hyderabad News:డ్రీమ్ రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి మోసానికి పాల్పడ్డారు
Hyderabad, Telangana:డ్రీమ్ రిచ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ దుర్గాప్రసాద్ ప్లాట్ పేరుతో రైల్వే ఉద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసం కేసు హైదరాబాద్లో వెలుగు చూసింది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Konda Surekha Issue: మంత్రి కొండా సురేఖ అంశంపై తొలిసారి నోరు విప్పిన రేవంత్ రెడ్డి
Baddipadaga, Telangana:Konda Surekha vs Revanth Reddy: అవినీతి, అక్రమాలు అంటూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు హాట్టాహాట్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై కొండా కుటుంబం తిరుగుబాటు చేసిందనే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీ నోటీసులు అందుకోవడం.. దానికి బదులివ్వడం వంటివి చకాచకా జరిగిపోయాయి. అయితే తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంశంపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ క్రమంలో మీడియా అంతా ఎదురుచూస్తున్న కొండా సురేఖ ఎపిసోడ్పై స్పందించకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రెండు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డివ వెళ్లిపోయారు.
బంతి అధిష్టానం కోర్టులో..
'కొండా సురేఖ అంశం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనితమైన విషయాలను ప్రస్తావించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొండా సురేఖ వ్యవహారం అధిష్టానం కోర్టులో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆమెను సహించేది లేదని.. ఓపిక పట్టలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే కొండా సురేఖను సస్పెండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని చర్చ జరుగుతండగా.. అనూహ్యంగా ఆమె తన శాఖకు సంబంధించిన కార్యక్రమంలో మునిగారు. మంత్రి పదవి నుండి ఉద్వాసన, బర్తరఫ్ ఇలా వార్తలు వస్తుండగా కొండా సురేఖ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన అనంతరం కొండా సురేఖ పూర్తి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను కలిసి వచ్చిన అనంతరం కొండా సురేఖ ఇక రాజకీయ వివాదాల జోలికి వెళ్లకుండా తన మంత్రిత్వ శాఖ పనుల్లో నిమగ్నమయ్యారు. మంత్రిగా సమీక్షలు.. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించారు.
Jogi Ramesh: కుటుంబ వివాదంపై నోరు విప్పిన మాజీ మంత్రి జోగి రమేశ్
Jaggaiahpet, Andhra Pradesh:Jogi Ramesh Reacts On His Son Rajeev And Daughter In Law Meghana Issue Watch His CommentsRevanth Reddy: కొండా సురేఖ, అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad, Telangana:Hyderabad: విదేశీ పర్యటన రద్దు.. కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్మీట్ నిర్వహించి కీలక విషయాలు వెల్లడిచారు. కొండా సురేఖ వ్యవహారంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తన అమెరికా పర్యటన రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తన పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఆ పర్యటనపై కీలక విషయాలు వెల్లడించారు.
నిరాకరించడం బాధాకరం
హైదరాబాద్లోని సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక విషయాలు తెలిపారు. 'రాష్ట్రాల కలయికనే దేశం. విదేశీ పర్యటన ద్వారా తెలంగాణ రైజింగ్తో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కార్యాచరణతో ముందుకెళుతున్నాం. దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్ పర్యటనకు అంగీకరించి అమెరికాకు అనుమతి నిరాకరించడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎంతోమంది తీవ్రంగా ఖండించారు. అయితే బీజేపీ వాళ్లు మాత్రం మాపై ఆరోపణలు చేస్తున్నారు' అని తెలిపారు.
'పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేపట్టాం. విద్యా, క్రీడా రంగంలో పెట్టుబడులతో ముందుకు వెళ్లాలన్నది మా ఆలోచన. ఇంగ్లండ్ పర్యటనకు అనుమతిచ్చి అమెరికా పర్యటనకు తిరస్కరించారు. కేంద్రం వైఖరిని ఖర్గే ఖండించారు. కోట్లాది మంది కేంద్రం వైఖరిని తప్పుపట్టారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎందుకు అనుమతి ఇవ్వలేదు?
'నేను పర్యటనకు దరఖాస్తు చేస్తే ప్రొసీజర్ ప్రకారం మేము వెళితే పొలిటికల్ యాంగిల్ పేరుతో తిరస్కరిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులకు ఇస్తారు. మాకు ఎందుకు ఇవ్వరో చెప్పు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రి కెనడా, ఇతర దేశాల పర్యటనకు ఎలా అనుమతి ఇచ్చారని అడిగారు. 'పెట్టుబడులకు సంబంధించి క్రీడలకు, విద్యా అవసరాలను దృష్టిలో పర్యటనకు వెళ్తున్నట్లు వివరించాం. రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను రద్దు చేస్తున్నట్లు కేంద్రం చెపుతుంది. విదేశీ పర్యటనలో విషయం లేదు అంటే మరీ ఇంగ్లాండ్కు ఎందుకు అనుమతి ఇచ్చారు. అమెరికాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు.. 'నా కోడలు మేఘన కూతురుతో సమానం'
Jaggaiahpeta, Andhra Pradesh:Jogi Ramesh Family Issue: తన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన వివాదంపై మాజీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కోడలు మేఘన తన కూతురుతో సమానం అని ప్రకటించారు. 'ఉన్న కొన్ని రోజులైనా కూతురు కన్నా ఎక్కువగా చుసుకున్నాం. వారి మధ్య వచ్చిన చిన్న సమస్యలకు 11 మందిపై ఫిర్యాదు చేశారు. కోర్టుకు లోబడి కొన్ని విషయాలు చెప్పలేను. నెల రోజులుగా కొన్ని యూట్యూబ్, టీవీ ఛానల్స్ వారు మితిమీరి ప్రచారం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నా భార్య కన్న కూతురిలా చూసుకొని కోడలు మేఘనకు గోరుముద్దలు తినిపించింది. నా భార్య బైబిల్ చదివితే తప్ప? తిరుమల వెళ్తాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తాం. అసత్యాలను ప్రచారం చేస్తూ నెల రోజులపాటు మా కుటుంబాన్ని మానసికంగా వేధించారు' అని మాజీ మంత్రి జోగి రమేశ్ తెలిపారు. 'ఐ టీడీపీ ద్వారా కొన్ని ఛానల్స్ను పెట్టుకొని వ్యాపారం చేశారు. కల్తీ కేసు పెట్టి 3 నెలలు జైలు తిప్పావు.. అయినా భయపడాల?' అని ప్రశ్నించారు.
'నా గొంతు నొక్కేందుకు ఈ పరిణామాలు జరుగుతున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని ఎవరో చేస్తున్నారో తెలుసు. 83 రోజులపాటు జైలులో పెట్టిన జడవలేదు. ఇంటిపై యాసిడ్ దాడి చేసినా భయపడలేదు' అని మాజీ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు. రాజీవ్, మేఘన ఇప్పటికీ కలిసి ఉండాలని కోరుంటామని తెలిపారు. 'టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ఏనాడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు. రాజకీయంగా మాత్రమే ఎదుర్కొన్నాం' అని గుర్తుచేశారు.
తాను ఎప్పటికీ తప్పు చేయనని.. విలువలతో కూడా రాజకీయాలు చేస్తానని మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రకటించారు. 'ఎమ్మెల్యే వసంత కార్యాలయం నుంచి డ్రామాలు జరిగాయి. నెల రోజులపాటు మా కుటుంబసభ్యులను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టు కన్నా ముందే ఓ టీవీ ఛానల్లో అసత్యాలను ప్రచారం చేశారు. దేవుడు చూస్తున్నాడు' అని తెలిపారు. 'ఐ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్ నా స్థానంలో ఉండి ఆలోచించు. మీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో నా కుటుంబంపై అనేక దాడులు చేశారు. ప్రాణం పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటా' అని జోగి రమేశ్ ప్రకటించారు.
'కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని టీవీలో ముందే తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని తప్పుడు ఛానల్స్, యూట్యూబ్ చానల్స్ ప్రసారాలు చాలా దారుణం. టీడీపీ వారిలో కొందరు ఐ టీడీపీని అసహ్యించుకుంటున్నారు' అని మాజీ మంత్రి జోగి రమేశ్ తెలిపారు. 'ఎప్పుడు ఒకరే పరిపాలన చేయరు.. మహామహులే మట్టి కరిచారు. నాకు ఒక సమయం వస్తుంది. రెడ్ బుక్ నేడు డెడ్ బుక్గా మారింది' అని ఆరోపించారు. తాను జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని ప్రకటించారు.
'అధికార మదంతో వ్యవహరించిన చంద్రబాబు. ఇద్దరు వ్యక్తులు కలవాలని కోరుకోవాలి తప్ప విడగొట్టేందుకు రాజకీయాలు చేయకూడదు. కుటుంబపరమైన విషయాలను రాజకీయ జోక్యంతో ఎలా వ్యవహరించారు. తమ కుటుంబ విషయాన్ని ఇంతటితో ముగించితే మంచిది' అని ప్రత్యర్థులకు మాజీ మంత్రి జోగి రమేశ్ సూచించారు.
Telangana New Brands: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!
Hyderabad, Telangana:Telangana International Brands: తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న తరుణంలో, ఇక్కడి ప్రజల జీవనశైలి (లైఫ్ స్టైల్), వీకెండ్ పార్టీల సంస్కృతి కూడా వేగంగా మారుతోంది. దీనికి అనుగుణంగా ఎలైట్, ప్రీమియం విదేశీ మద్యం బ్రాండ్లకు నగరంలో డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశీ మద్యం ప్రియుల కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మద్యం ఏదైనా అది ఆరోగ్యానికి హానికరమనే నిజాన్ని గ్రహించాలని కూడా అధికారులు గుర్తుచేస్తున్నారు.
121 కొత్త బ్రాండ్ల రాక..
తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోకి కొత్తగా 121 రకాల నూతన లిక్కర్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 18 ప్రముఖ సరఫరా సంస్థలు (suppliers) ఈ 121 బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకురావడానికి దరఖాస్తు చేసుకోగా, ప్రాథమిక పరిశీలన పూర్తి చేసిన తర్వాత, ఈ బ్రాండ్ల వివరాలను అధికారుల అధికారిక వెబ్సైట్లో ప్రజల పరిశీలనార్థం ఉంచారు.
అందుబాటులోకి రానున్న ఎలైట్ బ్రాండ్లు..
ఈ నూతన నిర్ణయం ద్వారా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అత్యంత ఖరీదైన గ్లెన్ఫెడిక్ (Glenfiddich), ది మెకాలన్ సింగిల్ మాల్ట్ విస్కీ (The Macallan Single Malt Whisky), లూయిస్ థర్టిన్ కాగ్నాక్ (Louis XIII Cognac) వంటి ప్రీమియం బ్రాండ్లు ఇకపై స్థానిక వైన్ షాపుల్లోనే నేరుగా లభించనున్నాయి. వీటితో పాటు మంకీ షోల్డర్, హెండ్రిక్స్ జిన్, టైగర్ లాగర్, చీతా, రెడ్ హార్స్ వంటి అంతర్జాతీయ బీర్లు, వోడ్కా, బ్రాందీ, టకీలా బ్రాండ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేందుకు TSBCL మేనేజింగ్ డైరెక్టర్ హరికిరణ్ ఒక కీలక ప్రకటన చేశారు. కొత్త సప్లయర్లు, వారి బ్రాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ tgbcl.telangana.gov.inలో ప్రదర్శించామని తెలిపారు. ఈ బ్రాండ్ల ఆమోదంపై ప్రజలకు లేదా ఇతర మద్యం వ్యాపారులకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.
ఆ అభ్యంతరాల పరిష్కారం తర్వాతే వీటికి తుది ఆమోదం లభిస్తుంది. ఈ అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు అధికారికంగా మార్కెట్లో లభించడం వల్ల నకిలీ మద్యం బెడద, బ్లాక్ మార్కెట్ విక్రయాలు తగ్గుతాయి. పరోక్షంగా ఇది రాష్ట్ర పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలకు తోడ్పడటమే కాకుండా, ప్రభుత్వ ఎక్సైజ్ ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచే అవకాశం ఉంది.
Also Read; మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక..మంత్రివర్గ మార్పులపై చర్చ!
Also Read: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahul Gandhi Kiss Video: రాహుల్ గాంధీకి లైవ్లో ముద్దుపెట్టిన యువతి..సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రచ్చ!
Pune, Maharashtra:Rahul Gandhi Kiss Viral Video: పూణెలో నిర్వహించిన ఒక విద్యార్థి సదస్సు వేదికపై అత్యంత ఆసక్తికరమైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగడానికి ఒక యువతి వేదికపైకి వచ్చింది. అయితే, కెమెరాకు ఫోజు ఇస్తున్న తరుణంలో ఆమె హఠాత్తుగా రాహుల్ గాంధీ బుగ్గపై ముద్దుపెట్టి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అనాలోచిత సంఘటనకు రాహుల్ గాంధీ ఏమాత్రం తత్తరపాటుకు గురికాకుండా, ఎంతో ప్రశాంతంగా మరియు సరదాగా స్పందించారు. ఈ ఆత్మీయ హావభావానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన కొద్ది సేపట్లోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వైరల్గా మారింది.
ఈ సంఘటన యువతలో రాహుల్ గాంధీకి ఉన్న విశేషమైన ఆదరణను స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా దేశంలో అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో ప్రజలు ప్రవర్తించే విధానానికి భిన్నంగా, యువ మద్దతుదారులు ఆయనతో ఎంతటి బలమైన అనుబంధాన్ని, స్వేచ్ఛను, చొరవను అనుభవిస్తున్నారో ఈ ఉదంతం నిరూపించింది. నాయకుడి పట్ల యువతలో ఉన్న విశ్వాసానికి ఈ దృశ్యం అద్దం పట్టింది.
How lucky is this girl? 😭🫶🎀
She got to meet Rahul Gandhi and even kissed him. 😭❤️
Never seen any baddies this comfortable with any BJP leader🔥 pic.twitter.com/j0Z9KWxZGL
— Amock (@Politicx2029) August 23, 2026
కానీ, ఈ వ్యక్తిగత ఆత్మీయ స్పందన కేవలం ఒక వైరల్ వీడియోతో ముగిసిపోలేదు. సాంప్రదాయ సామాజిక నిర్మాణాలు, విలువలపై రాహుల్ గాంధీ చేసే విమర్శలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రత్యర్థి పార్టీలు రంగంలోకి దిగడంతో ఇది పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ (BJP) నేతల మధ్య తీవ్రమైన విమర్శలు, ప్రతివిమర్శలు నడిచాయి. పబ్లిక్ పర్సెప్షన్ (ప్రజా అభిప్రాయం), ఇరు పార్టీల రాజకీయ వ్యూహాలకు సంబంధించిన చర్చలకు ఈ చిన్న ఘటన ఒక పెద్ద ఫ్లాష్పాయింట్గా మారింది. ఒక స్వచ్ఛందమైన వ్యక్తిగత స్పందన కాస్తా, దేశంలో విస్తృత రాజకీయ సిద్ధాంతాల మధ్య ఘర్షణకు దారితీయడం గమనార్హం.
Also Read: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!
Also Read: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో సస్పెండ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha Episode: ఓ కొలిక్కి మంత్రి కొండా సురేఖ వివాదం..అధిష్టానానికి నివేదిక ఇచ్చిన పీసీసీ!
Hyderabad, Telangana:Konda Surekha Episode AICC Report: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన ఆరోపణలను ఖండించకపోవడం, తనపై కుట్ర జరుగుతోందంటూ సురేఖ లేఖ రాయడంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పీసీసీ ఆదివారం ఏఐసీసీకి కీలక నివేదిక సమర్పించింది.Eshwar Sai Video: "మీ అందరికి దండం పెడతా..నన్ను వదిలేయండి" ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి రిక్వెస్ట్!
Hyderabad, Telangana:Eshwar Sai On Madhuri Rathod: ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఇటీవలే వైరల్గా మారింది. ఈ ఘటనను భార్య వీడియో తీస్తు రెడ్ హ్మాండెడ్ గా పట్టుకుంది. మాధురిని చెంప మీద కొట్టి నానా బూతులు తిట్టింది. ఈ రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్గా మారింది. కొంత మంది ఈశ్వర్ సాయి భార్యకు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం మాధురీ రాథోడ్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ఈశ్వర్ సాయి స్పందించాడు. తప్పు జరిగిపోయిందని.. తనను వదిలిపెట్టాలని అందర్ని వేడుకుంటున్నానని ఈశ్వర్ సాయి తాజాగా మరో వీడియోతో స్పందించాడు.Konda Surekha Episode: మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక.. మంత్రివర్గ మార్పులపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ!
Hyderabad, Telangana:Konda Surekha Episode AICC Report: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేసిన ఎపిసోడ్ తర్వాత పార్టీలో వివాదం ముదిరింది.
కుమార్తె చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించకపోవడం పార్టీ శ్రేణుల్లోనూ, నేతల్లోనూ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ, తనకు మరియు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదని సురేఖ సమాధానం ఇచ్చారు. ఆపై తనపై కుట్ర జరుగుతోందంటూ లేఖ రాయడం వంటి వరుస పరిణామాలు ఆమెను మరింతగా వివాదాల్లోకి లాగి టార్గెట్ అయ్యేలా చేశాయి.
దీంతో కొండా సురేఖ ప్రవర్తనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె పార్టీ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వివాదాలను మరింత పెంచేలా ప్రవర్తిస్తున్నారని పీసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆదివారం నాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీకి ఒక తాజా నివేదికను పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై సుస్మిత చేసిన అసత్య ఆరోపణలను సురేఖ ఖండించకపోవడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సమర్థించడం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో తీవ్ర అసమ్మతిని కలిగించింది. ఆ తర్వాత 'తనపై కుట్ర జరుగుతోంది' అంటూ ఆమె రాసిన లేఖ కూడా పార్టీ ప్రతిష్టకు పెద్ద ఇబ్బంది కలిగించేలా మారిందని పీసీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రతిష్టను భంగపరిచేలా సుస్మిత మాట్లాడినప్పటికీ సురేఖ దానిని ఖండించకపోగా, సహచర పార్టీ నేతలపై అభాండాలు వేయడం ఏమాత్రం సరికాదని పీసీసీ, క్రమశిక్షణ కమిటీ గట్టిగా భావిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు, ఏఐసీసీకి పీసీసీ కూలంకషంగా వివరించింది.
ఈ పీసీసీ నివేదికలు, వరంగల్ ఎమ్మెల్యేల మీడియా సమావేశాలు, కొండా సురేఖ రాసిన లేఖల ఆధారంగా ఏఐసీసీ ప్రస్తుతం అంతర్గత విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో అధిష్టానం చర్చించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. అయితే వీరందరూ కూడా కొండా కుటుంబ వ్యవహార శైలిపై ప్రతికూలంగానే అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.
గతంలో కూడా కొండా సురేఖ ఇటువంటి ఆరోపణలు చేసిన చరిత్ర ఉన్నందున, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమెతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తే జిల్లా అభివృద్ధి పనులకు ఎలా సహకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహారశైలి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారినట్లు ఉందని, కాబట్టి ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని, అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖపైనా, చిన్నారెడ్డిపైనా అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also REad; వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
Also Read: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Raksha Bandhan 2026: ఆగస్టు 27న రాఖీ ఎందుకు కట్టకూడదు? రాఖీ కట్టడానికి శుభముహూర్తాలు ఇవే!
Hyderabad, Telangana:Raksha Bandhan 2026 Muhurat: రక్షాబంధన్ పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది శ్రావణ మాస పూర్ణిమ తిథి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని ఆగస్టు 28న జరుపుకోనున్నారు. ఈ రోజున శతభిషా నక్షత్రం, సుకర్మ యోగంతో పాటు మీన రాశిలో చంద్రుడి సంచారం వంటి అద్భుతమైన జ్యోతిష్య సంయోగాలు ఏర్పడుతున్నాయి. శుక్రవారం, సుకర్మ యోగాల కలయిక వల్ల ఈ పండుగ మరింత పవిత్రతను, శ్రేయస్సును సంతరించుకోనుంది. ఈ ఏడాది పండుగ రోజున భద్రా ప్రభావం ఏమాత్రం లేకపోవడం అత్యంత విశేషం.
ఆగస్టు 27న రాఖీ ఎందుకు కట్టకూడదు?
సాధారణంగా ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రా కాలం ఛాయ పడుతుంటుంది. శాస్త్రాల ప్రకారం భద్రా కాలంలో రాఖీ కట్టడం అశుభం. ఈ ఏడాది భద్రా తిథి పండుగకు ఒక రోజు ముందే, అంటే ఆగస్టు 27వ తేదీ గురువారం ఉదయం 9:09 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 9:25 గంటలకు ముగిసిపోతుంది.
గురువారం పూర్ణిమ తిథి ప్రారంభమైన క్షణం నుంచే భద్ర ప్రభావం కూడా మొదలవుతుంది. అందుకే పూర్ణిమ తిథి ఉన్నప్పటికీ, శాస్త్ర నియమాల ప్రకారం 27న రాఖీ కట్టకూడదు. ఆగస్టు 28న పండుగ రోజున భద్రా దోషం ఏమాత్రం ఉండదు
చంద్రగ్రహణ ప్రభావం ఉందా?
ఆగస్టు 28న ఈ ఏడాది చివరి పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. ఈ గ్రహణ సమయం ఉదయం 6:53 గంటల నుంచి మధ్యాహ్నం 12:31 గంటల వరకు ఉంటుంది. అయితే, ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఎలాంటి సూతక నియమాలను పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
రాఖీ కట్టడానికి శుభ ముహూర్తాలు (ఆగస్టు 28): సోదరులకు దీర్ఘాయువు, ఐశ్వర్యం కలగడం కోసం ఆగస్టు 28న కింది శుభ సమయాల్లో రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు.
అమృత ఘడియలు (అత్యంత శ్రేష్టం): తెల్లవారుజామున 6:08 నుండి ఉదయం 10:53 వరకు
అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:53 వరకు
శుభ ఘడియలు: మధ్యాహ్నం 12:28 నుండి మధ్యాహ్నం 2:03 వరకు
అపరాహ్న కాల ముహూర్తం: మధ్యాహ్నం 1:44 నుండి సాయంత్రం 4:16 వరకు
చర ఘడియలు: సాయంత్రం 5:13 నుండి సాయంత్రం 6:48 వరకు
రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ముఖం ఉండేలా కూర్చోవాలి. పూజా పళ్లెంలో కుంకుమ, చందనం, అక్షింతలు, దీపం, తీపి పదార్థాలను అమర్చుకోవాలి. ముందుగా సోదరుడి నుదుట తిలకం దిద్ది, తలపై అక్షింతలు చల్లి, హారతి ఇచ్చిన తర్వాతే కుడిచేతికి రక్షా సూత్రాన్ని (రాఖీ) కట్టాలి.
