అవినీతి ప్రొఫెసర్ల పై చర్యలు తీసుకోండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Dinesh Karthik On Babar Azam: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్పై టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాబర్ను భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో పోల్చడంపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఘాటుగా స్పందించారు. పాకిస్థాన్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘోర విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో బాబర్ అజామ్ కేవలం 5 పరుగులకే (7 బంతుల్లో) పెవిలియన్ చేరడం చర్చనీయాంశమైంది.
అది కోహ్లీకి అన్యాయం చేసినట్లే!
దినేశ్ కార్తీక్ ఒక క్రీడా విశ్లేషణలో మాట్లాడుతూ.. బాబర్ను కోహ్లీతో పోల్చడాన్ని తప్పుబట్టారు. "చాలా కాలంగా బాబర్ను విరాట్తో పోల్చుతున్నారు, అది చాలా అన్యాయం. విరాట్ ఎప్పుడూ బాబర్లా నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం నేను చూడలేదు" అని కార్తీక్ వ్యాఖ్యానించారు. బాబర్ షాట్ సెలక్షన్ చాలా పేలవంగా ఉందని, అతడిలో జట్టును గెలిపించగలననే ఆత్మవిశ్వాసం కనిపించడం లేదని విశ్లేషించారు.
గొప్ప క్రికెటర్కు ఉండాల్సిన లక్షణాలను వివరిస్తూ కార్తీక్ కింది విధంగా అన్నారు. "ఒత్తిడిలో రాణించడమే గొప్ప ఆటగాడి లక్షణం. కానీ బాబర్పై నాకు ఆ నమ్మకం కలగడం లేదు. అతడిలో అత్యుత్తమ క్రికెటర్ లక్షణాలు నాకు కనిపించలేదు" ఇదే క్రమంలో యువ ఆటగాడు అభిషేక్ శర్మపై డీకే ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కోహ్లీ మెల్బోర్న్ ఇన్నింగ్స్..
విరాట్ కోహ్లీ ఒత్తిడిలో ఎలా ఆడతారో చెప్పడానికి 2022 టీ20 ప్రపంచకప్లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ మ్యాచ్లో కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశారు. 160 పరుగుల ఛేదనలో టీమ్ ఇండియాను ఒంటిచేత్తో గెలిపించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి ఇన్నింగ్స్లు ఆడటంలో కోహ్లీకి సాటి ఎవరూ లేరని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డారు.
Also Read: Best AC in India: వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా? 3-స్టార్ vs 5-స్టార్..మీ ఇంటికి ఏది బెటర్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nampally Court Latest News: హైదరాబాద్ నగరంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. భాగ్యనగరంలో అత్యంత ప్రధానమైన నాంపల్లి CBI కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చాయి.. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.. కోర్టు ప్రధాన బిల్డింగ్లో ప్రత్యేకమైన బాంబు అమర్చామని.. కొద్దిసేపట్లోనే బ్లాస్ట్ అవుతుందని వచ్చిన సమాచారంతో అటు పోలీసులతో పాటు ఇటు న్యాయవాదులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జరిగింది ఇదే..
బుధవారం ఉదయం కోర్టుకు సంబంధించిన అన్ని పనులు మొదలు కాగానే..కొద్దిసేపటికే అధికారులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.. అయితే, ఈ మెయిల్లో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కోర్టు ఆవరంలో బాంబ్ బ్లాస్ అవుతుందని రాశారు. అయితే, ఈ సమాచారం తెలిసిన వెంటనే నాంపల్లి పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీనికి ముందు జాగ్రత్తగా కోర్టు భవనంలోని నాయమూర్తులతో పాటు సిబ్బంది, న్యాయవాదులు వెంటనే బయటకు వచ్చారు. అంతేకాకుండా పోలీసులు వెంటనే ప్రాంగణాన్ని ఖాళీ చేశారు.
రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
పరిస్థితులు తీవ్రతరం కాకుండా ముందుగానే ఉన్నతాధికారులు కోర్టుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS)తో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా పంపించిన్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కోర్టులోని ప్రతి రూమ్ని, పార్కింగ్ ఏరియాను, క్యాంటీన్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనుమానాస్పద వస్తువుల కోసం అధికారులు అణువణువూ గాలించారు. ఈ సోదాల సమయంలో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో న్యాయవాదులు ఇబ్బంది పడినట్లు సమాచారం..
ఊపిరి పీల్చుకున్న అధికారులు..
కోర్టును మొత్తం తనిఖీలు చేసిన అధికారులు అనంతరం కోర్టులో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవవడంతో అధికారులు ఇది ఫేక్ మెయిల్గా తేల్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దార్యప్తు ప్రారంభించారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో? పంపిన వ్యక్తి ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
3 star or 5 Star AC Which Is Better: వేసవి కాలం వచ్చేస్తోంది.. భానుడి భగభగలకు చెక్ పెట్టేందుకు చాలా మంది ఏసీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏసీ కొనడానికి వెళ్ళినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సందేహం.. '3 స్టార్ ఏసీ తీసుకోవాలా? లేక 5 స్టార్ ఏసీ బెటరా?' అనేది. ఏసీ రేటింగ్ను భారతదేశంలో BEE (Bureau of Energy Efficiency) నిర్ణయిస్తుంది. స్టార్స్ ఎక్కువగా ఉంటే విద్యుత్ ఆదా అంత ఎక్కువగా ఉంటుందని అర్థం.
3-స్టార్ ఏసీ (తక్కువ ధర - ఎక్కువ బిల్లు)
3-స్టార్ ఏసీ దీని ప్రారంభ ధర 5-స్టార్ ఏసీ కంటే తక్కువగా ఉంటుంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. ఇది 5-స్టార్ ఏసీ కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఫలితంగా నెలవారీ కరెంటు బిల్లు భారంగా మారుతుంది. మీరు ఏసీని రోజుకు కేవలం 2-3 గంటలు మాత్రమే వాడితే లేదా సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉపయోగిస్తే 3-స్టార్ ఏసీ సరిపోతుంది.
5-స్టార్ ఏసీ (ఎక్కువ ధర - భారీ పొదుపు)
ఇది అత్యంత శక్తి సామర్థ్యం కలిగినది. 3-స్టార్ ఏసీతో పోలిస్తే కరెంటు బిల్లులో ఏటా వేల రూపాయలు ఆదా చేస్తుంది. దీని కొనుగోలు ధర 3-స్టార్ మోడల్ కంటే దాదాపు రూ.5,000 నుండి రూ.10,000 వరకు ఎక్కువగా ఉండవచ్చు. మీరు రోజుకు 6 నుండి 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీని ఉపయోగిస్తుంటే, 5-స్టార్ ఏసీయే బెస్ట్. మీరు పెట్టిన అదనపు పెట్టుబడి 2-3 ఏళ్లలోనే కరెంటు బిల్లుల పొదుపు రూపంలో తిరిగి వచ్చేస్తుంది.
స్టార్ రేటింగ్తో పాటు ఇవి కూడా ముఖ్యం..
కేవలం స్టార్ రేటింగ్ చూస్తే సరిపోదు, ఏసీ పనితీరు బాగుండాలంటే కింది విషయాలు గమనించాలి. గది చిన్నదైతే 1 టన్, మీడియం అయితే 1.5 టన్, పెద్ద హాల్ అయితే 2 టన్నుల ఏసీని ఎంచుకోవాలి. తప్పు టన్నేజ్ ఎంచుకుంటే 5-స్టార్ ఏసీ కూడా ఎక్కువ బిల్లును ఇస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా గదిలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
మంచి సర్వీస్ నెట్వర్క్ ఉన్న బ్రాండ్ను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో రిపేర్ ఖర్చులు తగ్గుతాయి. మీరు ఏసీని దీర్ఘకాలం (5-8 ఏళ్లు) వాడాలని ప్లాన్ చేస్తే, కళ్లు మూసుకుని 5-స్టార్ ఏసీ తీసుకోవడం తెలివైన పని. తక్కువ వాడకం ఉన్నవారికి మాత్రమే 3-స్టార్ ఏసీ ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madanapalle Child Murder Case: మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడు కులవర్ధన్ (30) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బాలికను అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, చివరకు కురబలకోట మండలంలో అతడి మృతదేహం లభ్యమైంది.
స్థానికుల కథనం ప్రకారం.. కురబలకోట మండలం కనసానివారి పల్లె చెరువులో నిందితుడు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి ఫోన్ చేయగా పాప కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. బాలిక చివరిసారిగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్తో కనిపించిందని పాప తాత సమాచారం ఇచ్చారు.
