Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Peddapalli505188

కరీంనగర్‌లో బతుకమ్మ పండుగ: మహిళల ఆనందం మరియు సంబురాలు!

Oct 03, 2024 06:29:23
Kamanpur, Telangana
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని ఇందిరానగర్ కాలనీలో పరిధిలో ఎర్రకోటలో ఆడపడుచులు ఆనందంతో బతుకమ్మ పాటలతో, కోలాటాలతో సంబురంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మను బుధవారం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించారు. బతుకమ్మ వేడుకలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆడపడుచులు మహిళలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 31, 2026 17:32:21
Thiruvananthapuram, Kerala:

India vs New Zealand: వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత జట్టు టీ20లో అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుని పొట్టి క్రికెట్‌లో తిరుగులేదని నిరూపించింది. హ్యాట్రిక్‌ విజయాల అనంతరం నాలుగో మ్యాచ్‌ కోల్పోయిన భారత్‌ ఐదో మ్యాచ్‌లో దుమ్ములేపింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన టీమిండియా బౌలింగ్‌లో కొంత తడబడినా చివరకు మంచి స్కోర్‌తో విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌కు ఉత్సాహంగా వెళ్లనుంది.

తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. మరోసారి సంజూ శాంసన్ తీవ్ర నిరాశపర్చి 6 పరుగులకే ఔటయ్యాడు. ఇక ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ బాదాడు. 43 బంతుల్లో 103 పరుగులు చేయగా.. 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. మూడో మ్యాచ్‌లో తృటిలో కోల్పోయిన సెంచరీని ఈ మ్యాచ్‌లో పూర్తి చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 30 బంతుల్లో 63 పరుగులు చేసి మెరవగా.. హార్దిక్ పాండ్య (42) మెరిశాడు.. అభిషేక్ శర్మ 30 పరుగులకే పరిమితమయ్యాడు. సూర్యకుమార్, ఇషాన్ మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. 

రింకూ సింగ్ 8 బంతుల్లో 8 పరుగులు, శివం దూబే 2 బంతుల్లో 7 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించారు. భారత స్కోర్‌కు కళ్లెం వేయడంతో కివీస్‌ బౌలర్లు విఫలమయ్యారు. లాకీ ఫెర్గూసన్‌ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించగా.. జాకబ్‌ డఫీ, కేల్‌ జేమిసన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ 225 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయినా చివరి మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలని బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మరో ఓటమిని పొందింది. బ్యాటింగ్‌ చేసిన వారిలో ఫిన్‌ అలెన్‌ సెంచరీకి చేరువై ఔటయ్యాడు. 38 బంతుల్లో 80 పరుగులు చేయగా.. ఇష్‌ సోధి (33), రచిన్‌ రవీంద్ర (30) కొంత పోరాడారు. తర్వాతి బ్యాటర్లు అంత ప్రభావం చూపకపోవడంతో కివీస్‌ జట్టు మ్యాచ్‌ను కోల్పోయింది. భారత్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 5, అక్షర్ పటేల్ 3, వరుణ్‌, రింకు సింగ్‌ చెరో ఒక వికెట్ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 17:04:59
Mahbubnagar, Telangana:

Nitin Nabin Sinha Telangana Visit: 'బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ మార్గదర్శనంలో తెలంగాణ బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం' మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునేలా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని.. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. 'మహబూబ్ నగర్ ఎంపీగా నన్ను గెలిపించారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలి' అని సూచించారు. తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున పుంజుకుంటోందని.. యువత బీజేపీ వైపు చూస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పని చేద్దామని పార్టీ శ్రేణులతో ఎంపీ డీకే అరుణ తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కోసం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నూతన అధ్యక్షులు నితిన్ నబీన్ సిన్హా రాబోతుండడంతో ఎంపీ అరుణ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఎంపీ అరుణ మాట్లాడుతూ.. 'పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలను ఉద్దేశించి జాతీయ అధ్యక్షుడు సందేశం ఇస్తారు. ఒక యువ నాయకుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సిన్హా పార్టీ శ్రేణుల్లో ఈ సమావేశంతో స్పూర్తి నింపుతారు' అని తెలిపారు.

'ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఈ సమావేశం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగే ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరవుతుండటం సంతోషకరం' అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. 'ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల పక్రియ తెలంగాణలో కొనసాగుతుంది. 3వ తేదీ నాటికి నామినేషన్ విత్ డ్రా గడువు ముగుస్తుంది. జిల్లా కార్యకర్తల సమావేశానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఏర్పాట్లు ప్లాన్ చేసేందుకు, సభ స్థలాన్ని పరిశీలించాం' అని వెల్లడించారు. 

జాతీయ అధ్యక్షుడు రానున్న సమావేశానికి ఉమ్మడి జిల్లాతోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నలుమూల నుంచి బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, మోర్చ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరై  విజయవంతం చేయాలి' అని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:51:30
Hyderabad, Telangana:

42 Percent BC Reservation: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఎన్ని టికెట్లు ఇస్తుందో స్పష్టంగా ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పించని పార్టీలు బీసీ ద్రోహులు అని ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు బీఫామ్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన ఓ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లింది. పార్టీలపరంగా బీసీలకు జనాభా దామషా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలి' అని డిమాండ్ చేశారు. జనరల్ స్థానాలలో ఇప్పటికే నామినేషన్ వేసిన బీసీలకు బీఫామ్‌లు ఇవ్వాలని కోరారు. జనరల్ స్థానాలలో బీసీలకు అవకాశం కల్పిస్తేనే జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా దక్కుతుందని తెలిపారు. 

'బీసీలను రాజకీయంగా అణిచి వేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో బీఫామ్‌లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాయి. సర్వేల పేరుతో బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం' అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పిస్తామని రాజకీయ పార్టీలు స్పష్టమైన తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. లేకపోతే బీసీ ద్రోహుల పార్టీలుగా చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. కాగా రేవంత్ రెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిక్లరేషన్‌ ఇచ్చి... మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు బీసీలను ఘోరంగా మోసగించడాని రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:28:20
Tadepalli, Andhra Pradesh:

Ambati Rambabu vs TDP Goons: దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా చంద్రబాబు? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు  ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా?' అని ప్రశ్నించారు. 'చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చట్టం, న్యాయం అనే పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని చంద్రబాబు సృష్టించారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. 

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు దాడి చేసిన వీడియోను పోస్టు చేసి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు' అని మండిపడ్డారు. 'చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

'తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. భక్తుల మనోభావాలను గాయపరచడంతో ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబును చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

'ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం.. తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేయించడమే చంద్రబాబు నియంత స్వభావానికి, దుర్మార్గానికి   నిదర్శనం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కరుడుగట్టిన గూండాగా.. ఓ నియంతగా చంద్రబాబు తయారయ్యారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఈ వైఖరి అత్యంత ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులపై జరుగుతున్న దాడులు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను కూడా విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 16:06:38
Guntur, Andhra Pradesh:

TDP Goons vs Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి తీవ్ర సంచలనం రేపగా.. ఈ దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. గుంటూరులో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ కోరింది. డీజీపీకి ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి.. దాడికి పాల్పడిన వారితోపాటు వెనుక నుంచి కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

Also Read: Daughter In Law: డామిట్‌ కథ అడ్డ తిరిగింది.. అత్తారింటికే కన్నం వేసిన కోడలు

ఏపీ డీజీపీకి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సెంట్రల్‌ ఆఫీస్ ఇంఛార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. 'అంబటి రాంబాబు నివాసాన్ని చుట్టుముట్టి గుండాలు, అసాంఘిక శక్తులు దాడికి పాల్పడడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి కుట్ర పన్నారు' అని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఇది యాదృచ్ఛిక ఘటన కాదు… రాజకీయ ప్రేరేపిత హింసకు పరాకాష్ట అని స్పష్టం చేసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకే భద్రత లేకుండా పోయిన పరిస్థితి రాష్ట్రంలో ఎంతటి అరాచక పాలన కొనసాగుతుందో స్పష్టమవుతోందని వైఎస్సార్సీపీ పేర్కొంది. గుండాలు, రౌడీలను రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహిస్తున్న శక్తుల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది.

'టీడీపీ గూండాలు దాడి చేస్తున్న సమయంలో పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్వీర్యతకు, పాలన వైఫల్యానికి అద్దం పడుతోంది' అని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగి.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నంపై తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని.. దాడికి పాల్పడిన వారితో పాటు వెనుక నుంచి కుట్ర పన్నిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పూర్తి స్థాయి భద్రత కల్పించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. హింస, బెదిరింపులు, దాడులతో వైఎస్సార్సీపీని అణచివేయడం ఎవరి వల్లా కాదని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులను నొక్కివేయాలనే ఈ అరాచక ప్రయత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. చట్ట వ్యవస్థను ధ్వంసం చేసిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:44:02
Guntur, Andhra Pradesh:

YS Jagan Phone Call: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై తెలుగుదేశం పార్టీ గూండాల దాడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపుతుండగా.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. తమ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ మూకలు, గూండాలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. అంబటి నివాసంపై దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించి ఫోన్‌ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబుని ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయి' అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఉద్దేశపూక్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నం, దాడులకు దిగారని తెలిపారు. ఇవన్నీ ప్రజలు మొత్తం చూస్తున్నారని.. ఈ అరాచక పాలనను ప్రజలు సహించబోరని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ మొత్తం అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులకు వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబుకు అండగా నిలబడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక అంబటి రాంబాబు నివాసానికి భద్రత కల్పించాలని.. అంబటికి ప్రాణహానీ పొంచి ఉందని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా డీజీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మెయిల్‌ చేశారు. అంబటి రాంబాబుకు తక్షణమే కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ గూండాల నుంచి అంబటి రాంబాబుకు ప్రాణహాని పొంచి ఉందని మెయిల్‌లో తెలిపారు. కాగా ఫోన్‌కాల్‌లో ప్రయత్నించగా స్పందన లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:24:46
Domakonda, Telangana:

In Laws House: తన సంసారం సాఫీగా జరగడానికి బంగారం, ఆస్తి కావాలని కోరుకున్న కోడలు తన అత్త ఇంటిలో దొంగతనానికి ప్లాన్‌ వేసింది. అత్తగారింట్లో దొంగతనం చేయడానికి ప్లాన్‌ వేసి కొందరిని మాట్లాడించి పంపించింది. అయితే దొంగతనానికి వెళ్లిన సమయంలో ఆ దొంగలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో కోడలి గుట్టు బయటపడింది. అత్తారింట్లో గౌరవంగా బతకాల్సిన కోడలు ఇప్పుడు జైలుపాలైంది. వైరల్‌గా మారిన ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా దోమకొండలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీన రాత్రి దోమకొండలోని బీసు రుకుంబాయి-కిష్టయ్య ఇంట్లోకి చొరబడ్డారు. దొంగతనం చేస్తున్న క్రమంలో వారి అలజడికి ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు నిద్రలేచారు. దొంగలను చూసి ఆ కుటుంబసభ్యులు కేకలు, అరుపులు వేయడంతో వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్రమత్తమై కేకలు వేయడంతో దోపిడీకి వచ్చిన ఇద్దరు పారిపోయారు. స్థానికులు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

దొరికిపోయిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం వాసి గోనే రజినీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. రజనీకాంత్‌ను విచారించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని సీఐ సంపత్‌ కుమార్‌ తెలిపారు. రజినీకాంత్‌ను  ఈ నెల 28వ తేదీన అరెస్టు చేయగా.. దొంగతనానికి వచ్చిన ఇద్దరు అన్నారం గ్రామస్తులు కేసరి తిర్మల్, కేసరి రాజేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కోడలి బండారం బయటపడింది.

దొంగతనం జరిగిన రుకుంబాయి చిన్న కుమారుడు నవీన్‌ భార్య మమత. చిన్న కోడలు మమత కాపురంలో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతేడాది మమత మెడలోని బంగారు పుస్తెల తాడు పోవడంతో ఆమె భర్త నవీన్ ఆమెపైనే అనుమానపడ్డాడు. దీంతో వారి సంసారంలో గొడవలు జరిగి ప్రస్తుతం మమత తన పిల్లలతో పుట్టింటిలో ఉంటోంది. ఇటీవల కాపురానికి రావడానికి ప్రయత్నాలు చేయగా.. ఏదైనా ఆస్తి తీసుకురావాలని భర్త, అత్తమామలు తెగేసి చెప్పారు. డబ్బులు తీసుకురాలేక ఈ విషయంలో మమత తన అత్త ఇంట్లోనే దోపిడీ చేయాలని తనకు పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులకు డబ్బుల ఎర చూపించి ఉసిగొల్పింది. పథకం ప్రకారం వారు దోపిడీకి పాల్పడ్డారని. ఈ కేసులో మమతతో పాటు ఇద్దరు పరిచయస్థులు తిర్మల్, రాజేష్ లను అరెస్టు చేసినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 13:20:36
Karimnagar, Telangana:

Karimnagar Municipal Corporation Elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. కరీంనగర్‌ మేయర్‌తోపాటు 3 చైర్మన్‌ స్థానాలు తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే చోట కార్యకర్తలకే సీట్లు ఇస్తున్నామని.. గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే ప్రత్యామ్నాయ నాయకులకు టికెట్లు ఇస్తున్నట్లు వివరించారు. టికెట్ రాని వారికి నామినేటెడ్, పార్టీ పదవులతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి అని సూచించారు. 

కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్‌ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ సమావేశమై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతోపాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయ అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

కరీంనగర్ కార్పొరేషన్‌లో 80 శాతంపైగా పార్టీకి కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు బండి సంజయ్‌ తెలిపారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని.. నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

'కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో. ఈ అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం చేయాలి' అని పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ సూచించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేసే బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. టికెకెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి డివిజన్‌లో గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి,  పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 12:46:53
Dhamsalapuram, Telangana:

CPI vs Congress Party: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. మిత్రపక్షం సీపీఐ బంధాన్ని తెంచేసుకుంది. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకోగా.. మరికొన్ని చోట్ల ఒంటరిగా బరిలోకి దిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సహకరిస్తున్నా కనీస గౌరవం ఇవ్వడం లేదని సీపీఐ కినుక వహించింది. దీనికితోడు క్షేత్రస్థాయిలో సీపీఐని గుర్తించకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు సీపీఐ ఝలక్‌ ఇచ్చింది.

మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా.. వారి తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కొన్ని మున్సిపాలిటీల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ నామినేషన్లు వేసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐకి  పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అన్నింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా అన్నీ డివిజన్‌లలో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐ చెరి సగం డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్‌ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సీపీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లలోనూ సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇల్లందులో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేశారు. ఇదే జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తోంది.

ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా 15 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేసింది. అయితే కాంగ్రెస్‌ సీపీఐ వేసిన డివిజన్లతోపాటు మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలతోపాటు మొత్తం అన్ని చోట్ల నామినేషన్లు వేసింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చెరో దారి చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. కాగా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పోటీలో దిగింది. అక్కడ గులాబీ, ఎర్రజెండాలు కలవడం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:40:26
Hyderabad, Telangana:

K Chandrashekar Rao: రాజకీయ కక్ష్యతోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌లో నోటీస్ ఇచ్చారని తెలిపారు. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్ కొడంగల్  అయితే గతంలో అధికారులు హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ మాత్రం అలా చేయక వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయమని హెచ్చరించారు.

Also Read: BRS Party Protest: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విచారణ.. రేపు బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసనలు

సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.'టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్‌పై వేధింపులు, సీరియల్ తరహాలో రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే అలీబాబా 40 దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు' అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరని తెలిపారు. 'ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హసనం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు' అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల పాలన కొనసాగిస్తోంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ వంటి అంశాలతో రెండున్నరేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ కోసం శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని.. నోటీసులతో భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

'సమ్మక్క–సారక్క అమ్మవార్ల జాతర ఆహ్వానాన్ని మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఇచ్చారు. విచారణకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు రావాలని సూచించినప్పటికీ కక్షపూరితంగా నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తామని చెప్పడం అన్యాయం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి సిట్ నోటీసులు గోడకు అతికించడం అవమానకరమని చెప్పారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎంత ఒత్తిడి తెచ్చినా టీఆర్ఎస్ నాయకులు భయపడరని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 11:34:47
Hyderabad, Telangana:

Snakes Temple Video Watch: సాధారణంగా పాములు కనిపిస్తేనే చాలు.. చాలామంది ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక గుడిలో మాత్రం మొత్తం పాములే ఉంటాయి. ఎటు చూసినా పాములు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు.. ఏ మాత్రం భయపడకుండా పారిపోకుండా వాటికి నమస్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణం తో పాటు గర్వాలయంలో లోపల కూడా పాములే దర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజు ఉదయాన్నే నాగుపాములు స్వయంగా గుడి లోపలికి వస్తాయట.. అంతేకాకుండా అక్కడి పూజారి ఆ పాములను భయపెట్టకుండా.. ఎంతో భక్తితో వాటికి కుంకుమ బొట్టు పెట్టి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ పాములన్ని పూజా సమయంలో చాలా ప్రశాంతంగా కూడా ఉంటాయని వారు అంటున్నారు. ఈ సమయంలో వచ్చే భక్తులకు కూడా ఆ ప్రమాదకరమైన పాములు ఎలాంటి హాని కలిగించమని వారు చెబుతున్నారు. 

అలాగే ఈ పాములన్ని గుడికి వచ్చే భక్తుల చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయట.. అవి ఎవరిని ఏమీ చేయవని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. పాములంటే భయం ఉన్నవారు ఈ గుడిలో కొంత జాగ్రత్తగా ఉండాలని అక్కడి స్థానికులు చెబుతారు. అలాగే ఈ గుడికి వచ్చిన కొంత మంది భక్తులు స్వయంగా పాములకు కుంకుమ తిలకం దిద్దుతారట. మరికొంతమంది అయితే, మరి కొంతమంది అయితే, వాటికి పాలు కూడా పోస్తారని సమాచారం. ఇలా ఆ పాములు ఎంతమంది భక్తులు వచ్చినా గుడిలో మాత్రం ప్రశాంతంగా ఉంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఆ గుడిలోకి వచ్చే భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారని.. అందువల్ల ఆ పాములు ఏమీ చేయమని సమాచారం. అలాగే అక్కడ పూజలు చేసే పూజలు కూడా వాటికి ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేసి అందిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ని ఓ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ కొన్ని లక్షలమంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి లైక్ కూడా చేశారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top