అవినీతి ప్రొఫెసర్ల పై చర్యలు తీసుకోండి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Pawan Kalyan Tirupati Laddu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మరోసారి నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ (SIT) తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన వారు భగవంతుడికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, బుకాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ అంశంపై కీలక విషయాలను వెల్లడించారు.
రిపోర్టుల్లో నిజాలు ఏంటి?
నెయ్యి కల్తీపై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) ఇచ్చిన నివేదికలను పవన్ గుర్తు చేశారు. ఒక రిపోర్టులో చేప నూనె, మరొకటిలో జంతు కొవ్వు (పంది, గొడ్డు కొవ్వు), ఇంకొకటిలో పామాయిల్, కెమికల్స్ కలిసినట్లు స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
"ఎక్కడా సిట్ గానీ, సీబీఐ గానీ వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు. పాల కొవ్వుతో రావాల్సిన నెయ్యిలో రసాయనాలు ఉన్నాయని రిపోర్టులు చెబుతుంటే, క్లీన్ చిట్ అని ఎలా చెప్పుకుంటారు?" అని పవన్ నిలదీశారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులను పవన్ ఏకిపారేశారు. రామతీర్థం, పిఠాపురం ఘటనలను 'పిచ్చోళ్లు చేశారని' నమ్మబలికారని ఆరోపించారు.
దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోతే 'ఇంకోటి కొనుక్కోవచ్చు' అన్న అహంకారపూరిత వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 219 దేవాలయాలను అపవిత్రం చేసిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు. "సాధారణంగా మనుషులపై పగబడతారు, కానీ వైసీపీ వాళ్లు సాక్షాత్తూ భగవంతుడి మీదే పగబట్టారు" అని పవన్ వ్యాఖ్యానించారు.
మార్కెట్లో కేజీ నెయ్యి 400 రూపాయలకు పైగా ఉంటే, అంతకంటే తక్కువ ధరకే కొన్నారంటేనే అందులో కల్తీ ఉందనేది సామాన్య గృహిణికి కూడా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తిరుమల నుండే అయోధ్యకు లడ్డూలు పంపారని, అక్కడ కూడా ఈ అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకా హత్యతో పోలిక
వివేకా హత్య విషయంలో 'గుండెపోటు' అని ఎలాగైతే అబద్ధాలు ఆడారో, ఇప్పుడు నెయ్యి కల్తీ విషయంలో కూడా అలాగే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏడు కొండలు అక్కర్లేదు.. రెండు చాలు అన్న వాళ్లు ఏ స్థాయికైనా దిగజారుతారని పవన్ అన్నారు.
తప్పు చేసిన వారు భగవంతుడి ముందు మోకరిల్లి క్షమాపణ అడగాలని, లేనిపక్షంలో సర్వనాశనం అయిపోతారని పవన్ హెచ్చరించారు. కల్తీకి కారణమైన ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Cobra Snake Video Watch: ఓ గ్రామంలో ఇంటి ముందు ఉండే తులసి కోటలో ఓ భారీ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమవ్వడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తులసి మొక్కల మధ్యలో పాము నిశ్శబ్ధంగా నక్కి ఉండడం చూసిన ఇంటి సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్స్కి సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఓ ఇంటి ముందు తులసి కోట ముందుగా కనిసిస్తుంది. అయితే దానికే చుట్టుకుని ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము కనిపించడం మీరు చూడొచ్చు. చాలా శుభప్రదమైన తులసి కోటలో విషపూరీతమైన నాగుపాము కనిపించడంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఆ తులసి కోటలో పాము అత్యంత పొడవుగా.. పడగ విప్పి కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు.. అంతేకాకుండా ఈ పాము తులసి మొక్క కొమ్మల మధ్య అటు ఇటూ తిరగడం మీరు గమనించవచ్చు.. అంతేకాకుండా బుసలు కొట్టడం కూడా మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు..