మంగళవారం ఉదయం కులవర్ధన్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా, నీళ్ల డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా పడి ఉంది. నిందితుడు పాపపై అత్యాచారం చేసి, ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపేసి, అదే గదిలో రాత్రంతా నిద్రపోవడం కలచివేసింది.
నిందితుడి నేర చరిత్ర
పోలీసుల విచారణలో నిందితుడు కులవర్ధన్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు తేల్చారు. ఇతనిపై గతంలో కూడా పలు క్రిమినల్ ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. గంజాయి మత్తులో ఏమీ తెలియని చిన్నారిపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనతో మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడు పోలీసులకు దొరకకముందే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Most Romantic Zodiac Signs Telugu: ప్రేమ అనే భావన రాశిచక్రాలపై కూడా ఆధారపడి ఉంటుందంటే మీరు నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే.. ఎందుకంటే రాశి ఫలాలపై కూడా కొన్ని సార్లు ప్రేమ, వ్యక్తిగత జీవితం ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఎల్లప్పుడు జీవితభాగస్వామితో ప్రేమగా కూడా ఉంటారు. అయితే, ఆ రాశులేంటో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారు ఎల్లప్పుడు ప్రేమగా ఉంటారు..
తుల రాశి:
తుల రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శృంగారభరితంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు మానసికంగా భాగస్వామితో చాలా సంతోషంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సంబంధాల్లో అవగాహన కూడా చాలా ప్రాముఖ్యతను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ ఎన్నో రకాలుగా పరిష్కారం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు చాలా సున్నితంగా ఉంటారు. అలాగే వీరు భాగస్వామితో కూడా ఎంతో ఆరోగ్యంగా జీవితం కొనసాగిస్తారు.
వృషభ రాశి:
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంచి భాగస్వాములు లభిస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ భాగస్వామి భావాలను కూడా ఎంతో సులభంగా బాగా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అభిప్రాయభేదాలు కూడా లభిస్తాయి. వీరు చిన్ని చిన్న విషయాల్లో కూడా భాగస్వామితో చాలా ప్రేమగా ఉంటారు. అంతేకాకుండా వీరు కుంటుంబ పట్ల బాధ్యతాయుతంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వృషభ రాశివారు చాలా సంతోషంగా జీవిస్తారు.
సింహ రాశి:
సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరు తమ ప్రేమను వక్తపరచడంలో ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా తమ భాగస్వామిని కూడా ఎప్పుడు ప్రశంసిస్తునే ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరు తమ భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు కూడా చాలా అసక్తి చూపుతూ ఉంటారు. వీరికి ప్రతిరోజూ కొత్త కొత్త సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. దీని వల్ల వీరు మనసులో ఉన్న ప్రేమను కూడా చూపించగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు భాగస్వామ్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు చాలా నిజాయితీపరులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వీరికి విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. వారు తమ భాగస్వాములతో ప్రేమగా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ రాశివారు భాగస్వామితో ఎల్లప్పుడూ ఒకరికొకరు ఎంతో అండగా కూడా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా పరిష్కారం అవుతూనే ఉంటాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Schools Holiday: తెలంగాణలోని ఓ ప్రాంతంలో రేపు స్కూళ్లు, కాలేజ్లకు బంద్ ఉండే అవకాశం ఉంది. జరుగుతున్న రాజకీయంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం.. 144 సెక్షన్ పెట్టి ఇతర రాజకీయ పార్టీలను వేధించడంతో పరిస్థితి భయానకంగా మారింది. దీంతో కాంగ్రెస్ దౌర్జన్యాలు.. నీచపు రాజకీయానికి వ్యతిరేకంగా రేపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీతోపాటు సీపీఐ బంద్కు పిలుపునిచ్చాయి. అది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి పట్టణంలో. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో ఆ బంద్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
Also Read: KCR Birthday Gift: ఐదుకు 5 క్లీన్ స్వీప్ విజయాలు కేసీఆర్ బర్త్ డే కానుక: కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఏం జరిగింది?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డులను బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ గెలిచాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్, సీపీఐ ఎన్నిక కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అడ్డుకుంటుంది. మెజార్టీ లేకపోయినా మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని కుట్ర.. దౌర్జన్యం.. అధికార బలంతో రాజకీయం చేస్తోంది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతోపాటు సీపీఐ కౌన్సిలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో మున్సిపల్ కార్యవర్గం ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. రెండో రోజు మంగళవారం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం.. అధికారులకు కూడా వంతపాడడం.. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, సీపీఐ క్యాతన్పల్లి బంద్కు పిలుపునిచ్చింది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
