బోయిన్ పల్లి: సాయిబాబా ఆలయంలో మల్లారెడ్డి పూజలు
Boyapalle, Telangana:బోయిన్ పల్లి లోని జయ నగర్ లో ఉన్న సాయిబాబా ఆలయాన్ని గురుపౌర్ణమి సందర్భంగా మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
KT Rama Rao: మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Press Meet: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులతో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మా ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఒక్క రూల్, తమకు ఒక రూలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టక మీద మాట్లాడితే మొదటిగా కేసీఆర్ ఖండిచారని గుర్తుచేశారు.
Vijayasai Reddy: విజయసాయి రెడ్డి కీలక ప్రకటన.. దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ
Vijayawada, Andhra Pradesh:Vijayawada: 'విజయదశమి' తర్వాతి రోజే పార్టీ వివరాలు ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తమది ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు. యువతతో కలిసి పార్టీని స్థాపిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని.. తన శత్రువు కాదని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా తానేమీ పార్టీని పెట్టడం లేదని స్పష్టం చేశారు.
విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీపై కీలక విషయాలు వెల్లడించారు. దసరా పండుగ తర్వాత రాజకీయ పార్టీ ప్రకటిస్తానని తెలిపారు. 'ఇంకా నాలుగు ప్రెస్మీట్లు నిర్వహిస్తా. తదుపరి అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో ప్రెస్మీట్లు ఉంటాయి. ప్రెస్మీట్ల అనంతరం కాంక్లేవ్ నిర్వహించి పార్టీ జెండా, అజెండా, పేరు ప్రకటిస్తా' అని విజయసాయి రెడ్డి వెల్లడించారు.
'నేను ప్రజా సొమ్ము దోచుకుని ఉంటే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి నాపై విచారణ వేయండి.. దేనికైనా నేను సిద్ధం' అని కూటమి ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి సవాల్ చేశారు. తన ఇమేజ్ ఏమిటో మూడు సంవత్సరాల్లో తెలుస్తుందని చెప్పారు. టీడీపీ, వైఎస్సార్సీపీ తనకు ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కాదని ప్రకటించారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి వెళ్తామని తెలిపారు. తనది మతతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు.
'గుంటూరులో జరిగింది కూడా కచ్చితంగా లవ్ జిహాద్. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. నేను ప్రారంభించబోయే పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ తరహా ట్రీట్మెంట్ ఉంటుంది. నా మీద వచ్చే విమర్శలకు నేను కౌంటర్ ఇచ్చుకోగలను' అని విజయసాయి రెడ్డి తెలిపారు. తన పొలిటికల్ గాడ్ ఫాదర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలేనని చెప్పారు. ప్రతి ప్రభుత్వంలో బలవంతపు, ప్రలోభపు మత మార్పిడిలు ఉంటాయని పేర్కొన్నారు. తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని విజయసాయి రెడ్డి ప్రకటించారు. త్వరలో పాదయాత్ర చేస్తానని.. 660 మండలాల్లో ప్రజల మధ్య పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. అడవుల్లో, రోడ్ల మీద గిన్నీస్ బుక్ రికార్డు కోసం పాదయాత్ర చేయనని పరోక్షంగా వైఎస్ జగన్కు కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో తనకు ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో 'మన శంకర వరప్రసాద్' నటి, ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్! లండన్ వీసాల పేరుతో భారీ ఫ్రాడ్!
Hyderabad, Telangana:YouTuber Nandus World Nandana Arrest: 'మన శంకర వరప్రసాద్' సినిమాలో నటించిన నటి రమా నందనను, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. లండన్లో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ల పేరుతో మోసం చేశారని ఆమెపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈమె ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నందన. ఇప్పటికే ఆమెపై కేసు నమోదవ్వడమే కాకుండా, లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
'నందుస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్ ద్వారా రమా నందన తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కానీ ఆమె తన భర్త మధుకర్తో కలిసి యూకేలో ఉద్యోగాల కోసం వీసా స్పాన్సర్షిప్ పేరుతో భారీగా మోసం చేసినట్లు పలువురు మీడియా ముందుకు వచ్చి, ఛానల్ల వద్ద కూడా వాపోయారు. సుమారు 100 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.15 నుండి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తోటి యూట్యూబర్లు కూడా వీరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ కొత్తూరుకు చెందిన శివ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తాము మోసపోయామని చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు, అయితే రమా నందన, ఆమె లాయర్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు.