స్థానికుల సమాచారం మేరకు వెంటనే మున్నా స్నేక్ రెస్క్యూయర్ అక్కడికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ బృదం ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ సమయంలో పాము ఆ స్నేక్ క్యాచర్పైకి పడగ విప్పి.. బుసలు కొడుతూ దాడి చేసేందుకు కూడా ప్రత్నించింది. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఏమాత్రం బయపడకుండా దాదాని ఎంతో సులభంగా నియంత్రించారు. అయితే, ఈ దృశ్యాలను చూడడానికి చాలా మంది అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
చివరికి ఆ స్నేక్ క్యాచర్ ఎంతో ప్రమాదకరమైన పామును ఎలాంటి హాని కలిగించకుండా.. ఎంతో సులభంగా సరక్షితంగా పట్టుకున్నారు. దీనిని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. ఆ తర్వాత ఈ పామును సురక్షితమైన ప్రదేశంలో వదిలి పెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pakistan Boycott India Match News: టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన భారత్-పాక్ పోరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీమ్ ఇండియాపై మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కుండబద్దలు కొట్టారు. బంగ్లాదేశ్కు మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది.
ఇస్లామాబాద్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని చెబుతూనే, భారత్తో తలపడకూడదనే నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
వివాదానికి అసలు కారణం ఏంటి?
ఈ నిర్ణయం వెనుక బంగ్లాదేశ్ అంశం ప్రధానంగా ఉంది. భారత్లో భద్రత సరిగా లేదని సాకు చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. దీనికి ఐసీసీ నిరాకరించడంతో బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. వారి స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. బంగ్లాకు సంఘీభావంగా, భారత్తో జరగాల్సిన కీలక మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
ఐసీసీ సీరియస్..పాక్కు భారీ నష్టం?
షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాక్ మొండివైఖరిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నచ్చిన జట్లతోనే ఆడతామనడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.
ఒకవేళ పాక్ గనుక మ్యాచ్ ఆడకపోతే ఆ జట్టుపై ఐసీసీ కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా, పాయింట్లను కోత విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వ్యూవర్ షిప్ వచ్చే ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే పాక్ క్రికెట్ బోర్డు భారీగా ఆదాయాన్ని కోల్పోనుంది.
క్రీడలను రాజకీయాలతో ముడిపెడుతూ పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేలా ఉంది. ఐసీసీ ఒత్తిడికి పాక్ తలొగ్గుతుందా లేక తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అనేది చూడాలి.
Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Grama Ward Sachivalayam Promotion: ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారి కెరీర్ ఎదుగుదలకు సంబంధించి కీలక ఉత్తర్వులను సిద్ధం చేస్తోంది.
ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం
సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల వేల మంది ఉద్యోగులకు హోదాతో పాటు వేతన పరంగానూ లబ్ధి చేకూరనుంది.
సచివాలయ వ్యవస్థలో పారదర్శకత, పనితీరును మెరుగుపరచడానికి 'మూడంచెల వ్యవస్థ'ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా బాధ్యతల విభజన, పర్యవేక్షణ మరింత సులభతరం కానుంది.
ఖాళీల భర్తీ, క్రమబద్ధీకరణ
ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బంది కొరత తీరడమే కాకుండా, సచివాలయ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి.
'స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు' లక్ష్యంతో సాగుతున్న ఈ సంస్కరణలు సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. త్వరలోనే ఈ ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: New Criminal Law: భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళితే భార్యకు 3 నెలలు జైలు శిక్ష!
Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Taliban New Law On Women: ఆఫ్ఘనిస్తాన్లో మహిళల స్వేచ్ఛపై తాలిబన్ ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే విద్య, ఉద్యోగాల విషయంలో అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న అక్కడి మహిళలకు, ఇప్పుడు వ్యక్తిగత ప్రయాణాల విషయంలోనూ కొత్త కఠిన చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
సాధారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడు లేదా మనస్పర్థలు వచ్చినప్పుడు భార్యలు తమ పుట్టింటికో లేదా బంధువుల ఇంటికో వెళ్లడం సహజం. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఇలా చేయడం ఇకపై నేరం కానుంది.
ఏంటీ కొత్త నిబంధన?
తాలిబన్ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏ మహిళ అయినా తన బంధువుల ఇంటికి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా తన భర్త నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. భర్త అనుమతి లేకుండా ఇల్లు దాటి బంధువుల దగ్గరకు వెళ్లినట్లు తేలితే, ఆ మహిళకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు.
ఎందుకు ఈ నిర్ణయం?
కుటుంబ వ్యవస్థను కాపాడటం, సంప్రదాయాలను గౌరవించడం అనే సాకుతో తాలిబన్లు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు జరిగినప్పుడు మహిళలు ఇల్లు వదిలి వెళ్లడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వారు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల కదలికలపై భర్తలకు పూర్తి నియంత్రణను కట్టబెట్టారని అంటున్నారు.
ఈ అమానవీయ చట్టంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో పార్కులు, జిమ్ములు, విద్యా సంస్థలకు దూరమైన ఆఫ్ఘన్ మహిళల ప్రాథమిక హక్కులను ఈ చట్టం పూర్తిగా కాలరాస్తోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
భర్త వేధింపులకు గురిచేస్తున్నా కూడా అనుమతి లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి కల్పించడం వల్ల మహిళల భద్రత గాలిలో దీపంలా మారుతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో రోజురోజుకూ మహిళలపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కొత్త జైలు శిక్ష నిబంధనతో అక్కడి స్త్రీలు తమ సొంత బంధువులను కలుసుకోవడానికి కూడా భయం నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!
Also Read: India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Actress Vahini Passed Away: తెలుగు బుల్లితెర, సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న నటి వాహిని (వాసవి అలియాస్ పద్మ) బుధవారం కన్నుమూశారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఆమెను చుట్టుముట్టడంతో చివరకు విజయనగరంలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. నటి వాహిని మరణవార్త పరిశ్రమలో కలకలం రేపింది. ముఖ్యంగా ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడిన తీరు అందరినీ కలిచివేస్తోంది.
సినీ ప్రస్థానం
1978లో విజయనగరంలో జన్మించిన వాహిని, 'జయ వాహిని' పేరుతో గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సీరియల్స్ ద్వారా గృహిణిలకు దగ్గరయ్యారు. 2019లో వచ్చిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో నరేష్ సరసన నటించారు. ఆమె చివరిగా 'బహిర్భూమి' అనే చిత్రంలో కనిపించారు.
ఆర్థిక కష్టాలు, అనారోగ్యం
వాహిని గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. చికిత్స కోసం తన వద్ద ఉన్నదంతా ఖర్చైపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా చితికిపోయారు. వాహిని దీనస్థితిని చూసి నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించారు. ఇండస్ట్రీలోని పలువురు నటులు ఆర్థిక సహాయం అందించినప్పటికీ, క్యాన్సర్ ముదిరిపోవడంతో పరిస్థితి విషమించింది.
వాహిని మరణవార్తను కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. "మా ఇళ్లు విజయనగరంలో పక్కపక్కనే ఉండేవి. చిన్నప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. నా సోదరిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ఫలితం లేకపోయింది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో, వైద్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను విజయనగరం తరలించగా, బుధవారం సాయంత్రం ఆమె ప్రాణాలు విడిచారు.
ఒకప్పుడు కెమెరా ముందు నవ్వుతూ కనిపించిన నటి, చివరకు వైద్యానికి కూడా డబ్బు లేని స్థితిలో ప్రాణాలు కోల్పోవడం సినీ రంగంలోని చీకటి కోణాన్ని ప్రతిబింబిస్తోంది. వాహిని మృతికి పలువురు టీవీ నటులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Aadhaar Update For Students AP: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఆధార్ వివరాల అప్డేట్ కోసం కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. విద్యార్థులు తమ విద్యా సంస్థల్లోనే ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.
చిన్న వయసులో ఆధార్ తీసుకున్న విద్యార్థులు, వయసు పెరిగే కొద్దీ తమ బయోమెట్రిక్ (వేలిముద్రలు, ఐరిస్) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని నిబంధన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లోనే ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది.
ఫిబ్రవరి నెల షెడ్యూల్ ఇక్కడే..
ఈ నెలలో రెండు విడతలుగా ఈ ప్రత్యేక క్యాంపులు జరగనున్నాయి.
మొదటి విడత: ఫిబ్రవరి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు.
రెండో విడత: ఫిబ్రవరి 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు.
బయట ఆధార్ సెంటర్లలో అప్డేషన్ కోసం రుసుము వసూలు చేస్తారు. కానీ, 5 నుండి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు ఈ స్కూల్ క్యాంపుల్లో ఉచితంగా అప్డేట్ చేయించుకోవచ్చు. గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా స్కూళ్లకు వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్ సెంటర్ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు, ప్రయాణ ఖర్చులు కూడా తప్పుతాయి.
ఎందుకు అప్డేట్ చేయించుకోవాలి?
చిన్నప్పుడు తీసుకున్న ఆధార్లోని బయోమెట్రిక్ వివరాలు పెద్దయ్యాక మారతాయి. వీటిని అప్డేట్ చేయకపోతే.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉన్నత చదువుల అడ్మిషన్లు, స్కాలర్షిప్ల దరఖాస్తుల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో ఆధార్ కార్డు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంది.
తెలంగాణలోనూ ఇదే సదుపాయం
ఏపీ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సంబంధిత మండల విద్యాశాఖాధికారిని (MEO) సంప్రదించవచ్చు.
విద్యార్థుల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ అప్డేట్ ద్వారా ప్రభుత్వ పథకాలు, విద్యా సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India America Trade Deal Latest News: అమెరికా-భారత్ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ వ్యవహరించిన తీరు ఇరుదేశాల మధ్య ఒప్పందానికి దారితీసిందని బ్లూమ్బర్గ్ తన కథనంలో పేర్కొంది.
బెదిరింపులకు తావులేదు
సెప్టెంబరులో అజిత్ డోభాల్, యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక సమావేశం జరిగింది. ఆ సమయంలో డోభాల్ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
"ట్రంప్ ప్రభుత్వం లేదా ఆయన సలహాదారులు ఇచ్చే టారిఫ్ హెచ్చరికలకు భారత్ భయపడదు. గౌరవప్రదమైన ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండటానికైనా మేము సిద్ధం" అని డోభాల్ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీపై లేదా భారత విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని భారత్ స్పష్టం చేసింది.
వెనక్కి తగ్గిన ట్రంప్ యంత్రాంగం
ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అంతకుముందు భారత్ను 'టారిఫ్ కింగ్' అని విమర్శించిన ట్రంప్, ఆ తర్వాత శాంతించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. బహిరంగ విమర్శలు తగ్గడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ గాడిలో పడ్డాయి, ఇది చివరకు వాణిజ్య ఒప్పందానికి దారితీసింది.
ఈ రహస్య చర్చలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. "ప్రైవేటుగా జరిగిన దౌత్యపరమైన చర్చల వివరాలను వెల్లడించలేము" అని పేర్కొంది. అటు భారత ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
భారత దౌత్య విజయం
ఒకప్పుడు అమెరికా ఒత్తిడికి ఇతర దేశాలు లొంగిపోయేవి. కానీ, ఈ ఉదంతం ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే అగ్రరాజ్యంతో సమాన స్థాయిలో చర్చలు జరిపింది.
Also REad: Peddi Postponed: బాబాయ్ కోసం రేసు నుంచి తప్పుకున్న అబ్బాయ్! పెద్ది సినిమా విడుదల వాయిదా..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Ghee Testing Lab Setup: తిరుమల శ్రీవారి భక్తులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ప్రసాదాలు, ఆహారం అందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో ముందడుగు వేసింది. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో, భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్ను టీటీడీ నిర్మిస్తోంది. ఈ కొత్త ల్యాబ్లో అత్యంత ఖరీదైన, ఆధునిక సాంకేతిక పరికరాలను అమర్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో 15 రకాల హైటెక్ పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేసింది.
హై ఫర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమోగ్రాఫ్ (HPLC), గ్యాస్ క్రోమటోగ్రాఫ్ (GC), ఐసీపీఎంసీ (ICPMC) వంటి పరికరాల ద్వారా ఆహారంలో కలిసే అతి సూక్ష్మమైన రసాయనాలను లేదా కల్తీ పదార్థాలను కూడా సులభంగా గుర్తించవచ్చు.
మార్చి నుంచే సేవలు ప్రారంభం
ప్రస్తుతం తిరుమలలో నీరు, ఆహార నాణ్యతను పరీక్షించే చిన్న ల్యాబ్ అందుబాటులో ఉంది. దానికి సమీపంలోనే ఈ కొత్త ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) ల్యాబ్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే మార్చి నెల కల్లా ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి ఇటీవలే పనులను పర్యవేక్షించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కల్తీ నెయ్యిపై సిట్ (SIT) విచారణ అప్డేట్
మరోవైపు, గతంలో జరిగిన నెయ్యి కల్తీపై ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తు కొనసాగిస్తోంది. కేవలం తిరుమలకే కాకుండా, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా 2022-23 కాలంలో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది.
విజయ డెయిరీ స్థానంలో వచ్చిన రాజేశ్ కార్పొరేషన్ సరఫరా చేసిన నెయ్యిలో రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికే తిరుమలలో ఈ పటిష్టమైన ల్యాబ్ వ్యవస్థను తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అన్నప్రసాదం నుండి లడ్డూ ప్రసాదం వరకు ప్రతిదీ నాణ్యంగా ఉండేలా చూడటం ద్వారా భక్తుల ఆరోగ్యం, సెంటిమెంట్ను కాపాడటమే ఈ ల్యాబ్ ప్రధాన ఉద్దేశం.
Also REad: Peddi Postponed: బాబాయ్ కోసం రేసు నుంచి తప్పుకున్న అబ్బాయ్! పెద్ది సినిమా విడుదల వాయిదా..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026 Effect On Zodiac: ఫిబ్రవరి 13న తేది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు మకరం నుంచి శని పాలించే కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారంతో కెరీర్, వ్యాపారాల పరంగా కొన్ని రాశులవారి జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా సూర్యుడి ప్రభావంతో కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వృత్తి, వ్యాపారాల పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా జీవితంలో ఎన్నడు పొందలేని అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే, ఈ సమయం ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
తుల రాశి
తుల రాశి వారికి ఈ సమయంలో బోలెడు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మీడియా, కళ, డిజైన్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులు భారీ లాభాలు పొందుతారు. పనుల్లో ప్రశంసలు కూడా పొందుతారు. విద్యార్థులు ఈ సమయంలో చదువుపై దృష్టి పెడుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది.
మేష రాశి
మేష రాశివారికి సూర్యుడి ప్రభావంతో ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాల పరంగా జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే అదనపు ఆదాయం కూడా తిరిగి పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు సీనియర్ల నుంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మిథున రాశి
మిథున రాశివారికి శక్తివంతమైన సూర్యుడి ప్రభావంతో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా పనుల్లో పదోన్నతలు కూడా లభిస్తాయి. వీరికి ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నవాయి. దీంతో పాటు ప్రయాణాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశివారికి కొత్త కెరీర్ ప్రారంభమవుతుంది. వీరికి భాగస్వామ్య జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు బంపర్ లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది అద్బుతమైన సమయంగా భావించవచ్చు. వీరు ఈ సమయంలో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన కెరీర్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూలు, సమావేశాల్లో పల్గొనేవారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. దీంతో పాటు విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. విద్యార్థులు మానసికంగా చాలా బలంగా తయారవుతారు. అలాగే ఆర్థికంగా కూడా మేలు జరగుతుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
కుంభ రాశి
కుంభ రాశివారికి కూడా ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. అలాగే నాయకత్వ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుటుంది. అంతేకాకుండా పనుల్లో బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఊహించని స్థాయిలో సూర్యుడి, శని ప్రభావంతో ఆర్థిక లాభాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR vs Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన అత్యంత నీచపు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏకవచనంతో సంభోదించడడంపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. హార్వర్డ్ స్కూల్లో 500 రోజులు కోర్సులు చేసినా సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి స్థానం మురికికాలువే అని తెలిపారు.
Also Read: Harish Rao: కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్ రెడ్డి ఆంధ్రా మోచేతి నీళ్లు తాగేవాడు
మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత దూషణలు.. నీచపు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడాన్ని తులనాడారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్పై మురికిమాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి పాలన చేతకాని వాడే విషం చిమ్ముతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. 'మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నోట్లో నుంచి పాలసీలు రావు. పథకాలు వినిపించవు. వచ్చేది ఒక్కటే మురికి భాష. హార్వర్డ్లో 5 రోజులు కాదు.. 500 రోజులు కోర్సులు చేసినా సంస్కారం నేర్చుకోకపోతే కుక్కతోక ఎప్పటికీ వంకరే' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి.. ఉద్యమాల్ని నడిపి.. రాష్ట్రాన్ని సాధించి.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన కేసీఆర్పై మురికిమాటలు మాట్లాడే నీ స్థానం మురికి కాలువే' అని మండిపడ్డారు.
Also Read: YS Jagan: 'ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. చంద్రబాబుది జంగల్ రాజ్ పాలన': వైఎస్ జగన్
పాలనలో చేతకాని వాడే ప్రచారంలో విషం చిమ్ముతాడు. అది అహంకార లక్షణం కాదు. నీ పూర్తి అసమర్థతకు గుర్తు' అని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. 'చరిత్రను సృష్టించిన నాయకుడిని మాటలతో తక్కువ చేయలేరు. మురికి భాష మాట్లాడేవాడు తన మానసిక దరిద్రతనే ప్రజల ముందు బహిర్గతం చేస్తాడు' తెలిపారు. 'కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే అది రాజవదు. అది సింహాసనానికే అవమానం. రాష్ట్రాన్ని సాధించినవాళ్లపై, రాష్ట్రాన్ని దారిలో పెట్టినవాళ్లపై నోరు విప్పే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ చరిత్రను నీ మాటలు మసకబార్చలేవని కానీ నీ స్థాయిని మాత్రం. నీ మాటలే తెలంగాణ ప్రజలకు రోజురోజుకీ మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి' అని కేటీఆర్ తెలిపారు.
Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్ జీ పేదల పొట్ట కొట్టే పథకం'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Harish Rao vs Revanth Reddy: 'కాంగ్రెస్ పార్టీకి గెలిచే దమ్ములేక.. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభపెట్టి పార్టీలు మారుస్తున్నారు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11వ తేదీలోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తారు.. నిన్ను చీర్చి చింత కడతారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచే దమ్ములేక గులాబీ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు.. వడ్డీతో సహా చెల్లిస్తాం గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. 'తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహా నాయకుడు కేసీఆర్.. పీసీసీ పదవిని రూ.50 కోట్లకు కొన్న చరిత్ర నీది. తెలంగాణ కోసం పదవులులేదని కాదు.. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్' అని వివరించారు.
Also Read: Revanth Reddy: రైతులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. ఎన్నికలు ముగియగానే రైతు భరోసా డబ్బులు
మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రసంగం చేశారు. మిర్యాలగూడ సభలో రేవంత్ రెడ్డి చేసిన నీచపు వ్యాఖ్యలపై హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాష, పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. అవ్వతాతలు రూ. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్? అని అడిగితే లాగుల తొండలు వదులుతా అంటావా?' అని మండిపడ్డారు.
Also Read: YS Jagan: 'ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ.. చంద్రబాబుది జంగల్ రాజ్ పాలన': వైఎస్ జగన్
'బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా! ఆడబిడ్డలు మహాలక్ష్మి రూ.2,500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం సాగదు ఖబడ్దార్' అని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా విసిరేసిన మహనీయుడు కేసీఆర్. కేసీఆర్ చెబితే మేము కూడా పదవులకు రాజీనామా చేసి ఆంధ్రా పాలకుల ముఖం మీద కొట్టినం. మరి నువ్వు? రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్ పంపిన దొంగవు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన ద్రోహివి' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్ జీ పేదల పొట్ట కొట్టే పథకం'
'కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తీసుకురావడంతోనే ఈరోజు సీఎం కుర్చీలో ఉన్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ.. బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పార్టీకి గెలిచే సత్తా ఉంటే మా అభ్యర్థులను ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? జనం మీకు ఓటు వేయరని అర్థమై పోలీసులతో బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కండువాలు కప్పుతున్నారు. ఎవరెవరు అమ్ముడుపోతున్నారో, ఎవరు ఎందుకు ఎత్తుకుపోతున్నారో అందరినీ గుర్తుపెట్టుకుంటాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం' అని హెచ్చరించారు.
'ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతు బంధు పడకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు తొడిగి ఏడిపిస్తారు. నిన్ను చీరిచింతకు చెండాడుతారు' అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. 'రుణమాఫీ పేరుతో దేవుళ్లనే మోసం చేసిన ఘనుడివి నువ్వు. నీ అబద్ధాలను రైతులు నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ వచ్చాక ఇక్కడ ఒక్క రూపాయి పని జరగలేదు. మెదక్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు' అని విమర్శించారు. కాంగ్రెస్ గూంండా రాజకీయాన్ని, మోసాలను ఎండగట్టండి అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
YS Jagan Press Meet: ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని.. జంగల్ రాజ్ పాలన రాష్ట్రంలో నడుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న విడుదల రజనీ, బొల్లా బ్రహ్మనాయుడు ఇప్పుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడి విషయంలో జంగల్ రాజు పాలన కనిపిస్తోందని మండిపడ్డారు. బిహార్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఏపీలో అలా జరుగుతోందని విమర్శించారు.
Also Read: Revanth Reddy: రైతులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. ఎన్నికలు ముగియగానే రైతు భరోసా డబ్బులు
గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, పోలీసుల వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? అరెస్ట్ చేశారు?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్ జీ పేదల పొట్ట కొట్టే పథకం'
తిరుమల లడ్డూ వివాదం బెడిసికొట్టడంతో తమ పార్టీ నాయకులపై దాడి చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబుని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అంబటి రాంబాబు మాదిరి దాడి చేశారని మండిపడ్డారు. తప్పుడు సమాచారాలతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో పంది మాంసం కొవ్వు ఉందని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తుంది. జంతు మాంసం కొవ్వు ఉందని మన వెంకటేశ్వర స్వామి పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. టీటీడీ నెయ్యి కల్తీపై ఎన్ డి ఆర్ ఐ కేంద్రానికి చెందిన ల్యాబులు టెస్టు శాంపిల్పై విశ్లేషణ చేశారు. ఇచ్చిన వివరణలో నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని నిర్ధారించారు' అని వైఎస్ జగన్ వివరించారు. తప్పు చేసి ఉంటే సీబీఐ ఛార్జ్షీట్లో కరుణాకర్ రెడ్డి పేరు, వైవీ సుబ్బారెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే వీళ్లని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
Also Read: Arava Sridhar: ఇది నాకు, వీణకు మధ్య వ్యక్తిగత సంబంధం: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
'సీబీఐ క్లీన్చీట్ ఇస్తుంది. ఎన్బీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబులు క్లీన్చీట్ ఇస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి ఈ కేసుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సీబీఐ విచారణకు ఆదేశించింది. వాళ్లు విచారణ చేపట్టి ఎవరూ తప్పు చేయలేదని నిర్ధారించారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ అనే వ్యక్తులు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరాలి' అని చంద్రబాబును వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. 'తప్పుడు సమాచారాలతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ఎవరికైనా ఉందా? ఇదే సమాచారంతో మేము ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా?' అని ప్రశ్నించారు.
Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం
'అబద్దాలు చెబుతూ మోసం చేస్తూ ప్రజలను వక్రీకరిస్తున్నారు. చంద్రబాబుని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబుకి జ్ఞానం రావాలని గుడిలో పూజ చేసి వస్తున్న సమయంలో ఏకంగా కట్టలు పట్టుకొని దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేసిన పరిస్థితి ఉంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'బూతులు తిడుతూ అంబటి రాంబాబు కారుపై దాడులు చేస్తే.. ఒక్కరిపై ఎంతమంది దాడి చేస్తే రాంబాబు వాళ్లు తిట్టిన బూతులకు ప్రతిస్పందించారు. ప్రతిస్పందించే సమయంలో ఒక్కడే ఉండడంతో సహనం కోల్పోయారని వివరించారు.
'మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రతిస్పందించే క్రమంలో బూతులు తిట్టారు. ఇంట్లో జరిగినదంతా మీడియా ముందు అంబటి రాంబాబు వివరించారు. సంస్కారం ఉన్న వ్యక్తిగా అంబటి రాంబాబు నేను తిట్టకుండా ఉండాల్సిందని వివరణ కూడా ఇచ్చారు. ఆయన చూపించిన సంస్కారానికి నిజంగా పొగడాలి. చాతనైతే పొగడాల్సిన వాళ్లు దానిని వక్రీకరిస్తూ ఇంటిపై దాడి చేశారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rythu Bharosa Scheme: మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి భారీ శుభవార్త ప్రకటించారు. రైతులకు సంబంధించిన పెట్టుబడి సహాయం పథకం రైతు భరోసాను మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తామని హామీ ఇచ్చారు. రానున్న బడ్జెట్లో మరింత మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మున్సిపాలిటీలను అద్దంలా చేస్తామని చెప్పారు. తాము ఇచ్చిన పథకాలను గుర్తుచేసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: YS Sharmila: 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం.. గ్రామ్ జీ పేదల పొట్ట కొట్టే పథకం'
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలం గూడూరులో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కీలక ప్రసంగం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Arava Sridhar: ఇది నాకు, వీణకు మధ్య వ్యక్తిగత సంబంధం: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
'పదేళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 3.15 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ కార్డులపై ఇచ్చిన దొడ్డు బియ్యం మిల్లర్లు, బర్రెలకు దాణాగా మారింది. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అన్నారు. సన్నధాన్యం పండించండి బోనస్ ఇస్తామని మేం అన్నాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను దోచుకున్నారని.. పెళ్లాం మొగుడు మాట్లాడుతున్నా ఫోన్లు విన్నారని ఆరోపించారు.
Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం
'ఫోన్ ట్యాపింగ్ వింటే పోలీసులు నోటీసులు ఇచ్చారు. నీకు నోటీసు ఇస్తే తెలంగాణలు ఇచ్చినట్లేనా. అలా అయితే మీ ఫాం హౌసులు తెలంగాణ సమాజానికి ఇస్తారా' అని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం చనిపోయి శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పారు. తెలంగాణ సమాజం ఎదుట ముక్కు నేలకు రాయాలని ప్రతిపక్షాలకు సూచించారు.
'ఆనాడు బతుకమ్మ చీరలు ఇస్తే పిట్టలను బెదిరించడానికే పనికి వచ్చాయి. జానారెడ్డి ఇంట్లో చెప్పులు మోసినోడు భాస్కర్ రావు. కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే ఎర్రవెల్లిలో కేసీఆర్ కాళ్ల వద్ద మిర్యాలగూడ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిండు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తున్నావట భాస్కర్ రావు చింతపండు అవుతుందని హెచ్చరించారు. జానారెడ్డిలా తమకు పెద్ద మనుసు లేదని.. భాస్కర్ రావుకు చింతపండు చేస్తామని పునరుద్ఘాటించారు. అవతలి వాళ్లను గెలిపిస్తే మున్సిపాలిటీల్లో పనులు కావని రేవంత్ రెడ్డి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Peddi Release Postponed: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఉన్న బాబాయ్-అబ్బాయ్ అనుబంధం మరోసారి నిరూపితమైంది. రామ్ చరణ్ తన పుట్టినరోజు కానుకగా విడుదల కావాల్సిన తన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదలను వాయిదా వేసుకున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న 'పెద్ది' చిత్రం వాస్తవానికి రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే, బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం చరణ్ వెనక్కి తగ్గారు.
కారణం ఏంటి?
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మార్చి 26న విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు తలపడితే థియేటర్ల లభ్యత తగ్గి, కలెక్షన్లపై ప్రభావం పడుతుందని రామ్ చరణ్ భావించారు. అందుకే బాబాయ్ సినిమాకు పూర్తి స్థాయిలో థియేటర్లు ఉండాలనే ఉద్దేశంతో తన సినిమాను ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.
ఏప్రిల్ 30న 'మెగా' జాతర
సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న 'పెద్ది' ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మార్చిలో పవన్ కల్యాణ్, ఏప్రిల్లో రామ్ చరణ్ చిత్రాలతో మెగా అభిమానులకు రెండు నెలల పాటు పండగే అని చెప్పాలి.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'అచ్చమ్మ' అనే పాత్రలో నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.
వ్యక్తిగత కారణాలు కూడా..
సినిమా రిలీజ్ వాయిదాకు మరో కారణం కూడా ఉంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు (ఒక పాప, ఒక బాబు) జన్మించారు. తన పిల్లలతో విలువైన సమయాన్ని గడపడం కోసం రామ్ చరణ్ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. బాబాయ్ సినిమాకు దారి వదిలి రామ్ చరణ్ చూపిన ఈ చొరవపై అటు మెగా అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook