hyderabad News:డ్రీమ్ రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి మోసానికి పాల్పడ్డారు
Hyderabad, Telangana:డ్రీమ్ రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ దుర్గాప్రసాద్ ప్లాట్ పేరుతో రైల్వే ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసం కేసు హైదరాబాద్లో వెలుగు చూసింది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Cobra Video: కారు టైర్లో కోబ్రా.. గమనించకపోతే ప్రాణాలు పోయేవే.. వీడియో ఇదే!
Hyderabad, Telangana:Cobra Trapped In Car Video Watch: సాధారణంగా వాహనదారులు తమ కారును రోడ్డుపైకి తీసే ముందు టైర్లలో గాలి ఉందో లేదో చూసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం.. టైర్ల లోపల ఏమైనా ప్రాణహాని కలిగిన జీవులు ఉన్నాయేమోనని కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రమాదకరమైన నాగుపాము కారు చక్రం సందులో దూరి కూర్చున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోని నెటిజన్లను వణికిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తన కారును బయటికి తీద్దామని వెళ్లగా.. కారు చక్రం పై భాగంలో ఏదో కదులుతున్నట్లు గమనించాడు.. తీరా దానిని పరిశీలించి చూడగా అక్కడ దాదాపు 5 అడుగుల పొడవైన అత్యంత ప్రమాదకరమైన నాగుపాము చుట్టుకొని ఉండడం కనిపించింది. అది ఎప్పుడు వచ్చిందో? ఎలా లోపలికి దూరిందో తెలియదు కానీ.. టైర్ లో సన్నని సందులో చుట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు..
భయంతో వణికిపోయిన యజమాని వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పామును బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ పాము చక్రం లోపల ఉన్న చిన్న రాడ్డు మధ్య గట్టిగా చుట్టుకొని ఉండడంతో బయటికి తీయడం పెద్ద సవాలుగా మారింది.. స్నేక్ క్యాచర్ ఒక కర్ర సహాయంతో దానిని కదిలించే ప్రయత్నం చేయగా.. ఆ నాగుపాము కోపంతో గుసలు కొడుతూ వారి పైకి దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే దీనిని అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ఫోన్స్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దాదాపు గంటసేపు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు ఆ పామును సురక్షితంగా రెస్క్యూ చేసి అడవిలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
అయితే, ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఒకవేళ యజమాని గమనించకుండా కారు స్టార్ట్ చేసి ఉంటే.. ఆ పాము టైర్ వేగానికి చిధ్రమైపోయి ఉండేది.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు చలికాలంలో వేడి కోసం పాములు కారు ఇంజనులతో పాటు టైర్ల సందుల్లో చేరుకుంటాయి. కాబట్టి వాహనాలను పరిశీలించి స్టార్ట్ చేసి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Karimnagar: Pmj జువెలరీ దోపిడీ కేసులో బిగ్ బ్రేకింగ్.. బెంగాల్లో దొరికిన దొంగ!
Karimnagar, Telangana:Karimnagar Pmj Jewellery Robbery Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే (PMJ) జువెలరీ భారీ దోపిడీ కేసులో ఎట్టకేలకు పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన కరీంనగర్ పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుల కదలికలను కనిపెట్టారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేస్తుండగా.. పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రధాన నిందితుడిని ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నిందితుడు పశ్చిమ బెంగాల్లోని ఒక స్థానిక నగల వ్యాపారికి చోరీ చేసిన బంగారాన్ని విక్రయిస్తున్న సమయంలో పోలీసులు మెరుపు దాడిని చేశారు. అతని వద్ద నుంచి కొంతమేర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దొంగలించిన నగలు అని తెలిసినా కూడా వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడిన సదరు వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరిని కరీంనగర్ కు తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది..
ఈ దోపిడి వెనక ప్రొఫెషనల్ అంతరాష్ట్ర ముఠాహస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.. పక్క ప్లాన్తో షో రూమ్లోకి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ కళ్లు కప్పి భారీగా నగలను దోచుకెళ్లారు.. ఈ కేసులో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం చిక్కిన వ్యక్తి నుంచి మిగిలిన 5 నిందితుల వివరాలను పోలీసులు రాబడుతున్నట్లు సమాచారం.. వారు కూడా పశ్చిమ బెంగాల్ లేదా పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
దోపిడి జరిగిన వెంటనే కరీంనగర్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఎనిమిది ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దించారు. సెల్ ఫోన్ సిగ్నల్తో పాటు హైవే టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా నిందితులను వెంబడించారు. పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురు దొంగల కోసం పరుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి నిందితులను పట్టుకొని.. దోపిడికి గురైన మిగిలిన బంగారాన్ని కూడా వీకవరీ చేస్తామని పోలీసు వర్గాలు భీమా వ్యక్తం చేస్తున్నాయి. భారీ దోపిడీ కేసు కొలిక్కి వస్తుండడంతో అటు జ్యువెలరీ యజమానులతో పాటు ఇటు ప్రజలు కూడా ఊపిరిపించుకుంటున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: సర్కారు నిర్లక్ష్యం.. శిథిలావస్థలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. పేదలకు అందని వైద్యం!
Karimnagar, Telangana:Karimnagar PHCs Fund Crisis News: రాష్ట్రంలోని పేదల ప్రాథమిక వైద్యానికి వెన్నుముకగా నిలవాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేడు నిధుల కోరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలకు అందాల్సిన గ్రాంట్లు నిలిచిపోవడంతో వ్యవస్థ హస్తవ్యస్తంగా తయారయింది. గత రెండేళ్లుగా నిధుల విడుదల లేకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా రోగులు కూడా తీవ్ర అవస్థల పాలవుతున్నారు. ముఖ్యంగా పేద రోగులు పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రోజువారి నిర్వహణ.. చిన్నపాటి మరమ్మత్తుల తో పాటు మందుల రవాణా వంటి అవసరాల కోసం ప్రభుత్వం హెల్త్ ఫండ్ విడుదల చేస్తుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు 71 గ్రామీణ పీహెచ్పీ లకు సంబంధించి 2022 సెప్టెంబర్ నుంచి ఈ నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.87 కోట్ల బకాయాలు పెండింగ్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
నిధుల కోరత కారణంగా ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతుల కల్పన పూర్తిగా ఆగిపోయింది. అంతేకాకుండా వర్షం పడితే పైకప్పుల నుంచి నీరు కారడమే కాకుండా.. శిథిలావస్థకు చేరిన గోడలకు రంగు వేయడం వంటి పనులు నిలిచిపోయాయి. ఇక పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు బ్లీచింగ్ పౌడర్ ఇతర శుభ్రత సామాగ్రి కొనుగోలుకు నిధులు లేక ఆస్పత్రులు అశుభ్రంగా మారాయి. దీంతోపాటు పెండింగ్ బిల్లుల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగిన పరిస్థితులు నెలకొన్నాయి..
ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో.. చేసేదేమీ లేక కొందరు వైద్యాధికారులు తమ సొంత జేబుల నుంచే ఖర్చులు చేస్తున్నారట.. నెలకు రూ.1000 పెట్టి అత్యవసర మరమ్మత్తులు చేయిస్తున్నారు. ప్రభుత్వాన్ని నుంచి రియంబర్స్మెంట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితులలో తమ జీవితాల్లో నుంచి ఖర్చులు భరించాల్సి వస్తుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ వైద్యం అందిస్తామని గొప్పలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పీహెచ్పీలను మాత్రం గాలికి వదిలేసింది.. అని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. నిధుల విడుదలను ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా పోతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి.. పెండింగ్ లో ఉన్న కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి పీహెచ్బీలను ఆదుకోవాలని జిల్లా ప్రజల కోరుతున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moon Transit 2026: ఈ 4 రాశుల వారికి బంపర్ జాక్పాట్.. చంద్రుడి రాకతో అదృష్టం మామూలుగా ఉండదు!
Hyderabad, Telangana:Moon Transit In Ashwini Nakshatra Effect On Zodiac 2026: ఈ ఏడాది మే 14వ తేదీన గురు ప్రదోష వ్రతం వచ్చింది. ఈ ఈ శుభదినం రోజునే చంద్రుడు కేతు ఉగ్రహానికి సంబంధించిన అశ్విని నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. మే 14 గురువారం రాత్రి 10 గంటలకు చంద్రుడు అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు మే 15న రాత్రి 8 గంటల వరకు అదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతాడు. దీని కారణంగా ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై కొనసాగుతుంది. ముఖ్యంగా చంద్రుడి ప్రభావంతో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో పోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మేషరాశి
అశ్విని నక్షత్రంలోకి చంద్రుడు సంచారం కారణంగా మేషరాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు ఎంతో సులభంగా పూర్తవుతాయి. అలాగే వృత్తిపరమైన సమస్యల నుంచి చాలావరకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత అధికారులకు మీరు ఇష్టమైన వ్యక్తిగా మారతారు. అలాగే కొత్త ప్రాజెక్టు లభించడమే కాకుండా కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ శుభ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ధన లాభాలు పొందుతారు. అలాగే డబ్బుకు కూడా కోరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన చేసే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు చంద్రుడి సంచారం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాత కోరికలు నెరవేరడమే కాకుండా ఉద్యోగాల్లో గొప్ప పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. అలాగే జీతం విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు కొత్త క్లైంట్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు అశ్వినీ నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం కారణంగా సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు మానసిక సమస్యలు ఊహించని స్థాయిలో తొలగిపోతాయి. వ్యాపారాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు చేకూరడమే కాకుండా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars Transit 2026: మే 11 నుంచి ఈ 3 రాశుల వారికి కుబేర యోగం.. కుజుడి దయతో కనకవర్షమే!
Hyderabad, Telangana:Mars Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు ఒక వ్యక్తి విధిరాతతో పాటు జీవితం పై ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అందుకే జాతకాల్లో గ్రహాలు కీలకంగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మే 11వ తేదీ నుంచి కుజుడు, కేతువు నక్షత్రాల్లోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన సంఘటనగా భావిస్తూ ఉంటారు. కుజుడిని బలంతో పాటు ధైర్యం కార్యాచరణకు అధిపతిగా చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు కేతు ఆకస్మిక మార్పు, కర్మ ఫలాలతో సంబంధం కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వృత్తి, డబ్బు, ఆస్తులు పరంగా అనేక మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో కుజుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా.. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా తిరిగి పొందే అవకాశాలను పెంచుతుంది. అలాగే ఇది వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా మరెన్నో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా అదృష్టం సహకరించి స్థిరాస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడి శుభప్రభావంతో పాత విభేదాలు లేదా కోర్టు కేసుల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం కలుగుతుంది. దీంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయాల్లో ఎలాంటి పనులైన ఎంతో సింపుల్గా చేసి విశేషమైన లాభాలు పొందగలుగుతారు.
ఈ రాశుల వారిపై అపారమైన కుజుడి ప్రభావం..
మేష రాశి
మే 11వ తేదీ నుంచి మేషరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కుజుడి ప్రభావంతో వీరికి కష్టానికి తగిన ప్రతిఫలాలు లభించబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో తప్పకుండా తెరుచుకుంటాయి. అసంపూర్తిగా ఉన్న పనులు సులభంగా పూర్తి కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
కర్కాటక రాశి
కుజుడి అనుగ్రహం మే 11వ తేదీ నుంచి కర్కాటక రాశి వారికి కూడా ఉంటుంది. కాబట్టి వీరికి అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.s పదోన్నతులు లభించడమే కాకుండా కొత్త కొత్త బాధ్యతలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎప్పటినుంచో తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మిథున రాశి
కుజుడి ప్రభావంతో మిధున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా పెద్ద పెద్ద మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి కష్టానికి తగిన గుర్తింపు లభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలున్నాయి. అలాగే వీరు కొత్త అవకాశాలు పొందడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా వ్యాపారస్తులకు పరిష్కారం అవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RR vs GT Highlights: రాజస్థాన్కు మరో ఓటమి.. భారీ విజయంతో ప్లేఆఫ్స్ రేసులోకి గుజరాత్ టైటాన్స్
Jaipur, Rajasthan:IPL 2026 RR vs GT Highlights: ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్ క్రమంగా డీలా పడిపోతున్నది. వరుస ఓటములను చవిచూస్తున్న రాజస్థాన్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపని రాజస్థాన్ పరాజయం పొంది ప్లేఆఫ్స్ రేసు నుంచి దూరమవుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా పుంజుకుని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా మెరుగైన రన్రేట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. 77 పరుగుల తేడాతో గుజరాత్ నెగ్గిన ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Vizag Trishul: విశాఖపట్టణానికి అదనపు అందం.. కైలాసగిరిపై భారీ త్రిశూలం
Visakhapatnam, Andhra Pradesh:Vizag New Landmark Of 65 Feet Trishul At Kailasagiri Hill Watch VideoTirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు.. ఎవరెవరంటే?