యూకేలో ఉద్యోగాల పేరిట భారీ మోసం.. నందూస్ వరల్డ్ ఫ్యామిలీ ఫైనల్గా స్పందన! ఫుల్ స్టోరీ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ishan Kishan Double Century: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..
Hyderabad, Telangana:Ishan Kishan Double Century News: భారత్లో ప్రస్తుతం జరుగుతున్న డొమెస్టిల్ లీగ్ దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తోంది. ఈ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తుండగా.. ప్రత్యర్థి సౌత్ జోన్ టీమ్పై మొదటి రోజు అద్భుతంగా రాణించింది. మొదటి రోజు ఆట ముగిసేనాటికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల పటిష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. తన అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకదాన్ని ప్రదర్శించిన కెప్టెన్ పుణ్యమా అని, ఈ ఆధిక్యం మరింత పెరిగింది.
ఈస్ట్ జోన్ టీమ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మొదటి రోజు క్రీజులోకి వచ్చి, రెండవ రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అతను 301 బంతుల్లో 250 పరుగులు చేసి, దులీప్ ట్రోఫీ చరిత్రలో 12వ అత్యధిక పరుగుల ఇన్నింగ్స్గా నిలిచాడు. 1987 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్పై నార్త్ జోన్ తరఫున 320 పరుగులు చేసిన రామన్ లంబా ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు.
అయితే ఇప్పుడు 250 పరుగులతో ఇషాన్ కిషన్.. డబ్ల్యూవీ రామన్తో కలిసి 12వ స్థానాన్ని పంచుకున్నాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత గేర్ మార్చాడు. అలసట కారణంగా రిటైర్డ్ హర్ట్గా నిష్క్రమించాడు.
ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్లో 34 బౌండరీలు సాధించగా, వాటిలో 27 ఫోర్లు ఉన్నాయి. అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి ఆడినప్పటికీ, బ్యాట్తో చరిత్ర సృష్టించడంలో విఫలమైనప్పటికీ, అతని జట్టు ఈస్ట్ జోన్కు ఇప్పుడు రికార్డుల పుస్తకాలను మార్చే అవకాశం లభించింది.
దులీప్ ట్రోఫీలో అత్యధిక జట్టు స్కోరు 868, దీనిని 1987లో నార్త్ జోన్ నమోదు చేసింది. ఈ వార్త రాసే సమయానికి, ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో 626 పరుగులు చేసింది. ఈ రికార్డుకు దగ్గరగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజ్లో లేకుండా.. ఇంతటి టార్గెట్ను సాధించడం ఇది సవాలుగా మారవచ్చు.
28 ఏళ్ల కిషన్ పేరిట కేవలం రెండు టెస్ట్ అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. అతని చివరి రెడ్ బాల్ (టెస్టు) మ్యాచ్ జూలై 2023లో వెస్టిండీస్తో జరిగింది అతన్ని ఎంపిక చేయని సెలెక్టర్లందరికీ అతని దులీప్ ట్రోఫీ ఫైనల్ ప్రదర్శన ఒక గట్టి సమాధానం కావచ్చు.
Also REad: India Vs Japan: జపాన్తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్..భారత్కు ఇన్ని లాభాలా?
Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్లో హై-వోల్టేజ్ మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: 'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం': వేముల ప్రశాంత్ రెడ్డి
Hyderabad, Telangana:Telangana Bhavan: 'తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న కేటీఆర్ను పోలీసులు కింద వేసి పోలీసులు తొక్కింది తెలంగాణ మొత్తం చూసింది. చిల్లర దౌర్జన్యకాండ రేవంత్ రెడ్డి చేశాడు' అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం అని తెలిపారు. 'రేవంత్ రెడ్డి బడువే మాటలు టీ షర్ట్స్పై లేదు. కింద పడేసి తొక్కుతాని రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషలేదు' అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.
'రాహుల్, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మోడీ అదానీ టీషర్ట్స్ వేసుకున్నారు. రాహుల్ గాంధీ ఒక న్యాయం కేటీఆర్, హరీశ్ రావుకు ఒక న్యాయమా?' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. 'శాంతియుత మార్గంలో మేము నిరసన తెలిపాం. మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు పోలీసులు నొక్కారు. ఇదేనా ప్రజా పాలన అంటే?' అని నిలదీశారు. సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారని.. తోపులాటలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి సంజయ్ కిందపడ్డారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.
'భౌతికంగా కేటీఆర్పై దాడి చేశారు. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. బ్లాక్ టీషర్ట్స్ రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు. పచ్చ టీ షర్ట్స్ వేసుకొని వస్తే రేవంత్ రెడ్డికి మంచిదేమో' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయం చేస్తున్నాడని.. రేవంత్ రెడ్డి కంటే శిఖండి నయం విమర్శించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను అపహాస్యం చేస్తున్నారు. మమ్మల్ని అవమానించినట్టే కేసీఆర్ను అవమానించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి బండారం బయటపడుతుంది' అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
'బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వడం లేదు. అసెంబ్లీ బయట రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. రెండు సార్లు నన్ను వాహనంలో ఎత్తేశారు. ఇంతటి గుండాగిరి ఎన్నడు చూడలేదు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తాము కేసీఆర్ సైనికులం.. భయపడేది లేదని ప్రకటించారు. బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే తమను అడ్డుకున్నారని.. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు.
'తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ములాఖాత్ ప్రజలకు అర్థమైంది. మేము బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. బీజేపీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు. రేవంత్ రెడ్డి పొద్దున కాంగ్రెస్ తో సాయంత్రం బిజెపితో ఉంటాడు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Revanth Reddy: కమ్యూస్టుల పోరాటం చేస్తే.. కాంగ్రెస్ పరిష్కారం చూపిస్తుంది: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Hyderabad: 'మనమంతా కలసి దేశంలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు కొత్త కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. సర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యం చేసుకున్నారు. తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో చేసినట్లే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని తెలిపారు.
హైదరాబాద్లోని రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటు' అని తెలిపారు. సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరని చెప్పారు. కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారని గుర్తుచేశారు.
'భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్సైక్లోపీడియా సారంపల్లి. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యలను మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమిలేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడారని.. కనీస వేతన చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దున్నేవాడికి భూమికోసం కమ్యూనిస్టులు పోరాడారని చెప్పారు.
'అసైన్డ్ భూములను 24 లక్షల 56 వేల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయి. ఇది కమ్యూస్టుల పోరాటానికి .. కాంగ్రెస్ పరిష్కారం. ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆహార భద్రతా చట్టం కాంగ్రెస్ తీసుకొచ్చింది. కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించింది' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో కలిసినా కలవకపోయినా.. కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందని చెప్పారు.
'గత ఎన్నికల్లో బూత్ల వారీగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. 'ఎన్నికలు వేరు.. పేద ప్రజల ప్రాథమిక హక్కులు వేరు. ఇన్నాళ్లుగా పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారు. ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా' అని రేవంత్ రెడ్డి చెప్పారు. 'దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు. పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేబినెట్ సహచరులతో చర్చించి.. సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు.
Bigg Boss Telugu 10 Salaries: బిగ్బాస్లో రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా? వారానికి లక్షల్లో సంపాదన..ఆ ఇద్దరికే ఎక్కువ!
Hyderabad, Telangana:Bigg Boss Telugu 10 Contestants Salaries: బిగ్ బాస్ హౌస్కి వెళ్లడం.. అక్కడ గెలవడం ఏమో కానీ.. ఒక్కసారి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుందని చాలామంది అంటుంటారు. కేవలం షో నిర్వాహకులు ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ ద్వారా లభించే విపరీతమైన క్రేజ్, పర్సనల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్స్ వ్యూవర్ షిప్ పెరిగి చేతినిండా సంపాదనతో లైఫ్ స్థిరపడుతుందని నమ్ముతారు.
ఇప్పటివరకు ఓటీటీతో కలుపుకుని 11 సీజన్లు (దాదాపు 220 మంది కంటెస్టెంట్స్) పూర్తయినప్పటికీ, విజేతలతో సహా చాలామంది ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారనేది కూడా నిజం. అయినప్పటికీ, ఈ షో ఇచ్చే పారితోషికాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి.
కంటెస్టెంట్ల భారీ పారితోషికాలు
ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10లో మొత్తం 16 మంది సభ్యులు అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. వీరి రెమ్యూనరేషన్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్గా 'జబర్దస్త్' రాంప్రసాద్ నిలిచారు. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా వారానికి ఏకంగా రూ.4.5 లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం. ఆ తర్వాతి స్థానంలో ప్రముఖ యాంకర్ వర్షిణి నిలిచారు.
ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్న వర్షిణికి వారానికి రూ. 3.5 లక్షలు ఇస్తున్నారు. గత మూడు నాలుగు సీజన్ల నుండి బిగ్ బాస్ టీమ్ సంప్రదిస్తున్నా నో చెప్పిన వర్షిణి, ఈ సారి భారీ ఆఫర్తో అంగీకరించింది. 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో ముఖేష్ గౌడకు కూడా వారానికి రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు అందుతున్నట్లు సమాచారం.
ఇతర సెలబ్రిటీల పారితోషికాలు పరిశీలిస్తే, నటి దేబ్జానీ మోదక్ వారానికి రూ. 2.75 లక్షలు, నటుడు త్రిగుణ్ (ఆదిత్) రూ. 2.75 లక్షలు పొందుతున్నారు. 'జబర్దస్త్' నరేష్, నటి చైత్రా రాయ్లు వారానికి రూ.2.5 లక్షల చొప్పున అందుకుంటున్నారు. ఇక 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు, టెంపర్ వంశీలు వారానికి రూ. 2 లక్షల చొప్పున తీసుకోగా, యాంకర్ సుధీర్ రెడ్డికి వారానికి రూ. 1.25 లక్షలు చెల్లిస్తున్నారు.
సామాన్యులకు జాక్పాట్ ఆఫర్
ఈ సీజన్లో సామాన్యులకు (కామనర్స్) కూడా మంచి ఆఫర్ దక్కింది. గత సీజన్ 'అగ్నిపరీక్ష' సమయంలో ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు. కానీ ఈసారి అగ్నిపరీక్షకు హాజరైన 15 మందికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున చెల్లించారు. అలాగే హౌస్లోకి ప్రవేశించిన ఆరుగురు సామాన్యులకు గత సీజన్ తరహాలోనే వారానికి రూ.70,000 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. సెలబ్రిటీలతో సమానంగా క్రేజ్ పొందేలా ఈ సారి సామాన్యులు కూడా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు.
Also Read: బిగ్బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్ప్రైజ్లతో 16 మంది కంటెస్టెంట్లు!
ALso REad; బిగ్బాస్ హౌస్లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో తొలిసారిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Assembly Session: తాతా మధును తొలగించాలి.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: రేవంత్ రెడ్డి
Baddipadaga, Telangana:MLC Thatha Madhu: 'సభ సంప్రదాయాలకు విలువ ఇవ్వాలి. ప్రతి సభ్యుడి గౌరవానికి భంగం కలిగించడం అంశం ఇది. స్పీకర్ ఛాంబర్ అంటే ఎనలేని గౌరవం ఉంది. చట్టసభ ఏదయినా స్పీకర్ పోస్ట్ అనేది గౌరవం ఉండేది. సభ్య సమాజం కించపర్చే విధంగా మట్కాడిన తీరుపై ఇక్కడ చర్చ ఇది. వారి అపవాదును మీరు ఎందుకు మోస్తున్నారు? మీ చర్చను బీఏసీలో మాట్లాడండి. కచ్చితంగా అవకాశం ఉంటది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. వారి నాయకుడు ఇలా మాట్లాడాలని చెప్పి పంపించాడా? అనాలోచితంగా మాట్లాడటం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. సభ్య సమాజం ఇబ్బందిపడేలా.. వాడలేని భాష వాడి ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధుపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానం ప్రవేశపెట్టగా రేవంత్ రెడ్డి ప్రసంగం చేశారు. 'వారి పార్టీ నాయకుడు దళితుల ఓట్లు వాడుకొని నమ్మించి మోసం చేసిన చరిత్ర వారిది. డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్న తాటికొండ రాజయ్యను పీకేశాడు. దళిత బంధు ఇవ్బకుండా మోసం చేశాడు. నేరెళ్ల ఘటనలో దాఁకితులను లారీలతో తొక్కించాడు' అని రేవంత్ రెడ్డి వివరించారు. సీఎల్పీ నాయకుడిగా ఉండడం ఇష్టం లేక ఏ రకంగా చేసాడో మనం చూశామని తెలిపారు. 'ఇలా ఎన్నో రకాలుగా దళితులను మోసం చేశాడో చూశాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఇలా వినలేదు. ఇలాంటి వ్యక్తులను శాశ్వతంగా సభ్యత్వాలను రద్దు చేయాలి' అని రేవంత్ రెడ్డి చెప్పారు.
'అన్నీ సభల్లో చూశాను 20 ఏళ్లలో ఎక్కడ చూడలేదు, రాజ్యసభ తప్ప అన్నిటిలో చేశా. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. సభ్యుడి చేత రాజీనామా చేయించాలి. మండలి చైర్మన్కు కూడా సూచిస్తున్నా. తొలింగించేలా నిర్ణయం తీసుకువాలని సూచిస్తున్నా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
పొన్నం ప్రభాకర్
అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. 'సభాపతిపై అనుచిత వ్యాఖ్యలపై వారి ప్రవర్తనపై సభలో చర్చ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. బీజేపీలో ఒక దళిత ఎమ్మెల్యేలు ఎవరు లేకపోతే దళితులకు ఏమి అయినా మాకు సంబధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 14 సార్లు గెలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేసిన సంస్కృతి బీజేపీది' అని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించే పరిస్థితి లేదని తెలిపారు. 'బీజేపీది ఫ్యూడలిస్ట్ పార్టీ.. మనువాద పార్టీ' అని విమర్శించారు.
KTR Harish Rao Black Shirt: కేటీఆర్ తలకు గాయం..హరీశ్ రావు చొక్కా ఊడగొట్టారు..తెలంగాణ అసెంబ్లీలో రణరంగం!
Hyderabad, Telangana:KTR Harish Rao Assembly Black Shirt: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాట, రణరంగం లాంటి వాతావరణంలో కేటీఆర్ తల, నుదురు, చేతికి గాయలైనట్లు తెలిపారు. హరీశ్ రావు, మరికొందరు శాసనసభ్యుల చొక్కాలు చిరిగిపోయాయి. ఈ క్రమంలో కేటీఆర్ గాయాల కోసం సూదిమందు తీసుకున్నారు.Harish Rao Black Shirt: బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావుకు తీవ్ర అవమానం..షర్ట్ లేకుండా ఈడ్చుకెళ్లారు!
Hyderabad, Telangana:Harish Rao Black Shirt Protest: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద నిరసన చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నల్ల చొక్కాను విప్పించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకెళ్లినట్లు ఆ నేతలు ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Ganesh Chaturthi 2026: వినాయక చవితి 2026 ఎప్పుడు జరుపుకోవాలి? సెప్టెంబరు 14 లేదా 15? తిథి, పూజా సమయం ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Ganesh Chaturthi 2026 Timing: భారతీయుల సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యమైనది. పార్వతీపరమేశ్వరుల చిన్న కుమారుడైన విఘ్నేశ్వరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, పూజలకు ఏ సమయం ఉత్తమమైనది అనే విషయాలపై భక్తులలో కొంత క్లారిటీ లేకుండా సందేహాలు నెలకొన్నాయి.
ఈ ఏడాది వినాయక చవితి తిథి వివరాల్లోకి వెళితే.. భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 7:06 గంటల (AM) నుండి ప్రారంభమై, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 7:44 గంటల (AM) వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ తిథి సమయం కారణంగా 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను భక్తులు రెండు రోజుల పాటు జరుపుకునే అవకాశం లభించింది.
అయితే, అత్యధిక శాతం మంది భక్తులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజునే ఈ పవిత్ర పండుగ పూజలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే వినాయక బొమ్మలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తమ ఇళ్లకు, పూజా మండపాలకు తరలిస్తున్నారు.
ఈసారి పండుగ సోమవారం రోజున రావడం భక్తులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం కలుపుకొని వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభించాయి. దీనితో పండుగ వాతావరణం అంతటా మరింత ఉత్సాహంగా మారనుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 14వ తేదీన పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 7:44 గంటల వరకు తిథి అందుబాటులో ఉన్నందున, ఆ రోజు ఉదయం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు.
సాధారణంగా సెప్టెంబర్ 14న వినాయక ప్రతిమలను నిలిపి నాటి నుండి దాదాపు 11 రోజుల పాటు నిత్యం అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ భాద్రపద మాసం మొత్తం గణపతి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ మాసంలో గణేశ్ చతుర్థి రోజు నుండి ప్రారంభించి అనంత చతుర్దశి తిథి వరకు భక్తులు నిరంతరాయంగా గణనాథుడిని పూజిస్తూ ఉంటారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే అందించారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.
Also Read: 300 యేళ్ల తర్వాత అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. లగ్జరీ లైఫ్ వీళ్ల
Also Read: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం! ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Harish Rao Black Shirt: తెలంగాణ అసెంబ్లీలో రణరంగం..కేటీఆర్ తలకు గాయం..ఉద్రిక్తతలో చిరిగిన హరీశ్ రావు చొక్క!
Hyderabad, Telangana:KTR Harish Rao Assembly Black Shirt: అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ఉద్రిక్తత, తోపులాట తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ వైఫల్యాలను నిరసించేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా నల్ల టీషర్టులను ధరించి బయలుదేరింది.
ఈ దుస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని ఆరు గ్యారంటీలపై విమర్శనాత్మక నినాదాలు ముద్రించి ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ప్రవేశ ద్వారం (గేట్ నంబర్ 1) వద్ద పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలిపివేశారు. నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లడం శాసనసభ నిబంధనలకు విరుద్ధమని పోలీసులు స్పష్టం చేస్తూ వారిని నిలువరించారు. నిరసనకారుల అరెస్టుతో లక్డీకాపూల్ పరిసర ప్రాంతాలు స్తంభించిపోగా, అసెంబ్లీ లోపల బీజేపీ భూ దందాలపై విచారణ డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగింది.
రోడ్డుపై బైఠాయింపు, నిలిచిపోయిన రవాణా వ్యవస్థ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 1 వెలుపల ప్రధాన రహదారిపైనే వారంతా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో లక్డీకాపూల్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, ఖైరతాబాద్ వంటి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, సాధారణ ప్రజలు కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బలప్రయోగం, గాయాలు, తీవ్ర నిరసనలు రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు చివరికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ప్రతినిధులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి సమీపంలోని స్టేషన్లకు తరలించారు. ఈ తోపులాట ప్రక్రియలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల, నుదురు, చేతికి స్వల్ప గాయాలైనట్లు చెప్పుకొచ్చారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు, మరికొందరు సభ్యుల చొక్కాలు చిరిగిపోయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వారి ఎంపీలు నల్ల టీషర్టులు ధరించి తిరగవచ్చని, కానీ ఇక్కడ తమను నిరోధించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు సైతం 22ఏ భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది.
Also REad: Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్ షాక్!
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mary Kom Bigg Boss: బిగ్బాస్ హౌస్లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో ఇదే తొలిసారి!
Hyderabad, Telangana:Mary Kom Bigg Boss 20: దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించే ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఒకేరోజు ఐదు విభిన్న భాషల్లో బిగ్ బాస్ సీజన్లు అత్యంత వైభవంగా ల్యాంచ్ అయ్యాయి. ఈ ప్రారంభోత్సవాలలో భాగంగా తెలుగు బిగ్బాస్ సీజన్ 10 హౌస్లోకి 16 మంది కంటెస్టెంట్లను హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్బాస్ ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. అదే సమయంలో.. తమిళం నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి కిచ్చా సుదీప్, మలయాళం నుంచి మోహన్ లాల్ వారివారి బిగ్బాస్ సీజన్ లాంచ్ సందర్భంగా అందరూ కలిసి వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఇది సంఘటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 20 కూడా ఎంతో వైభవంగా ప్రారంభమైంది. అయితే, ఈ సీజన్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, భారతదేశపు మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించడం. మేరీ కోమ్ హౌస్లోకి ప్రవేశించిన విధానం ఎంతో ప్రత్యేకంగా సాగింది. ఈ వేడుకకు ఆమె కుమారుడు స్వయంగా విచ్చేసి, బిగ్ బాస్ సెట్ వద్ద తన తల్లికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ రియాలిటీ షోలో పాల్గొనడంపై మేరీ కోమ్ బిగ్ బాస్ వేదికపై మాట్లాడుతూ.. "గృహిణిగా ఉండటం నా వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన భాగం" అని ