అవినీతి ప్రొఫెసర్ల పై చర్యలు తీసుకోండి
Hyderabad, Telangana:జేఎన్టీయూ యూనివర్సిటీలో అవినీతికి పాల్పడుతున్న ప్రొఫెసర్ల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు MSF నేతలు. ఈ సందర్భంగా జేఎన్టీయూ యూనివర్సిటీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు . నాణ్యమైన విద్య అందించాల్సిన యూనివర్సిటీ అవినీతికి పాల్పడుతున్నారని వెంటనే వారి పైన సమగ్ర విచారణ చేపట్టి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు ప్రస్తుతం ఉన్న ఇంఛార్జ్ వీసీ బుర్ర వెంకటేశంకి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Palnadu Railway Projects: పల్నాడు జిల్లా అభివృద్ధికి మరో ముందడుగు..ఎంపీ చొరవతో రూ.84 కోట్ల రైల్వే నిర్మాణాలను గ్రీన్ సిగ్నల్!
Sattenapalle, Andhra Pradesh:MP Lavu Srikrishna Devarayalu: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మార్గం దొరికింది. నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవతో కేంద్ర రైల్వే శాఖ రెండు భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల (ఫ్లైఓవర్ల) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.84.09 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు తలపెట్టిన ఈ పనులకు సంబంధించిన ఈ-టెండర్ నోటిఫికేషన్ను దక్షిణ మధ్య రైల్వే (గుంటూరు డివిజన్) శనివారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పెదకూరపాడు, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. స్పందించిన రైల్వే శాఖ వెంటనే అనుమతిలిచ్చిందని వెల్లడించారు. పల్నాడు అభివృద్ధికి సహకరించిన రైల్వే అధికారులకు ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నిర్మించనున్న ROBల వివరాలు..
పెదకూరపాడులోని రైల్వే స్టేషన్ యార్డ్ పరిధిలోని రైల్వే గేటు (LC నంబర్ 27) స్థానంలో 2-లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. అలాగే సత్తెనపల్లి - రెడ్డిగూడెం.. ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే గేటు (LC నంబర్ 40) స్థానంలో మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు.
ఈ రెండు ప్రతిష్టాత్మక బ్రిడ్జిల నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు నరసరావుపేట ఎంపీ స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి.. ఏడాదిన్నరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే రైళ్లు వచ్చే సమయంలో వాహనాలు గంటల కొద్దీ ఆగాల్సిన అవసరం ఉండదు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, ప్రయాణికులు సురక్షితంగా, వేగంగా వెళ్లేందుకు వీలవుతుంది.
Also Read: MP Lavu Krishna Devarayalu: ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మంచి మనసు ...
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dmart Offers: స్కూల్స్ రీపెన్ వేళ డీమార్ట్ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు
Wadgaon, Maharashtra:Dmart School Shopping Offers: పాఠశాలలు కొన్ని రోజుల్లో తెరచుకోనున్నాయి. వేసవి సెలవులు దాదాపు ముగిసిపోతుండగా.. విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులకు సంబంధించి తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు పొందాలంటే డీమార్ట్కు వెళ్లాల్సిందే. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా డీమార్ట్ సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ఒకటి కొంచే ఒకటి ఉచితం అనే పథకం అమలు చేస్తోంది.
Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక
విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగ్లతోపాటు వారికి బ్యాగ్లు, లంచ్బాక్స్లు, వాటర్ బాటిల్స్ వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు అందించాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ముందే కొని పెట్టుకోవాల్సి ఉంది. ఇది గమనించిన డీమార్ట్ సంస్థ కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తోంది. డీమార్ట్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు కేటగిరి వారీగా ఇలా ఉన్నాయి.
స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు
బ్రాండెడ్ లాంగ్బుక్, నోట్ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది.
పెన్నులు ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
రూ.139 నుంచి లంచ్ బ్యాగ్లు
రూ.49కు పెన్సిల్ పర్సులు
పిడిలైట్ గ్లూ ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
Also Read: Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది
డ్రాయింగ్ ఉపకరణాల ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
12 ఫోల్డర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఎంఆర్పీ రూ.250 కన్నా రూ.179 మాత్రమే. బుక్ లేబుల్ స్టిక్కర్ రూ.19 ధరకు.
38 సెం.మీ బ్రౌన్ బుక్ కవర్ ఎంఆర్పీ రూ.70 కాస్త రూ.55 మాత్రమే. రూ.400 ధర కలిగిన కాలిక్యులేటర్ రూ.219 మాత్రమే.
అన్ని రకాల కంగారూ ఉత్పత్తులపై 15 శాతం తగ్గింపు. రూ.49 నుంచి కత్తెర
అప్సర ఎరేజర్, షార్ప్నర్ ఎంఆర్పీపై 20 శాతం తగ్గింపు. రూ.290 ధర కలిగిన ఎగ్జిక్యూటివ్ ఫోల్డర్ 12 పాకెట్ ఫైల్ రూ.199 మాత్రమే
రూ.375 ధర కలిగిన జేకే కాపియర్ పేపర్ ఏ4 (21 సెం.మీ * 29.7 సెం.మీ), 70 జీఎస్ఎమ్ 500 షీట్లు రూ.275 ధరకే అందుబాటులో ఉంది. మెటల్ అండ్ మాగ్నెటిక్ పెన్సిల్ బాక్స్ రూ.99 నుంచి ప్రారంభం. స్టడీ టేబుల్ రూ.349 నుంచి ప్రారంభం.
బ్యాగ్లు, లంచ్బాక్స్పై ఆఫర్లు
లంచ్బాక్స్, వాటర్ బాటిల్ కాంబో రూ.169తో ప్రారంభం. లంచ్ బాక్స్ రూ.45 నుంచి ప్రారంభం.
స్కూల్ బ్యాగ్లు రూ.199 నుంచి ప్రారంభం. రూ.399 ధర కలిగిన స్టీల్ ప్లెక్సీ 2 లేయర్ లంచ్ బాక్స్ రూ.99 మాత్రమే లభిస్తోంది.
గొడుగు రూ.329 నుంచి, వర్షపు కోటు (రెయిన్ కోట్) రూ.149 లభిస్తోంది. పాలిమర్ క్రికెట్ బ్యాట్ రూ.229, స్కూల్ షూస్ రూ.179 నుంచి ప్రారంభం.
Also Read: IPL 2026: చాంపియన్ రేసులో గుజరాత్ టైటాన్స్.. వైభవ్ పోరాడినా రాజస్థాన్కు నిరాశ
రోజువారీ అవసరాలు, కిరాణ సామగ్రి
750 గ్రాములు కలిగిన రూ.415 ఉన్న బూస్ట్ రీఫిల్ ప్యాక్ రూ.335కు డీమార్ట్ అందిస్తోంది.
డాబర్ హనీ స్క్వీజీ ప్యాక్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 గ్రాముల రూ.420 ధర కలిగిన హనీ రూ.255కు లభిస్తోంది.
సన్ఫీస్ట్ యిప్పీ మ్యాజిక్ మసాలా న్యూడిల్స్ రూ.120 ఉండగా రూ.77కు మాత్రమే డీమార్ట్లో అందుబాటులో ఉంది.
రూ.280 ధర ఉన్న కిసాన్ మిక్స్ ఫ్రూట్ జామ్ (700 గ్రాములు) రూ.215కు డీమార్ట్ అందిస్తోంది.
రూ.225 ధర కలిగిన నుటెల్లా ఫెర్రెరో (180 గ్రాములు) రూ.190 మాత్రమే లభిస్తోంది.
PM Shram Mandhan Yojana: ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా నెలనెలా Pension.. కేవలం రూ. 55 పెట్టుబడితో ప్రతి నెలా రూ. 3,000 మీ అకౌంట్లోకి..!!
Lakshmapur, Telangana:PM Shram Mandhan Yojana: వయస్సులో ఉన్నప్పుడు బాధ్యతలన్నీ భుజనా మోసినవాళ్లు.. వృద్ధాప్యం తర్వాత తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగం చేయకుండా రోజువారీ కూలీగా జీవించేవారికి ఈ ఆందోళణ మరింత ఎక్కువగా ఉంటుంది. వీధి వ్యాపారులు, రిక్షాలాగేవాళ్లు, కూలీలు, చిన్న దుకాణదారులు వయస్సు పైబడి, శరీరం సహకరించనప్పుడు తమ ఇంటి ఖర్చులతోపాటు కనీస అవసరాలను తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.
అలాంటి వారిని అక్కున చేర్చుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ యోజన అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. మీరు ప్రతినెలా కేవలం ఒక చిన్న మొత్తాన్ని అంటే రూ. 55 జమ చేస్తే చాలు.. దానికి బదులుగా 60ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత మీకు నెలకు రూ. 3000 హామీతో కూడిన పెన్షన్ లభిస్తుంది.
2019లో ప్రారంభించిన.. ఈ పథకం ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం సరళమైన సూత్రం ఏమిటంటే, మీరు ఎంత ఎక్కువ డబ్బు జమ చేస్తే, ప్రభుత్వం మీ ఖాతాలో అంత ఎక్కువ జమ చేస్తుంది. ఉదాహరణకు.. మీ వయస్సు ఆధారిత వాయిదా రూ. 100 అయితే, మీరు రూ. 100 చెల్లిస్తారు. ప్రభుత్వం రూ. 100 జతచేస్తుంది. అంటే, ప్రతి నెలా మీ ఖాతాలో రూ. 200 జమ అవుతాయి. మీకు 60 ఏళ్లు నిండినప్పుడు, మీరు ప్రతి నెలా కనీసం రూ. 3,000 పెన్షన్ అందుకోవడం ప్రారంభిస్తారు.
అర్హులు ఎవరు?
ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందడానికి, ప్రభుత్వం కొన్ని షరతులను పెట్టింది. అవేంటంటే..
వృత్తి: మీరు వీధి వ్యాపారి, రిక్షా లాగేవారు, గృహ సహాయకులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న దుకాణదారులు లేదా అటువంటి ఏదైనా అసంఘటిత రంగంలో పనిచేసేవారై ఉండాలి.
వయస్సు: దరఖాస్తుదారుని వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
తక్కువ ఆదాయం: మీ నెలసరి ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
పన్నులు, ఇతర పథకాలు: మీరు ఆదాయపు పన్ను చెల్లించకూడదు. మీరు EPFO, ESIC, లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి ఏ ఇతర పథకంలోనూ సభ్యులుగా ఉండకూడదు.
Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!!
ప్రతి నెలా ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది?
ఈ పథకం కింద మీ జేబు నుండి తీసివేసే మొత్తం మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. మీకు 18 ఏళ్లు ఉంటే, మీరు నెలకు కేవలం రూ. 55 మాత్రమే జమ చేయాలి. మీరు గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులో చేరితే, నెలకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పథకంలో చేరిన తర్వాత, మీకు 60 ఏళ్లు వచ్చే వరకు మీ నిర్ణీత నెలవారీ వాయిదాను చెల్లిస్తూ ఉండాలి.
ఈ పథకం ఎన్ని ప్రయోజనాలను అందిస్తోంది?
జీవిత భాగస్వామి ప్రయోజనాలు: భార్యాభర్తలిద్దరూ ఈ పథకానికి అర్హులైతే, వారు విడివిడిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా, 60 ఏళ్ల వయస్సు తర్వాత, కుటుంబం నెలకు మొత్తం రూ. 6,000 పింఛను పొందవచ్చు.
కుటుంబ పింఛను: పింఛను ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుడు మరణిస్తే, అతని/ఆమె జీవిత భాగస్వామి పింఛనులో సగం అంటే ప్రతి నెలా రూ. 1,500 పొందడం కొనసాగిస్తారు.
స్కీములో నుంచి మధ్యలోనే వైదొలగవచ్చా?
మీరు ఏ కారణం చేతనైనా పథకం నుండి వైదొలగాలనుకుంటే, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేసింది. మీరు 10 సంవత్సరాల లోపు పథకం నుండి వైదొలిగితే, మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని వడ్డీతో పాటు మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అయితే, మీరు పథకం ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత, 60 ఏళ్ల వయస్సు రాకముందే పథకాన్ని నిలిపివేస్తే, మీ పెన్షన్ ఫండ్పై వచ్చిన అసలు వడ్డీతో పాటు మీ డబ్బు మీకు వాపసు ఇస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక వాయిదా చెల్లించడంలో విఫలమైతే, బకాయి ఉన్న మొత్తాన్ని వడ్డీతో పాటు చెల్లించి, దానిని తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు.
అకౌంట్ ఎలా తీసుకోవాలి?
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి
మీ ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతా వివరాలను (పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్కు వంటివి) మీతో పాటు తీసుకువెళ్లండి.
మొదటి వాయిదా మీ నుండి నగదు రూపంలో తీసుకుంటారు.
తదుపరి వాయిదాల కోసం ఆటో డెబిట్ సౌకర్యం ఉంటుంది.
ఈ పథకంలో పెట్టుబడులు సురక్షితమైనవి, ఎందుకంటే వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. అయితే, 60 ఏళ్ల వయస్సు తర్వాత అందే రూ. 3,000 పింఛను మొత్తం స్థిరంగా ఉంటుందని, ద్రవ్యోల్బణంతో పాటు అది పెరగదు.
Also Read: రూ. 500 నోట్లపై ఆర్బీఐ బిగ్ అలర్ట్.. కీలక విషయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Asian Games Cricket: ఎట్టకేలకు భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..ఆసియా క్రీడల్లో సూర్యకుమార్, గిల్కు నో ఛాన్స్!
Mumbai, Maharashtra:Asian Games Cricket Team India: జపాన్ వేదికగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ను అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. అందుకోసం 30 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ఇండియాను ప్రకటించింది. ఇందులో భాగంగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం 30 మందిని ఎంపిక చేయగా..అందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటుదక్కింది. అయితే టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్ యాదవ్, స్టార్ ప్లేర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడం గమనార్హం.
జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే అదే సమయంలో అనగా సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 17 వరకు స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్ ఉన్న కారంణంగా బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను బరిలో దించేందుకు సన్నద్ధమైంది.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో 16 మ్యాచ్ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి దుమ్మురేపిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని సెలెక్టర్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చేర్చారు. మరోవైపు వెస్టిండీస్ సిరీస్లో వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండటంతో అతనికి ఆసియా క్రీడల జాబితాలో చోటు దక్కలేదు. ఇక 2028 టీ20 ప్రపంచకప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ రేసులో సూర్యకుమార్ యాదవ్ లేకపోవడంతో, అతడిని ఆసియా క్రీడల జాబితా నుంచి మినహాయించడం గమనార్హం.
కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే రేసులో ముగ్గురు ఆటగాళ్లు ముందంజలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ వంటి వారు కెప్టెన్సీ రేసులో పోటీ పడుతున్నారు.
గతంలో గాయపడిన పేసర్ హర్షిత్ రాణా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకంతో అతడిని అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు జాబితాలోకి తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా పేరు ఈ 30 మందిలో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే వంటి వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆసియా క్రీడల్లో ఎంపికవుతారు. మిగిలిన ఇద్దర్ని వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఆసియా క్రీడల కోసం బీసీసీఐ రిలీజ్ చేసిన భారత జట్టు జాబితా ఇదే..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.
Also REad: ఐపీఎల్ ఫైనల్లో పక్కా గెలుపు ఆర్సీబీదే! ఈ లెక్కలు చూస్తే నిజం తెలిసిపోతుంది!
Also Read: ఐపీఎల్ ఫైనల్ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.2,20,000 మాత్రమే..ఖంగుతిన్న క్రికెట్ ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyper Aadi Marriage: స్టార్ యాంకర్తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్!
Hyderabad, Telangana:Hyper Aadi Varshini Marriage: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్ వేదికగా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం టెలివిజన్ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న ఆది కెరీర్ ఎంత హాట్ టాపికో.. ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించిన వార్తలు అంతే ఆసక్తికరంగా మారుతుంటాయి.
గతంలో యాంకర్ వర్షిణితో పాటు పలువురు నటీమణులతో ఆది పెళ్లి అంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది, తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూనే, అసలు తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే పెళ్లి అంటేనే భయం వేస్తోందని ఆది సంచలన నిజం పంచుకున్నాడు. "పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. అది జీవితాంతం కొనసాగే ఒక పెద్ద బాధ్యత. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎంతో ఆలోచన అవసరం" అని ఆది పేర్కొన్నాడు.
తన చిన్ననాటి రోజుల ప్రేమ గురించి కూడా మాట్లాడుతూ.. అప్పట్లో ఫోన్లు, సోషల్ మీడియా లేవని, కేవలం చూపులతోనే అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండేదని గుర్తుచేసుకున్నాడు. తాను ఒక మంచి భర్తగా మారడానికి, తనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని భావించిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కుతానని ఆది స్పష్టం చేశాడు. ఆయనకు ఉండాల్సిన ఆ క్వాలిటీస్ ఏంటంటే.. కోపాన్ని తగ్గించుకుని, ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. స్వయంగా కష్టపడి కుటుంబాన్ని పోషించగలగాలి. ఇంటి సమస్యలను రచ్చకెక్కించకుండా, నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. భార్య భావాలను గౌరవిస్తూ, ఆమెకు భర్తగానే కాకుండా ఒక మంచి స్నేహితుడిలా, కుటుంబ సభ్యుడిలా తోడుండాలి.
గతంలో యాంకర్ వర్షిణితో పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఈ వ్యాఖ్యలతో తేలిపోయింది. ప్రస్తుతం కెరీర్పైనే పూర్తి దృష్టి పెట్టిన హైపర్ ఆది, తనకు తాను పెట్టుకున్న ఈ జీవిత ప్రమాణాలు, విలువలు నెరవేరినప్పుడే సరైన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో "హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు?" అనే ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకలేదు కానీ, పెళ్లి పట్ల ఆయనకున్న బాధ్యతాయుతమైన ఆలోచనలు మాత్రం ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Also REad: బాలకృష్ణ చిన్న కూతురు ఒక్క వీడియోతో పాపులర్..ఆమె గురించి ఈ విశేషాలు తెలుసా?
Also Read: "నువ్వు హీరోయిన్ ఏంటి..ముఖం అద్దంలో చూస్కో" అన్నోళ్లే లేచి మరీ చప్పట్లు కొడుతున్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th CPC Jobs: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే ఛాన్స్!
Hyderabad, Telangana:8th Central Pay Commission Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఓ అద్భుత అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులకు మార్గదర్శకంగా నిలిచే 8వ సెంట్రల్ పే కమిషన్ (8వ వేతన సంఘం) లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.90,000 నుండి రూ.1.80 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు, వయోపరిమితి
ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లీగల్ రీసెర్చ్ వంటి విభాగాల్లో నిపుణులను కింది పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ కన్సల్టెంట్ విభాగంలో 10 ఉద్యోగాలు 10 ఏళ్ల అనుభవంతో 45 ఏళ్లు గరిష్ట వయసుగా నిర్ణయించారు. ఈ ఉద్యోగానికి నెలకు రూ.1,80,000 జీతం ఇస్తారు. అలాగే కన్సల్టెంట్ విభాగంలో 5 పోస్టు ఉండగా వారికి కనీసం 6 ఏళ్ల అనుభవంతో 40 ఏళ్లు గరిష్ట వయసుగా నిర్ణయించగా.. ఈ ఉద్యోగానికి నెలకు రూ.1,20,000 జీతం అందించనున్నారు. చివరిగా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో 10 ఖాళీలు ఉండగా.. వారికి కనీసం 4 ఏళ్ల అనుభవంతో గరిష్టంగా 32 ఏళ్ల వయసు ఉండాలి. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.90,000 జీతం అందిస్తారు.
అలాగే పార్ట్టైమ్ అభ్యర్థులకు వారు పనిచేసిన రోజుల ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. అయితే వీరికి DA, HRA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి అదనపు ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించవు.
అర్హతలు ఇవే..
ఫైనాన్స్, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్, పబ్లిక్ పాలసీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ / MBA (Finance/HR) లేదా LLB/న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించి ఉండాలి. పే స్ట్రక్చర్, సర్వీస్ రూల్స్, పెన్షన్ వ్యవస్థ, ప్రభుత్వ పరిపాలన రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు..
పైన పేర్కొన్న రంగాల్లో అనుభవంతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలైన.. MS Excel, Spreadsheet Analysis, PowerPoint Presentations, Data Interpretation, Policy Analysis, Financial Modelling, లీగల్ రీసెర్చ్లో పట్టు ఉండాలి.
ఈ ఉద్యోగాల బాధ్యతలు ఏమిటంటే?
కేంద్ర ఉద్యోగుల వేతన నిర్మాణాలు, అలవెన్సులు మరియు పెన్షన్ వ్యవస్థపై అధ్యయనం & విశ్లేషణతో పాటు అంతర్జాతీయ పే స్ట్రక్చర్లతో పోలికలు, వ్యయ ప్రభావ అంచనాలు రూపొందించడం వంటివి ఉన్నాయి. డేటా ఆధారిత విధాన నివేదికల తయారీ, ప్రభుత్వానికి కీలక సిఫార్సులు అందించడం వంటి ప్రక్రియలో భాగం కావాల్సి ఉంటుంది.
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా కింది దశల్లో జరుగుతుంది. దరఖాస్తుల పరిశీలన (అర్హతలు, అనుభవం ఆధారంగా) చేసిన తర్వాత సరైన అభ్యర్థులను షార్ట్లిస్టింగ్ చేసి నేరుగా ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఈ ప్రక్రియలో చివరిగా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తవ్వగానే తుది ఎంపిక లిస్టు విడుదల చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించరు. తొలుత 8వ సెంట్రల్ పే కమిషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అందులో మీ వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. విద్యా అర్హతలు, ఉద్యోగ అనుభవ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయండి. అవసరమైన సర్టిఫికెట్లను, పత్రాలను అప్లోడ్ చేసి.. డిక్లరేషన్ను అంగీకరించి, ఫారమ్ను సబ్మిట్ చేయాలి. అర్హత, ఆసక్తి గల నిపుణులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వెంటనే అప్లై చేసుకోండి!
Also REad: ఏకంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు..ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకపోవడమే మంచిది!
Also REad; 'ఆపరేషన్ సింధూర్ 2.0'కి త్రివిధ దళాలు రెడీ..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Free Bus: మహిళలకు అలర్ట్..ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్టుకు ఆధార్ కార్డు చెల్లదు!
Hyderabad, Telangana:Mahalakshmi Smart Card: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు ఉచిత టికెట్ కోసం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. కానీ, జూన్ 2 నుంచి బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే స్మార్ట్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.Balka Suman Arrest: బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం!
Hyderabad, Telangana:KTR On Balka Suman Arrest: భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక నేత బాల్క సుమన్ను నేడు తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉన్న సుమన్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అతని పోలీసు కేసు నమోదవ్వడంతో అతడని అరెస్టు చేసి పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. వేసవి సెలవులు ముగిసిపోతుండడంతో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులకు తోడు వరుసగా సెలవులు లభించడంతో భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తిరుమల గిరులు భక్తజన సంద్రంతో నిండిపోయాయి. ఎటు వైపు చూసినా భక్తులు తండోపతండాలుగా కనిపిస్తున్నారు. దీంతో రేపు ఆదివారం కొండపైకి మరింత తీవ్ర స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక
వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కావడంతో వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాలినడక మార్గం, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి.. క్యూలైన్లు వెలుపలికి వచ్చేశాయి. శ్రీవారి ఉచిత దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది.
తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శని, ఆదివారాలు.. వారాంతపు సెలవులు కావడంతో భక్తుల తాకిడి ఊహించని స్థాయిలో పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలకి వచ్చి కిలోమీటర్ల మేర భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సంఖ్య గంటగంటకు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుంచి క్యూలైన్ ఏటీసీ గుండా.. కృష్ణతేజ సర్కిల్ మీదుగా ఏకంగా శిలాతోరణం రహదారి వరకు భక్తులు వరుసలో వేచి ఉన్నారు.
Also Read: IPL 2026: చాంపియన్ రేసులో గుజరాత్ టైటాన్స్.. వైభవ్ పోరాడినా రాజస్థాన్కు నిరాశ
భక్తుల రద్దీ
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, స్లాటెడ్ సర్వ దర్శనం కలిగిన భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో గంటల కొద్దీ సమయం వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, చల్లని మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ తీసుకుంటున్న ఈ చర్యలతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు తీవ్ర ఎండ, అలసట నుంచి ఉపశమనం లభిస్తోంది.
దర్శనానికి ఇలా ఉండగా.. గదులు, లాకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తిరుమలలో గదులకు తీవ్ర కొరత ఏర్పడింది. భక్తుల సంఖ్య లక్షకు చేరడంతో గదులన్నీ బుక్ అయిపోయాయి. గదులు దొరకని వేలాది మంది భక్తులు తిరుమలలోని పార్కులు, ఓపెన్ షెడ్లలోనే తలదాచుకుంటున్నారు. ఈ రద్దీ మరో వారం పాటు ఉండే అవకాశం ఉంది. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. దర్శనంతోపాటు టీటీడీ సేవల కోసం భక్తులు ఓపిక.. సంయమనంతో వ్యవహరించి.. తమకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Jagtial: జగిత్యాలలో త్వరలోనే SIR ప్రారంభం.. జూన్ 15 నుంచి బీఎల్వోలకు ప్రత్యేక శిక్షణ!
Jagtial, Telangana:Jagtial Voter List Special Revision 2026: జగిత్యాల జిల్లాలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు మేరకు ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు.. జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి ప్రత్యేకమైన ఓటర్ గుర్తింపు కార్డును కూడా అందించే ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది..
డిజిటలైజ్ ప్రక్రియ..
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు 2002తో పాటు 2026 ఓటరు జాబితాల మ్యాపింగ్ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.. పాత ఓటరు జాబితాలను.. ప్రస్తుతం తాజా జాబితాలతో సరిపోల్చుతూ.. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? ఓటర్ల విభజన సరిగ్గా జరిగిందా? లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం..
జూన్ 15 నుంచి శిక్షణా కార్యక్రమాలు..
ఈ భారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు బీఎల్వోలకు అధికారులు ప్రత్యేకమైన శిక్షణను అందించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు వివిధ విడుదల్లో ఈ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు కొనసాగబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఓటర్ల నమోదు తో పాటు మార్పులు చేర్పులు, సాంకేతిక యాపుల వినియోగంపై సిబ్బందికి ఈ శిక్షణలో భాగంగా పూర్తిస్థాయి అవగాహన కల్పించబోతున్నట్లు తెలుస్తోంది..
సర్వే ప్రారంభ తేది..
జూన్ 25వ తేదీ నుంచి నెలరోజులపాటు ఇంటింటి సర్వే శిక్షణ పూర్తి కాగానే.. అసలైన ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులపాటు బీఎల్వోలు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటినీ సందర్శించి సర్వే నిర్వహించబోతున్నారు. ఈ ఇంటింటి సర్వేలో భాగంగా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసుకోబోతున్నట్లు సమాచారం.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
జగిత్యాల జిల్లా ఓటర్ల సంఖ్య..
ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు ఉన్న వారిని గుర్తించడంతోపాటు మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతి యువకులను ఓటర్లుగా నమోదు చేయడం వంటి పనులను ఈ సర్వేలోనే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లాలో మొత్తం.. 7 లక్షలకు మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసిన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని.. ప్రజలందరూ బీఎల్వోల సర్వేకు సహకరించాలని అధికారులు కోరినట్లు సమాచారం..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bank Holidays: ఏకంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు..ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకపోవడమే మంచిది!
Hyderabad, Telangana:Bank Holidays In June 2026: మే నెల ముగుస్తుండటంతో.. జూన్ నెలలో వివిధ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు ఈ వార్తను తప్పక చదవాలి. వచ్చే నెలలో బ్యాంకులకు వెళ్లే కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సెలవుల జాబితాను విడుదల చేసింది.
సాధారణ వారాంతపు సెలవులతో (శని, ఆదివారాలు) పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల ఆధారంగా జూన్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల మీ నగరంలో ఏ రోజు బ్యాంకుకు సెలవు ఉందో ముందుగానే తెలుసుకొని మీ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.
జూన్లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా..
జూన్ నెలలో వచ్చే సాధారణ సెలవులు (4 ఆదివారాలు, 2 శనివారాలు) కాకుండా, నిర్దిష్ట తేదీల్లో రాష్ట్రాల వారీగా ఉన్న సెలవుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. జూన్ 13, జూన్ 27న రెండో, నాలుగో శనివారాల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
అలాగే జూన్ 15న 'వైఎంఏ డే' సందర్భంగా ఐజాల్ (మిజోరం) సహా 'రాజా సంక్రాంతి' సందర్భంగా భువనేశ్వర్ (ఒడిశా)లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. జూన్ 17న 'మహారాణా ప్రతాప్ జయంతి' సందర్భంగా హర్యానాలో బ్యాంకులు బంద్ కానున్నాయి. జూన్ 18న 'శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరత్వ దినోత్సవం' కారణంగా పంజాబ్లో బ్యాంకులు సెలవు ప్రకటించారు.
మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. జూన్ 25న మొహరం పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో) మొహరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూన్ నెలలో అత్యధిక రాష్ట్రాలలో వచ్చే ప్రధాన సెలవు జూన్ 26 కావడం విశేషం. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, లక్నోలలో బ్యాంకులు మూతపడతాయి. (గమనిక: గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు వర్తించదు).
జూన్ 29న 'సంత్ గురు కబీర్ జయంతి' సందర్భంగా సిమ్లా (హిమాచల్ ప్రదేశ్), హర్యానా, పంజాబ్, ఛత్తీస్గఢ్లలో సెలవు పాటిస్తారు. జూన్ 30న 'రెంమ్నా ని' (శాంతి దినం) సందర్భంగా ఐజాల్ (మిజోరం)లో బ్యాంకులు మూసి ఉంటాయి.
గమనిక: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో జూన్ నెలలో ఎలాంటి అదనపు ప్రాంతీయ సెలవులు లేవు. అక్కడ కేవలం సాధారణ శని, ఆదివారాల సెలవులు మాత్రమే వర్తిస్తాయి.
సెలవు దినాల్లో బ్యాంక్ బ్రాంచ్లు మూసి ఉన్నా.. వినియోగదారుల అవసరాల కోసం ఆన్లైన్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) లావాదేవీలు, ఏటీఎంలు (ATMs), మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి చేసుకునే నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్లు, పాస్బుక్ ప్రింటింగ్, కొత్త అకౌంట్ ఓపెనింగ్ వంటి సేవలు మాత్రం సెలవు రోజుల్లో లభించవు. కాబట్టి, బ్యాంకులకు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులను ఈ సెలవుల జాబితా ఆధారంగా ముందే ప్లాన్ చేసుకోండి!
Also REad: 'ఆపరేషన్ సింధూర్ 2.0'కి త్రివిధ దళాలు రెడీ..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన!
Also Read: బస్సు టికెట్టు ధరకే విమానం ఎక్కొచ్చు..సగం ధరకే విమానం టికెట్తో ఎయిర్ ఇండియా ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక
Tirupati Urban, Andhra Pradesh:TTD Free Bus Service: తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు మరింత మెరుగైన, పర్యావరణహితమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలో నడుస్తున్న ఉచిత బస్సుల విభాగంలోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బస్సు వచ్చి చేరింది. లీలా రజియా అనే మహిళా భక్తురాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆధునిక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేశారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించి.. ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా టీటీడీ వేస్తున్న అడుగులకు స్పందన లభిస్తోంది.
తిరుమల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచుతోంది. తాజాగా లీలా రజియా అనే మహిళా భక్తురాలు స్వామివారిపై భక్తితో ఒక అధునాతన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని అన్నదాన భవనం వద్ద టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. కాగా అంతకుముందు బస్సు అందించిన దాత రజియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు దర్శన ఏర్పాట్లు టీటీడీ అధికారులు దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళం చెవిని అందుకున్న అనంతరం అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ఉచిత బస్సుల (ధర్మ రథాలు) సంఖ్య ఈ కొత్త బస్సుతో కలిపి మొత్తం 20 బస్సులు అయ్యాయని వెల్లడించారు. తిరుమలలో ప్రస్తుతం తిరుగుతున్న 20 ఉచిత బస్సుల్లో 14 బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయని తెలిపారు. శ్రీవారి భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమల వీధుల్లో రోజుకు ఏకంగా 320 ట్రిప్పులు తిరుగుతూ ఈ బస్సులు నిరంతర సేవలు అందిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ కొత్త బస్సును డిజైన్ చేయగా.. ఈ బస్సులో 40 మంది భక్తులు నిలబడి ప్రయాణించేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
కాలుష్య రహిత తిరుమలే లక్ష్యంగా భవిష్యత్తులో డీజిల్ బస్సులను పూర్తిగా పక్కన పెట్టి.. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే నడపాలని టీటీడీ యోచిస్తోంది. భక్తులకు ఉచితంగా.. సౌకర్యవంతంగా సేవలందిస్తున్న ఈ గ్రీన్ బస్సుల సంఖ్య పెరగడంపై హర్షం వ్యక్తమవుతోంది. కాగా తిరుమలలో భక్తుల అసాధారణ రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటలకు సమయం పడుతోంది. దీంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు నిలిచిపోయాయి. నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సహాయ చర్యలు చేస్తోంది. నిరంతరాయంగా అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీ కొనసాగుతోంది.
Operation Sindoor 2.0: 'ఆపరేషన్ సింధూర్ 2.0'కి త్రివిధ దళాలు రెడీ..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన!
Hyderabad, Telangana:Upendra Dwivedi On Operation Sindoor: భారత సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం అనగా మే 30 నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రు దేశాల కుట్రలను అడ్డుకోవడానికి, జాతీయ రక్షణ లక్ష్యంతో 'ఆపరేషన్ సింధూర్ 2.0'కు భారత్ సన్నద్ధమవుతోందని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ చర్యలకు ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న కఠినమైన సైనిక వైఖరి ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన అన్నారు.
ఏఎన్ఐ మీడియా సంస్థతో మాట్లాడిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని ఆయన తాత్కాలిక ఘర్షణల విరమణగా అభివర్ణించారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే శత్రువుకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
భవిష్యత్తులో కొత్త ఆపరేషన్ చేపట్టాల్సి వస్తే, కేవలం సైన్యం మాత్రమే కాకుండా వాయుసేన, నావికా దళం కూడా సంయుక్త దాడికి సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. తదుపరి యుద్ధం కోసం ఈ మూడు దళాలు రోజుకు 24 గంటలూ సిద్ధంగా ఉన్నాయని, వాటి మధ్య సమన్వయం పెంచబడుతోందని ఆయన అన్నారు.
ఆధునిక యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుతూ, సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ రోజుల్లో యుద్ధరంగం చాలా పారదర్శకంగా మారింది. మన ప్రతి కదలిక ఇతరులకు తెలిసిపోతోంది. కాబట్టి మన సైనికులను, సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులను రక్షించడానికి వ్యూహాత్మక రక్షణ, సైనిక మోహరింపు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన అన్నారు.
అంతేకాకుండా, కేవలం సరిహద్దుల వెంబడి మాత్రమే కాకుండా, సమాచార యుద్ధంలో గెలవడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. యావత్ దేశం ఐక్యంగా ఉండి, అధికారిక సమాచారాన్ని విశ్వసించినప్పుడే సమాచార యుద్ధంలో గెలవగలమని, అటువంటి ఐక్యత ఉన్న దేశం ఎల్లప్పుడూ యుద్ధంలో విజయం సాధిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
'ఆపరేషన్ సింధూర్' అంటే?
గత ఏడాది (2025 మే 7 - మే 8 మధ్య), పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టి ప్రతీకారంగా భారతదేశం 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించింది. అంతకుముందు ఏప్రిల్ 22న, కాశ్మీర్లోని పహల్గామ్ జిల్లా, బైసారన్ లోయలో పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద దాడులకు గట్టి హెచ్చరిక ఇవ్వడానికే భారత సైన్యం ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా.. రెండవ భాగం (ఆపరేషన్ సింధూర్ 2.0) కోసం మూడు దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: బస్సు టికెట్టు ధరకే విమానం ఎక్కొచ్చు..సగం ధరకే విమానం టికెట్తో ఎయిర్ ఇండియా ఆఫర్!
Also Read; ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ డబ్బు ఏటీఎం ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB Vs GT Final Preview: ఐపీఎల్ ఫైనల్లో పక్కా గెలుపు ఆర్సీబీదే! ఈ లెక్కలు చూస్తే నిజం తెలిసిపోతుంది!
Ahmedabad, Gujarat:RCB Vs GT IPL Final Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. మే 31 (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. క్వాలిఫైయర్-1లో జీటీపై ఆర్సీబీ గెలవగా, క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ను ఓడించి గుజరాత్ ఫైనల్కు దూసుకొచ్చింది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఇరు జట్ల బలాబలాల గురించి ఇప్పుడు అంచనా వేద్దాం.
అయితే ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుత ఫామ్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్లో స్వల్ప ఆధిక్యంతో బరిలోకి దిగుతోంది. గత సీజన్ (2025) ఛాంపియన్ అయిన ఆర్సీబీ, ఈసారి కూడా అద్భుతమైన బ్యాటింగ్ లైన్అప్తో ఫేవరెట్గా కనిపిస్తోంది. ముఖ్యంగా రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ దళం భువనేశ్వర్ కుమార్, ఢఫీ, హేజిల్ వుడ్, రసిఖ్ సలామ్, సుయాష్ శర్మ వంటి వారితో బలంగా కనిపిస్తోంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన శుభ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అలాగే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో మహ్మద్ సిరాజ్, కగిసో రబడా, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారితో ఎంతో బలంగా కనిపిస్తోంది. అయితే, అహ్మదాబాద్ పిచ్పై ఆర్సీబీ బ్యాటింగ్ లోతు, అనుభవజ్ఞులైన బౌలింగ్ అటాక్ వల్ల ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాలు (53%) ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా 9 సార్లు ఇరుజట్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 5 సార్లు గెలుపొందగా.. గుజరాత్ 4 సార్లు గెలుపొందింది. ఇటీవల జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్లో బెంగళూరు జట్టు 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ను ఓడించి హెడ్-టు-హెడ్ రికార్డులో ముందంజ వేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, రసిఖ్ సలామ్. (ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ)
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/సాయి కిషోర్, కగిసో రబడా, మహ్మద్ సిరాజ్.(ఇంపాక్ట్ ప్లేయర్: ప్రసిద్ధ్ కృష్ణ)
Also Read: ఐపీఎల్లో ఆటగాళ్ల కళ్లద్దాలు నిషేధించిన బీసీసీఐ..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL Final Tickets: ఐపీఎల్ ఫైనల్ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.2,20,000 మాత్రమే..ఖంగుతిన్న క్రికెట్ ఫ్యాన్స్!
Ahmedabad, Gujarat:IPL 2026 RCB Vs GT: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది! అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య ఈ చారిత్రాత్మక టైటిల్ పోరు జరగనుంది.
మొత్తం 73 మ్యాచ్ల ఉత్కంఠభరిత పోరు ముగిసిన తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్కు చేరాయి. ఈ మెగా మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం టిక్కెట్ల ధరలు, ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ, స్టేడియం నియమ నిబంధనల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైనల్ టిక్కెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు మీరు ఎంచుకునే స్టాండ్ మరియు లభించే సౌకర్యాల ఆధారంగా ఉంటాయి. కనీస ధర రూ.5,000 (బ్యాక్ స్టాండ్ టికెట్లు) ఉండగా.. గరిష్ట ధర రూ.2,20,000 (హాస్పిటాలిటీ యాక్సెస్, విలాసవంతమైన సీటింగ్, విందు సౌకర్యాలతో కూడిన ప్రీమియం టిక్కెట్లు) అమ్మకాలు జరుగుతున్నాయి.
ఈ మ్యాచ్ అధికారిక టిక్కెట్లను 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' యాప్ లేదా వారి వెబ్సైట్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ టికెట్ను బుక్ చేసుకునేందుకు వీలుగా ముందు మీ మొబైల్లో 'డిస్ట్రిక్ట్ బై జొమాటో' యాప్ లేదా వెబ్సైట్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో 'IPL 2026 Final' అని టైప్ చేసి వెతకండి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను ఎంచుకుని, మీకు నచ్చిన స్టాండ్, సీట్లను సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, ఆన్లైన్ ద్వారా చెల్లింపు (Payment) పూర్తి చేయండి. బుకింగ్ పూర్తయ్యాక, కన్ఫర్మేషన్ టిక్కెట్ను డౌన్లోడ్ చేసుకోండి.
అయితే క్రికెట్ ప్రేమికులకు ఓ గమనిక. ఒకే అకౌంట్/ఖాతా నుండి గరిష్టంగా 4 టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ కన్ఫర్మేషన్ లభించిన తర్వాత, మ్యాచ్కు ఒక రోజు ముందు అహ్మదాబాద్లోని నిర్దేశిత టిక్కెట్ కౌంటర్కు వెళ్లి మీ ఫిజికల్ (అసలు) టిక్కెట్లను సేకరించాల్సి ఉంటుంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రేక్షకులను సాయంత్రం 4:30 గంటల నుంచే మైదానంలోకి అనుమతిస్తారు. స్టేడియంలోకి ప్రవేశించడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. అయితే, 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ విడిగా టిక్కెట్ తీసుకోవడం తప్పనిసరి. లక్షకు పైగా ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఈ రసవత్తర పోరును మైదానంలో చూసేందుకు ఇప్పుడే మీ టిక్కెట్లను సిద్ధం చేసుకోండి!
Also Read: ఐపీఎల్లో ఆటగాళ్ల కళ్లద్దాలు నిషేధించిన బీసీసీఐ..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
Also Read: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..కనీస జీతం రూ.69,000కి పెంపు..18 నెలల బకాయిలు అకౌంట్లో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