Also Read: ఏల్నాటి శని సమయంలో అసలు చేయకూడని 5 తప్పులు..! చేస్తే అంతే సంగతులు..
Also Read: ఈ 6 రాశులకు సెప్టెంబర్ నెలంతా లక్ష్మీదేవి అనుగ్రహం.. కలలో సైతం ఊహించని లాభాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vishwanath And Sons Collection: రూ.200 కోట్ల క్లబ్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. బాక్సాఫీస్ వద్ద సూర్య సరికొత్త రికార్డు!
Hyderabad, Telangana:Vishwanath And Sons Collection 10 Days: తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ హీరోయిన్ మమితా బైజు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటినట్లు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిలోనే సూర్య నటించిన రెండు సినిమాలు ఈ ఘనత సాధించడం ఒక అరుదైన రికార్డుగా నెలకొంది.
భారీ వసూళ్లతో దూకుడు..
బాక్సాఫీస్ వద్ద 'విశ్వనాథ్ అండ్ సన్స్' కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా మొదటి 9 రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.118 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.
ఈ చిత్ర 9 రోజుల రోజువారీ వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి రోజు: రూ. 20 కోట్లు
రెండో రోజు: రూ. 28.5 కోట్లు
మూడో రోజు: రూ. 25 కోట్లు
నాలుగో రోజు: రూ. 10 కోట్లు
5వ రోజు: రూ. 8 కోట్లు
6వ రోజు: రూ. 7 కోట్లు
ఏడో రోజు: రూ. 5.5 కోట్లు
ఎనిమిదో రోజు: రూ. 6 కోట్లు
9వ రోజు: రూ. 9 కోట్లు
ఓవర్సీస్ మార్కెట్లో అద్భుత రన్ కారణంగా.. విదేశీ మార్కెట్లలో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్లకు పైగా (భారతీయ కరెన్సీలో రూ.24 కోట్లు) వసూలు చేసింది. మిగిలిన దేశాలతో కలుపుకుని ఓవర్సీస్లో మొత్తం 6 మిలియన్ డాలర్లు (రూ.57 కోట్లు) రాబట్టడంతో, వరల్డ్ వైడ్గా రూ.175 కోట్ల గ్రాస్ వసూలైంది.
10వ రోజు అద్భుతం & సూర్య రికార్డులు..
విడుదలైన 10వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైగా, తమిళనాడులో మరో రూ. 5 కోట్లకు పైగా రాబట్టింది. నైట్ షోల సమయానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 190 కోట్లు వసూలవుతుందని అంచనా వేసినప్పటికీ, ఊహించని విధంగా కలెక్షన్లు దూసుకుపోయి ఏకంగా రూ.200 కోట్ల మార్కును దాటేసిందని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.
అయితే సరిగ్గా మూడు నెలల క్రితం సూర్య గత చిత్రం 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు) రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, వరుసగా ఇదే ఏడాదిలో రెండో సినిమాతో కూడా రూ.200 కోట్ల క్లబ్లో చేరి సూర్య తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారు.
Also REad: Irumudi Collections: 'ఇరుముడి' సినిమా ఆల్టైమ్ రికార్డ్..36 గంటల్లో బ్రేక్ ఈవెన్ తెచ్చుకొని సంచలనం!
Also Read: Eshwar Sai Madhuri Rathod: మధూరీ రాథోడ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kurukshetra Murder Case: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!
Hyderabad, Telangana:Kurukshetra Murder Case News: హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన హత్యోదంతం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఒక మహిళ తన భర్తను చంపి, అతని పేగులను బయటకు తీసి ఘటన చుట్టుపక్కల వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఆ తర్వాత భయాందోళనతో తాము అద్దెకు ఉంటున్న ఇంటి మేడ పైనుంచి ఆ మహిళ దూకేసింది.
ఏం జరిగిందంటే?
బాధితుడు రాజేష్, అతని భార్య విమ్ల దేవి కురుక్షేత్రలోని పెహోవా రోడ్డులో ఉన్న రాజ్ ప్యాలెస్ సమీపంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఆ దంపతులు గట్టిగా అరుచుకోవడం వినిపించిందని ఇంటి యజమాని రింకు తెలిపారు.
ఆ అరుపులు విని ఆయన వెంటనే మేడ పైకి వెళ్లారు. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఏదో క్రైమ్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా ఉంది. రాజేష్ తీవ్రమైన కడుపు గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. రాజేష్ శరీరం నుండి బయటకు వచ్చిన పేగులను విమ్ల ఒక సంచిలో పెడుతుండగా ఇంటి యజమాని చూశారని సమాచారం. యజమానిని చూడగానే ఆమె భయాందోళనకు గురై మేడ పైనుంచి దూకేసింది.
కింద పడటంతో నిందితురాలు గాయపడింది, ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా ధంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, గత ఏడాది కాలంగా కురుక్షేత్రలో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతను పెహోవా రోడ్డులోని ఒక నీటి సరఫరా సంస్థలో పని చేసేవాడు.
పోస్టుమార్టం పరీక్షలో గాయాల తీవ్రత బయటపడింది. నివేదిక ప్రకారం.. రాజేష్ కడుపు భాగం సుమారు 35 సెంటీమీటర్ల మేర కోయబడి ఉంది. పదునైన ఆయుధాల వల్ల లోతైన గాయాలు అయ్యాయి. అతని పేగులు పొట్ట భాగం నుండి బయటకు వచ్చినట్లు గుర్తించారు.
అలాగే, అతని కాలేయంలోని గణనీయమైన భాగం, కుడి వైపు మూత్రపిండం (కిడ్నీ) కనిపించకుండా పోయినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ గాయాలు, కనిపించకుండా పోయిన అవయవాలకు సంబంధించిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలం నుండి వివిధ పరిమాణాల మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురీందర్ సింగ్, పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విమల సంప్రదాయ వైద్యం, చేతబడి నివారణ వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవారు. అలాగే ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. అయితే, ఈ హత్యకు గల అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
రాజేష్, విమలలకు వివాహమై చాలా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు లేరు. పోలీసులు ఇప్పుడు వారి మధ్య ఉన్న సంబంధం, గతంలో జరిగిన గొడవలు, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
Also REad: July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Eagle Challenge: గంజాయి రవాణా, అమ్మకాల సమాచారాని రూ.5,000..సేవించే వారిని పట్టిస్తే రూ.1,500..'ఈగల్ టీమ్ ఛాలెంజ్'!
Vijayawada, Andhra Pradesh:AP Eagle Challenge 5000: విజయవాడ నగర వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆదివారం రోజున విజయవాడ అజిత్సింగ్ నగర్లోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఎస్.వి.రాజశేఖరబాబు, ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ కలిసి 'ఈగల్ ఛాలెంజ్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. గంజాయి కట్టడి కోసం పోలీసులు చేపడుతున్న వివిధ రకాల కఠినమైన చర్యలను ఈ సందర్భంగా వారు వివరించారు.
పోలీస్ కమిషనర్, ఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తీసుకువచ్చేవారిని మరియు విక్రయించేవారిని పట్టిస్తే రూ.5,000, అలాగే గంజాయి తాగే అలవాటు ఉన్నవారిని పట్టిస్తే రూ.1,500 నగదు బహుమతిగా ఇస్తారు. గంజాయి రవాణా, అమ్మకాలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని పోలీసులకు అందిస్తే ఈ రూ.5 వేల బహుమతి లభిస్తుంది.
ఇటీవల ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కేసులతో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానించిన 1,287 మందిని పోలీసులు సమగ్రంగా విచారించారు. వారిలో వెయ్యి మందికి పైగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని సీపీ తెలిపారు. అయితే, ఒక్క అజిత్సింగ్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోనే 469 మందిని పరీక్షించగా, వారిలో 128 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో, అక్కడ గంజాయి తాగే 129వ వ్యక్తిని చూపించిన వారికి రూ.1,500 నగదు బహుమతి ఇస్తామని అజిత్సింగ్నగర్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.
సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ, నగరంలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై ఇప్పటికే 'పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్' అమలు చేశామని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించేందుకే ఈ 'ఈగల్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, యువతను డ్రగ్స్కు దూరం చేయాలనే ఉద్దేశంతో 'డ్రగ్స్ వద్దు బ్రో' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల విద్యాసంస్థల్లో 'ఈగల్ క్లబ్స్' స్థాపించినట్లు వివరించారు. దీనితో పాటు రాష్ట్రంలో 849 హాట్స్పాట్లను కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 'ఈగల్ కాల్సెంటర్ 1972' ప్రారంభించిన తర్వాత, గంజాయి వాడకంపై తల్లులు స్వయంగా ఫోన్ చేసి పోలీసులకు కీలక సమాచారం ఇస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈగల్ బృందం గడిచన ఒక ఏడాది కాలంగా విజయవంతంగా చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాల వివరాలను ఈగల్ ఎస్పీ మహేశ్వరరాజు సభకు నివేదించారు.
Also Read: Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షముప్పు..ఉత్తరాంధ్రకు అల్పపీడన అలర్ట
Also REad: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Principal Suspended: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ సస్పెండ్!
Thanagazi, Rajasthan:School Principal Suspended: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15న ఓ స్కూల్ ప్రిన్సిపాల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న అతను.. పాఠశాలలోని కొందరు విద్యార్థినులతో కలిసి కొలనులో స్నానం చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 15న ప్రిన్సిపాల్, పాఠశాలకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక డ్యామ్ వద్దకు 200 మందికి పైగా విద్యార్థులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ డ్యామ్లో సుమారు 11 అడుగుల నీరు ఉండటంతో, మునిగిపోయే ప్రమాదం ఉన్నందున అక్కడ స్నానం చేయడం నిషేధించబడింది. అయినా అలాంటి ప్రమాదరకర ప్రాంతాలకు విద్యార్థినులతో వెళ్లిన కారణంగా, ఆ పరిస్థితుల్లో విద్యార్థినుల అసభ్యకర వీడియోలు బయటకు రావడంతో అతడ్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
థానాగాజీ ప్రాంతంలోని రౌబవి పడక్ ఛాప్లీలో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ లాల్ చంద్ మీనాను, బికనీర్లోని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ తక్షణమే సస్పెండ్ చేసింది. శనివారం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వు ప్రకారం.. మీనా, పాఠశాల విద్యార్థినులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఆయన ప్రవర్తన ప్రాథమికంగా ఉల్లంఘించిందని విద్యాశాఖ పేర్కొంది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ మరియు అప్పీల్) నియమావళి, 1958లోని నియమం 13(1) ప్రకారం మీనాపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించబడింది.
సస్పెన్షన్ కాలంలో, మీనా ప్రధాన కార్యాలయం బికనీర్లోని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. 11, 12వ తరగతి విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ డ్యామ్ నీటిలో స్నానం చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయులు లాల్ చంద్ మీనా డ్యామ్లో స్నానానికి తీసుకెళ్లారు. స్కూల్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యామ్లో సుమారు 11 అడుగుల లోతులో నీరు ఉన్నట్లు తెలిసింది. మునిగిపోయే ప్రమాదం ఉన్నా దాదాపుగా 200 మంది విద్యార్థినులతో అక్కడికి వెళ్లి స్నానం చేయడం, వారి అసభ్యకర వీడియోలు బయటకు రావడం.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీంతో పై అధికారులు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశారు.
Also Read: July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Also Read: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Autos Bandh: బిగ్ బ్రేకింగ్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం- అర్ధరాత్రి ఆటోల బంద్ విరమణ
Baddipadaga, Telangana:Auto Workers Strike: తమకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆటోడ్రైవర్లు కొంచెం శాంతించారు. నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టాల్సిన ఆటోల బంద్ను విరమించుకున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో తాత్కాలికంగా నిరవధిక బంద్ విరమించుకున్నట్లు ఆటో సంఘాలు ప్రకటించాయి. యథావిధిగా ఆటోల రాకపోకలు హైదరాబాద్తోపాటు తెలంగాణవ్యాప్తంగా ఉండనున్నాయి.
ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో కార్మిక సంఘాల డిమాండ్స్ పై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక బంద్నును విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ఆటో కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. దీంతో ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆటో కార్మిక సంఘాలకు ప్రభుత్వం నుంచి సానుకూల అంశాలు రావడంతో సమ్మె విరమించుకోవడంతో హైదరాబాద్ నగర ప్రయాణికులకు భారీ ఊరట లభించింది.
ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని అది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. విధివిధానాలకు సెప్టెంబర్ 1వ తేదీ కార్మిక శాఖ, రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012 తర్వాత ఆటో చార్జీలు పెంచుకోవడంతో ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలి అనే దానిపై తగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఓలా, ఉబెర్ లా మాదిరి ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఐటీ శాఖ నుంచి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ద్విచక్ర వాహనాల్లో రాపిడో, ఓలా, ఉబెర్ నడిపే వాటికి ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి మాత్రమే ప్రయాణికులను తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.12 వేల అంశంపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తగిన అంశాలు పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచ మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
హైదరాబాద్ లో పాత డీజిల్, పెట్రోల్ ఆటోలకు రెట్రోఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడానికి రూ.1.50 లక్షలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని అధికారులు ప్రకటించారు. కొత్త ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి.. పర్యావరణాన్ని కాపాడడానికి నగరంలో ఈవి ఆటో లుగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆటో కార్మికుల సోదరుల డిమాండ్స్ పై ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఆటో కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, వెంకటరమణ ఉన్నారు.