ఈ బంద్ ప్రభావంతో క్యాతన్పల్లిలో ఉన్న స్కూళ్లు, కాలేజ్లు కూడా బంద్ కానున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్యాతన్పల్లి రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల కవాతుతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏదో ఉగ్రవాదులు వచ్చినట్టు పెద్ద ఎత్తున బలగాలు మోహరించగా క్యాతన్పల్లిలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు ఏర్పడడంతో ఈ నేపథ్యంలో ఇచ్చిన బంద్తో ఇబ్బందులు ఎదురవుతాయని స్కూళ్లు, కాలేజ్లు బుధవారం పనిచేయకపోవచ్చు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా రేపు బుధవారం బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు కలిసి క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. 22 వార్డులు ఉంటే 7 వార్డులు గెల్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చైర్మన్ ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. ఈ దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు థూ.. అని ఉమ్ముతున్నారని తెలిపారు. 'గెలిచిన వారిని వారి సీట్లలో కూర్చోనివకుండా ఇదేం పద్దతి అని అడుగుతున్నా. కాంగ్రెస్ కార్యకర్తలకంటే అద్వాన్నంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కండువా వేసుకుని రేవంత్ రెడ్డి పాటకు డాన్సులు చేయండి' అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించారు.
'కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు తాగి వచ్చి మంత్రి వివేక్ ముందు మా మహిళా సభ్యులను తాకరాని చోట తాకారు.. చెత్తనా కొడుకులు. నువ్వు, నీ కొడుకు కూర్చొని.. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో మా సోదరీమణుల మీద దౌర్జన్యం చేపిస్తావా?' అని మంత్రి వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రి ఆధ్వర్యంలో ఆడబిడ్డల మీద దౌర్జన్యం జరిగింది.. ఒక్క మునిసిపల్ కౌన్సిల్ కోసం ఇంత దుర్మార్గమా? నువ్వు రిక్వెస్ట్ చేయ్ ఇచ్చి పడేస్తాం. మా ఆడకూతుర్లకంటే మాకు ఈ మున్సిపాలిటీ సీట్ ఎక్కువ కాదు' అని స్పష్టం చేశారు.
టెన్షన్.. హై టెన్షన్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దీంతోపోలీసులతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gudem Mahipal Reddy Gift To KCR Birthday: తన నియోవజకర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీల విజయాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కానుక అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన కాంగ్రెస్లో చేరి తిరిగి గులాబీ గూటిలోకి వచ్చేశారు. అధికారికంగా చేరకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తన పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీలు గెలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బుల్లెట్ దిగిందా లేదా? అని సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఐదు మున్సిపాలిటీలు కేసీఆర్ బర్త్డే కానుక అని ప్రకటించారు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించిన అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం. మీ వెనుక నేనున్నా అభివృద్ధిలో ముందుకు సాగండి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి' అని కొత్త మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. 'పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు పుట్టినరోజు కానుకగా అందించాం. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు' అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సహకరించిన కార్యకర్తలు, సంపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 1300 ఉద్యోగాల భర్తీకి సిద్ధం
'రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజం. ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులందరూ ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి' అని కొత్త పాలకవర్గాలకు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి సంక్షేమాల అంశంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని.. అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై పటాన్చెరు ప్రజలు ఎల్లప్పుడూ తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఐదు మున్సిపాలిటీలలోనూ.. బీఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని పేర్కొన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Govt Job Notifications: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దాదాపు 1300 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో బీసీ హాస్టళ్లలో 1,291 మంది పారిశుధ్య సిబ్బంది, 142 మంది కుక్ కమాటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 10 ఎంజేపీ బీసీ గురుకులాలను స్థాపించబోతున్నామని, ఆరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయబోతున్నట్లు తెలిపారు.
Also Read: KTR: సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు: కేటీఆర్
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సవిత స్పందిస్తూ సమాధానం ఇచ్చారు. 'బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నాం. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో వారికి అవకాశమిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో సముద్రంలో చేపల వేట ఉపశమన పథకం, తల్లికి వందనం, దీపం-2, ఆటో డ్రైవర్ సేవలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా ఫించన్ల కింద 1,59,99,934 మంది బీసీ లబ్ధిదారులకు రూ.31,331.25 కోట్లు అందించాం' అని సవిత వెల్లడించారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
బీసీలకు ఎన్టీఆర్, చంద్రబాబు రెండు కళ్లలాంటి వారని మంత్రి సవిత ప్రకటించారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని.. 2014-19లోనూ.. ఇప్పుడు బీసీలను అన్ని విధాల ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదరణ 1, ఆదరణ 2.0 పథకాలను అమలు చేశామని, త్వరలో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సవిత ప్రకటించారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని.. ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్త అనే పాలసీ ద్వారా బీసీలకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
Also Read: Manikonda Floods: వర్షం రాలేదు కానీ వరదొచ్చింది.. చెరువుగా మారిన మణికొండ
'పీఎం-యశ్వసీ పథకం కింద 3,05,840 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా రూ.145 కోట్లు విడుదల చేశాం. హాస్టళ్లు, గురుకులాల్లో యూపీఎస్ లు, ఆర్వో ప్లాంట్లు, దోమ తెరలు, వంటగది పాత్రలు వంటి సౌకర్యాలు అందించడానికి రూ.69.33 కోట్లు మంజూరు చేశాం' మంత్రి సవిత వెల్లడించారు. హాస్టళ్లలో 1,291 మంది పారిశుధ్య సిబ్బందిని, 142 మంది అదనపు వంటవారిని, కామాటీ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు(ఎంటీఎఫ్) కోసం రూ.420.72 కోట్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ (ఆర్టీఎఫ్) కోసం రూ.933.76 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Muhammad Yunus Bangladesh Telugu News: భారత్ను ఉద్దేశించి మరోసారి మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి నుంచి వైదొలుగుతున్న వేళ.. ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 18 నెలల పాలన ముగింపు సందర్భంగా ఆయన జాతి ఉద్దేశించి ప్రసంగించారు.. అలాగే భారత ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దౌత్య పరంగా ఇప్పుడు చర్చనీ అంశానికి దారితీసింది.
భారతదేశంలోని సెవెన్ సిస్టర్స్ అభివృద్ధికి బంగ్లాదేశ్ ఒక గేట్వేగా మారుతుందని యునెస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.. బంగ్లాదేశ్ తన సముద్ర మార్గం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు, నేపాల్ తో పాటు భూటాన్ లకు గొప్ప ఆర్థిక అవకాశాలను కల్పిస్తుందని.. ఆయన అన్నారు. అయితే మహమ్మద్ యూనస్ ఈ రాష్ట్రాలను భారతదేశ అంతర్భాగంలో ప్రస్తావించకుండా.. సెవెన్ సిస్టర్స్ అని విడిగా సంబోధించడంపై.. భారత విదేశీ వ్యవహారాలనుపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఆ రాష్ట్రాల ప్రత్యేక ఉనికి ఉన్న ప్రాంతాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే.. యూనస్ తన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
అయితే తన వీడ్కోలు ప్రసంగంలో భాగంగా యూనస్ చైనాకు పెద్దపీటవేశారు.. బంగ్లాదేశ్ కు బీజింగ్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు వ్యతిరేకమైన తీస్తా నది పునరుద్దీకరణ ప్రాజెక్టులలో చైనా సహకారాన్ని ఈ ప్రసంగంలో అతను కొనియాడారు.. బంగ్లాదేశ్ ఇకనుంచి ఏ దేశం పైన ఆధారపడదని.. అలాగే తమది లొంగిపోయే విదేశాంగ విధానం కాదని ఆయన ప్రసంగంలో తెలిపారు..
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
ఇక యూనస్ ప్రసంగంపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కాన్వాల్వ్ సింబల్ స్పందించారు.. ఈ ప్రసంగం వింటుంటే యూనస్ తెలితక్కువ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన మండిపడ్డారు.. దేశాన్ని ఉన్నత స్థాయిలో అభివృద్ధి పరచడంలో విఫలమైన యూనస్.. భారత్ ను ఒక విలన్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ విమర్శించారు. యూనస్ సమయంలో బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయని.. అలాగే హిందువులపై దాడులతో పాటు భారత్ వ్యతిరేక సెంటిమెంట్ పెరగడం వంటి అంశాలు ఈ దేశాల మధ్య దూరాన్ని పెంచుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ప్రధాని తారీక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jammu And Kashmir Alert Telugu News: జమ్మూ కాశ్మీర్లోని ఆర్ఎస్ పురాలోని జువైనల్ అబ్జర్వర్ హోమ్లో సోమవారం సాయంత్రం ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు బాల ఖైదిలు అక్కడి భద్రతా సిబ్బందిపై దాడి చేసి.. తుపాకీతో కాల్పులు జరిపి మరి తప్పించుకున్నారు. పరారైన వారిలో ఇద్దరు పాకిస్తాన్ కు సంబంధించిన బాల ఖైదీలు కూడా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు..
సోమవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలు పక్కా ప్రణాళికలతో కాపలాగా ఉన్న పోలీసులపై దాడికి దిగారు.. ఒక ఖైదీ వద్ద నాటు తుపాకీ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఖైదీల్లోని ముందుగా లోపల కాల్పులు జరిపి.. మిగిలిన పోలీసులను నెట్టేసి మరి బయటికి పారిపోయారు. ఈ ఖైదీలు వసతి గృహం నుంచి బయటికి వచ్చిన వెంటనే వారి దగ్గర ఉన్న తుపాకీతో ఓ వ్యక్తిని బెదిరించి మరి మోటార్ సైకిల్ లాక్కొని పరారయ్యారు.
పోలీసులందించిన సమాచారం ప్రకారం.. తప్పించుకున్న వారిలో స్థానికుడు కరంజిత్ సింగ్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ సునావుల్లా, అహసాన్ అన్వర్ ఉన్నారట.. వీరిపై గతంలో కొన్ని ప్రత్యేకమైన కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జువైనల్ హోమ్ లోపలికి తుపాకీ ఎలా వచ్చిందని అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.. ఇదిలా ఉంటే.. ఆ ఖైదీలు ప్రవీణ్ అనే హెడ్ కానిస్టేబుల్ పై తుపాకీతో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పక్కనే ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వినయ్ కుమార్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యా.. ముఖ్యంగా డిజిపి నలిన్ ప్రభాత్, ఐజి బీమ్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంబార్ జిల్లాతో పాటు జాతీయ రహదారి వైపు వెళ్లే మార్గాల్లో చెక్పోస్టుల ఏర్పాటుకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. అయితే ఇందులో ఇద్దరు పాకిస్తాన్ దేశానికి చెందిన వారు కావడంతో వారు సరిహద్దు దాటే అవకాశాలు ఉన్నాయని భావించి బిఎస్ఎఫ్ ను కూడా అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన ఉన్నతాధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR 72nd Birthday: 'తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని పోయిన జాతి ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ వేడుకలు తెలంగాణతోపాటు దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్లో జరిగిన తన తండ్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత' అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలిన రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
'రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది. బరిలో బందూక్ పట్టి దేశ్ముఖ్లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది' అని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
Also Read: Manikonda Floods: వర్షం రాలేదు కానీ వరదొచ్చింది.. చెరువుగా మారిన మణికొండ
'సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పుపాతర వేస్తామన్న కాళోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 1969లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి 369 మంది అసువులు బాసిన యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అణువణువునా ఆత్మగౌరవం తొణికిసలాడే జాతి మాది. నీతి ఉన్న, రీతి ఉన్న తెలంగాణ జాతి మాది' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్కు సీతక్క మాస్ వార్నింగ్!
'ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేము కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం, ఆ జాతి మాది.. సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది. బానిసకు ఒక బానిస జాతి కాదు, గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీ కీ ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. కిరాయి వాళ్ల పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న, సొంత శక్తి ఉన్న జాతి మాది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
'ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?' అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తున్న.. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి' అని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మీద, తెలంగాణ జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Manjeera Water Pipeline Burst: హైదరాబాద్లో ఆకస్మికంగా వరద వచ్చింది. ఐటీ ప్రాంతం వారు నివసించే మణికొండలో అకస్మాత్తుగా వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపించింది. మోకాల్లోతు నీళ్లు చేరడంతో మణికొండవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవికాలం ప్రారంభమవుతున్న సమయంలో భారీ వరద ముంచెత్తడం ఏమిటంటే.. హైదరాబాద్కు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ ఒక్కసారిగా పేలిపోయింది. పైపులైన్ పేలడంతో వరద ముంచెత్తింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
రంగారెడ్డి జిల్లా మణికొండలో మంజీరా నీటి పైప్లైన్ సోమవారం అర్ధ రాత్రి పేలిపోయింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మణికొండ పైప్లైన్ రోడ్డులో భారీ శబ్దంతో మంజీరా నీటి పైప్లైన్ పేలడంతో ఐదు నిమిషాల్లోనే అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు నిండిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు చర్యలు చేపట్టాయి. మణికొండ పైప్లైన్ రోడ్డులో ఈ ప్రమాదం జరగడంతో మంజీరా నీరంతా వృథాగా పోయింది.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్కు సీతక్క మాస్ వార్నింగ్!
లక్షలాది లీటర్ల మంజీరా నీరు పోటెత్తడంతో మణికొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆరు అడుగుల మేర నీరు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరింది. అపార్ట్మెంట్లలో పార్క్ చేసిన దాదాపు 7 నుంచి 8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి భారీగా దెబ్బతిన్నాయి. సెల్లార్లో ఉన్న వస్తువులు, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బలగాలు, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైప్లైన్ నీటిని వెంటనే నిలిపివేసి, సెల్లార్లలో ఉన్న నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించడంతో కొంత ప్రమాదం తప్పింది.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
నీటి సరఫరాకు ఆటంకం
భారీ పైపులైన్ పేలిపోవడంతో హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్కు తాగునీటి సరఫరా అందించే మంజీరా పైపులైన్ పగిలిపోవడంతో మణికొండతోపాటు చుట్టు పక్కల పరిసరాల ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఎదురవుతుందని సమాచారం. అధికారులు తక్షణమే మంజీరా పైపులైన్ మరమ్మత్తులు ప్రారంభించినా.. కూడా ఆ పనులు అయ్యేందుకు సమయం పడుతుందని.. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huge Cobra Video Watch: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిల్లో కొన్ని మనకు ఫన్నీగా అనిపిస్తే..మరికొన్ని మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే అప్పుడప్పుడు ఇంటర్నెట్లో కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఈ పాముల వీడియోలు నిత్యం ఒకటో రెండో తప్పకుండా వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కాలుకు అత్యంత భారీ నాగుపాము చుట్టుకొని ఉండడానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూర్చొని ఉండడం మీరు గమనించవచ్చు. అతని కాలుకు ఒక పొడవైన నాగుపాము గట్టిగా చుట్టేసుకొని ఉండటం కూడా మీరు చూడొచ్చు. సాధారణంగా మనకు చిన్న పాము కనిపిస్తేనే.. కేకలు వేస్తూ మరి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాం.. అలాంటిది ఈ వ్యక్తి కాలుకు అత్యంత ప్రమాదకరమైన భారీ నాగుపాము చుట్టుకొని ఉండడం చూస్తుంటే.. ఆ పరిస్థితి ఊహించడానికి భయానకారంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఆ వ్యక్తి ఏమాత్రం కంగారు పడకుండా.. చాలా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యమేస్తోంది..
అయితే, ఈ వీడియోలో పాము మాత్రం.. అతని కాలును ఏమాత్రం విడిచిపెట్టకుండా అలాగే పట్టుకొని ఉంది.. ఆ వ్యక్తి తన కాలును నెమ్మదిగా కదిలిస్తున్నప్పటికీ.. పాము మాత్రం అలాగే కదలకుండా ఉండిపోయింది.. దీన్ని చూస్తుంటే ఆ వ్యక్తి ఒక స్నేక్ క్యాచర్ అయి ఉండచ్చని.. నేటిజన్లు భావిస్తున్నారు. అందుకే అంత ప్రమాదకరమైన పాము అతని కాలుకు చుట్టుకుని ఉన్నప్పటికీ భయపడకుండా చాలా నిశ్శబ్దంగా.. నెమ్మదిగా కాలును కదుపుతూ ఉండిపోతున్నాడు..
ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాముల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. ఎంత స్నేక్ క్యాచర్ అయినప్పటికీ.. అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో.. ఎప్పుడు దాడి చేస్తుందో అనే విషయం ఎవరికీ తెలియదు.. కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు కూడా ఇదే చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మేలని వారంటున్నారు.. అయితే, ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook