నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
Hyderabad, Telangana:బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరీయ విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్లో అఖిలపక్ష విద్యార్థి సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ నేత జాజుల శ్రీనివాస్తో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, ఇతర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బలమూరు వెంకట్ ఎమ్మెల్సీ నీట్ పరీక్ష పేపర్ లీక్, ఎన్టీఏ సంస్థ నిర్వహణలోపం, పేపర్లు అమ్ముకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరు చాలా బాధాకరం.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Pawan Kalyan: ఏపీలో కులాల దరిద్రం పోవాలి.. నన్ను కులానికి పరిమితం చేయొద్దు: పవన్ కల్యాణ్
Kakinada, Andhra Pradesh:Janasena Maata Manthi: 'మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నన్ను కులాలకు పరిమితం చేయకండి' అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కులాల దరిద్రం వదిలితేనే బాగుపడుతుందని అభిలషించారు. సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్గా మాత్రమే చూడాలని.. వారికి కులాలను అంటగట్టడం సరికాదని స్పష్టం చేశారు. 'నేరం చేసిన వారికి కులం ఏమిటి? నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాలకులుగా మారడానికి వీల్లేదు. క్రిమినల్స్ పాలకులైతే ప్రజల భవిష్యత్తు మంట గలుస్తుంది' అని పవన్ కల్యాణ్ తెలిపారు.
కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సంచలన ప్రసంగం చేశారు. 'ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కులానికి చెందిన వ్యక్తి. అతను డ్రైవర్ను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎవరికీ కులం గుర్తుకు రాదు. ఇప్పుడు నేరస్తులపై చర్యలు తీసుకుంటుంటే మాత్రం గుర్తొస్తుంది' అని తెలిపారు. 'రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదు. సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తూ, తప్పులకు పాల్పడే వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది' అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
'కూటమి పాలనలో ఎవరైనా తప్పు చేసి దొరికితే వారు తమ జీవితంలో మళ్లీ అలాంటి తప్పు చేయాలనే ఆలోచన కూడా చేయలేనంత తీవ్రంగా చర్యలు ఉంటాయి. తప్పు చేసే వాడికే కులం ఉంటుందా బాధితురాలుకి కులం ఉండదా?' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. వైసీపీ రౌడీ మూకలకి చెబుతున్నా పిచ్చి వేషాలు వేస్తే క్షమించే పరిస్థితి ఇక్కడ లేదని.. పొరపాటున మీ ప్రభుత్వం వచ్చినా సరే తొక్కి నారతీస్తానని హెచ్చరించారు.
'గతంలో వైసీపీకి సంబంధించిన మూలాలు ఉన్న పోలీసులపై ప్రత్యేకంగా దృష్టి పెడతా. ఒక స్టేషన్ ఎస్సై స్థాయిలో జరగాల్సిన న్యాయం ఎస్పీ డిప్యూటీ సీఎం వరకు రావడం వ్యవస్థలో లోపాలకు అద్దం పడుతోంది' పవన్ కల్యాణ్ తెలిపారు. తప్పు చేసిన వాడికి, నేరాలకు పాల్పడేవారికి ఎలాంటి కులం, మతం ఉండవని స్పష్టం చేశారు. 'గతంలో కోనసీమలో జరిగింది. ఎవరైనా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోవద్దని పోలీసులకు సూచించారు. మహిళలు, ఆడబిడ్డలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 'క్రిమినల్స్కు కులం ఉండదు. చాలా మంది కన్వీనెంట్ రాజకీయాలు చేస్తారు. రౌడీలను ఎంకరేజ్ చేశారా? దేశాన్ని ఎవడు బాగు చేయలేరు' అని అసహనం వ్యక్తం చేశారు.
'ఒక హోంమంత్రిని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆమె మేకప్ గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో తిరిగే ఆడబిడ్డ అలంకారాలు చేసుకోకూడదా. ఇలాంటి మాటలు ప్రేరణగా తీసుకొని కాలేజీలో కుర్రాడు అప్పుడే వచ్చిన ఆడబిడ్డను అంటాడు. నా భయం అది. దాని పర్యావసానాలు ఊహించలేం' పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. 'నేను బాధ్యతలు తీసుకున్నాక కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి ఎవరు కలెక్టర్గా ఉండాలి అనే ఆలోచన చేయలేదు. ఒక్కటే సూచన ఇచ్చా ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, వ్యవస్థ బలంగా ఉండాలి' అని పేర్కొన్నారు.
సుగాలి ప్రీతి కేసు
ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాలు అన్నీ మాయం చేశారు. 2018లో నా బిడ్డను చంపేశారని న్యాయం చేయాలని 2019లో సుగాలి ప్రీతి తల్లి నన్ను కలిసింది. నేను గెలిచాక మొదటి కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాలు మాయం చేశారు. గత పాలకులు చేసిన తప్పులతో సాక్ష్యాలు లేక క్రిమినల్స్ తప్పించుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని సార్లు నేరం చేశారని తెలిసినా.. సాక్ష్యాలు లేకపోతే ఏమీ చేయలేం' అని పవన్ కల్యాణ్ తన నిస్సహాయతను వెలిబుచ్చారు.
Fathers Day 2026: మనకు అన్నీ నేర్పించిన నాన్న కోసం.. ఓ చిన్న సందేశం..
Hyderabad, Telangana:Fathers Day 2026 Wishes: మన జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి తండ్రి. అలాంటి తండ్రిని గౌరవించేందుకు ప్రత్యేక రోజంటూ అవసరం లేదు. కానీ, ప్రపంచలోని ఓ పోకడ కారణంగా జూన్ నెలలోని మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్వహిస్తారు. మనకు మార్గనిర్దేశం చేస్తూ జీవితంలో బలంగా నిలిచే సపోర్ట్ నాన్న.. అలాంటి వ్యక్తి పట్ల మనం చూపించే అర్ధవంతమైన గౌరవానికి వాక్యాలు జోడించడం కష్టమే. కానీ, మనల్ని ప్రేమానురాగాలతో తీర్చిదిద్దుతున్న నాన్న కోసం కనీసం ప్రేమగా మాట్లాడిన ఓ మాటైనా జీవితాంతం గుర్తుండిపోతుంది.
ఈ క్రమంలో నేడు అనగా జూన్ 21వ తేదీన ఫాదర్స్ డేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. ఈ రోజున తమ తండ్రులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ఎప్పటిలాగ కాకుండా కొంచెం కొత్తగా వారికి గ్రీటింగ్ కార్డ్స్ లేదా వాట్సప్ మెసేజ్ ద్వారా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తే.. ఆ తండ్రిపై మీరు చూపించే కొద్దిపాటి ప్రేమకు ఆయన ఉబ్బితబ్బిబ్బైపోతారు. విషెస్ తెలియజేసేందుకు కొన్ని కోట్స్ ఇప్పుడు మీతో పంచుకుంటున్నాము.
1) అత్యంత ప్రేమతో ప్రతి అడుగులోనూ నాకు అండగా నిలిచే నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మీరే నా గొప్ప స్ఫూర్తి.
2) నన్ను ఎల్లప్పుడూ నమ్మినందుకు ధన్యవాదాలు, నాన్న. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.
3) మీరే నా హీరో, నా మార్గదర్శి, నా అతిపెద్ద బలం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
4) మీరు నా తండ్రిగా ఉన్నందుకు నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేను. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తునే ఉంటాను!
5) జీవితంలో ప్రతి విషయాన్ని దగ్గరుండి నేర్పిన నా నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
6) ఫాదర్స్ డే శుభాకాంక్షలు, నాన్న! మీరే నా జీవితంలో అతిపెద్ద బలం.
7) నాన్న, నీ ప్రేమ లేకుండా నేను శూన్యం.
8) మీరే నా హీరో, ఎప్పటికీ మీ హీరోనే. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
9) నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నందుకు ధన్యవాదాలు, నాన్న.
10) మీరు లేకుండా నా జీవితం అసంపూర్ణం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
11) మీ ప్రేమ, మార్గదర్శకత్వం వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ధన్యవాదాలు నాన్న!
12) నాన్న, మీరే నా జీవితానికి పునాది. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
13) మీరు లేకుండా నా జీవితం అసంపూర్ణం. మీకు నా ప్రేమ నాన్న!
14) మీరే నా బలం, నా స్ఫూర్తి నాన్న.
15) ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న! నా జీవితానికి మీరే బలం.
16) మీ ప్రేమకు, మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు నాన్న.
17) మీరంటే నాకు భయమే..కానీ, చెప్పలేనంత ప్రేమ నాన్న! ఫాదర్స్ డే శుభాకాంక్షలు!?
ఫాదర్స్ డే అంటే కేవలం బహుమతులు ఇవ్వడం మాత్రమే కాదు. తరచుగా మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తపరచడం కూడా. ఒక చిన్న సందేశం తండ్రి, బిడ్డల మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. చేతితో రాసిన ఉత్తరాలు, వాట్సాప్ సందేశాలు లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా శుభాకాంక్షలు పంపడం ఒక ప్రముఖ ధోరణిగా మారింది.
Also Read; Happy Father's Day 2026: నాన్న మనసు మెచ్చేలా.. ఫాదర్స్ డే బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్ ఇవే!
Also Read: Happy Fathers Day: నాన్న మనసును తాకే బెస్ట్ ఫాదర్స్ డే టాప్ 10 విషెస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tuni Girl Missing: తుని చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్..రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్!
Tuni, Andhra Pradesh:Tuni Girl Missing Case: ఆడుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన చిన్నారి కనిపించకకుండా పోయి నేటికి 15 రోజులు దాటిపోయింది. అయితా చిన్నారి జాడ తెలియడం లేదు. రోజుకో అనుమానంతో రాష్ట్రమంతా ఏవోవే ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. చిన్నారి కనిపించకుండా పోయి ఇన్ని రోజులైనా ఎలాంటి క్లూ లభించకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన కాకినాడ పర్యటన ఖరారు కాగా.. ఈ కేసు గురించి కూడా ప్రస్తావన వచ్చిందని అధికారులు చెబుతున్నారు.Re-NEET Exam 2026: రీ-నీట్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ టెన్షన్ పోవాలంటే ఎక్స్పర్ట్స్ చెబుతున్న ఈ టిప్స్ పాటించండి!
Hyderabad, Telangana:Re-NEET Mental Health Tips: పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళనలకు గురికాకూడదు. ఆందోళన వల్ల సరైన సమాధానాలు రాయలేకపోవడమే కాకుండా, ప్రశ్నాపత్రం కూడా సరిగ్గా అర్థం కాదు. సైకాలజిస్టుల ప్రకారం, రీ-ఎగ్జామ్ రాస్తున్నాం అనే భావనతో పరీక్ష పాస్ అవుతామో లేదో అన్న ఆందోళన అభ్యర్థులలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కోపం, నీరసం, ఆందోళన వంటివి రావడం వల్ల పరీక్షను సరిగ్గా అటెండ్ చేయలేకపోతారు.
ప్రతిసారి పరీక్ష రాయడం కష్టమే అయినప్పటికీ, కొత్తగా ప్రిపేర్ అయినట్టే మానసికంగా సిద్ధంగా ఉంటే పరీక్షను సులభంగా రాయవచ్చు. పరీక్ష సమయంలో కడుపు సమస్యలు, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురైతే, పరీక్షా పత్రంపై దృష్టి పెట్టలేరు. ఒకవేళ పరీక్ష రాస్తున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు వస్తే, వెంటనే మీ తల్లిదండ్రులకు, స్నేహితులకు లేదా ఇన్విజిలేటర్కు సమాచారం అందించండి.
పరీక్షకు ముందు అభ్యర్థులు చేయాల్సిన పనులు:
NEET పరీక్ష రాసే విద్యార్థులు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు తగినంత నీరు తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండాలి. పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. జంక్ ఫుడ్ , కెఫిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం తగ్గించాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి మ్యూజిక్ వినడం, డ్రాయింగ్, చిన్నపాటి వ్యాయామం, సైక్లింగ్, ప్రకృతితో సమయం గడపడం లేదా ఇష్టమైన వారితో మాట్లాడటం వంటివి చేయాలి. మెడిటేషన్ , మంత్ర పఠనం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
మానసిక నిపుణుల ప్రకారం, మీరు పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ నిద్రపోతే బ్రెయిన్ తప్పుగా స్పందించే అవకాశం ఉంది. మీరు ఈ పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.. గత అనుభవం కూడా ఉంది కాబట్టి, ప్రశ్నల ఫార్మాట్ మీకు ముందే తెలుసు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండండి.
పరీక్ష సమయంలో యాంగ్జైటీ వస్తే..
పరీక్ష సమయంలో ఆందోళనగా అనిపిస్తే కాసేపు ఆగి, లోతైన శ్వాస తీసుకోండి. పరీక్షకు ముందు అతిగా చదవడం వంటివి చేయకండి. ఇతర అభ్యర్థులతో పేపర్ కఠినంగా ఉందనే చర్చల్లో పాల్గొనకండి. ప్రశ్నపత్రాన్ని మొత్తం ఒక్కసారిగా చదవకుండా, ఒక్కో ప్రశ్నపై దృష్టి పెట్టండి. ఏదైనా ఒక ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకుండా, అది కష్టంగా అనిపిస్తే వెంటనే తదుపరి ప్రశ్నకు వెళ్లండి. మీకు సులభంగా అనిపించే ప్రశ్నలను ముందుగా పూర్తి చేయండి. "నేను బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా రాస్తాను" అని సానుకూలంగా ఆలోచించండి.
Also Read: నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష రోజూ ఇవి అస్సలు వేసుకెళ్లొద్దు! డ్రెస్ కోడ్ రూల్స్ ఇవే!
Also Read: నీట్ రీ-ఎగ్జామ్ గైడ్లైన్స్ విడుదల.. మార్కింగ్ విధానం, తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఇవే!
పేపర్ అర్థం కాకపోతే ఏం చేయాలి?..
పరీక్ష సమయంలో కాసేపు పేపర్ అర్థం కాకపోతే, అది ఆందోళన వల్ల అని గుర్తించండి. వెంటనే పెన్, పేపర్ పక్కన పెట్టి, రెండు మూడు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ, మళ్ళీ ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. "నేను బాగా చేయగలను" అని మనసులో అనుకోవడం వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. అలాగే ఒక చేతిని ఛాతిపై మరొక చేతిని కడుపుపై ఉంచండి.. కాళ్లను నేలకు బలంగా నొక్కి పట్టుకోవడం లేదా ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీ నర్వస్ సిస్టమ్ మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. వైద్య పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఈ సూచనలు, ఆందోళన లేకుండా పరీక్షను సులభంగా పూర్తి చేయడానికి సహాయపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Happy Fathers Day: నాన్న మనసును తాకే బెస్ట్ ఫాదర్స్ డే టాప్ 10 విషెస్..
Hyderabad, Telangana:Happy Fathers Day Wishes In Telugu: మన జీవితంలో తండ్రి స్థానం ఎంతో విలువైనది.. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే నాన్న త్యాగాలను.. ఆయన అందించే ప్రేమానురాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ డే గా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన ఫాదర్స్ డే వచ్చింది. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా ఫాదర్స్ డే ను జరుపుకుంటూ ఉంటారు. మీరు కూడా ఫాదర్స్ డేను ఎంతో ఘనంగా జరుపుకుంటూ.. ఇలా మీ తండ్రులకు శుభాకాంక్షలు తెలపండి..
✿ ఫాదర్స్ డే శుభాకాంక్షలు ✿
✿ కనుపాపను కాపాడే కనురెప్పవు నీవు..
నా గెలుపుకై అహర్నిశలు శ్రమించే నివురు గప్పిన నిప్పు నీవు..
నీ నీడలో పెరగడం నా పూర్వజన్మ సుకృతం..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..
✿ నా మొదటి అడుగు ఆసరా నీవు..
నా తడబాటుకు ధైర్యం నీవు..
చీకటి మార్గంలో వెలుగు నింపిన దిక్సూచివి నీవు..
హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ లవ్లీ ఫాదర్..
✿ నువ్వు చిందించిన ప్రతి చెమట చుక్క..
నా భవిష్యత్తుకు వేసిన బంగారు బాట..
నీ త్యాగానికి సాటి రాదు ఏ కానుక..
లవ్ యు నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే..
✿ పైకి గంభీరంగా కనిపించే హిమాలయం నువ్వు..
లోపల మాత్రం అనంతమైన ప్రేమ సాగరం నువ్వు..
నీ మౌనంలోనే నాపై ఊహించని ప్రేమ దాగుంది..
ఫాదర్స్ డే శుభాకాంక్షలు..
✿ కథల్లో వినే సూపర్ హీరోలను నేను చూడలేదు..
కానీ నా కళ్ళ ముందు ఉన్న నిజమైన హీరోవి నీవే నాన్న..
నా ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో దాటేసే నీ ధైర్యమే నాకు స్ఫూర్తి..
హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ లవ్లీ ఫాదర్..
Also Read: నాన్నకు ఒక రోజును ఎందుకు కేటాయించారు? దీని వెనుక ఉన్న కన్నీటి కథ మీకు తెలుసా?
✿ ఓర్పుతో నన్ను మలిచిన చిలిపివి నీవు..
నా ప్రతి ఎదుగుదలకు మూల కారణం నీవు..
నీ చల్లని దీవెనలే నాకు శ్రీరామరక్ష..
హ్యాపీ ఫాదర్స్ డే మై డియర్ ఫాదర్..
✿ కుటుంబం కోసం పగలు రేయి తపించే సూర్యుడివి నీవు..
మా జీవితాల్లో వెలుగును నింపే దీపానివి నీవు..
నీ అడుగుజాడల్లో నడవడం నా అదృష్టం..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..
✿ మాటల్లో చెప్పలేని అనురాగం నీది..
గుండెల్లో నాపై దాచుకున్న అమితమైన ప్రేమ నీది..
నాన్న అనే రెండు అక్షరాల వెనుక ఉన్న ప్రేమామృతం నీవు..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..
✿ బాధ్యతలు కదలని కొండవు నీవు..
నా చిన్న బాధకైనా కరిగిపోయే వెన్నవు నీవు..
నీ నీడన బతకడం కంటే గొప్ప వరం ఏముంది నాన్న..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..
✿ నా గెలుపు వెనక నిశ్శబ్ద శ్రమికుడు నువ్వు..
నా ప్రతి విజయాన్ని చూసి మురిసిపోయే మనసు నీది..
ఓటమిలో నన్ను వెనక తట్టి లేపే చేతులు నీవి..
నా జీవితానికి నువ్వే సర్వస్వం నాన్న..
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న..
Also Read: నాన్నకు ఒక రోజును ఎందుకు కేటాయించారు? దీని వెనుక ఉన్న కన్నీటి కథ మీకు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Iran Singer 74 Lashes: హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్కు 74 కొరడా దెబ్బలు! ఘోరమైన శిక్ష ఎందుకంటే?
Haftador, Yazd Province:Iran Singer Parastoo Ahmadi 74 Lashes: హిజాబ్ లేకుండా ప్రదర్శన ఇచ్చినందుకు ఓ లేడీ సింగర్కు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. హిజాబ్ లేకుండా ఓ ఈవెంట్లో పాట పాడిన ఇరాన్ గాయని పరాస్తూ అహ్మదీకి ఇరాన్లోని ఖోమ్ ప్రావిన్స్లోని ఒక క్రిమినల్ కోర్టు ఆ బృందానికి 74 కొరడా దెబ్బల శిక్షగా విధించింది. దీంతో పాటు ఆ బృందానికి రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయకూడదనే ఆంక్షలను విధించింది.
2024లో ఆమె యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఒక సంగీత కచేరీకి గాను.. అహ్మదీ, సంగీతకారులతో సహా ఆమె నిర్మాణ బృందంలోని ఎనిమిది మంది సభ్యులకు శిక్ష విధించినట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ నివేదించింది. ఇరాన్లోని ఖోమ్ ప్రావిన్స్లోని ఒక క్రిమినల్ కోర్టు ఆ బృందానికి 74 కొరడా దెబ్బలతో పాటు.. రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, అలాగే రెండేళ్ల పాటు ఎలాంటి కన్సర్ట్లలో పాల్గొనేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది.
"అసభ్యకరమైన, అనైతికమైన కంటెంట్"గా పరిగణించే కంటెంట్ను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేసి వారి మర్యాదను మంటగలిపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ తీర్పును ఇరాన్ న్యాయవ్యవస్థ వార్తా సంస్థ ఇంకా అధికారికంగా ప్రచురించలేదు. అయితే ఈ శిక్షను మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అమెరికాకు చెందిన 'సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్' సంస్థకు చెందిన బహార్ గందేహరి, దేశంలో మానవ హక్కుల పరిస్థితులు పెద్దగా మారలేదనడానికి ఈ శిక్ష ఒక సాక్ష్యమని అభివర్ణించారు.
యూట్యూబ్లో ప్రదర్శన ఇచ్చినందుకు అహ్మదీకి కొరడా దెబ్బలు వేశారన్న వార్తలపై స్పందిస్తూ.. పాత్రికేయుడు మసీహ్ అలీనెజాద్.. ఈ చర్య మహిళల గొంతులను ఒక ముప్పుగా ఎలా పరిగణిస్తున్నారో చూపిస్తోందని, ప్రభుత్వ చర్యలను "మహిళలపై వర్ణవివక్ష" అని అభివర్ణించారు. న్యాయ నిపుణులు కూడా ఈ తీర్పును ప్రశ్నించారు. ఇరాన్ చట్టం ప్రకారం మహిళలు పాడటం లేదా సంగీతం సృష్టించడం నేరం కాదని మానవ హక్కుల న్యాయవాది మోయిన్ ఖజెలీ పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే?
2024 డిసెంబర్లో ఒక ఆన్లైన్ సంగీత కచేరీలో గాయని 'అజ్ ఖూనే జవానే వతన్' ("మాతృభూమి యువత రక్తం నుండి") అనే దేశభక్తి గీతాన్ని ప్రదర్శించడంతో ఈ వివాదం మొదలైంది. అహ్మదీ హిజాబ్ లేకుండా కనిపించడంతో, లైవ్స్ట్రీమ్ చేసిన ఆ ప్రదర్శన వీడియో వైరల్ అయింది.
అదే సమయంలో 27 ఏళ్ల వయసున్న గాయని.. జుట్టు విరబోసుకొని, నల్లని స్లీవ్లెస్ డ్రస్సు ధరించి, నలుగురు పురుషుల సంగీతకారులతో కలిసి ఆమె ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రదర్శన యూట్యూబ్లో లక్షలాది వీక్షణలను పొందింది. ఆ సంగీత కచేరీ ఆన్లైన్లో విడుదలైన కొద్దిసేపటికే.. అహ్మదీతో పాటు పలువురు సంగీతకారులను అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. వారిని తర్వాత విడుదల చేసినప్పటికీ, ఆ వీడియో ప్రచురణకు సంబంధించి వారిపై అధికారికంగా కేసు నమోదు చేశారు.
Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు
Also Read: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indian Railways: ఇకపై రైళ్లలో రూల్స్ బ్రేక్ చేస్తే బాదుడే.. రూ.500 పెనాల్టీ! దొరికితే 6 నెలల జైలు శిక్ష, రైల్వే శాఖ కొత్త రూల్స్!
Hyderabad, Telangana:Indian Railways Penalty For Ticketless Journey: భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు ఇకపై టికెట్ లేకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తే గతంలో ఉన్న రూ.250 పెనాల్టీని రూ.500కి పెంచారు. ప్రయాణికులు తమ టికెట్ను ఎల్లప్పుడూ తమ వద్దే ఉంచుకోవాలని, ఫైన్ చెల్లించని వారికి ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సెంట్రల్ జోన్లో కేవలం మే నెలలోనే రూ.45.85 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు సమాచారం.
ఈ కనీస పెనాల్టీ రైల్వే యాక్ట్ 1989లోని సెక్షన్ 137, 138 కిందకు వస్తుంది. జూన్ 20, 2026 నుండి ఈ రూ.500 జరిమానా వర్తిస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు రైలులో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలి, లేకపోతే భారీ జరిమానా విధించబడుతుంది. టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, సెంట్రల్ రైల్వే జోన్ ఇప్పటివరకు 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుండి రూ.45.85 కోట్ల జరిమానా వసూలు చేసింది.
అంతేకాకుండా, రైలు ప్రయాణంలో కొన్ని వస్తువులు తీసుకువెళ్లడం నిషేధించబడింది. ముఖ్యంగా గ్యాస్ లేదా మండే స్వభావం గల పదార్థాలను తీసుకువెళ్తే రూ.10,000 పైగా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనితో పాటు ఇతర నిబంధనలను కూడా అమలు చేస్తారు. మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఒకరి పేరు మీద టికెట్ బుక్ చేసుకుని మరొకరు ప్రయాణించడం కూడా నిషిద్ధం. ఈ కొత్త నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడానికి ప్రయాణికులు నిరాకరిస్తే, ఆ కేసు కోర్టు వరకు వెళ్తుంది.
READ ALSO: రైలులో విండో సీట్ కావాలా? టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే చాలు.. సీట్ పక్కా!
READ ALSO: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రన్నింగ్ ట్రైన్లో కూడా టికెట్ బుకింగ్, కొత్త రూల్స్ ఇవే!
భారతీయ రైల్వేలో వస్తువులు విక్రయించే వారిపై కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎటువంటి గుర్తింపు లేకుండా ఇష్టానుసారంగా రైల్వేలో వస్తువులు అమ్మకూడదు. అటువంటి వారికి భారీ జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించని వారికి మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000 వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది.
అంతేకాకుండా, రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై, ముఖ్యంగా మద్యం సేవించి గొడవలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారిపై భారీ జరిమానా విధించడమే కాకుండా, రైలులో సిగరెట్లు తాగినా లేదా మద్యం సేవించినా జరిమానా విధించబడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vemulawada: కాంగ్రెస్ రాక్షస పాలనలో రైతన్నల కన్నీరు.. రేవంత్ సర్కార్పై BRS ఫైర్!
Vemulawada, Telangana:Vemulawada Chalmeda Laxminarsimha Rao: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోందని.. బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు నివాసంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల మీడియా సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎత్తిచూపుతూ మండిపడ్డారు..
కేసీఆర్ పాలనే రైతులకు శ్రీరామరక్ష..
బీఆర్ఎస్ హయాంలో కెసిఆర్ రైతులకు అండగా నిలిచి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాడు కల్లాల్లో పోసిన వడ్లను.. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందని చెప్పారు.. కెసిఆర్ దార్శనికత వల్లే కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు కోట్ల 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని.. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ కాలేశ్వరంపై నీచమైన రాజకీయాలు చేస్తూ రైతులకు సాగునీరు అందించకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.
అబద్ధాల ఆరు గ్యారెంటీలు.. యూరియాకు చెప్పుల క్యూలు..
అబద్దాలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఆర్ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని.. నాడు కెసిఆర్ పాలనలో సంతోషంగా ఉన్న రైతులు.. నేడు కాంగ్రెస్ రాక్షస పాలనలో కన్నీరు పెడుతున్నారని వేములవాడ BRS నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.. యూరియా కోసం వ్యాపులు పెట్టడం కాంగ్రెస్ అసమర్ధతకు నిదర్శనమని ఎద్దేవ చేశారు.. రైతులు స్మార్ట్ఫోన్స్లో యూరియా ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే దుస్థితి మళ్ళీ వచ్చిందని ధ్వజమెత్తారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
హామీలు ఏమాయె? ప్రభుత్వ విప్కు ప్రశ్నల వర్షం..
రైతులకు ఇస్తామన్న బోనస్ ఏమైంది? పంట పెట్టుబడి సహాయం రైతుబంధు అసలు ఇస్తారా లేదా? అని నాయకులు డిమాండ్ చేశారు.. కేంద్రం ప్రకటించే పంటలనే కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు అన్నారు.. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసకు ఇక్కడి రైతుల గోస కనిపించడం లేదని ప్రశ్నించారు.. పంటలు వేసే సమయానికి సాగునీరు ఇస్తారో లేదో సమాధానం చెప్పాలన్నారు.. రైతులను అనాధలను చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS ఎల్లప్పుడు అండగా ఉంటుందని.. ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని నాయకులు స్పష్టం చేశారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bandi Bhagirath Bail: పోక్సో కేసులో బండి భగీరథ్కు భారీ ఊరట..రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు!
Hyderabad, Telangana:Bandi Bhagirath Bail News: పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్కు ఎట్టకేలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. గత నెల రోజులకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న అతనికి మల్కాజ్గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు కేసు ఏమిటంటే?
హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8వ తేదీ రాత్రి బండి భగీరథ్పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ పోక్సో కేసును నమోదు చేశారు.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 17 ఏళ్ల మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, అత్యాచారానికి ఒడిగట్టాడనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
నెల రోజులుగా జైల్లోనే..
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన పేట్ బషీరాబాద్ పోలీసులు.. మే 16వ తేదీ రాత్రి బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో అతడిని హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అప్పటినుంచి దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులోనే రిమాండ్లో ఉన్న భగీరథ్ తరపు న్యాయవాదులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం, మల్కాజ్గిరి కోర్టు నిందితుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Also Read: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే!
Also Read: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నోటీసులు..కోర్టుకు రావాలని ఆదేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OG Sequel Movie: పవర్స్టార్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్..చేతులు మారిన 'ఓజీ 2' మూవీ..ఈసారి ఎవరంటే?
Hyderabad, Telangana:OG Sequel Movie Producers: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వచ్చిన 'ఓజీ' (OG) ఓజాస్ గంభీర చిత్రం బాక్సాఫీసు వద్ద సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ జోష్తో ఇప్పుడు అందరూ 'ఓజీ 2' కోసం భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదే విషయమై ఇటీవలే పవన్ కళ్యాణ్ టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేయగా.. ఇప్పుడు సీక్వెల్ తప్పక ఉంటుందని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నవంబర్ నుంచి షూటింగ్?
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న డైరెక్టర్ సుజిత్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ తో స్టోరీ సిట్టింగ్ వేసిన తర్వాత.. స్క్రిప్ట్ ఫైనల్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్లో సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చి.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
చేతులు మారిన నిర్మాణ భాగస్వామ్యం..
అయితే ఈ ప్రాజెక్టును సంబంధించి ఫిలింనగర్లో ఒక షాకింగ్ రూమర్ వినిపిస్తోంది. 'ఓజీ' సినిమా మొదటి భాగాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించగా.. ఇప్పుడు మరో టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ కూడా కలిసి ఈ సీక్వెల్ నిర్మించనుందని టాక్ వినిపిస్తోంది.
తాజాగా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో పాటు మరో టాప్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఏదన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్షన్ అయినప్పటికీ.. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ డైలాగ్స్, సుజిత్ తన అభిమాన నటుడ్ని స్క్రీన్పై ప్రజెంట్ చేసిన విధానం నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి. ఇప్పుడు సీక్వెల్లో కూడా అంతకుమించిన ఎలివేషన్స్, ఇంటరెస్టింగ్ సీన్స్ ఇందులో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. ఇంతటి భారీ అంచనాల మధ్య రాబోతున్న 'ఓజీ 2' సినిమాకు పవర్స్టార్, సుజిత్ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ వీడియోలు..ఏఐ వీడియో క్రియేట్ చేసిన ముగ్గురు అరెస్ట్!
Also REad: తల్లి కాబోతున్న హీరోయిన్ సమంత..బేబీబంప్ను చీరతో దాచేస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Mine 2026: ఆంధ్రప్రదేశ్కు కూతవేటు దూరంలో మరో బంగారం నిధి..దక్షిణ భారతదేశంలో రెండో బంగారు గని!
Haveri, Karnataka:Karnataka Haveri Gold Mine: అంతర్జాతీయ మార్కెట్లు, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కొన్నిసార్లు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్ తెలిసింది. ఏపీలోని జొన్నగిరి బంగారం గనిలో బంగారం ఉత్పత్తి మొదలుపెట్టారు. ఇప్పుడు మరో గుడ్న్యూస్ బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని రాయదుర్గంకు కూతవేటు దూరంలో కర్ణాటకలో ఇప్పుడు మరో బంగారం గని బయటపడింది. కేజీఎఫ్ తరహాలో హావేరి జిల్లాలో మరో బంగారం గని బయటపడిందనే సమాచారం బయటకు వచ్చింది.
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో ఇనుప ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన క్రమంలో.. హవేరి జిల్లాలోని గంజూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారు తవ్వకాలకు సుప్రీంకోర్టు కూడా పచ్చజెండా ఊపుతుందా అనే ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఇది జరిగితే, హవేరి జిల్లా కూడా బంగారు గనిగా ఆవిర్భవించడంలో ఎలాంటి సందేహం లేదు.
2015 నుండే బంగారం అన్వేషణ..
హవేరి జిల్లాలోని గంజూర్తో సహా కొన్ని గ్రామాలలో బంగారు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో, 2015 నుండి బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ పనులు జరుగుతున్నాయి. డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ 2015లో సంబంధిత అధికార సంస్థ నుండి అనుమతి పొంది సర్వే నిర్వహించింది. దక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ గంజూర్ సరిహద్దు నుండి నాగేంద్రనామతి వరకు 72 ఎకరాల భూమిని సర్వే చేసింది. ఈ సమయంలో, ఆ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు.
రైతులతో ఒప్పందం చేసుకున్న కంపెనీ..
బంగారు నిక్షేపాలు ఏమైనా ఉన్నాయేమో అని సర్వే చేసేందుకు 72 ఎకరాల విస్తీర్ణంలో 150 బోర్వెల్స్ తవ్విన గోల్డ్ మైన్స్ కంపెనీ, మైనింగ్ కోసం ఎంపిక చేసిన భూ యజమానులకు ఎకరాకు సంవత్సరానికి రూ. 40,000 చొప్పున లీజుకు ఇచ్చింది. ఇందుకోసం, ఆ సమయంలో గోల్డ్ మైన్స్ కంపెనీ హవేరి నగరంలోని హనగల్ రోడ్డులో కనీసం ఒక కార్యాలయాన్ని కూడా తెరవలేదు. అయితే, కొన్ని చట్టపరమైన చిక్కుల కారణంగా మైనింగ్ అనుమతి లభించలేదు. అప్పటి నుండి గోల్డ్ మైన్స్ కంపెనీ చట్టంతో పోరాడుతూనే ఉంది.
అయితే ఇదే క్రమంలో గంజూర్ మాదిరిగానే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో కూడా ఇనుప నిల్వలు కనుగొన్నారు. అక్కడ కూడా, తవ్వకాలకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు అక్కడ ఇనుప తవ్వకాలకు పచ్చజెండా ఊపింది.
మహారాష్ట్రలోని ఇనుప ఖనిజ గని మాదిరిగానే.. హవేరి జిల్లాలోని గంజూర్ బంగారు గనిలో తవ్వకాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ మహారాష్ట్రలోని గడ్చిరోలి మాదిరిగా హవేరి జిల్లాలోని గంజూర్ గ్రామంలో బంగారు తవ్వకాలు జరుగుతాయని అంచనా వేసి, గంజూర్లో బంగారు తవ్వకాల ప్రారంభానికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే, కర్ణాటకలోని ఆ ప్రాంతంతో పాటు పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రానికి మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది.
రైతుల నుంచి వ్యతిరేకత..
మైనింగ్కు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే హవేరి బంగారు గనిగా మారాలని గోల్డ్ మైన్స్ కంపెనీ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు గంజూర్ గ్రామంలోని వ్యవసాయ భూ యజమానులతో పాటు కొందరు రైతులు దీనిని వ్యతిరేకించారు. ఆ రోజు కౌలు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో, రుణాలు తీసుకున్న ఎంతోమంది రైతులు తమ భూములను కోల్పోయారు. ఈ వ్యవసాయ భూమి సారవంతమైనది.. అంతే కాకుండా తమ తాతల తరం నాటి భూమిని ఇచ్చేదే లేదంటూ బంగారం గని వార్తలు వచ్చిన తర్వాత రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read; మరణించిన తర్వాత ఆరుగురికి ప్రాణం పోసిన రాజ్..ముంబై కుర్రాడి హృదయ విదారక గాథ!
Also Read: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. పీఎఫ్ అకౌంట్లో రూ.15,000 జమ..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rukmini Vasanth AI Video: హీరోయిన్ రుక్మిణి వసంత్ బికినీ వీడియోలు..ఏఐ వీడియో క్రియేట్ చేసిన ముగ్గురు అరెస్ట్!
Hyderabad, Telangana:Rukmini Vasanth AI Video News: కన్నడ నటి రుక్మిణి వసంత్ వీడియోను మార్ఫ్ చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ)ను ఉపయోగించి.. హీరోయిన్ రుక్మిణి వసంత్ కు సంబంధించిన అభ్యంతరకరమైన రీతిలో వీడియో క్రియేట్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న బెంగళూరు నగర సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తనను కించపరిచే ఉద్దేశంతో AI టెక్నాలజీతో అభ్యంతరకరమైన (బికినీ వీడియో) కంటెంట్ను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. ఇదే విషయమై సదరు నటి రుక్మిణి వసంత్ సీరియస్గా స్పందించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది.మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని.. తన ప్రైవసీని ఉల్లంఘించాయని, మానసిక వేధింపులకు గురిచేశాయని.. అంతే కాకుండా తనను ప్రజల ముందు తప్పుగా చిత్రీకరించాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసిన బెంగళూరు నగర సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నం. 36/2026) నమోదు చేసిన తర్వాత, ఈ కంటెంట్ను సృష్టించి ప్రచారం చేసిన వారిని గుర్తించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడటానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మూడు మొబైల్ ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులను కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన రవికుమార్ (24).. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాకు చెందిన చంద్రకాంత్ (33) ప్రస్తుతం బెంగళూరులోని కామాక్షిపాళ్యలో నివసిస్తున్నట్లు తెలిసింది. అలాగే బెంగళూరులోని మహాలక్ష్మి నగర్కు చెందిన రంజిత్ (25)గా గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
రుక్మిణి వసంత్ చివరిగా 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్-1' చిత్రంలో కనిపించారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న 'డ్రాగన్'సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ.
Also Read: తల్లి కాబోతున్న హీరోయిన్ సమంత..బేబీబంప్ను చీరతో దాచేస్తుందా?
Also Read: ప్రియుడికి బ్రేకప్ చెప్పిన నాగార్జున హీరోయిన్ సునైనా..నిశ్చితార్థం ఫొటోలు డిలీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: వానమ్మా.. ఒక్కసారొచ్చిపోవమ్మా!: కరీంనగర్ రైతన్నలు
Karimnagar, Telangana:Monsoon Delay Telangana Latest News: మృగశిర కార్తె ప్రవేశించి.. వర్షాకాలం అధికారికంగా ప్రారంభమై కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ.. ఆకాశం మాత్రం కరుణించడం లేదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్న తొలకరి పలకరింపు కరువైంది.. దీంతో ఎంతో ఉత్సాహంగా వానాకాలం సాగు కోసం ప్రారంభమైన రైతులు, ఇప్పుడు వర్షాలు లేక తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. నేలలన్ని దుక్కి దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ.. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది...
దుక్కులు సిద్ధం.. విత్తేందుకు వణుకు..
రోహిణి కార్తె సమయంలోనే ఎండల తీవ్రతను తట్టుకుంటూ రైతులు తమ పొలాలను ట్రాక్టర్లతో పాటు నాగర్లతో సిద్ధం చేసుకున్నారు.. విత్తనాలు ఎరువులను కూడా కొనుగోలు చేసి తెచ్చుకున్నారు.. కానీ ప్రస్తుతం ఒకవైపు భానుడి భగభగలతో పాటు.. మరోవైపు ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో విత్తనాలు నాటేందుకు రైతులు వెనకాడుతున్నారు. పత్తితో పాటు పెసర కంది మొక్కజొన్న బట్టి ఆరుతడి పంటలను సాగు చేయాలంటే భూమిలో కనీసం తడి ఉండడం తప్పనిసరి.. పదును లేకుండా విత్తనాలు వేస్తే అవి మొలకెత్తమని.. వేసిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
నైరుతి ఆలస్యం.. గుండెల్లో గుబులు..
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పాటు స్థానికంగా మేఘాలు ఆవరించిన కేవలం తుంపర్లతోనే సరిపెట్టడంతో రైతుల అంచనాలు తలకిందులౌతూ వస్తున్నా.. బావులతో పాటు బోరుబావులు భూగర్భ జల మట్టాలు పడిపోవడంతో పాటు.. కేవలం వర్షాధారంగా పంటలు వేసే చిన్న, సన్న కారు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. సమయానికి వానలు పడితేనే పంట చేతికొస్తుంది.. ఇలా రోజులు గడుస్తుంటే సాగుకాలం దాటిపోతుందని ఉమ్మడి జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నట్లు సమాచారం..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
జిల్లాలోని వ్యవసాయ అధికారుల సైతం తగినంత వర్షాపాతం నమోదయి.. భూమి లోపల పొరల వరకు తడిచేరిన తర్వాతే విత్తనాలు వెతుకోవాలని రైతులకు సూచిస్తున్నారు.. దీంతో అన్నదాతలు తమ ఆరాధ్య దైవమైన వరుణ దేవుడిని శాంతింప చేసేందుకు.. వర్షాలు కురవాలంటే పలు గ్రామాల్లో ప్రత్యేకమైన పూజలతో పాటు కప్పల పెళ్లిలు వంటి సాంప్రదాయ క్రతువులకు కూడా సిద్ధమవుతున్నారట.. వానమ్మ ఒకసారి వచ్చి పోవమ్మా.. మమ్మల్ని ఆదుకోవమ్మ.. అంటూ రైతులు పెట్టుకుంటున్న మొర ఆలకించి.. వరుణుడు ఎప్పుడు శాంతిస్తాడు చూడాల్సిందే...
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Mars Transit in Taurus: కుజుడి రాశి మార్పు.. మేషం, సింహం, మీన రాశుల వారికి దిమ్మతిరిగే లాభాలు!
Hyderabad, Telangana:Mars Transit In Taurus Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తూ ఉంటారు. ఇది భూమితో పాటు బలం ధైర్యం, శౌర్యానికి సూచికగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడి సంచారం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ గ్రహం రాశి మార్చినప్పుడల్లా అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మేష రాశి నుంచి మీన రాశి వరకు అన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అందుకే దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఇలా ఉంటే జూన్ 21వ తేదీన వృషభ రాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ గ్రహ సంచారం జరుగుతుంది. ఆగస్టు ఒకటో తేదీ వరకు అక్కడే సంచార దశలో ఉంటాడు. వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటిది కుజుడు అదే రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ఈ సమయంలో సానుకూలమైన ప్రభావం పడుతుంది. ఆయారాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరిగి వృత్తి జీవితంలో పురోగతి లభిస్తుంది. కుజుడి ఆశీస్సులతో ఆర్థిక శ్రేయస్సు విపరీతంగా లభించబోతోంది..
ఈ రాశులవారికి ధన లాభాలు:
మేష రాశి
గుజుడి సంచారం మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు మంచి శుభవార్తలు విని సంతోషపడతారు. ముఖ్యంగా వీరికి ధైర్యం విపరీతంగా పెరిగి వృత్తి జీవితంలో రాణించగలుగుతారు. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరికీ ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది.. ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సమయం ఎంతో ప్రభావంతంగా ఉండడం వల్ల ఎలాంటి పనులు చేపట్టినప్పటికీ మంచి ధన లాభాలు పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి
కుజుడి సంచారం సింహరాశి వారికి కూడా ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలను తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఈ సమయంలో తప్పకుండా ఊబందుకుంటాయి. గతంలో చిక్కుకున్న డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. ఆర్థిక ప్రణాళికలు ఈ సమయంలో తప్పకుండా విజయవంతం అవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారడమే కాకుండా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి.. వ్యాపారాలపరంగా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న సింహరాశి వ్యక్తులందరికీ ఈ సమయంలో శుభవార్తలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వ్యక్తులందరికీ దిమ్మతిరిగేది లాభాలు కలుగుతాయి.
మీన రాశి
కుజుడి సంచారం మీన రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు చేకూరడమే కాకుండా.. దేశ విదేశాలకు పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడి లో నుంచి మంచి మంచి లాభాలు కూడా పొందుతారు. మంచి శుభవార్తలు విని కుటుంబంలో ఆనందాన్ని పొందగలుగుతారు. వీరికి ప్రియమైన వారి నుంచి మంచి సపోర్టు కూడా లభిస్తుంది.. ఉద్యోగాలు చేస్తున్న మీన రాశి వారికి ఈ సమయంలో విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Guru Pushyami Rajayoga 2026: గురు పుష్యమి రాజయోగం.. జూన్ 18 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Guru Pushyami Rajayoga 2026 Effect On Zodiac: జూన్ 18వ తేదీన పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం సంచారం చేసింది. ఇదిలా ఉంటే ఆగస్టు 18వ తేదీ వరకు పుష్యమి నక్షత్రంలోనే ఈ గ్రహం కొనసాగుతూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్రానికి శని అధిపతి కావడం వల్ల శని గురు ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతోంది. అలాగే శని నక్షత్రంలోకి గురుడు ప్రవేశించడం చాలా శుభప్రదంగానే భావిస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. గురు గ్రహ సంచారం సమయంలో కొనుగోలు చేయడమే కాకుండా వ్యాపారాలు ప్రారంభించడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎంతో శుభప్రదమైన యోగంగా పరిగణించే గురు పుష్యమి యోగం కూడా ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి మరింత అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు ఊహించని విజయాలు సాధించబోతున్నారు. అయితే గురు పుష్యమి రాజయోగ ప్రభావంతో ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
మిథున రాశి వారికి జాతకంలో రెండవ స్థానంలో గురు పుష్యమి రాజయోగం ఏర్పడుతోంది. దీని అర్థం ధనస్థానంలో కాబట్టి.. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో సంపాదన విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఊహించని మార్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. అలాగే గత కొన్ని రోజుల నుంచి ఖర్చులు పెరిగినప్పటికీ అద్భుతమైన నియంత్రణ లభించబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో పొదుపు కూడా పెరుగుతుంది. మిథున రాశి వారికి కుటుంబ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే వీరు అద్భుతమైన శక్తిని వినియోగించి పనుల్లో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారస్తుల మద్దతు లభించి అనుకున్న పనుల్లో ధన లాభాలు కూడా పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి లగ్నంలో గురు పుష్యమి రాజయోగం ఏర్పడింది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులందరికీ ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించగలుగుతారు. గతంలో కంటే ఇప్పుడు వీరు చాలా దృఢంగా తయారవుతారు. అంతేకాకుండా స్వేచ్ఛగా జీవించగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్ఞానం కూడా విపరీతంగా పెరిగి స్వాతంత్రంగా జీవించగలిగే అద్భుతమైన అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు.. ముఖ్యంగా ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి..
మకర రాశి
మకర రాశి వారికి ఏడవ స్థానంలో గురు పుష్యమి రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా ఈ సమయంలో వీరికి వైవాహిక జీవితంలో సానుకూలమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా భాగస్వామి మీకు మరింత సన్నిహితంగా ఉండబోతోంది. వివాహిత జంటలకు వారి అత్తామామలతో మరింత మంచి సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్యంతో పని చేసే వారికి ఈ సమయంలో మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎప్పటినుంచో దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరికీ తప్పకుండా పరిష్కారం దొరకబోతోంది..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు శక్తివంతమైన గురు పుష్యమి రాజయోగ ప్రభావం వల్ల ఈ సమయం ఎంతో శుభప్రదంగా మారబోతోంది. అదృష్ట స్థానంలో గురుగ్రహం ఉండడం కారణంగా.. వీరికి పూర్వికుల ఆస్తులపరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పుణ్య యాత్రలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులందరికీ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సామాజిక హోదా పెరగడమే కాకుండా ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది.. దీనివల్ల ఎలాంటి పనులైనా ఎంతో సులభంగా చేయగలుగుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
