చంద్రబాబు-రేవంత్ భేటీ: ప్రజాభవన్లో సమావేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో ప్రజా భవన్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇరువురు నేతల భేటీ.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Cobra Snakes Video Viral: ప్రమాదకరమైన పాములను రక్షించడంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలను పట్టుకునే సమయంలో కూడా వాటి కాటు బారిన పడి మరణిస్తున్నారు.. ఏది ఏమైనా పాములు పట్టేవారు ప్రకృతిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రకృతిని రక్షించేందుకు వారు చేసే ప్రయత్నాలు అంతో ఇంతో కాదు వర్ణనాతీతం.. అయితే, చాలామంది యువత కూడా పాములు పట్టే ట్రైనింగ్ తీసుకొని.. ప్రకృతిని రక్షించే కార్యక్రమంలో పడ్డారు. ఇటీవల కాలంలో అడవి ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఆహార కోరత కారణంగా.. పల్లె ప్రాంతాల్లోకి ప్రమాదకరమైన పాములు సంచారం చేయడంతో.. వాటిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగమే జలీల్ బాయ్..
గత కొద్ది రోజుల నుంచి జలీల్ భాయ్ పాములను రెస్క్యూ చేసే పనిలో పడ్డారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరకు చెందిన అతను ఎక్కడ పాములు కనిపించిన అక్కడికి వెళ్లి రెస్క్యూ చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు అతను కొన్ని వందల పాములకు పైగా పట్టుకొని రెస్క్యూ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అతడు ఆ పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అతను తీసిన వీడియోలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు పట్టుకునే క్రమంలో తీసిన కొన్ని వీడియోలైతే జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.
తాజాగా కూడా జలీల్ భాయ్ ఓ పామును పట్టుకుంటున్న క్రమంలో తీసి పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో ఓ ఇంట్లోకి సంచారం చేసిన కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం మీరు చూడొచ్చు. ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో కింగ్ కోబ్రా ఇంట్లోని వంట రూములో సిలిండర్ కింద సంచారం చేస్తుంది. అయితే, దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని వెంటనే జలీల్ బాయ్ కి సమాచారం అందించారు వెంటనే అతను అక్కడికి చేరుకొని సిలిండర్ కింద ఉన్న ఆ పాముని రెస్క్యూ చేశారు.
ఈ సమయంలో అతను సిలిండర్ కింద ఉన్న చిన్న నాగుపామును తన చేతితోనే బయటికి లాగి.. తోకను పట్టుకొని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించడం మీరు చూడొచ్చు. ఇలా అతను ఓ ప్లాస్టిక్ డబ్బాలో ఆ పామును బంధించి.. సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు యూట్యూబ్ షార్ట్ వీడియోను కొన్ని వందల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
New Rules From January 2026: 2026 సంవత్సరం సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా అనేక కొత్త నిబంధనలు, విధాన మార్పులు అమలుకు సిద్ధమవుతున్నాయి. ప్రతి కొత్త సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, ఉద్యోగాలు, రైతాంగం, సోషల్ మీడియా, రవాణా వంటి అనేక రంగాల్లో మార్పులు సామాన్యుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించనున్నాయి. ఈ మార్పులు యువత నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ తాకనున్నాయి.
బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు:
2026 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ నిర్వహణలో కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి అప్ డేట్ అయ్యే క్రెడిట్ డేటాను ఇకపై ప్రతి వారం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రుణాలపై వడ్డీ రేట్లు, లోన్ అర్హత మరింత పారదర్శకంగా మారనుంది. అదే సమయంలో SBI, PNB, HDFC వంటి ప్రధాన బ్యాంకులు రుణ వడ్డీ రేట్లలో కోత ప్రకటించాయి. ఈ తగ్గింపు ప్రభావం కొత్త సంవత్సరం నుంచి స్పష్టంగా కనిపించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లలో కూడా మార్పులు చేసి, జనవరి నుంచి కొత్త రేట్లు అమలు చేయనున్నారు.
UPI, ఇతర డిజిటల్ చెల్లింపుల విషయంలో భద్రతను మరింత కఠినతరం చేశారు. PAN–Aadhaar లింకింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది లేకపోతే బ్యాంకింగ్ లేదా ప్రభుత్వ సేవలు నిలిపివేయబడే అవకాశం ఉంది. అలాగే WhatsApp, Telegram, Signal వంటి యాప్లలో సిమ్-లింక్ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు.
సోషల్ మీడియా, ట్రాఫిక్ నియమాల్లో మార్పులు:
సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లల కోసం కఠిన నియమాలు తీసుకురావాలని చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల మాదిరిగా వయస్సు పరిమితి, కంటెంట్ నియంత్రణలు అమలు చేసే అవకాశముంది.రవాణా రంగంలోనూ మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా కొన్ని నగరాల్లో డీజిల్, పెట్రోల్ వాహనాల వాణిజ్య వినియోగంపై పరిమితులు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో డెలివరీ వాహనాలపై కొత్త నిబంధనలు అమలు కావచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మార్పులు:
డిసెంబర్ 31తో ఏడవ వేతన సంఘం కాలపరిమితి ముగియడంతో... ఎనిమిదవ వేతన సంఘంపై అంచనాలు పెరిగాయి. 2026 జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీనితో పాటు కరువు భత్యం (DA) పెంపు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల కనిపించవచ్చు. హర్యానా వంటి రాష్ట్రాల్లో పార్ట్-టైమ్, రోజువారీ వేతన కార్మికులకు కనీస వేతనం పెంచే నిర్ణయాలు తీసుకున్నారు.
రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు:
రైతుల కోసం కూడా కీలక మార్పులు అమలవుతున్నాయి. ముఖ్యంగా PM కిసాన్ పథకం కింద రైతు ఐడీ తప్పనిసరి చేస్తున్నారు. ఇది లేకపోతే వాయిదాలు రైతు ఖాతాల్లో జమ కావు. పంట బీమా పథకంలో కూడా మార్పులు వచ్చాయి. అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా ఇప్పుడు బీమా కవరేజీ లభించనుంది. అయితే నష్టం జరిగిన 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
పన్నులు, గ్యాస్, విమాన టిక్కెట్లపై ప్రభావం:
2026 జనవరి నుంచి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్ విడుదల కానుంది. ఇందులో బ్యాంకింగ్ లావాదేవీలు, ఖర్చుల వివరాలు ముందుగానే పొందుపరిచే అవకాశం ఉంది. LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1 నుంచి సవరిస్తారు. అలాగే ఎయిర్ ఫ్యూయల్ ధరల్లో మార్పులతో విమాన టిక్కెట్ ధరలపై ప్రభావం పడవచ్చు.
ఈ విధంగా 2026 సంవత్సరం అనేక మార్పులతో మొదలుకాబోతోంది. బ్యాంకింగ్ నుంచి వ్యవసాయం వరకు, ఉద్యోగాల నుంచి సోషల్ మీడియా వరకు ప్రతీ రంగంలో కొత్త నిబంధనలు మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ మార్పులను ముందుగానే తెలుసుకుని, జాగ్రత్తగా ప్రణాళిక చేసుకుంటే కొత్త సంవత్సరం మనకు మరింత లాభదాయకంగా మారే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Cobra Video: వామ్మో.. 12 ఏళ్ల నాటి నాగుపామును పట్టుకున్న యువకుడు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Rare Cobra Video Watch Now: ప్రకృతిలో పాములు అత్యంత కీలకమైన జీవులుగా చెప్పుకుంటారు.. ఇవి ఆహార గొలుసులో భాగంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇటీవలే అడవుల్లో వనరుల కోరత తగ్గిపోయి.. ఎక్కువగా జనావాసాల మధ్యలోకి పాములు రావడం ప్రారంభమైంది. దీని కారణంగా కొన్ని అడవి ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఊళ్ళలోకి ఎక్కువగా విషపూరితమైన పాములు సంచారం చేస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఈ పాములు ఇళ్లలోని వంట గదిలో చేరి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొంతమంది స్నేక్ క్యాచర్స్ వాటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. అయితే ఈ సమయంలోనే వారు వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ స్నేక్ రెస్క్యూయర్ జలీల్ భాయ్ ఓ అరుదైన 12 ఏళ్ల వయస్సు కలిగిన ఇండియన్ కింగ్ కోబ్రాను రెస్క్యూ చేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో అతను అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఎలా పట్టుకుంటున్నాడనేది క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. 12 ఏళ్లు కలిగిన అత్యంత ప్రమాదకరమైన నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చాలామంది ఇలాంటి కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోలు చూసి అప్పుడప్పుడు భయపడుతూ కూడా ఉంటారు. అయితే ఈ వీడియో కూడా అదే కోవాకు చెందింది గా అనిపిస్తోంది.
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఈ వీడియోలో ఆ స్నేక్ క్యాచర్ ఒక పెద్ద పాములు పట్టే కర్రను తీసుకొని.. ఆ ప్రమాదకరమైన నాగుపాము తలభాగాన్ని దానితో పట్టి ఉంచడం మీరు గమనించవచ్చు. అయితే ఈ సమయంలో అది ఏ మాత్రం దాడి చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ రెస్క్యూట్ స్టిక్ తో పామును సులభంగా నియంత్రించడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా 12 ఏళ్ల నాటి పాము కావడంతో దాని శరీరం మొత్తం పోలీసులు వదులుతున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. అలాగే దాని తలభాగం కూడా చాలా పెద్దదిగా ఉండడం గమనించవచ్చు. అయితే, జలీల్ భాయ్ ఆ పాముని పట్టుకొని ఓ సంచిలో బంధించాడు.
ఈ వీడియోలో జలీల్ భాయ్ పామును రక్షించే సమయంలో ఆయన వ్యూయర్స్కి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. నాగుపాములు జెర్రిపోతులు సాధారణంగా గుడ్లు పెడతాయని.. రక్తపింజర జాతికి సంబంధించిన పాములు మాత్రం నేరుగా పిల్లలను జన్మనిస్తాయని అతను తెలిపాడు. అంతేకాకుండా ఇలాంటి ప్రమాదకరమైన పాములు కనిపించినప్పుడు తప్పకుండా రెస్క్యూ ఇబ్బందికి సమాచారం అందించాలని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో జలీల్ భాయ్ తన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th pay commission expectations 7th pay commission impact: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో కీలక దశకు తెరలేవనుంది. డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం పదవీకాలం ముగుస్తుంది. గత 10ఏండ్ల కాలంలో అమలైన మార్పులు మరోసారి చర్చకు వస్తున్నాయి. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, పదవీ విరమణ ప్రయోజనాల వరకు 7వ వేతన సంఘం తీసుకొచ్చిన నిర్ణయాలు కోట్లాది కుటుంబాల ఆర్థిక జీవనంపై గణనీయమైన ప్రభావం చూపాయి. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘంపై కేంద్రీకృతమైంది. జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? పెన్షనర్లకు ఎంత ప్రయోజనం లభిస్తుంది? అనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే ఇవి 50 లక్షలకుపైగా ఉద్యోగులు.. దాదాపు 69 లక్షల పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.
7వ వేతన సంఘం అమలు.. ప్రధాన మార్పులు:
7వ వేతన సంఘం సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతాన్ని నెలకు రూ.18,000గా నిర్ణయించారు. అదే సమయంలో అపెక్స్ స్థాయి అధికారుల గరిష్ట జీతాన్ని రూ.2.25 లక్షలుగా, క్యాబినెట్ సెక్రటరీ వంటి అగ్రస్థాయి అధికారులకు రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. పాత పే బ్యాండ్.. గ్రేడ్ పే విధానాన్ని రద్దు చేసి, కొత్తగా పే మ్యాట్రిక్స్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని వల్ల ఉద్యోగుల స్థాయి, జీతాల పురోగతి స్పష్టంగా మారింది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్లు:
7వ వేతన సంఘంలో 2.57 యూనిఫాం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అన్ని ఉద్యోగులకు ప్రయోజనాలను అందించారు. దీని కారణంగా ప్రాథమిక జీతాలు గణనీయంగా పెరిగాయి. వార్షిక ఇంక్రిమెంట్ రేటును మాత్రం 3 శాతానికి పరిమితం చేశారు. దీంతో జీతాల పెరుగుదల స్థిరంగా కొనసాగింది.
