దమ్మాయిగూడలో పేకాట డెన్పై ఎస్ఓటీ దాడులు, పది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
Secunderabad, Telangana:మేడ్చల్ జిల్లా: దమ్మాయిగూడలో పేకాట స్థావరంపై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసిన సంఘటన శనివారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రియా కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ పై ఎస్ ఓటీ పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి రెండు లక్షల నగదు, పది మొబైల్ ఫోన్లు, ప్లే కార్డులు లాక్కొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Prakasam Barrage: కృష్ణా డెల్టాలో గోదావరి నది వరద చూసి సంబరపడ్డ సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Prakasam Barrage Water Levels: ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక వెలవెలబోతున్న కృష్ణా నదిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్లో కలిసిన గోదారమ్మ నీటి పరవళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటి లెక్కల వివరాలు ఆరా తీశారు. తన పర్యటనలో ఆకస్మికంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎం చంద్రబాబు నిలవడం ఆసక్తికరంగా మారింది.
విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్పై సీఎం చంద్రబాబు కొద్దిసేపు తన వాహన కాన్వాయ్ను ఆపివేయించారు. గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు.
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్ పై కొద్దిసేపు తన కాన్వాయ్ ఆపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్ లో… pic.twitter.com/vGsBV98iT1
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 9, 2026
డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్ నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
Varuna Yagam: రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్ ఒడ్డున భారీ ఏర్పాట్లు
Nandikonda, Telangana:Tomorrow Varuna Yagam: వర్షాభావం ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వర్షాలు భారీగా కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. నాగార్జునసాగర్లోని విజయవిహార్లో రేపు నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు, ప్రాజెక్టులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో వరుణ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవిహార్లో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
యాగం కోసం విజయవిహార్లో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు, అర్చకులు పూర్తి చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విజయవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరుణ యాగం జరిగే ప్రాంతంలో భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లో రేపు జరగనున్న వరుణ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Lal Darwaza Bonalu: అంగరంగ వైభవంగా లాల్దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు
Hyderabad, Telangana:Lal Darwaza Temple: ఆషాఢమాసంలో హైదరాబాద్లో జగన్మాత స్మరణలో మునిగింది. గల్లీ గల్లీ.. వాడా వాడ అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక హైదరాబాద్ మొత్తం కోలాహలంగా మారింది. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాలు, భక్తుల సందడి కనిపిస్తోంది. లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. తెలంగాణవాసుల ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు సహా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి' అని వివరించారు.
'వందల సంవత్సరాలుగా హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి..గతంలో నిజాం రాజు హయాంలో కూడా వేడుకలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
'బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి వైభవానికి ప్రతీక. హైదరాబాద్ మహానగరంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలను భక్తులు కుటుంబ సమేతంగా ఆనందంగా చేసుకోవాలని కోరుతున్నా' మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఆలయాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
డెంగీ బారినపడి ఐసీయూకి దగ్గరగా బాలీవుడ్ భామ.. వర్షాకాలంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న 5 లక్షణాలు ఇవే!
Hyderabad, Telangana:Dengue Symptoms: వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇటీవల నటి స్వర భాస్కర్ కూడా డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం పెరగడం వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ క్రింది ఐదు లక్షణాలు కనిపిస్తే మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. గత ఐదేళ్లలో 968 కేసులు నమోదైనప్పటికీ, 2023లో రికార్డు స్థాయిలో 2,89,235 కేసులు నమోదై 485 మంది మరణించారు.
డెంగీ లక్షణాలు ప్రధానంగా జ్వరంతో మొదలవుతాయి. ఆ తర్వాత కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ళ నొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. దీనితో పాటు ముక్కు లేదా చిగుళ్ల నుండి రక్తం రావడం, కడుపు నొప్పి, ప్రతి 24 గంటల్లో మూడు కంటే ఎక్కువసార్లు వాంతులు అవ్వడం, మలంలో రక్తం పడటం లేదా రక్త వాంతులు కావడం కూడా ముఖ్యమైన లక్షణాలే.
డెంగీ నివారణ మార్గాలు..
డెంగీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే నివారించుకోవడం మంచిది. ఇది నిల్వ ఉన్న నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
ప్రతి వారం చేయాల్సిన జాగ్రత్తలు..
ఇంటి బాల్కనీలలోని మొక్కల పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని మార్చాలి. ఎయిర్ కూలర్ ట్యాంకులు, బకెట్లు, డ్రమ్ములలోని నీటిని ప్రతి వారం మార్చాలి. అలాగే వాటర్ బాటిల్స్, రెఫ్రిజిరేటర్ ట్రేలు, పాత టైర్లు, ఖాళీ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రూఫ్ గట్టర్లు, బాల్కనీ డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి డ్రమ్ములు, ట్యాంకులు, వాటర్ బాటిళ్లకు మూతలు గట్టిగా ఉండేలా చూసుకోండి. బకెట్లలో కూడా నీరు నిల్వ ఉండనివ్వకండి. డ్యామేజ్ అయిన మూతలు వెంటనే రిపేర్ చేయండి.
Also Read: బయట ఫుడ్ తిని కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ 5 వంటింటి చిట్కాలతో నిమిషాల్లో ఉపశమనం!
Also Read: మహిళకు తరచూ వచ్చే నడుమునొప్పి.. అడ్వాన్స్డ్ క్యాన్సర్కు సంకేతమా? హెల్త్ నిపుణుల హెచ్చరిక!
దోమలు రాకుండా ఉండటానికి ఇంటికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. దోమల నుండి రక్షణ కోసం మస్కిటో రిపెల్లెంట్లు వాడండి. శరీరం అంతా కవర్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. సాక్సులు, ఫుట్వేర్ వంటివి ఉపయోగించండి. కిటికీలకు మెష్ ఇన్స్టాల్ చేసుకోవడం, తలుపులకు గ్యాప్స్ లేకుండా చూడటం మంచిది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో ఉదయం సమయంలో నిద్రపోయే వారు తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించడం ద్వారా జాగ్రత్త వహించాలి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bonalu: 3,400 ఆలయాలు ఉంటే బోనాలలకు రూ.20 కోట్లు విదిలిస్తారా?: బండి సంజయ్
Hyderabad, Telangana:Bonalu Festival: 'బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే నిధులేవి? హైదరాబాద్లో 3,400 ఆలయాలు ఉంటే బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు విదిలిస్తారా? రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు విడుదల చేస్తారా? బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ప్రస్తావిస్తే మతం పేరుతో చిచ్చు పెట్టాలని మాట్లాడతారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తే...80 శాతం మంది హిందువుల పండుగకు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి. విదేశాలు నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా కాంగ్రెస్ రూ.2.40 కోట్లు విడుదల చేస్తారా? నేను హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా' అని బండి సంజయ్ ప్రకటించారు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా? వద్దా? అని నిలదీశారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించాలా? వద్దా? అని ప్రశ్నించారు. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా? తాను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తానని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు.
'హిందువులంతా జాగృతం కావాలి. హిందువులారా జెన్జీలను స్పూర్తిగా తీసుకోండి. ఆకాశంలో రాకెట్లను పంపడమే కాదు హిందూ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. జెన్జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 'ఎన్నికలకు బోనాలకు సంబంధమే లేదు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు రాజకీయ పార్టీ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. హైడ్రా 150 పోస్టులకు ఫిజికల్ టెస్ట్ పెడితే సరూర్ నగర్ స్టేడియం నిండిపోవడమే నిదర్శనమని పేర్కొన్నారు.
హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలనే ఆ పార్టీలు అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మైనారిటీ సంతూష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకం అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో వెయ్యి మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడు అని చెప్పారు. అట్లాంటి దుర్మార్గుడిని హీరో చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అని నిలదీశారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారని బండి సంజయ్ ప్రశ్నించారు.
'ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానన్న హామీ ఏమైంది? ఉద్యోగాలను భర్తీ చేసేదాకా నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తానన్న హామీ ఏమైంది? రోజ్ గార్ మేళాతో 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మోదీదే. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పేద విద్యార్థులు అల్లాడుతున్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. 'సమాజాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించింది. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మీ పథకం కింద నెలనెలా ఎంత మంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు. వృద్దాప్య పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని మోసం చేయలేదా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
Srisailam Dam Gates: కృష్ణానదికి పోటెత్తిన వరదనీరు..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత!
Hyderabad, Telangana:Srisailam Dam Gates Open: ఎల్నినో ప్రభావం వేళ దేశవ్యాప్తంగా వర్షాభావం తగ్గుదల గురించి శాస్త్రవేత్తలు ముందునుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకొని రాబోయే పరిస్థితులకు అనుగుణంగా నీటిని వాడుకోవాలని సూచించారు. అయితే ఈ క్రమంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో భారీగా వరదనీరు చేరుకుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ గేట్లను తాజాగా తెరిచి కొద్దికొద్దిగా వరదనీటిని పంపిస్తున్నారు.ICC ODI World Cup Teams: క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?
Dubai, Dubai:ICC ODI World Cup 2027 Teams: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ కోసం కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి టోర్నీలో జట్ల సంఖ్యను 10 నుంచి 14 జట్లకు పెంచడంతో అర్హత పోరు మరింత రసవత్తరంగా మారింది.
టోర్నీ అర్హత నిబంధనలు ఇవే..
ఆతిథ్య హోదా కింద ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించాయి. అయితే మరో కో-హోస్ట్ అయిన నమీబియా మాత్రం ఈ ఆతిథ్య కోటాను దక్కించుకోలేకపోయింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం కటాఫ్ తేదీ నాటికి టాప్-8లో నిలిచే జట్లే ఎలాంటి క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడకుండా నేరుగా ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాయి.
క్రికెట్ వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం ఆతిథ్య దేశాలు రెండింటితో పాటు ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించిన 8 జట్లు పోను.. మిగిలిన 4 స్థానాల కోసం ప్రత్యేకంగా గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహిస్తారు.
టీమిండియా పరిస్థితి ఏంటంటే?
ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ప్రస్తుతం 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. భారత జట్టు పాయింట్ల పరంగా ఎంతో పటిష్టంగా ఉండటంతో పాటు భారీ ఆధిక్యంలో ఉంది. దీంతో టీమిండియా ఎలాంటి ఆందోళన లేకుండా నేరుగా 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా సురక్షితమైన స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇతర ప్రధాన జట్ల పరిస్థితి ఎలా ఉందంటే?
ర్యాంకింగ్స్ రేసులో పాకిస్తాన్ (100 పాయింట్లు) 5వ స్థానంలో, శ్రీలంక (96 పాయింట్లు) 6వ స్థానంలో, ఇంగ్లాండ్ (93 పాయింట్లు) 7వ స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్లో ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య జరిగే వన్డే సిరీస్ ఈ రెండు జట్ల ర్యాంకింగ్స్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక అఫ్గానిస్తాన్ 90 పాయింట్లతో 8వ స్థానంలో ఉంటూ క్వాలిఫికేషన్ అంచున నిలిచింది. రాబోయే సిరీస్లలో ప్రతీ మ్యాచ్ ప్రతీ జట్టుకూ అత్యంత కీలకం కానుంది.
Also Read: యశస్వి జైస్వాల్తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!
Also Read: "నా సొంత ఊర్లో ఇంటి స్థలం ఇప్పించండి సీఎం గారూ"..క్రికెటర్ రిషబ్ పంత్ ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy A36: రూ.35,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ 5జీ మొబైల్ ఇప్పుడు కేవలం రూ.26,999లకే!
Hyderabad, Telangana:తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. రానున్న 2 రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు! 3 జిల్లాలకు రెడ్ అలర్ట్!
Hyderabad, Telangana:2 Days Heavy Rains In Telangana: రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటే, కొన్ని చోట్ల స్వల్పంగా అధికంగా ఉండవచ్చని తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటికీ వర్షాల లోటు కనిపిస్తోంది. రాష్ట్ర సగటు వర్షపాతం ప్రస్తుతం 4 శాతం లోటులో ఉంది. జూన్ 1 నుండి ఆగస్టు 8 వరకు 41.5 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 39.95 సెం.మీ మాత్రమే కురిసింది. దీనివల్ల 10 జిల్లాల్లో వర్షాల లోటు ఉండగా, 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మండలాల వారీగా పరిశీలిస్తే, 18 మండలాల్లో అత్యధికం, 111లో అధికం, 278లో సాధారణం, 210లో లోటు మరియు 4 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది.
మళ్లీ మొదలైన వర్ష గండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి కారణంగా ఈరోజు నుండి 13వ తేదీ వరకు రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గత పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో, కొమరం భీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఒక్క రాత్రికే జలమయమైన కామారెడ్డి..
గత వారం కురిసిన భారీ వర్షాల వల్ల కొమరుం భీం, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరం భీం జిల్లాలోని తిరియాని, బెజ్జూరు, దహేగాం, నార్నూరు, జైనూరు మండలాల్లో దాదాపు 15 నుండి 20 సెం.మీ వర్షం కురిసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన మెదక్ జిల్లాలో మాత్రం ఇప్పటివరకు భారీ వర్షపాతం నమోదు కాలేదు.
నైరుతి తుస్సు.. వాయుగుండం హిట్టు..
నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాల లోటు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో ఈ గణాంకాలు కొంతవరకు మెరుగుపడ్డాయి. ఒకవేళ పది రోజుల్లో వర్షాలు కురవకపోయి ఉంటే, రాష్ట్రం కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికీ వర్షాల లోటు కొనసాగుతుండగా, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కాలేదు.
గోదావరిలో తగ్గుతున్న వరద ఉధృతి..
బంగాళాఖాతంలోని అలజడి వాయుగుండంగా లేదా అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో, ఉత్తర తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ తెలంగాణలో ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడంతో, నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గోదావరి నది ప్రవాహం గత వర్షాల వల్ల పెరిగింది. మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత, గోదావరి నదుల ప్రవాహాలు పెరిగాయి. కాళేశ్వరం వద్ద ఈ వానాకాలంలో ఇప్పటివరకు సుమారు 8.5 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మీదుగా గోదావరిలోకి ప్రవహించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండకపోవడంతో, ప్రస్తుతం గోదావరి నది ప్రవాహం కూడా చాలా వరకు తగ్గిపోయింది.
సాగర్కు చేరుతున్న శ్రీశైలం నీరు..
కృష్ణా నది ప్రవాహం కూడా తక్కువగా ఉంది, దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా పెద్దగా వరదలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సి వస్తే, ఆ నీరంతా దిగువన ఉన్న నాగార్జున సాగర్ చేరుకునే అవకాశం ఉంది. మొన్న కురిసిన వర్షాలు పంటలకు ప్రాణం పోశాయని రైతులు చెబుతున్నప్పటికీ, రాష్ట్రం ఇంకా వర్షాల లోటుతోనే ఉంది. ఇప్పటివరకు వచ్చిన వర్షాలు ఈ వానాకాలం సాగుకు దాదాపు 70 శాతం వరకు ఉపయోగపడతాయి, కానీ పంటలు చివరి దశకు వచ్చేసరికి మళ్ళీ నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం, మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్లో పరిస్థితి ఇలా ఉంది...
నిన్న అర్ధరాత్రి కూడా భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సూర్యాపేటలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మియాపూర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో వర్షం కారణంగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ బృందం వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించారు. మరోవైపు ఖైరతాబాద్లో కూడా భారీ వర్షం కురిసింది. బోరబండ్లో అత్యధికంగా 3.4 మిల్లీమీటర్లు, రహమత్ నగర్లో 2.5 మిల్లీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 2.3 మిల్లీమీటర్లు, యూసఫ్ గూడలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read: హైదరాబాద్ బోనాలు క్లైమాక్స్.. లాల్దర్వాజా సింహవాహినికి ఘనంగా బలిహరణం
Also Read: హైదరాబాద్లో దంచి కొట్టిన వర్షం.. ఈ సీజన్లో ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahesh Babu Varanasi: 'వారణాసి' సినిమా నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్కు సర్ప్రైజ్..ట్రీట్ అదిరిపోయింది!
Hyderabad, Telangana:Mahesh Babu Birthday Varanasi Special: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి'. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హీరో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'వారణాసి' సినిమా నుంచి సరికొత్త లుక్స్ను చిత్రబృందం షేర్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'వారణాసి' చిత్రబృందం విడుదల చేసిన లుక్స్ ప్రకారం.. ఆఫ్రికాలోని వైల్డ్లైఫ్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో దాని తాలూకా లుక్స్ను విడుదల చేసినట్లు కనిపిస్తుంది. అందులో ఓ లుక్.. మహేష్ బాబు సైడ్ లుక్ ఉండగా, రెండోది ఆయన స్టైల్గా పడుకున్న లుక్ను విడుదల చేశారు. ఇప్పుడా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.
అసలు కథ ఏంటంటే..?
ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ తో అల్లరించబోతున్నప్పటికీ.. ఈ స్టోరీ సోల్ మాత్రం పక్క ఇండియన్ ఎమోషన్ అని రాజమౌళి హింట్ ఇచ్చారు. సినిమా స్టోరీ లైన్ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని గడగట్టే చలి వరకు.. రామాయణంలోని దేవుళ్ళు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్.. ఇలా ఇవన్నీ ఒకే సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే వారణాసి సినిమాకు అసలైన మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్. ఆ ఎమోషన్ నుంచి కథలోని మిగిలిన అడ్వెంచర్స్ అన్ని గుర్తుకొస్తాయి" అని ఆయన అన్నారు.
రాజమౌళి లిఫ్ట్ చేసిన ఈ స్టోరీ లైన్, రామాయణం రిఫరెన్సులు విన్న తర్వాత మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అడవులు, అంటార్కిటికా, ఫాంటసీ ఎలిమెంట్స్, తండ్రి కొడుకుల ఎమోషన్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పూనకాలే అని ఫిక్స్ అయిపోతున్నారు.
సీక్వెల్స్ లేవు..
సాధారణంగా రాజమౌళి సినిమాలో అనగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తరహాలో పార్ట్ టూ లేదా సీక్వెల్స్ ఉంటాయేమో అని అంతా భావించారు. కానీ జక్కన్న వహదారులకు బ్రేక్ వేశారు. మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమాకి ఎలాంటి సీక్వెల్స్ గాని ఫ్రీక్వెల్స్ గాని ఉండవని.. ఇది కేవలం ఒకే ఒక స్టాండ్ అలోన్ చిత్రంగా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: నటనలో 'రాజకుమారుడు'..అమ్మాయిల మనసు దోచే 'పోకిరి' ఈ సూపర్ స్టార్..HBD మహేష్ బాబు!
Also Read: యశస్వి జైస్వాల్తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Price Today: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడం, హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందనే ఆశలు బలపడటంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం..
గత కొన్ని వారాలుగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 13 శాతానికి పైగా పడిపోయింది. ఆగస్టు 7 నాటికి ముగిసిన వారంలో ఇది బ్యారెల్కు 83.55 డాలర్ల వద్ద సెటిల్ అయింది. డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 78.18 డాలర్ల వద్ద ముగిసింది. వారమంతా చూస్తే ఇది సుమారు 7.7 శాతం వరకు క్షీణించింది.
ఇరాన్-ఒమన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయనే అంచనాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
భారత్లో పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు..
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గత కొన్ని నెలలుగా ధరలను సవరించలేదు. మే 25 తర్వాత దేశంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉండగా, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. (XP95 పెట్రోల్ రూ. 125.17)
విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర రూ. 117.25 కాగా, డీజిల్ ధర రూ. 104.96 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర రూ. 116.39, డీజిల్ ధర రూ. 104.11గా ఉంది.
భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు దేశంగా ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న తరుణంలో దేశీయంగానూ ఇంధన ధరలను తగ్గించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయిల్ కంపెనీలు ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ పశ్చిమాసియా పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలపైనే చమురు ధరల మనుగడ ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Also REad: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
Also Read: జియో వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్..రూ.200లకే 30 జీబీ డేటా-15 OTT సబ్స్క్రిప్షన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బంగారం, వెండి ధరలు.. ఆగస్టు 9వ తేదీ ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే..?
Secunderabad, Telangana:Gold Rate Today: ఈరోజు ఆదివారం, ఆగస్టు 9న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.152,150కి చేరింది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.139,471కి చేరింది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.232,640కి చేరింది. బంగారం ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో డాలర్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఈ పెరుగుదలకు ఒక కారణం. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని.. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. బంగారం ధర కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, జూలై నెలకు సంబంధించిన యూఎస్ ఉద్యోగాల డేటా అంచనాల కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా, సెప్టెంబర్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందని చెబుతున్నారు. పర్యవసానంగా, మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా. అయితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్లో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చని లేదా మరింత తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల, సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ప్రోత్సాహం పొందవచ్చు.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల యూఎస్ బాండ్లపై రాబడి తగ్గడమే. ఇది డాలర్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు, యూఎస్ బాండ్లపై రాబడి కూడా తగ్గుతుంది. పెట్టుబడిదారులు యూఎస్ ట్రెజరీ బాండ్ల కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నందున, దీనిని బంగారం ధరల పెరుగుదలగా కూడా భావించవచ్చు. శ్రావణ మాసం ప్రారంభంతో బంగారం ధరలు పెరగడం దీనికి ఒక కారణం.
మరోవైపు, దేశీయ మార్కెట్లోని కారణాలను పరిశీలిస్తే, శ్రావణ మాసం ప్రారంభంతో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవబోతోంది. దీని కారణంగా, ప్రస్తుతం మార్కెట్లో బంగారు ఆభరణాలకు బలమైన డిమాండ్ ఉంది. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా, ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ముడి చమురు ధరలు కూడా తగ్గాయి, ఇది డాలర్ విలువ తగ్గడానికి బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది. మరోవైపు, భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అనేక బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నట్లు మనం చూడవచ్చు.
Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Mahesh Babu Birthday: నటనలో 'రాజకుమారుడు'..అమ్మాయిల మనసు దోచే 'పోకిరి' ఈ సూపర్ స్టార్..HBD మహేష్ బాబు!
Hyderabad, Telangana:Mahesh Babu Birthday: తెలుగు సినీ పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు హీరో మహేష్ బాబు. అందంతో పాటు అభినయం, అంకితభావం ఉట్టిపడే ఆయన నటనతో కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టారు. కేవలం నటుడిగానే కాకుండా, తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ 'రియల్ హీరో' అనిపించుకుంటున్న మహేశ్ బాబు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం.
బాలనటుడిగా ఎంట్రీ..
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన హీరో మహేష్ బాబు.. 'రాకుమారుడు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో యువతను విపరీతంగా ఆకట్టుకుని 'ప్రిన్స్' బిరుదును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' వంటి సంచలన విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ప్రయోగాత్మక చిత్రాలు - బాక్సాఫీస్ రికార్డులు..
కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా 'శ్రీమంతుడు', 'మహర్షి', 'భారత్ అనే నేను' వంటి సందేశాత్మక చిత్రాలతో సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా తన హవాను కొనసాగిస్తున్నారు.
గ్లోబల్ ప్రాజెక్ట్తో సరికొత్త మైలురాయి..
ప్రస్తుతం మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోని భారీ యాక్షన్ అండ్ మైథలాజికల్ మూవీ 'వారణాసి' సినిమాలో నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.
సామాజిక సేవా కార్యక్రమం..
తెరపైనే కాకుండా తెరవెనుక కూడా మహేశ్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 'మహేష్ బాబు ఫౌండేషన్' ద్వారా వందలాది గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు నిలబెడుతున్నారు. అలాగే 'మీనాక్షి' గ్రామం వంటి దత్తత కార్యక్రమాలతో తన మంచితనాన్ని చాటుకుంటున్నారు.
విలక్షణ నటనతో, బాధ్యతాయుతమైన పౌరుడిగా తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన కెరీర్ మరిన్ని అద్భుత విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు!
Also Read: ప్రభాస్ సినిమాలోని ఈ లేడీ విలన్ గుర్తుందా? 54 ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టించే గ్లామర్!
Also Read: యశస్వి జైస్వాల్తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chintada Ravikumar Arrest: మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్!
Amadalavalasa, Andhra Pradesh:YSRCP Chintada Ravikumar Arrest: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటన నేపథ్యం..
శ్రీకాకుళం పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఇటీవల శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్కు స్వాగతం పలికేందుకు చింతాడ రవికుమార్ తన అనుచరులతో కలిసి తరలివచ్చారు.
అయితే ఈ క్రమంలో మహిళా ఎస్సైపై కొందరు వైసీపీ నేతలు దురుసగా ప్రవర్తించారు. కొట్టారోడ్డు వద్ద బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల రవికుమార్, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, చింతాడ రవికుమార్ను ఈ కేసులో ఏ1 గా చేర్చారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
రవికుమార్ ఆరోపణలు, వివరణ..
అరెస్ట్ సమయంలో చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆరోపణలు గుప్పించారు. తన కుటుంబ సభ్యులను, వైసీపీ కార్యకర్తలను విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ వద్దకు లొంగిపోయేందుకు వెళ్తుండగా తనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అంతకుముందు సోషల్ మీడియా ద్వారా స్పందించిన రవికుమార్.. తనతో పాటు అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తే పోలీసులకు లొంగిపోతానని తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండటం వల్లే మహిళా ఎస్ఐని పక్కకు జరిపామని, అంతేక్రీ ఆమె గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదని ఆ వీడియోలో వివరణ ఇచ్చారు.
Also Read: రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..ఆగస్టు 8 నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్!
Also Read: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం..బ్యాలెట్ బాక్సులా? ఈవీఎంలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jio Rs 200 Recharge: జియో వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్..రూ.200లకే 30 జీబీ డేటాతో 15 ఓటీటీ సబ్స్క్రిప్షన్స్!
Hyderabad, Telangana:Jio Rs 200 Recharge Free OTTs: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం మరో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం మొబైల్ డేటా మాత్రమే కాకుండా, ఎంటర్టైన్మెంట్ లవర్స్ని దృష్టిలో ఉంచుకుని రూ.200 ధరతో ఈ సరికొత్త ప్లాన్ను డిజైన్ చేసింది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ OTT ప్రయోజనాలు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
రూ.200 ప్లాన్ ప్రత్యేకతలు..
ఈ రూ.200 రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు లభిస్తుంది. రోజూవారీ డేటా లిమిట్ ఉండే సాధారణ ప్లాన్లా కాకుండా.. మొత్తం 28 రోజులకు కలిపి ఒకేసారి 30 GB హై-స్పీడ్ డేటాను అందిస్తారు. దీన్ని యూజర్లు తమ అవసరానికి తగ్గట్టు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.
ఈ రీఛార్జ్ ద్వారా అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వంటి ప్రముఖ ప్లాట్ఫారమ్లతో కలిపి మొత్తం 15 ఓటీటీ సేవలకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.
ఓటీటీ ప్రియులు విడివిడిగా వేర్వేరు సబ్స్క్రిప్షన్లు తీసుకునే పనిలేకుండా, తక్కువ ఖర్చుతోనే సినిమాలు, వెబ్ సిరీస్లు, లైవ్ స్పోర్ట్స్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ అద్భుతంగా సరిపోతుంది.
ఈ ప్లాన్ ఎవరికి అనుకూలం?
ప్రతిరోజూ ఇంటర్నెట్ అవసరం పెద్దగా లేనివారికి, లేదా అప్పుడప్పుడు బల్క్ డేటా కావాలనుకునే వారికి ఈ రీఛార్జ్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ప్లాన్ను ఎంచుకునే ముందు దీనికి ఏదైనా యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరమా లేదా అనే పూర్తి వివరాలను 'మై జియో' యాప్ లేదా అధికారిక వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: వినియోగదారులకు ఎయిర్టెల్ బిగ్షాక్..అతిచౌకైన రూ.299 రీఛార్జ్ ప్లాన్ క్యాన్సిల్!
Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