Dharmavaram, Andhra Pradesh:Movie Director And Producer Bunny Vasu Meher Ramesh Rush To Tirumala TemplePrabhas Peddamma: తిరుమలలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి
Dharmavaram, Andhra Pradesh:Actor Prabhas Peddamma Shyamala Devi Visits To Tirumala Temple With OthersBandi Bagirath: కొడుకు బండి భగీరథ పోక్సో కేసుపై బండి సంజయ్ తొలి స్పందన
Baddipadaga, Telangana:Bandi Bagirath POCSO Case: మద్యం తాగించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సాయిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదడంతో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో రచ్చ మొదలవగా.. బీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసింది. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఈ సంఘటనపై తొలిసారి నిందితుడి తండ్రి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Tirumala VVIPs: తిరుమలకు సెలవుల రద్దీ.. భారీగా తరలివచ్చిన ప్రముఖులు
తన కుమారుడు బండి భగీరథ్ సాయిపై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలను ఓర్వలేక.. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కష్టపడి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన సామాన్య బీసీ వ్యక్తినని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడిపై ఆరోపణలు చేస్తున్న వారిపై సమాధానం వస్తుందని.. ప్రతి కుట్ర బహిర్గతం అవుతుందని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. 'నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నా. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను' అని పేర్కొన్నారు. 'నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టా. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్గా, నేడు ఎంపీగా ఎన్నికై కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి' అని ఆరోపించారు.
'రేపు ప్రధానమంత్రి బహిరంగ సభ నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యం. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది. ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది' అని బండి సంజయ్ పేర్కొన్నారు. చివరికి సత్యమేవ జయతే అని పోస్టు చేశారు.
నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన
నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala VVIPs: తిరుమలకు సెలవుల రద్దీ.. భారీగా తరలివచ్చిన ప్రముఖులు
Tirupati Urban, Andhra Pradesh:Summer School Holidays: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరిగిపోతుండగా.. వారికితోడు ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కళకళలాడుతున్నాయి. శనివారం రోజు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ, ప్రభుత్వ అధికారులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Also Read: LSG vs RCB: హ్యాట్రిక్ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్లో బెంగళూరు బోల్తా
ఏపీ ప్రభుత్వ విప్ గణబాబు, దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మెహర్ రమేష్, విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని శనివారం తిరుమల శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరందరికీ ఆలయ అధికారులు ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?
తిరుమల స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన సముద్రఖని మీడియాతో మాట్లాడుతూ.. 'నా ఆప్తమిత్రుడు, తోబుట్టువు లాంటి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి విజయ్ తమిళనాడులో సుపరిపాలన అందించాలని నేను స్వామిని వేడుకున్నా' అని నటుడు సముద్రఖని తెలిపారు.
తిరుమల ఆలయాన్ని శ్రీవాణి విరామ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. రెండు రోజుల తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా మొదటగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకి వచ్చారు. వారికి టీటీడీ ఈఓ స్వాగతం పలికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపం లో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jangaon Snake Bite: ఒకేసారి రెండు పాములు కాటేస్తే..శరీరంలో జరిగే భయంకరమైన మార్పులు ఏంటి?
Jangaon, Telangana:Jangaon Snake Bite Incident: సాధారణంగా ఒక విష సర్పం కాటు వేస్తేనే ప్రాణాలు కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాంటిది ఒకే సమయంలో రెండు జాతుల పాములు కాటు వేస్తే? ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. నిద్రలో ఉన్న నాలుగేళ్ల బాలుడిని నాగుపాము, రక్తపింజరి ఒకరి తర్వాత ఒకరు కాటు వేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
భారతదేశంలోని ప్రధాన విష సర్పాల్లో ఒక్కో రకమైన విషం ఉంటుంది. నాగుపాము/కట్లపాము (న్యూరోటాక్సిన్) విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది మెదడు నుంచి శరీరానికి అందే సంకేతాలను నిలిపివేస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల కండరాలు పనిచేయవు, దీనివల్ల శ్వాస తీసుకోవడం సాధ్యం కాక మనిషి ఊపిరి ఆడక చనిపోతాడు.
అదే విధంగా రక్తపింజరి పాము విషం రక్తాన్ని గడ్డకట్టనివ్వదు లేదా అసాధారణంగా గడ్డకట్టేలా చేస్తుంది. కణజాలాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల అంతర్గత రక్తస్రావం జరిగి కిడ్నీలు, గుండె వంటి అవయవాలు విఫలమవుతాయి.
ఈ విధంగా రెండు పాములు ఒకేసారి కరిచినప్పుడు, శరీరంపై రెట్టింపు భారం పడుతుంది. ఒకవైపు శ్వాస వ్యవస్థ ఆగిపోతుంటే, మరోవైపు రక్తం విషతుల్యమై అవయవాలు కుప్పకూలతాయి. సాధారణంగా ఒక పాము కరిచినప్పుడు విషం వ్యాపించడానికి పట్టే సమయం కంటే, రెండు పాములు కరిచినప్పుడు ఆ వేగం విపరీతంగా పెరిగి మనిషికి కోలుకునే అవకాశం కూడా ఉండదు.
ఇలాంటి అరుదైన, సౌకర్యమైన కేసుల్లో వైద్యులకు కూడా చికిత్స చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. ఏ పాము కరిచిందో తెలియనప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ పాములు కరిచినప్పుడు వైద్యులు 'పాలివాలెంట్ యాంటీ వీనమ్' (పాలీవాలెంట్ యాంటీ-వెనం) వాడతారు. ఇది మన దేశంలో కనిపించే నాలుగు ప్రధాన విష సర్పాల (నాగుపాము, కట్లపాము, రెండు రకాల రక్తపింజరులు) విషాన్ని అడ్డుకోగలదు. అయితే, పాముల విషం శరీరంలో ఉన్నప్పుడు రెండు వీనమ్ డోసేజ్ భారీగా పెంచాల్సి ఉంటుంది. బాధితుడిని ఎంత త్వరగా ఆసుపత్రికి చేర్చామనే దానిపైనే ప్రాణాపాయం ఉంటుంది.
గమనిక: డాక్టర్ల సూచన మేరకు పాము కాటుకు గురైన వ్యక్తిని ఎలాంటి గాబరా లేకుండా.. వెంటనే అత్యవసర చికిత్స అందించడం కీలకం.
Also Read: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
Also Read: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
West Bengal CM Salary: బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి జీతం ఎంత?
Chhotobainan, West Bengal:Chief Minister Salary And Allowances: భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం.. బ్రిటీష్ కాలం నుంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి, ఎన్డీయే నాయకులు హాజరయ్యారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు ఎంత జీతం పొందుతారో తెలుసుకుందాం.
Also Read: Suvendu Adhikari: సువేందు అధికారి ఆస్తులు ఇవే.. తులం బంగారం లేని బెంగాల్ కొత్త సీఎం
15 ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చిన మమతా బెనర్జీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మరి ఆమె లాగా సువేందు అధికారి జీతం, ఇతర అధికారిక సౌకర్యాలు పొందుతారో చూడాలి. వాస్తవంగా తీసుకున్నా తీసుకోకపోయినా ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రికి జీతం, భత్యాలతోపాటు కొన్ని అధికారిక సౌకర్యాలు ముఖ్యమంత్రికి లభిస్తుంటాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి జీతం ఎంత, ఏమేమీ ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.
Also Read: Vizag Big Trishul: వైజాగ్కు మరో అదనపు అందం.. కైలాసగిరిపై భారీ త్రిశూలం
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేశంలోనే చాలా పెద్దది. జనాభా కూడా అదే స్థాయిలో ఉంది. సంపద అధికంగా ఉండే పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రికి కూడా భారీగా జీతం ఉంది. జీతంతోపాటు అధికారిక నివాసం.. ఇతర అలవెన్స్లు, సేవలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు పొందుతారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారికి నెలకు సుమారు రూ.2.10 లక్షల జీతం పొందుతారు.
వాస్తవంగా పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేకు రూ.50,000 చొప్పున జీతం ఇస్తారు. ముఖ్యమంత్రికి రూ.లక్ష జీతం ఇస్తుండగా.. భత్యంగా రూ.51,600 చెల్లిస్తారు. అన్నీ కలిపితే రూ.2.10 లక్షలు జీతం, భత్యం రూపంలో ముఖ్యమంత్రి పొందుతారు. ముఖ్యమంత్రి అధికారిక ఖర్చులు, బహిరంగ సభల కోసం ప్రత్యేక భత్యాలు పొందుతారు. ఎమ్మెల్యేగా, ఆయన కార్యాలయ పనుల కోసం, తన నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి రూ.48,000 భత్యం చెల్లిసతారు.
రోజువారీ సమావేశ భత్యంగా రూ.2,000 అందిస్తారు. ఇది నెలకు మొత్తం రూ.60,000 అవుతుంది. ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం, ప్రభుత్వ వాహనం, సిబ్బంది, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లులు, భద్రతా కాన్వాయ్ లభిస్తాయి. జెడ్-ప్లస్ భద్రత ఉన్నవారు ఉచిత వైద్య చికిత్స, ఉచిత ప్రయాణ భత్యంతో సహా అనేక అదనపు ప్రయోజనాలను పొందుతారు. అయితే వీటన్నిటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి పొందుతారో లేదో తెలియాల్సి ఉంది. మమతా బెనర్జీ బాటలో సువేందు పొందుతాడో లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BRS Party: బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Hyderabad, Telangana:Bandi Sanjay Son POCSO Case: 'కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడుపై పోక్సో కేసు ఉత్తిగా నమోదు కాదు కదా? దీని వెనుక ఏం జరిగింది అనే దానిపై విచారణ జరపాలి. కేంద్ర మంత్రి కొడుకు అయినా సామాన్యుడు అయినా ఒకటే. బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోవాలి. బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి' అని హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 'రేవంత్ రెడ్డి హోం శాఖా మంత్రిగా, విద్యా శాఖా మంత్రిగా, మున్సిపల్ శాఖా మంత్రిగా ఫెయిల్ అయ్యారు' అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను రేవంత్ రెడ్డి దిగజార్చాడని మండిపడ్డారు.
Also Read: Suvendu Adhikari: సువేందు అధికారి ఆస్తులు ఇవే.. తులం బంగారం లేని బెంగాల్ కొత్త సీఎం
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో శాంతిభద్రతలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. 'కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉంది. కేసీఆర్ హయాంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రం వెనక్కి పోతుంది.
Also Read: Ashu Reddy Engagement: పెళ్లి పేరుతో మోసం.. ఇంకొకరితో అషూరెడ్డి నిశ్చితార్థం
'ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం శాంతిభద్రలపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో హోం శాఖా మంత్రి లేరు. హోం మంత్రి బాధ్యతలను రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించారు. కమాండ్ కంట్రోల్లో కూర్చుని రేవంత్ రెడ్డి హోం శాఖపై సమీక్ష చేయడం లేదు. కేసీఆర్ హోం శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. దేశంలో మొదటిసారిగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి. మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి గస్తీకి వెళ్తే పోకిరీలు ఎలా వేధించారో అందరికీ తెలుసు' అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
'తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. 2023 కంటే 2024లో 34 వేల కేసులు పెరిగాయి. రాష్ట్రంలో 18.4 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను తిట్టడానికే రేవంత్ రెడ్డి సమయం వృథా చేస్తున్నారు. పెట్టుబడుల సదస్సులో ప్రతిపక్షాలను తిడితే పెట్టుబడులు పెడతారా?' అని మాజీ మంత్రి సబిత ప్రశ్నించారు. 'కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి ఉన్న కరీంనగర్లో పట్టపగలు గోల్డ్షాప్లో చోరీ జరిగితే నివేదికలు తెప్పించుకునే తీరిక రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కు లేదు. రెండేళ్ల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని బండి సంజయ్ అంటున్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడారు ఎన్ని దాడులు జరిగి ఉండాలి' అని మాజీ మంత్రి సబితా ప్రశ్నించారు.
'నేను జడ్చర్ల వెళ్తుంటే నాపైన పోలీసు నిఘా పెట్టారు. ఇదెక్కడి వ్యవస్థ? పోలీసు వాళ్లను వారి పని చేసుకోనివ్వండి. మహిళలు, చిన్నారులపై దాడుల్లో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ క్రైమ్ హబ్గా మారింది. పోలీసులు చలాన్లకు పరిమితమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. పోలీసులకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను రేవంత్ రెడ్డి వాళ్లకే వదిలిపెట్టాలి. రేవంత్ రెడ్డి సచివాలయం వదిలి పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ వెళ్లడంతో పోలీసులు తాము చేసే ప్రాథమిక పనులు చేయడం లేదు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి' అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
రేవంత్ రెడ్డిది విఫల ప్రభుత్వం: ఎమ్మెల్సీ వాణీదేవి
'రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయి. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. శాంతిభద్రతల సమస్య రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున మాజీ ఐపీఎస్ భార్య హత్య జరిగింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరగడం దురదృష్టకరం' అని ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తెలిపారు. 'మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ధైర్యంతో రాత్రి సమయంలో శాంతి భద్రతల సమస్యలు తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉండేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫల ప్రభుత్వం. హైదరాబాద్లో శాంతి భద్రతల అంశం చాలా కీలకం. రాష్ట్రంలో విద్యా రంగం గందరగోళంలో ఉంది' అని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Snake Video: నువ్వు తోపు భయ్యా.. బుసలు కొడుతున్న పాముకు నీళ్లను తాగిస్తూ మరీ.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Man gently pours water on venomous snake video: కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపంను చూపిస్తున్నాడు. అసలు ఇంట్లో నుంచి బైటకు వెళ్లాలంటేనే జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలుచోట్ల ఒకవైపు ఎండలు, మరికొన్ని చోట్ల ఆకస్మిక వర్షాలతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మండిపోతున్న ఎండలతో మనుషులు మాత్రమే కాదు..నోరు లేని జీవాలు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. చాలా మంది సమ్మర్ లో నోరులేని జీవాల కోసం ఇంటి మిద్దెల మీద మగ్ లో నీళ్లను పెడుతారు. మరికొంత మంది ఇంటి ముందు బకెట్ లో నీళ్లను ఉంచుతారు. ఇదంతా మనంచూస్తుంటాం. అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి రోడ్డు మీద పాము నీరసంగా ఉండటంను చూశాడు. బహుశా దానికి సమ్మర్ ఎఫెక్ట్ తో ఎటు కదల్లేక పోతుంది.
ఇంతలో అతను ఆలోచించి పామును మీద నెమ్మదిగా ఒక బాటిల్ లో నీళ్లను తీసుకుని దాని మీద పోశాడు. అది ఏంచక్కా తన ప్రాణాలు తిరిగొచ్చినట్లు ఆ నీళ్లను తాగింది. అతను కూడా పాముపైన నెమ్మదిగా నీళ్లను వేస్తు దానికి ఇబ్బంది కల్గకుండా చేశాడు. మొత్తంగా కోబ్రా నీళ్లను తాగడంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. అక్కడి వారు ఈ ఘటనను వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కాటు వేసే పాము కష్టంలో ఉందని తెలిసి దానికి మంచి నీళ్లను పోసిన వ్యక్తిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
మొత్తంగా కోబ్రాకు అతను చేసిన సాయంను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా మంది ఇటీవల పాములు కన్పిస్తే దూరంగా పారిపొవడంలేదు. వాటితో స్టంట్ లు చేస్తు వార్తలలో ఉంటున్నారు.
Read more: Pm modi and Makhanlal Sarkar: 98 ఏళ్ల పెద్దాయన కాళ్లు మొక్కిన ప్రధాని.. మఖన్ లాల్
ఈ నేపథ్యంలో సమ్మర్ వేళ పాములు ఎక్కువగా అడవులు, పుట్టల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట పంటలకు నీళ్లు పెట్టడానికి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలు మండుతున్న వేళ తమ వంతుగా నోరులేని జీవాల కోసం ఏమైన మంచి నీళ్ల సాయం చేయడం, బకెట్ లు, మగ్ లలో నీళ్లలో పెట్టాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