MACP.. అలవెన్సుల మార్పులు:
MACP నిబంధనల్లో పనితీరు ప్రమాణాన్ని గుడ్ నుంచి వెరీ గుడ్ కు పెంచారు. అదే సమయంలో 52 అలవెన్సులను రద్దు చేసి, మిగిలినవాటిని విలీనం చేశారు. రిస్క్, హార్డ్షిప్ అలవెన్సుల కోసం ప్రత్యేకంగా 9-టైర్ మ్యాట్రిక్స్ను అమలు చేశారు. ఇంటి అద్దె భత్యం విషయంలో X, Y, Z నగరాలకు వరుసగా 24శాతం, 16శాతం, 8శాతంగా నిర్ణయించారు. డీఏ పెరిగే కొద్దీ HRAలోనూ మార్పులు చేశారు.
అడ్వాన్సులు, వైద్య సౌకర్యాలు, పెన్షన్:
వడ్డీ లేని అడ్వాన్సులను రద్దు చేసి.. గృహ నిర్మాణ అడ్వాన్సు (HBA) పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. CGEGIS కింద బీమా కవర్ పెరిగింది. వైద్య సదుపాయాల విషయంలో CGHS పరిధిని విస్తరించారు. 2016కి ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ పునఃలెక్కింపు అమలు చేశారు. గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పెద్ద ఉపశమనంగా మారింది.
8వ వేతన సంఘం.. ఆశలు, అంచనాలు:
8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలవుతుందా? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. లోక్సభలో ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వం ఇప్పటివరకు తేదీని ఖరారు చేయలేదని తెలిపింది. కమిషన్ నోటిఫికేషన్ తర్వాత నివేదిక రావడానికి సుమారు 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ఉద్యోగులు, పెన్షనర్లు ఫిట్మెంట్ ఫ్యాక్టర్, జీతాల పెరుగుదల, పెన్షన్ సవరణలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. 7వ వేతన సంఘం ముగింపుతో.. ఇప్పుడు 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Why Gold Rate Surge: 2025 ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు మాత్రమే కాదు.. సామాన్య వినియోగదారులకు ఆశ్చర్యం కలిగించాయి. ప్రతిరోజూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. మధ్య కొన్ని సందర్భాల్లో బంగారం ధరలు తగ్గినట్లుగా అనిపించినా.. 2025 ముగిసేలోపు మళ్లీ భారీగా ఊపందుకుంటున్నాయి. తాజాగా బుధవారం జరిగిన ట్రేడింగ్ లో బంగారం ధర మరోసారి దూసుకెళ్లింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం ధర దాదాపు రూ.2,500 పెరిగి 10 గ్రాములకు రూ.1.41 లక్షల స్థాయిని దాటింది. ఈ ఆకస్మిక ర్యాలీ వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు కారణాలకు అమెరికాతో నేరుగా సంబంధం ఉండటం గమనార్హం.
బుధవారం బంగారం ధరలు రాకెట్లా ఎగసిపడ్డాయి. MCXలో వరుసగా రెండో ట్రేడింగ్ రోజూ బంగారం బలమైన లాభాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 5 గడువు ఉన్న 24 క్యారెట్ బంగారం ధర ట్రేడింగ్ సమయంలో రూ.1,519 పెరిగి 10 గ్రాములకు రూ.1.38 లక్షలకు పైగా చేరింది. ఇది శాతంగా చూస్తే సుమారు 1.11 శాతం పెరుగుదల. అదే సమయంలో దేశీయ బులియన్ మార్కెట్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం, సోమవారం ముగింపు నాటికి 24 క్యారెట్ బంగారం ధర రూ.1,33,970గా ఉండగా, బుధవారం నాడు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంతోనే అది రూ.2,163 పెరిగి రూ.1,41,133కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం పరుగులు తీసింది. ఆసియా మార్కెట్లలో స్పాట్ బంగారం ధర ఔన్సుకు జీవితకాల గరిష్ట స్థాయి $4,445.69ను తాకింది. వెండి ధరలు కూడా అదే బాటలో నడిచాయి. MCXలో వెండి ధరలు కిలోకు రూ.3,000కు పైగా పెరిగి సుమారు రూ.2,25,596కు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ వెండి ధర 0.19 శాతం పెరిగి ఔన్సుకు $69.15 వద్ద ట్రేడైంది.
డిసెంబర్ ప్రారంభంలో కొంతకాలం బంగారం ధరలు ఒత్తిడిలోకి వెళ్లాయి. అయితే నెల చివరి రోజుల్లో మళ్లీ పుంజుకున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 70 శాతం బలమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఈ నెలలో కొంత తగ్గిన తర్వాత కూడా దాదాపు 10 శాతం రికవరీ సాధించాయి. ఈ పునరుజ్జీవానికి ప్రధానంగా పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడమే కారణంగా చెప్పవచ్చు.
మొదటి ప్రధాన కారణం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని చెప్పాలి. అమెరికా వెనిజులా చమురును రవాణా చేస్తున్న ట్యాంకర్లపై చర్యలు తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడం వల్ల ఇంధన సరఫరాలపై అనిశ్చితి పెరిగింది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసి, బంగారాన్ని మరోసారి సేఫ్ హేవెన్ గా మార్చాయి.
రెండో కారణం ప్రపంచ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు చేయడం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా కేంద్ర బ్యాంకుల నిల్వల్లో బంగారం వాటా అమెరికా ట్రెజరీ బాండ్ల కంటే ఎక్కువైంది. 2022 నుంచి కేంద్ర బ్యాంకులు ప్రతి ఏడాది సగటున వెయ్యి టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ ధోరణి డాలర్ ఆధిపత్యానికి సవాల్గా మారడంతో పాటు బంగారం ధరలను మరింత పైకి నెట్టింది.
మూడో కారణం ఏంటంటే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఇచ్చిన సంకేతాలు. ఇటీవల ఫెడ్ పాలసీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో, 2026లో కూడా రేటు కోతలు ఉండవచ్చని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు దిగుబడి లేని బంగారం వంటి ఆస్తులు ఆకర్షణీయంగా మారుతాయి. ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ వ్యాఖ్యలు కూడా ఈ భావనకు బలం చేకూర్చాయి. ఈ అన్ని అంశాలు కలిసి బంగారం ధరలను మరోసారి ఆకాశానికి ఎత్తేశాయి.
ఇదే ధోరణి కొనసాగినట్లయితే వచ్చే ఏడాది చివరి నాటికి 10గ్రాముల బంగారం ధర రూ. 2లక్షలు, కిలో వెండి ధర రూ. 4లక్షలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దూకుడు దాదాపుగా కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టేవారికి భారీ రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ సామాన్యులకు మాత్రం ఈ లోహాలకు అందనంత ఎత్తుకు చేరుకోవడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPFO 3.0 Withdrawal Rules: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత వేగవంతం చేయడం సహా సభ్యులకు వెసులుబాటు కల్పించేందుకు EPFO 3.0 వెర్షన్ను ప్రవేశపెట్టింది. నిరుద్యోగం, పెన్షన్, వివాహం, విద్య వంటి అవసరాల కోసం పీఎఫ్ (PF) డబ్బును తీసుకునే నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఆ 7 ముఖ్యమైన మార్పులు ఇక్కడ ఉన్నాయి.
1. నిరుద్యోగ సమయంలో ఉపసంహరణ..
పాత రూల్: ఒక నెల ఖాళీగా ఉంటే 75 శాతం, రెండు నెలల తర్వాత మిగిలిన 25 శాతం తీసుకోవచ్చు.
కొత్త నియమం (EPFO 3.0): ఉద్యోగం పోయిన వెంటనే 75 శాతం బ్యాలెన్స్ను తక్షణమే విత్డ్రా చేసుకోవచ్చు. అయితే, పూర్తి 100 శాతం నగదు కావాలంటే మాత్రం వరుసగా 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉన్నట్లు నిరూపించుకోవాలి.
2. పెన్షన్ విత్డ్రా..
పాత నియమం: రెండు నెలల పాటు ఉద్యోగం లేకపోతే పెన్షన్ డబ్బు తీసుకోవచ్చు.
కొత్త నియమం: ఇప్పుడు పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేయాలంటే కనీసం 36 నెలల పాటు (3 ఏళ్లు) నిరుద్యోగ కాలం పూర్తి కావాలి.
3. సంస్థ మూసివేత లేదా లాకౌట్
పాత నియమం: కంపెనీ మూతపడితే ఉద్యోగి వాటా లేదా 100 శాతం మొత్తం తీసుకునే వీలుండేది.
కొత్త నియమం: సభ్యులు పీఎఫ్ కార్పస్లో 75 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని ఖాతాలో 'కనీస నిల్వ' గా ఉంచడం ఇప్పుడు తప్పనిసరి.
4. విద్య, వివాహం
పీఎఫ్ సభ్యులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. పాత నియమం ప్రకారం.. ఏడేళ్ల సర్వీస్ తర్వాత విద్య కోసం 3 సార్లు, పెళ్లి కోసం 2 సార్లు మాత్రమే డబ్బు తీసుకునే అవకాశం ఉండేది.
కొత్త నియమం ప్రకారం.. సర్వీస్లో ఉన్నప్పుడు ఉన్నత విద్య కోసం 10 సార్లు, వివాహ ఖర్చుల కోసం 5 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణలకు ప్రభుత్వం అనుమతించింది.
5. ప్రకృతి వైపరీత్యాలు
నిబంధన: వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పాక్షిక ఉపసంహరణ చేసుకోవాలంటే ఇప్పుడు కనీసం 12 నెలల సర్వీస్ ఉండటం ప్రామాణికం చేశారు.
6. అనారోగ్యం, వైద్య ఖర్చులు
నిబంధన: 6 నెలల బేసిక్ వేతనం + DA లేదా ఉద్యోగి వాటా మొత్తాన్ని మెడికల్ అడ్వాన్స్గా తీసుకోవచ్చు. దీనికి కూడా ఇప్పుడు ఏకరీతిగా 12 నెలల సర్వీస్ తప్పనిసరి నిబంధనను వర్తింపజేశారు.
7. 'ప్రత్యేక పరిస్థితుల' కింద క్లెయిమ్..
మార్పు: గతంలో అంటువ్యాధులు (Pandemic), సంస్థ మూసివేత వంటి ప్రత్యేక కారణాల కింద డబ్బు విత్డ్రా చేయాలంటే సరైన వివరణలు/ఆధారాలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎటువంటి వివరణలు ఇవ్వకుండానే సభ్యులు ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
EPFO 3.0 ద్వారా క్లెయిమ్ల సెటిల్మెంట్ సమయం తగ్గడమే కాకుండా, సభ్యులకు అత్యవసర సమయాల్లో నిధులు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RoKo In Vijay Hazare Trophy: భారత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజే టీమ్ ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాట్లతో మైదానంలో పరుగుల వరద పారించారు. ఒకవైపు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయి మైలురాయిని అధిగమించగా, మరోవైపు రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్తో అభిమానులను ఉర్రూతలూగించారు.
16,000 పరుగుల క్లబ్లో కింగ్..
ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఆంధ్రప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తీయడం ద్వారా విరాట్ లిస్ట్-ఎ (List-A) క్రికెట్లో 16,000 పరుగుల చారిత్రక రికార్డు మైలురాయిని చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న 9వ ఆటగాడు కోహ్లీ కావడం విశేషం. 299 పరుగుల లక్ష్యఛేదనలో కోహ్లీ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. 110 బంతుల్లో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు కోహ్లీ. ఈ మ్యాచ్లో ఢిల్లీ టీమ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సిక్కిం బౌలర్లపై 'హిట్మ్యాన్' దాడి
మరోవైపు విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై జట్టు తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ, సిక్కింతో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 61 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న రోహిత్, మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు (18 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించి ఔట్ అయ్యారు. 237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ తన ఒంటిచేత్తో ఛేదించి ముంబైకి ఘనవిజయాన్ని అందించారు. జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ను చూడటానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
లిస్ట్-ఎ క్రికెట్ అంటే ఏమిటి?
దేశీయ 50 ఓవర్ల టోర్నమెంట్లు (విజయ్ హజారే వంటివి), అంతర్జాతీయ వన్డేలు (ODI) రెండింటినీ కలిపి 'లిస్ట్-ఎ' క్రికెట్గా పరిగణిస్తారు. ఇందులో అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్ దిగ్గజం గ్రాహం గూచ్ (22,000 పైచిలుకు) పేరిట ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి తమ జట్ల కోసం ఇరువురు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు ఫామ్లోకి రావడం భారత క్రికెట్ అభిమానులకు పెద్ద పండగ లాంటి వార్త.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajasthan Jalore Panchayat Smart Phone Ban: ప్రపంచం 5G, 6G వేగంతో దూసుకుపోతుంటే.. రాజస్థాన్లోని కొన్ని గ్రామాల్లో మాత్రం కాలం వెనక్కి వెళ్తోంది. జలోర్ జిల్లాలోని భిన్మల్ ప్రాంతానికి చెందిన సుమారు 15 గ్రామాల్లో మహిళలు, యువతులు స్మార్ట్ఫోన్లు వాడటంపై స్థానిక పంచాయతీ నిషేధం విధించింది. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఎక్కడ? ఎప్పటి నుంచి అమలు?
రాజస్థాన్లోని 'చౌదరి కమ్యూనిటీ'కి చెందిన సుంధమాత పట్టి పంచాయతీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26, 2026 నుండి ఈ కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఘాజీపూర్, రాజ్పూర్, ఖాన్పూర్ వంటి మొత్తం 15 గ్రామాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
జలోర్ పంచాయతీ విధించిన కఠిన నిబంధనలు ప్రకారం.. మహిళలు కెమెరా ఉన్న ఏ స్మార్ట్ఫోన్ను ఉపయోగించకూడదు. కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుండే కీప్యాడ్ ఫోన్లను మాత్రమే వాడాలట. వివాహాలు, శుభకార్యాలు లేదా పొరుగువారి ఇళ్లకు వెళ్లేటప్పుడు మహిళలు మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకూడదు. అయితే చదువుకునే విద్యార్థినులకు మాత్రం కొన్ని పరిమితులను విధించారు. కళాశాల లేదా పాఠశాలకు వెళ్లే అమ్మాయిలు చదువు కోసం కేవలం ఇంటి లోపల మాత్రమే స్మార్ట్ఫోన్ వాడాలి. ఇంటి గడప దాటితే ఫోన్ చేతిలో ఉండకూడదు.
ఈ నిషేధానికి కారణాలు ఏంటి?
పంచాయతీ పెద్దల వాదన ప్రకారం స్మార్ట్ఫోన్ల వల్ల సమాజానికి ముప్పు పొంచి ఉందట. స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల గ్రామస్తులు పట్టణ సంస్కృతికి అలవాటు పడి, స్థానిక ఆచారాలను విస్మరిస్తున్నారని వారి అభిప్రాయం. మహిళలు తమ పని కోసం పిల్లలకు ఫోన్లు ఇచ్చి వెళ్లడం వల్ల వారి కళ్లు దెబ్బతింటున్నాయని, పిల్లలు తప్పుదోవ పడుతున్నారని వారు వాదిస్తున్నారు.
వెల్లువెత్తుతున్న నిరసనలు
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. "ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే" అని వారు ఆరోపిస్తున్నారు. డిజిటల్ ఇండియా కాలంలో మహిళలను సాంకేతికతకు దూరం చేయడం వారి అభివృద్ధిని కుంటుపరచడమేనని విమర్శిస్తున్నారు. ఈ మధ్యయుగపు ఆలోచనలపై ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? లేదా ఈ పంచాయతీ తీర్పు అలాగే కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mobile Recharge Increase 2026: కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యుడిపై మరో ఆర్థిక భారం పడనుంది. దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు రీఛార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 16 శాతం నుండి 20 శాతం వరకు ధరల పెంపు ఉండవచ్చని సమాచారం. 2026 జనవరి ప్రారంభంలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఏ ప్లాన్ ధర ఎంత పెరగొచ్చు? (అంచనా)
టెలికాం వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో రీఛార్జ్పై దాదాపు రూ. 60 నుండి రూ. 100 వరకు అదనపు భారం పడనుందట. ప్రముఖ కంపెనీల ప్రస్తుత, పెరగబోయే ధరల అంచనా ధరలు ఇక్కడ ఉన్నాయి.
| కంపెనీ | ప్లాన్ వివరాలు | ప్రస్తుత ధర | పెరగబోయే ధర (అంచనా) |
| ఎయిర్టెల్ | 28 రోజులు (బేసిక్ 5G) | ₹319 | ₹419 |
| జియో | 28 రోజులు (బేసిక్) | ₹299 | ₹359 |
| జియో | 28 రోజులు (5G ప్లాన్) | ₹349 | **₹429 |
| వొడాఫోన్ ఐడియా | 28 రోజులు (1GB/రోజు) | ₹340 | ₹419 |
| వొడాఫోన్ ఐడియా | 56 రోజులు (2GB/రోజు) | ₹579 | ₹699 |
ధరల పెంపునకు కారణం ఏంటి?
ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం.. టెలికాం కంపెనీలు తమ ఒక్కో వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 5G నెట్వర్క్ విస్తరణ కోసం చేసిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి టారిఫ్ ధరల పెంపు అనివార్యమని కంపెనీలు భావిస్తున్నాయి.
వినియోగదారులకు సూచన
ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్, డేటా ప్లాన్ల ధరలన్నీ ఒకేసారి పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ధరలు పెరగకముందే దీర్ఘకాలిక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా కొంత కాలం పాటు ఈ అదనపు భారం నుండి తప్పించుకోవచ్చు.
Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?
Also Read: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huge Rainbow Python Video: అన్ని జీవులు మాతృ ప్రేమను కలిగి ఉంటాయి. చాలామంది మనుషులు మాత్రమే తల్లులు బిడ్డలను ప్రేమిస్తాయని అనుకుంటూ ఉంటారు.. కానీ ప్రపంచంపై ఉన్న ప్రతి ఒక జీవి తప్పకుండా వాటి పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూనే ఉంటుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగడుతూ ఉంటాయి. ఎందుకు నిదర్శనమే ఓ భారీ రెయిన్బో పైథాన్ వీడియో.. ఇందులో తన గుడ్లను రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రముఖ వన్యప్రాణి సంరక్షకుడు జే బ్రూవర్ తన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ గా మారింది.
ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. జే బ్రూవర్ పాములను బంధించిన బాక్సును ఓపెన్ చేస్తాడు. అయితే, ఇదే సమయంలో తన వెంట కెమెరామెన్ కూడా ఉంటాడు. అతడు ఆ తెల్ల పెట్టేలో ఉన్న భారీ రెయిన్బో పైథాన్, దాని కింద ఉన్న గుడ్లను చూపించమని అడగ్గా.. కెమెరామెన్ దానికి దగ్గరగా వెళ్లి వీడియోను రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, కెమెరామెన్ తన గుడ్లపై దాడి చేస్తుండని అనుకొని.. అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలోనే హఠాత్తుగా కెమెరామెన్ వైపు విరుచుకుపడుతుంది. ఆ పాము తన నోరును పెద్దగా చేసుకుని వేగంగా దాడికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు.
జే నిత్యం తన ప్రయోగశాలలో ఉన్న పాముల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తూ ఉంటాడు. ముఖ్యంగా గుడ్లు పాములను చాలా ప్రత్యేకమైన పద్ధతిలో పరీక్షించి.. వ్యాధికి గురైన పాములకు చికిత్స అందిస్తూ ఉంటాడు. అయితే గుడ్లు పెట్టే సమయంలో కూడా కొన్ని పాములు ఎంతో కోపంగా ఉంటాయి. అలాగే వాటిని రక్షించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ పాము కూడా తన గుడ్లకు హాని కలిగించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాటిని ఎవరూ ముట్టుకోకుండా ఉండడానికి.. దాని దగ్గరికి వచ్చిన ప్రతి జీవి పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా రెయిన్బో పైథాన్ పాములు గుడ్లు పెట్టి మాత్రమే పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాయి. అయితే, ఈ వీడియోలో కూడా పాము తన గుడ్లను రక్షించుకోవడం క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తల్లి ప్రేమ గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Senior Citizen Darshan Free: కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది నెలల తరబడి ఎదురుచూస్తుంటారు. అయితే కొందరికి ఇప్పటికీ అతని సేవలో తరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందులోనూ ఆ దర్శనం ఉచితంగా కేవలం అరగంటలో దర్శనం అయిపోతుందంటే భక్తులు ఎగిరి గంతేస్తారు. ఇప్పుడదే విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
శ్రీవారి దర్శనం కోసం 65 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా అది కూడా ఏరోజుకు ఆ రోజు టికెట్ లేకుండా దర్శనం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇదే విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా స్పందించింది. వృద్ధుల కోసం కొత్తగా 'ఉచిత దర్శన పథకం' ప్రారంభమైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే?
గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే, "65 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత దర్శన పథకం ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం ఉండనుంది. ఎస్-1 కౌంటర్ వద్ద ఐడీ కార్డు చూపిస్తే చాలు.. కేవలం 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుందని" అందులో రాసుంది. అయితే దర్శనం పూర్తయిన వెంటనే వృద్ధులకు ఉచిత భోజనం, వేడి పాలు అందిస్తారని.. ఏవైనా సహాయం కోసం 87722 77777 నంబర్ను సంప్రదించవచ్చని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుతోంది.
టీటీడీ ఖండన - అసలు నిజం ఇదీ!
ఈ వైరల్ మెసేజ్పై టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. భక్తులు ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. వృద్ధుల కోసం ఎలాంటి కొత్త ఉచిత దర్శన పథకాన్ని టీటీడీ ప్రస్తుతానికి ప్రారంభించలేదు. వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెలా ఒక నిర్దిష్ట కోటాను ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే విడుదల చేస్తుంది. ఆ టికెట్లు ఉన్న వారికి మాత్రమే ప్రత్యేక లైన్ ద్వారా దర్శనం కల్పిస్తారు.
హెచ్చరిక: సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక మెసేజ్లను చూసి నేరుగా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడొద్దని భక్తులకు సూచించారు.
భక్తులు ఏం చేయాలి?
శ్రీవారి దర్శనం, టికెట్లు లేదా ఇతర సేవల గురించి సరైన సమాచారం కోసం కేవలం ఈ మార్గాలనే నమ్మాలని టీటీడీ కోరింది. అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలు ఉంది.
ముఖ్య సూచన: తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. భక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్న్యూస్..జీతాల పెంపు అప్పటి నుంచే..ఎంత శాతం పెరుగుతుందంటే?
Also REad: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BP Control Foods: మన దేశంలో బీపీ పేషెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. షుగర్, బీపీతో బాధపడుతున్నారు ఉన్నారు. వీరి డైట్లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవాలి. తద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది. అయితే కొన్ని వేదికల ప్రకారం మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా కూడా బీపీ నియంత్రించవచ్చు. బీట్రూట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. ఇది 24 గంటలు పైగా దీని ప్రభావం ఉంటుంది. అయితే రెగ్యులర్ డైట్ లో ఎలాంటి ఫుడ్స్ చేర్చుకోవాలి తెలుసుకుందాం.
కొవ్వు చేప..
కొవ్వు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్, మేకరల్, సార్డినైన్, ట్రౌట్ చేపలు తినాలి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తనాళాలు కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఈ చేపలు తీసుకోవడం వల్ల నైట్రైట్స్ రక్తనాళాల్లో కలిసి పోతాయి. బీపీ నియంత్రణలో ఉంటాయి.
ఆకుకూరలు..
ఆకుకూరల్లో పాలకూర, కాలే వంటివి తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయి. మన శరీరంలో ఉండే అధిక సోడియం సమతులం చేస్తుంది. డైట్ లో ఈ ఆకుకూరలు చేర్చుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
బెర్రీ పండ్లు..
బెర్రీ జాతికి చెందిన పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. స్ట్రాబెరీ, బ్లూబెర్రీ పండ్లు తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు రక్తపోటుని నియంత్రిస్తాయి. బెర్రీ పండ్లు తాజావి లేదా ఫ్రోజెన్ చేసినవి స్నాక్ లో తీసుకోవచ్చు.
కీవీ పండు..
కొన్ని నివేదికల ప్రకారం కీవీ పండులో కూడా బ్లడ్ ప్రెజర్ నియంత్రించే గుణం ఉంటుంది. వీటిలో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రక్తనాళాలకు సహాయపడతాయి. నైట్రిక్ ఆక్సైడ్ పెంచుతుంది. ఆక్సిడేటివ్స్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ కీవీ పండు పుల్లగా తీపిగా ఉంటాయి. రెగ్యులర్ గా తాజాగా తినవచ్చు.
ఇవి మాత్రమే కాదు శనగలు, బీన్స్ వంటివి కూడా డైట్లో చేర్చుకోవాలి. వీటిని వారంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. హైబీపీతో బాధపడుతున్న వాళ్ళు ఈ తృణధాన్యాలు కూడా తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది. రక్తప్రసరణ మెరుగు చేస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగు చేస్తుంది. రెగ్యులర్గా ఏదో విధంగా వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
Read more: ఈ 5 ఆయుర్వేదిక్ ఇంటికి చిట్కాలు 2025లో ఎక్కువమంది ఫాలో అయ్యారు..!
Read more: ఈ 5 కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bangladesh Dependence on India: భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వాణిజ్య సంబంధాలు దశాబ్దాలుగా బలంగా కొనసాగుతున్నాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు అనేక కీలక రంగాల్లో పరస్పరం ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ రోజువారీ జీవితం, పరిశ్రమలు, ఆహార భద్రతకు అవసరమైన అనేక వస్తువుల కోసం భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే ఇటీవలి కాలంలో ద్వైపాక్షిక సంబంధాల్లో వచ్చిన ఒత్తిడి, అలాగే బంగ్లాదేశ్లోని అంతర్గత రాజకీయ అస్థిరత ఈ వాణిజ్య ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడితే.. అక్కడి ప్రజల రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం పడే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ నుంచి దిగుమతి చేసుకునే కీలక వస్తువులు:
గోధుమలు.. బంగ్లాదేశ్ ఆహార భద్రతకు అత్యంత కీలకం. భారత్ నుంచి పెద్ద ఎత్తున గోధుమలు దిగుమతి అవుతుంటాయి. నిషేధానికి ముందు కాలంలో మాత్రమే భారత గోధుమల దిగుమతుల విలువ సుమారు 734 మిలియన్ డాలర్లకు పైగా ఉండగా.. ఇది లక్షల టన్నుల పరిమాణంలో జరిగింది. నిషేధం తరువాత కొంతమేర మినహాయింపులతో మాత్రమే సరఫరా కొనసాగింది.
బియ్యం: విషయంలో కూడా భారతదేశం ప్రధాన సరఫరాదారే. బాస్మతి కాకుండా సాధారణ బియ్యం రకాలను బంగ్లాదేశ్ తన దేశీయ అవసరాలు, ప్రభుత్వ నిల్వల కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది.
చక్కెర మరో ముఖ్యమైన ఉత్పత్తి. ఆహార తయారీ పరిశ్రమతో పాటు గృహ వినియోగానికి కూడా ఇది అవసరం. ఒకే సంవత్సరంలో భారతదేశం నుంచి బంగ్లాదేశ్కు వందల మిలియన్ డాలర్ల విలువైన చక్కెర ఎగుమతి జరిగింది.
రోజువారీ వంటలో ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి వంటి కూరగాయలు కూడా ప్రధానంగా భారత్ నుంచే వస్తాయి. వీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే, బంగ్లాదేశ్లో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
అదే విధంగా సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కూడా భారత ఎగుమతుల్లో ముఖ్యమైన భాగం. ఇవి అక్కడి వినియోగదారుల అవసరాలతో పాటు ఆహార పరిశ్రమను నిలబెడతాయి.
పరిశ్రమలకు కీలకమైన భారతీయ సరఫరాలు:
బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు పత్తి వెన్నెముక లాంటిది. భారతదేశం నుంచి వెళ్లే మొత్తం పత్తి ఎగుమతుల్లో సుమారు మూడవ వంతు బంగ్లాదేశ్కే చేరుతుంది. ఇది అక్కడి గార్మెంట్ రంగానికి కీలక ఆధారం. ఇదే కాకుండా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్లు, ఉక్కు, విద్యుత్ పరికరాలు వంటి పారిశ్రామిక వస్తువులు కూడా భారత్ నుంచే పెద్ద ఎత్తున దిగుమతి అవుతాయి. మందులు, వైద్య పరికరాలు విషయంలోనూ భారతదేశం బంగ్లాదేశ్కు ప్రధాన సరఫరాదారుగా ఉంది.
భారతదేశంపై బంగ్లాదేశ్ ఆధారపడటానికి కారణాలు:
భౌగోళికంగా బంగ్లాదేశ్కు భారతదేశంతో 4,300 కి.మీ.లకు పైగా సరిహద్దు ఉంది. ఇది దాదాపు 94 శాతం భూసరిహద్దు భారత్తోనే పంచుకుంటుంది. ఈ సమీపత వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం, సరఫరా వేగంగా చేరడం బంగ్లాదేశ్కు పెద్ద లాభం. అందుకే చౌకగా, త్వరగా లభించే భారతీయ వస్తువులపై అక్కడి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడుతోంది.
వాణిజ్యం, అభివృద్ధిపై ప్రభావం:
ఇటీవలి సంవత్సరాల్లో భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. బంగ్లాదేశ్ భారత్కు ఎగుమతులు చేస్తున్నప్పటికీ, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉంది. గత ఎనిమిదేళ్లలో భారత్ బంగ్లాదేశ్కు సుమారు 8 బిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయాన్ని అందించింది. రహదారులు, రైల్వేలు, పోర్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషించింది.
ఈ సహకారం వల్ల షేక్ హసీనా పాలన కాలంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. మొత్తం GDP, తలసరి ఆదాయం రెండూ భారీగా పెరిగాయి. అందుకే భారత్తో వాణిజ్య సంబంధాల్లో వచ్చే ఏ చిన్న అంతరాయం కూడా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: EPS Pension: రూ. 1000 నుంచి రూ. 7500కు పెన్షన్ పెంపు... ప్రభుత్వం కీలక అప్డేట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission Salary Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల భారంతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక భారీ ఊరట లభించబోతోంది. 2025 డిసెంబరు 31 నాటికి 7వ వేతన సంఘం పదవీకాలం ముగియనుండటం వల్ల అందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘం అమలుపైనే ఉంది. దీని ద్వారా వేతనాలు, కరువు భత్యం (DA), పెన్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.
నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని సవరించాల్సి ఉంటుంది. ప్రస్తుత 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన విధివిధానాలను ఆమోదించినట్లు సమాచారం. కొత్త వేతన సంఘం అనగా 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
జీతాలు ఎంత పెరగొచ్చు? (అంచనా)
గతంలో ఏర్పాటైన 6వ, 7వ వేతన సంఘాల గణాంకాలను పరిశీలిస్తే.. రాబోయే 8వ వేతన సంఘం సిఫారసు చేయనున్న జీతాల పెంపు ఏ స్థాయిలో ఉండబోతుందో ఒక అంచనాకు రావచ్చు.
| వేతన సంఘం | పెంపు శాతం (సుమారుగా) |
| 6వ వేతన సంఘం | 40% |
| 7వ వేతన సంఘం | 23% - 25% |
| 8వ వేతన సంఘం (అంచనా) | 20% - 35% |
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.
జీతం ఎప్పటి నుండి చేతికి అందుతుంది?
8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చినప్పటికీ, పెరిగిన జీతం వెంటనే చేతికి అందకపోవచ్చు. ఎందుకంటే, కమిషన్ సిఫార్సులను సమర్పించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో పెరిగిన జీతాలు, పెన్షన్లు 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమలులో జాప్యం జరిగినప్పటికీ, జనవరి 1, 2026 నుండి లెక్కగట్టి అరియర్స్ రూపంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం వివిధ వర్గాల నుండి సేకరించిన అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అధికారిక పెంపుదల, నిబంధనల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ నోటిఫికేషన్ చూడటం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.
Also Read: January 2026 Holidays: జనవరిలో సెలవుల జాతర..13 రోజులు సెలవులే సెలవులు..పండగలతో ఫుల్ ఎంజాయ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays In January 2026: మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది (2026 సంవత్సరం)లోకి అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరం రాగానే అందరూ చూసేది క్యాలెండర్. అయితే రాబోయే జనవరి నెలలో ఎక్కువ పబ్లిక్ హాలీడేలు ఉండడం వల్ల సెలవుల పరంగా విద్యార్థులకు, ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. పండగలు, ఆప్షనల్ హాలిడేస్, ఆదివారాలు అన్నీ కలిపి జనవరిలో దాదాపు 13 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ క్రమంలో 2026 జనవరిలో ఏఏ రోజులు సెలవులు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూఇయర్ వేడుకలు..
జనవరి 1 (గురువారం): న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే ఉంది. చాలా విద్యాసంస్థలు కూడా దీనికి సెలవు ప్రకటిస్తాయి.
జనవరి 3 (శనివారం): హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా ఆప్షనల్ హాలిడే.
జనవరి 4 (ఆదివారం): సాధారణ సెలవు.
సంక్రాంతి సందడి
తెలుగు వారి పెద్ద పండుగే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో సంక్రాంతిని ఘనంగా జరుపుకొంటారు. ఈసారి సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రానున్నాయి. జనవరి 10న రెండో శనివారం కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు ఉండనుంది. ఆ తర్వాత జనవరి 11న ఆదివారం కావున సాధారణ సెలవు కానుంది.
అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 15, 16 (బుధ, గురు, శుక్ర).. అనగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు వరుసగా మూడు రోజులు సెలవు రానుంది. ఏపీలో ఈ మూడ్రోజులు సాధారణ సెలవులు కాగా, తెలంగాణలో 16వ తేదీన (కనుమ) ఆప్షనల్ హాలిడేగా ఉంది.
జనవరి 17 (శనివారం): షబ్-ఈ మేరాజ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే.
జనవరి 18 (ఆదివారం): సాధారణ సెలవు.
గమనిక: విద్యార్థులకు జనవరి 10 నుండి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉండే అవకాశం ఉంది.
రిపబ్లిక్ డే, లాంగ్ వీకెండ్..
నెల ఆఖర్లో మరో లాంగ్ వీకెండ్ మనకు స్వాగతం పలుకుతోంది. జనవరి 23న శుక్రవారం నాడు శ్రీపంచమి (వసంత పంచమి) సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉండనుంది. అలాగే జనవరి 25న ఆదివారం కావడం వల్ల ఆ రోజున సాధారణ సెలవు కానుంది.
జనవరి 26 (సోమవారం): రిపబ్లిక్ డే (నేషనల్ హాలీడే). ఆది, సోమవారాలు వరుసగా సెలవులు రావడంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది మంచి అవకాశం. ఈ విధంగా జనవరి నెలలో అత్యధికంగా 13 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
