బోయిన్ పల్లి: సాయిబాబా ఆలయంలో మల్లారెడ్డి పూజలు
Boyapalle, Telangana:బోయిన్ పల్లి లోని జయ నగర్ లో ఉన్న సాయిబాబా ఆలయాన్ని గురుపౌర్ణమి సందర్భంగా మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Honor X80 Pro Max ఫోన్ లీకైన ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Honor X80 Pro Max Leaks Latest News: టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్ఫోన్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎప్పుడు ఒక పెద్ద సవాలు గానే ఉంటూ వస్తోంది. కానీ ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపబోతోంది. మార్కెట్లోని సంచలనం సృష్టించేందుకు సరికొత్త హానర్ ఫ్లాగ్ షిప్ మోడల్ Honor X80 Pro Max స్మార్ట్ఫోన్ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ అతి త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్కు సంబంధించిన అధికారిక టీజర్ కూడా తాజాగా విడుదల కావడం విశేషం. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చార్జింగ్ స్పీడ్..
ఈ స్మార్ట్ఫోన్ లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. దీనికి అద్భుతమైన శక్తివంతమైన బ్యాటరీ. లీకైన వివరాల ప్రకారం ఇది ఏకంగా 11,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ఫోన్ చరిత్రలోనే ఎంత పెద్ద బ్యాటరీని పరిచయం చేయడం ఇదే తొలిసారి కావచ్చని మార్కెట్ ని గుణలు చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు సాధారణ వినియోగం పై మూడు నుంచి ఐదు రోజులపాటు ఎలాంటి సమస్య లేకుండా పవర్ సపోర్ట్ అందిస్తుంది. అయితే, ఈ భారీ బ్యాటరీని చార్జ్ చేయడానికి వీలుగా 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను కూడా ఈ ఫోన్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..
ప్రీమియం డిజైన్..
కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. ఈ స్మార్ట్ఫోన్ డిజైన్ కూడా ఎంతో ప్రీమియం గా ఉండబోతోంది. లీకైన ఫోటోల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగం డ్యూయల్ టోన్ లెదర్ ఫినిషింగ్ తో రాబోతోంది. ఇది వినియోగదారులకు ఫోన్ను పట్టుకున్నప్పుడు ఒక లగ్జరీ అనుభూతిని అందించడమే కాకుండా.. చాలా కంఫర్ట్గా ఫీల్ అవొచ్చు. దీంతోపాటు ఇది నాలుగు కలర్ ఆప్షన్స్లో విడుదల కాబోతోంది. ఫోను వెనక భాగంలో ఒక పెద్ద సర్కిల్ కెమెరా మాడ్యూల్ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన సెన్సార్తో కూడిన కెమెరాలు అందుబాటులో ఉండబోతున్నాయి.
పవర్ఫుల్ ఫీచర్లు..
ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇది 1.5K రెజ్యూల్యూషన్ కలిగిన చాలా ప్రత్యేకమైన 6.8 ఇంచుల ఫ్లాట్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని అల్ట్రా నానో బెజెల్స్ ఫోన్ స్క్రీన్ను మరింత అందంగా చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన సరికొత్త Qualcomm Snapdragon 6 Gen 5 చిప్సెట్ను వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ టాస్కింగ్తో పాటు గేమింగ్ కు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ వెనక భాగంలో ఉండే సర్కిల్ కెమెరా మాడ్యూల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అంతేకాకుండా ఈ ఫోన్ నీటిలో పడినప్పటికీ పాడవకుండా పూర్తిగా వాటర్ రెసిటెంట్తో పాటు.. కిందపడిన పగలకుండా ఉండేందుకు డ్రాప్ రెసిస్టెన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. అదేవిధంగా ఈ మొబైల్కు సంబంధించిన లాంచ్ డీటెయిల్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఈనెల చివరి వారంలో చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇది భారత మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ త్వరగా అయిపోతుందని బాధపడే వారికి.. అలాగే హెవీ యూజర్లకు ఈ మొబైల్ ఎంతగానో పనిచేస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy A27 5G: 50MP కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో సాంసంగ్ కొత్త ఫోన్.. లీకైన గెలాక్సీ A27 5G ఫీచర్లు!
Hyderabad, Telangana:Samsung Galaxy A27 5G Leaks: ప్రముఖ దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్ బడ్జెట్తో పాటు మిడ్రెంజ్ ప్రియుల కోసం ఒక సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇది సాంసంగ్ గెలాక్సీ A27 5G పేరుతో లాంచ్ కాబోతోంది. ఇటీవల చెక్ రిపబ్లిక్కు చెందిన samsung అధికారికి వెబ్సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అవడం దీనికి సంబంధించిన కీలకమైన ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ లీకవడం విశేషం. గత ఏడాది మార్చిలో విడుదలైన సాంసంగ్ గెలాక్సీ a26 5జికి అప్గ్రేడెడ్ వెర్షన్గా ఈ కొత్త మోడల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అద్భుతమైన డిస్ప్లే..
ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. సాంసంగ్ గెలాక్సీ A27 5జి స్మార్ట్ఫోన్ అద్భుతమైన 6.7 ఇంచుల ఫుల్ HD+ (1080 x 2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ (Super AMOLED) డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేతో పాటు వెనక భాగంలో ఫిల్ షీల్డ్ కెమెరా మాడ్యూయల్ని దీనికి అందించారు. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..
పవర్ఫుల్ ప్రాసెసర్..
ఈ స్మార్ట్ఫోన్లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 (Snapdragon 6 Gen 3) ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్తో పాటు గేమింగ్కు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 128gb ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులోకి రాబోతోంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తున్న ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన పవర్ బటన్ తో పాటు కుడివైపున వాల్యూమ్ కంట్రోల్స్ను కలిగి ఉండబోతుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
కెమెరా, బ్యాటరీ సామర్థ్యం..
ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో కంపెనీ వెనక వైపు ట్రిపుల్ కెమెరా అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు అదనంగా చాలా ప్రత్యేకమైన 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.. ఇక సెల్ఫీ కోసం ఎందులో కంపెనీ ముందు భాగంలో అద్భుతమైన 12 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో కంపెనీ రోజంతా బ్యాకప్ ను ఇచ్చేలా..5,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sircilla: క్లాస్రూమ్లో చీపురు పట్టిన క్లిన్ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్!
Hyderabad, Telangana:Bandi Sanjay Sircilla Visit: కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సందడి చేశారు. సరికొత్త లుక్కులో కనిపించిన ఆయన స్వయంగా క్లాస్ రూమ్లను శుభ్రం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా బిజెపి శ్రేణులు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు.. త్వరలో పాఠశాలలు మొదలు కాబోతున్న నేపథ్యంలో.. విద్యార్థులకు శుభ్రమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్రమంత్రి సందర్శించారు..
పైపుతో నీళ్లు కొట్టి.. క్లాస్రూమ్లు క్లీన్ చేసి..
సాధారణంగా మంత్రులు వస్తేనే అధికారులతో పాటు అనుచరులు హడావుడి చేయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ బండి సంజయ్ మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరించారు. పాఠశాలకు రాగానే స్వయంగా చేతిలోకి చీపిరి తీసుకున్నారు. తరగతి గదుల్లోని దుమ్ముతో పాటు దూలిని ఊడ్చేశారు.. ఆ తర్వాత వాటర్ పైపులను చేతపట్టుకుని బెంచీలతో పాటు గదులను నీళ్లతో కడిగి తల తలలాడేలా క్లీన్ చేశారు.. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా ఒక సామాన్య కార్యకర్తల ఆయన శ్రమించిన తీరు స్థానికులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు..
సిరిసిల్ల ఎస్పీపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. ఈ పర్యటనలో ఒక ఆసక్తికర రాజకీయరచ్చ కూడా చోటుచేసుకుంది.. కేంద్ర మంత్రి పాల్గొన్న ఇంత పెద్ద ప్రభుత్వ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ తో పాటు కొంతమంది పోలీస్ అధికారులు హాజరు కాకపోవడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం డిఎస్పీ మాత్రమే అక్కడ అందుబాటులో ఉండడంతో పాటు ఆయన పై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. నేనేమి ఇక్కడ సాధారణ కార్యకర్తగా రాలేదని.. కేంద్ర మంత్రి హోదాలో వచ్చినప్పుడు జిల్లా పోలీస్ బాస్ ఎందుకు హాజరు కాలేదని.. బిజెపి కార్యకర్తలతో పాటు నాయకులు అంటే ఆయనకు ఎందుకంత కోపమని బండి సంజయ్ నిలదీశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
KTRపై అంత ప్రేమ ఉంటే BRSలో చేరండి..
పోలీసు అధికారుల పక్షపాత వైఖరి పై బండి సంజయ్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీ ఎస్పీకి కేటీఆర్ పైన..బీఆర్ఎస్ పార్టీ పైన అంత ప్రేమ ఉంటే.. వెంటనే కాకి చొక్కా తీసేసి గులాబీ కండువా కప్పుకోవాలని.. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ రాజకీయ పక్షపాతం చూపించడం తగదని.. అంటూ ఘాటుగా ఎద్దేవ చేశారు.. ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్ను గౌరవించని అధికారుల తీరుపై తాము కోరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తానికి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సిరిసిల్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Plane crash: ఘోర విమాన ప్రమాదం.. మేఘనిలో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..
Hyderabad, Telangana:Ahmedabad Plane crash Video: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్ చేసినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘానిననగర్ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానాశ్రయం నుంచి ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
#PlaneCrash: Air India's AI171 (Ahmedabad- London) with around 242 passengers on board has reportedly crashed near #Ahmedabad (AMD) airport during take off.
Official confirmation awaited.#Aviation pic.twitter.com/7qmPfIwaaw
— The Chennai Skies (@ChennaiFlights) June 12, 2025
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీం లైనర్ గా సమాచారం. ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటిక కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. ఇప్పటికే ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విమానం మధ్యాహ్నం 1: 17 గంటలకు టేక్ ఆఫ్ కాగా.. 1:50 గంటలకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అని చెప్పారు. మొత్తంగా ఈ విమాన ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదంతో ఆ ప్రాంతాల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉండొచ్చని వార్తలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం మేఘానీనగర్ లో కుప్పకూలింది. సమాచారం ప్రకారం ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అక్కడ నుంచి లండన్కు బయలుదేరుతుంది.
కూలిన విమానంలో మాజీ సీఎం..?
అయితే ఈ రోజు ఈ కుప్పకూలిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: తల్లికి వందనం అకౌంట్లలోకి రూ.13,000.. మిగతా రూ.2000 కోత ఎందుకంటే?
Also Read: జియో సూపర్హిట్ ప్లాన్.. రూ.895 కే 11 నెలల వ్యాలిడిటీ పొందే ఛాన్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Karimnagar: కరీంనగర్ రైతులకు ఎరువుల కష్టం.. వానాకాలం సాగు వేళ వ్యాపారుల దోపిడీ!
Hyderabad, Telangana:Karimnagar Fertilizer Shortage Telugu News: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం వేల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలను ఎరువుల కోరతతో పాటు ధరల మాయాజాలం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న పెట్టుబడి వ్యాయాయంతో పాటు మరోవైపు నకిలీల భయంతో సతమతమవుతున్న రైతులకు.. ఇప్పుడు ఎరువుల వ్యాపారుల దోపిడీ అదనపు శాపంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 12.29 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతాంగం సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో.. ఎరువుల కృత్రిమ కోరతతో పాటు అక్రమ విక్రయాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి..
పాత స్టాక్కు కొత్త ధరలు..
మార్కెట్లోని కొత్త నిలువలు రాకముందే.. పాత స్టాకులను కొత్త ధరలకు విక్రయిస్తూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరల కంటే ఒక్కొక్క ఎరువు బస్తా పై దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించిన రైతులకు ఎరువులు లేవంటూ తెగేసి చెప్తుండడంతో.. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
యూరియా కావాలంటే.. అవి కొనాల్సిందే..
