ - రూ.9,165 
17) అన్నదాత సుఖీభవ - 6600 కోట్లు 
18) పోలవరం- 6105 కోట్లు
19) రాష్ట్రీయ కృషి వికాస్ యోజన  - 1927 కోట్లు
20) మత్స్యకార సేవలో - 260 కోట్లు
21) ధరల స్థిరీకరణ నిధి  - 500 కోట్లు
22) క్రాప్ ఇన్సూరెన్స్  - 250కోట్లు
23) పీఎం కృషి సించాయి యోజన - 190 కోట్లు
24) పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్- 22,941 కోట్లు 

Also Read: Hardik Pandya Violation: బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు లవర్‌తో ఇలా! వేటు తప్పదా?

Also Read: Gold Investment India: భారత్‌లో రూ.452 లక్షల కోట్ల పసిడి..ప్రపంచంలోనే అత్యధికంగా 'బంగారు'కొండలు ఇక్కడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 06:56:09
Hyderabad, Telangana:

Sangareddy Telugu News: మున్సిపల్‌ ఎన్నికల వేళ కొన్ని పార్టీలు భారీగా డబ్బులు పంచాయి. కొన్ని చోట్ల దాదాపు ఓటుకు రూ.2 వేయిలు పంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల వేళ అందిన డబ్బును ఓ వ్యక్తి దాచుకుంటే..గుర్తుతెలియని వ్యక్తులు దానిని దొంగతనం చేయడంతో మనస్థాపానికి గురైన అతన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింద. జోగిపేట పట్టణానికి చెందిన ఆశోక్‌ అనే యువకుడు తన వద్ద ఉన్న డబ్బులు పోవడంతో తీవ్ర ఆవేదన చెంది.. సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలపడం స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఇటీవలే జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కొంత మొత్తంలో అశోక్‌కు డబ్బులు అందినట్లు తెలుస్తోంది. అలాగే ఆ యువకుడు పొందిన డబ్బులతో మంచి స్మార్ట్‌ఫోన్‌ కూడా కొనుక్కోవాలని అనుకున్నారట.. కూలి పనులు చేసుకుంటూ జీవించే అశోక్‌.. తనకు వచ్చిన డబ్బులను ఓ చోట దాచుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అలా అతను దాచుకున్న డబ్బులను ఎవరో దొంగిలించారు. 

శుక్రవారం ఉదయమే ఆశోక్‌ నిద్రలేచి చూసేసరికి ఆతను ఓ చోట పెట్టిన డబ్బు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయిన్నట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించినా.. ఎన్నికల వేళ వచ్చినా.. ఫోన్ కొనాలన్న తన కల నెరవేరకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై.. పట్టణంలోని ఒక సెల్ టవర్ పైకి ఎక్కాడు.

అయితే, అశోక్‌ వెంటనే ఇంటికి దగ్గరలో ఉన్న సెల్ టవర్‌కి ఎక్కేసాడు.. అతను కిందకు దూకేస్తానని కేకలు వేయడంతో స్థానికులు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, స్థానికంగా ఉంన్న ప్రజలు వెంటనే పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. "డబ్బులు పోతే పోయాయి, ప్రాణాలు ముఖ్యం.. కిందకు దిగు నాయనా.." అంటూ అక్కడున్న కొంతమంది నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆశోక్‌ దాదాపు గంటపాటు టవర్ పైనే ఉండి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చివరకు స్థానికులతో పాటు పోలీసులు ఇచ్చిన హామీతో ఆతను టవర్‌పై నుంచి కిందికి దిగివచ్చాడు.

పాపం ఆ కుర్రాడు.. కష్టం చేసి, ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బులను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు.. దొంగలు ఆ డబ్బును దోచుకెళ్లడం అతను తట్టుకోలేపోయాడు.. అంటూ స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేయడం విశేషం.. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 06:14:43
Colombo, Western Province:

Hardik Pandya Girlfriend In Colombo: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఆయన ప్రవర్తన బీసీసీఐ (BCCI) నిబంధనలను ఉల్లంఘించేలా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్ట్‌లో తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి కనిపించడమే ఇప్పుడు ఈ దుమారానికి కారణమైంది. పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, హార్దిక్ వ్యక్తిగత వ్యవహారం జట్టు క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు స్వాగతం పలుకుతున్న సమయంలో.. అర్ష్‌దీప్ సింగ్ డాన్స్ చేస్తున్న వీడియోలో హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి టీమ్ బస్సు ఎక్కుతూ కనిపించారు. మిగిలిన ఆటగాళ్లంతా ఒంటరిగా వస్తే, హార్దిక్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా గర్ల్‌ఫ్రెండ్‌ను వెంట తెచ్చుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీసీసీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా ఐసీసీ మెగా టోర్నీల సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి బీసీసీఐ కఠిన రూల్స్ పెడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ వరల్డ్ కప్ గ్రూప్ దశలో భార్యలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను వెంట తెచ్చుకోవడానికి బోర్డు అనుమతి ఇవ్వలేదు. పర్యటన 45 రోజుల కంటే ఎక్కువ ఉంటేనే ఫ్యామిలీకి పరిమిత రోజులు (14 రోజులు) అనుమతి ఉంటుంది. కానీ హార్దిక్ నేరుగా టీమ్ అఫీషియల్ బస్సులోనే ఆమెను తీసుకురావడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు.

కోచ్ గంభీర్ రియాక్షన్?
భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాక్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో విభేదాలు లేదా ఏకాగ్రత లోపించే చర్యలను గంభీర్ సహించరనే పేరుంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే భారీ జరిమానా లేదా హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది.

మైదానంలో తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు వెన్నెముకగా నిలిచే హార్దిక్, ఇలాంటి వివాదాల వల్ల విమర్శల పాలవుతున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ముందు ఇలాంటి చర్చలు రావడం జట్టు వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Also Read: Gold Investment India: భారత్‌లో రూ.452 లక్షల కోట్ల పసిడి..ప్రపంచంలోనే అత్యధికంగా 'బంగారు'కొండలు ఇక్కడే!

Also Read: Bhopal Septic tank Murder: ప్రేమికుల రోజున ఘోర విషాదం..ప్రియురాలిని చంపి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన లవర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top