రైతులను నిలుపునా ముంచుతున్న మరో ప్రధాన సమస్య లింక్ బిజినెస్.. డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా లేదా ఇతర ముఖ్యమైన కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే.. వాటితో పాటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఇతర పనికిరాని జింక్ తో పాటు సల్ఫర్ లేదా బయో ప్రొడక్ట్స్ ను తప్పకుండా కొనుగోలు చేయాలని డీలర్లు మొండి చేస్తున్నారట.. యూరియా బస్తా కావాలంటే రూ.300 విలువ చేసే మరో మందు డబ్బాను బలవంతంగా అంటగడుతున్నారని.. దీనివల్ల వారికి అనవసరమైన ఆర్థిక భారం పెరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంతమంది రైతులు చెబుతున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
అధికారుల నిఘా కరవు..
అక్రమంగా పెంచిన ధరలకు విక్రయిస్తున్న కారణంగా.. వ్యాపారులు రైతులకు ఎలాంటి అధికారిక బిల్లులు ఇవ్వడం లేదు.. బిల్లులు అడిగితే స్టాక్ లేదని సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా పీఓఎస్ మిషన్ల ద్వారానే విక్రయాలు జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రూ.12.29 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న నేపథ్యంలో ఎరువుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని సాగుతున్న ఈ దోపిడీపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని.. ఆస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి.. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై.. లూటీ చేస్తున్న డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sarvartha Siddhi Yoga: జూన్ 15న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ 5 రాశుల వారికి దిమ్మతిరిగే ధనలాభం, బంపర్ ఆఫర్లు!
Hyderabad, Telangana:Sarvartha Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూన్ 15వ తేదీ జాల ప్రత్యేకమైనది ఎందుకంటే ఇదే రోజున ఈ సంవత్సరం మిధున సంక్రాంతి వచ్చింది. అయితే, ఈరోజు అత్యంత శుభప్రదమైన సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి అర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సర్వార్థ సిద్ధి యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి.. ముఖ్యంగా విజయాలు సాధించడమే కాకుండా ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే అనుకుంటున్నా పనుల్లో ఊహించని ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఏవైనా సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అయితే, ఈ శక్తివంతమైన యోగ ప్రభావంతో ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
మిథున రాశి
మిథున సంక్రాంతి సమయంలో ఏర్పడే సర్వార్థ సిద్ది యోగం ప్రభావంతో వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ముఖ్యంగా ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. కొత్త కాంట్రాక్టులు లేదా లాభాలకు అవకాశాలు ఉన్నాయి కుటుంబ సంబంధాలు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. దీంతోపాటు ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులందరికీ తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతాయి. ఉన్నతాధికారుల అద్భుతమైన ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే సమాజంలో గౌరవంతో పాటు పలుకుబడి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
తులారాశి
సర్వార్ధ సిద్ధ యోగంతో తులా రాశి వారికి కూడా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారాల విస్తరణకు ఈ సమయంలో అద్భుతమైన ప్రణాళికలను రచించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం పెరగడమే కాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సర్వార్ధ సిద్దయోగ ప్రభావం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అద్భుతమైన అవకాశాలని అందిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రాజెక్టులలో విజయ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంధాలు మరింత బలపడి విశేషమైన లాభాలు కలుగుతాయి.
కుంభరాశి
శని అధిపతిగా వ్యవహరించే కుంభ రాశి వారికి కూడా సర్వార్ధ సిద్ధియోగ ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో పోటీదారుల కంటే వీరు ముందుకెళ్లే అవకాశాలున్నాయి.. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా తగ్గుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kakinada: ఇన్స్టాగ్రామ్ లవ్.. భర్తను నిద్రమాత్రలిచ్చి చంపిన భార్య, 3 నెలల తర్వాత ప్రియుడు పంపిన ఒక్క మెసేజ్తో కథ అడ్డం తిరిగింది!
Hyderabad, Telangana:Instagram Affair Wife Brutally Kill Husband: ఇన్స్టాగ్రామ్ పరిచయాలు హత్యలకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియాను కేవలం సమాచారం కోసం వాడాలని అనుకునే లోపే, భార్యాభర్తలు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కూడా ఇన్స్టాగ్రామ్ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. సర్పవరం గ్రామానికి చెందిన పుల్లా దుర్గాప్రసాద్ (38)మరణంపై పోలీసులు అనుమానంతో కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్ భార్య దేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండు ఏళ్ల క్రితం గుండెకు స్టంట్లు వేయించుకోవడం వల్ల ఆయన అనారోగ్యంతో ఇంటి వద్దే ఉండేవారు. ఈ సమయంలో దేవికి బాపట్ల వ్యక్తి అయిన గోపి సాయితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. వీరు బహిరంగంగానే తిరగడం మొదలుపెట్టారు. భర్త దుర్గాప్రసాద్ అనుమానించి నిలదీసినా, దేవి తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. చివరకు భర్తను తొలగించుకోవడానికి ఆమె ఒక పథకం వేశారు. తన ప్రియుడి ద్వారా 15 నిద్రమాత్రలను తెప్పించుకుంది. మార్చి 13న ఖర్జూర జ్యూస్ లో 13 మాత్రలు కలిపి భర్తకు తాగించింది. ఆయన స్పృహ కోల్పోగానే ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత భర్తకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లింది, కానీ అక్కడ వైద్యులు మృతిని నిర్ధారించారు.
నిజం ఎలా తెలిసొచ్చినట్టంటే...
భర్త మరణం తర్వాత దేవి తన ప్రియుడితో మాట్లాడటం తగ్గించింది. దీనితో అనుమానపడిన ప్రియుడు, ఈ నెల 9వ తేదీన మృతుడి కుమార్తె ఫోన్కు వాట్సాప్ మెసేజ్ పంపాడు. అందులో 'నీ తంద్రిని మీ అమ్మే చంపింది, నిద్రమాత్రలు నేనే ఇచ్చాను' అని రాసి ఉంది. దీనితో మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితురాలిని విచారించి అసలు నిజాన్ని బయటపెట్టారు. తాను భర్తను ఎలా చంపాడో ఆమె వివరించింది. వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లు, మొబైల్ డేటా, హత్యకు వాడిన దిండు , మిగతా నిద్రమాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవి, ప్రియుడు గోపి సాయిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు.
READ ALSO: సీఐ రాజు బాగోతం.. భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను గర్భవతిని చేసి, టాబ్లెట్లు మింగించి ఘోరం!
READ ALSO: అమ్మతనానికే కళంకం.. ప్రియుడి కోసం 6 ఏళ్ల కూతురిని వాటర్ ట్యాంక్లో పడేసి అల్వాల్లో గుండెలవిసే దారుణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ రాహు కేతు పూజ
Nunna, Vijayawada, Andhra Pradesh:Mukesh Ambani Son Anant Ambani And Daughter In Law Offers Special Pooja At Srikalahasti TempleKTR: త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర పక్కా: కేటీఆర్
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:KT Rama Rao: KCR Will Start Bus Yatra Soon Ahead Assembly Elections Watch CommentsHyderabad Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. తెలంగాణ సీఎం విమానం దారి మళ్లింపు
Hyderabad, Telangana:Telangana CM Flight Diversion: మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత తెలంగాణలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక రోజు విరామంలో మరోసారి వరుణుడు దంచికొట్టాడు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరమంతటా భారీ వర్షం కురిసింది. దాదాపు గంట వరకు నిరాటంకంగా పెద్ద ఎత్తున వాన పడింది. కుండపోత వర్షం ధాటికి నగరంలోని రోడ్లన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో హైదరాబాద్లో మరోసారి జనజీవనం స్తంభించింది. ఈ వర్షం ప్రభావంతో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రాఫిక్ జామ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షం పడింది. మేడ్చల్, శామీర్పేట్, అల్వాల్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో గంటపాటు వర్షం దంచి కొట్టింది. పలు కాలనీల్లో జల ప్రవాహం పోటెత్తింది. రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మేడ్చల్ జాతీయ రహదారి 44పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్లోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉద్యోగులు ఇంటికి చేరుకున్న తర్వాత ఏకతాటిగా వర్షం పడుతుండడంతో కొద్దిగా ఉపశమనం కలిగించే విషయమైనా వివిధ పనుల మీద బయటికి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాతబస్తీలో..
హైదరాబాద్లోని పాతబస్తీలో కూడా జోరుగా వర్షం కురిసింది. పాతబస్తీ ఫలక్నుమా, బహదూర్పురా, కిషన్బాగ్, చార్మినార్, నూర్ఖాన్ బజార్, షా అలీ బందా హుస్సేనీ ఆలమ్లో భారీ వాన పడింది.
వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రి విమానం కూడా ప్రభావితమైంది. ల్యాండయ్యే అవకాశాలు లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. హైదరాబాద్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్ వస్తున్నప్పుడు మార్గమధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్కు ఏటీసీ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు.
Ambani Temple Tour: తిరుమల ఆలయంలో ముకేశ్ అంబానీ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Mukesh Ambani Visits Tirumala Temple Along With Anant Ambani And Radhika Merchant Watch VideoFood Adulteration: తిరుపతిలో దారుణం..హోటళ్లలో కుళ్లిన మాంసంతో బిర్యానీ..నాన్-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్!
Tirupati, Andhra Pradesh:Food Adulteration Tirupati: మస్త్ మస్త్ మటన్ బిర్యానీ, ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ అని హోటళ్లకు వెళ్లి లొట్టలేసుకుని తింటున్నారా? బోటీ భలేగా ఉంది.. పాయ అద్దిరిపోయిందంటూ తెగ జుర్రేస్తున్నారా? అయితే నాన్-వెజ్ ప్రియులారా.. ఒక్క నిమిషం ఆగండి! మీరు తింటున్నది తాజా మాంసం కాకపోవచ్చు, అది మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కాలకూట విషం కూడా కావచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వెలుగుచూసిన కల్తీ మాంసం దందా వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
డబ్బే పరమావధిగా భావిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్లు టన్నుల కొద్దీ కుళ్లిపోయిన మాంసాన్ని దర్జాగా హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులపై తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో అధికారులు.. నగరంలోని పెద్ద పీర్ల చావడి ప్రాంతంలో ఉన్న మటన్ మార్కెట్పై శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని చూసి అధికారులు సైతం ఒక్కసారిగా విస్తుపోయారు.
వెలుగుచూసిన షాకింగ్ నిజాలు..
పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకే తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్లు, బోటీలను ఎన్నో రోజులుగా ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చూపించడానికి కూడా వీల్లేనంతగా కుళ్లిపోయిన ఆ మాంసం నుండి కిలోమీటర్ల మేర కంపు కొడుతోంది. కొన్ని దుకాణాల్లో ఫ్రీజర్లలో గడ్డకట్టుకుపోయిన కుళ్లిన మాంసాన్ని బయటకు తీయడానికి తుప్పుపట్టిన ఇనుప చువ్వలను వాడారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
15 దుకాణాలు సీజ్..!
ఈ ఆకస్మిక దాడుల్లో భాగంగా మొత్తం 15 దుకాణాల్లో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 1,000 కిలోలకు పైగా (ఒక టన్ను) కల్తీ మటన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తూ, కల్తీ దందాకు పాల్పడుతున్న సదరు మటన్ షాపుల యజమానులపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా కల్తీగాళ్లలో మార్పు రావడం లేదు. అందుకే బయట నాన్-వెజ్ తినేటప్పుడు, కొనేటప్పుడు వినియోగదారులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం!
Also Read: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ CM పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్ల పోటీపై క్లారిటీ!
Also REad: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Remuneration Item Song: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
Hyderabad, Telangana:Highest Remuneration For Item Song: సినిమా ఇండస్ట్రీల్లో ఐటమ్ సాంగ్స్ కేవలం అభిమానులను అలరించడానికే కాదు.. కొన్నిసార్లు ఇవి సినిమా విజయానికి, మరోవైపు ప్రమోషన్లకు ప్రధాన బలంగా మారుతుంటాయి. మొన్నటి 'మున్నీ బద్నామ్ హుయీ' నుండి నిన్నటి 'ఆజ్ కీ రాత్' వరకు.. ఎన్నో పాటలు సినిమా కంటే పెద్ద హిట్గా నిలిచాయి. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రత్యేక గీతాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నిమిషాల పాట కోసం ఈ భామలు అందుకునే పారితోషికం కోట్లలో ఉంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఐటమ్ సాంగ్స్ ద్వారా భారీగా క్రేజ్, రెమ్యునరేషన్ అందుకున్న టాప్ హీరోయిన్ల వివరాలను తెలుసుకుందాం.
1) సమంత రూత్ ప్రభు - రూ. 5 కోట్లు
ఐటమ్ సాంగ్స్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా సమంత సరికొత్త రికార్డు సృష్టించింది. 'పుష్ప: ది రైజ్' సినిమాలోని 'ఊ అంటవా మావా ఊహూ అంటవా' పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమంత కెరీర్ లోనే ఇది మొదటి స్పెషల్ సాంగ్ కావడం విశేషం. కేవలం 3 నిమిషాల నిడివి గల ఈ పాట కోసం సమంతకు ఏకంగా రూ. 5 కోట్లు చెల్లించారట.
2) సన్నీ లియోన్ - రూ. 3 కోట్లు
ఐటమ్ సాంగ్స్ అనగానే సన్నీ లియోన్ పేరు మొదటగా వినిపిస్తుంది. ఆమె కెరీర్ను మలుపు తిప్పిన 'బేబీ డాల్' పాట 2010వ దశకంలోనే అతిపెద్ద హిట్ డ్యాన్స్ ట్రాక్లలో ఒకటిగా నిలిచింది. ఆమె పాపులారిటీ పీక్స్లో ఉన్న సమయంలో ఒక్కో ఐటమ్ సాంగ్కు రూ.3 కోట్ల వరకు పారితోషికం వసూలు చేసేవారని టాక్.
3) మలైకా అరోరా - రూ. 2.5 కోట్లు
బాలీవుడ్లో ఐటమ్ నంబర్ల ట్రెండ్ను పూర్తిగా మార్చేసి, దేశవ్యాప్తంగా ఊపు ఊపిన పాట 'మున్నీ బద్నామ్ హుయీ'. 2010లో వచ్చిన 'దబంగ్' సినిమాలోని ఈ పాటలో మలైకా అరోరా చేసిన మాస్ స్టెప్స్, హుక్ స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే ఈ పాట కోసం మలైకాకు రూ.2.5 కోట్లు చెల్లించారు. అయితే ఈమె 'దబంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' ఐటెంసాంగ్లోనూ నటించడం గమనార్హం.
4) కత్రినా కైఫ్ - రూ.2 కోట్లు
'అగ్నిపథ్' సినిమాలోని 'చిక్నీ చమేలీ' పాట బాలీవుడ్ క్లాసిక్ ఐటమ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. కత్రినా కైఫ్ వేసిన అద్భుతమైన మాస్ స్టెప్స్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం కత్రినా రూ.2 కోట్లు అందుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
5) నోరా ఫతేహి - రూ. 2 కోట్లు
ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆర్టిస్టులలో నోరా ఫతేహి ఒకరు. ఆమె డాన్స్తో యూట్యూబ్లో రికార్డులు సృష్టించిన 'దిల్బర్ దిల్బర్' పాట ఇప్పటికీ అందరి నోళ్లలో మారుమోగుతూనే ఉంది. ఈ వైరల్ సాంగ్ కోసం నోరాకు రూ. 2 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
6) తమన్నా భాటియా - రూ.1 కోటి
ఇటీవల 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన పాటల్లో 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' ఒకటి. తమన్నా భాటియా తన గ్లామర్, ఉత్సాహభరితమైన నృత్యంతో ఈ పాటను సినిమా కంటే పెద్ద హిట్ చేసింది. ఈ క్రేజీ సాంగ్ కోసం తమన్నా సుమారు రూ. 1 కోటి పారితోషికం అందుకుందని తెలుస్తోంది.
వీరితో పాటు 'జలేబీ బాయి' పాటతో వెండితెరపై హాట్ డ్యాన్స్తో మెప్పించిన మల్లికా షెరావత్ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ ద్వారా కోట్లాది రూపాయల పారితోషికాన్ని అందుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా చేస్తారా గురూ!
Also REad: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Rains: తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం.. వణికిన నెల్లూరు జిల్లా
Nellore, Andhra Pradesh:Rain Alert: వర్షాకాలం ఆంధ్రప్రదేశ్లో జోరందుకుంది. వర్షాకాలం ప్రారంభమే భారీ వర్షాలు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దీని ప్రభావం ఏపీపై పడింది. దీంతో తిరుమల కొండతోపాటు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ మూడు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడిన తిరుపతి నగరవాసులకు ఈ వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఊరట లభించింది. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్, లక్ష్మీపురం సర్కిల్, మాధవనగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో కాలినడకన వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఏడుకొండలపై..
తిరుమలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన జోరు వానతో తిరుమలలోని ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు.
నెల్లూరులో
తిరుమల, తిరుపతితోపాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
DA HIKE 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DA పెంపుపై MODI సర్కార్ కీలక నిర్ణయం.. సాలరీ ఎంత పెరుగుతుందంటే?
Secunderabad, Telangana:DA HIKE 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వేతనాలు సవరించేందుకు ఎనిమిదవ పే కమిషన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి దాదాపు 6 నెలల సమయం గడిచింది. మరో ఏడాది కాలంలోగా 8వ పే కమిషన్ సంబంధించి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులే ఇంకా అమలు అవుతున్నాయని చెప్పాలి.
అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి డీఏ పెంపుదల ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. 2026 ఏడాదికి సంబంధించిన మొదటి డి ఏ రెండు శాతం పెంచుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం డిఏ 58శాతం నుంచి 60శాతానికి చేరుకుంది. డీఏ అంటే డియర్ నెస్ అలవెన్స్ అని అర్థం. పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఉద్యోగులకు డిఏ.. పెన్షనర్లకు డిఆర్ చెల్లిస్తుంటారు.
2026 సంబంధించి ఇప్పటికే ఒక దఫా డి ఏ చెల్లించారు. అయితే మొత్తం 58% గా ఉన్న డి ఏ 60 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 18వేల రూపాయల వేతనం పొందే ఒక ఉద్యోగి అదనంగా 360 రూపాయల వేతనం పెరుగుతుంది. ఈ లెక్కన ఆరు నెలలకు గాను గమనిస్తే 2610 రూపాయలు అదనంగా లభిస్తాయి. ఇక రెండో దఫా కిందా జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు వర్తించే డి ఏను మరో మూడు శాతం పెంచినట్లయితే అప్పుడు డిఏ 60% నుంచి 63 శాతానికి పెరుగుతుంది .
ఈ లెక్కన గమనిస్తే 18 బేసిక్ వేతనం లభించే ఉద్యోగికి మూడు శాతం డి ఏ పెంచినట్లయితే నెలకు 540 రూపాయలు అదనంగా లభిస్తాయి. అంటే దీని ఆరు నెలల మొత్తానికి లెక్కించినట్లయితే 5400 అవుతుంది. మరోవైపు 8వ పే కమిషన్ సంబంధించి తమ విజ్ఞప్తులను కమిషన్కు తెలియజేసేందుకు జూన్ 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్పటివరకు ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఎనిమిదవ పే కమిషన్ కి తెలియజేయడానికి అవకాశం ఉంది.
అయితే ఇది అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే ఛాన్స్ ఉంది. ఎలాంటి మెమొరండంలో స్వీకరించేందుకు కమిషన్ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ తెలియజేస్తూ ఎనిమిదో వేతన సంఘానికి ఆన్లైన్ ద్వారా మెమోరండమ్స్ పంపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగ సంఘాలు ఈసారి వేతన విషయంలో గట్టిపట్టు పడుతున్నాయి. ఏడవ వేతనం సంఘం సిఫారసు చేసిన 2.57 కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని పెద్దెత్తునా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మరి వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: ఇంటిని నడిపే మహిళలు దేశ నిర్మాతలు .. కోర్టు వ్యాఖ్యలు వింటే గర్వపడతారు..!!
Also Read: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
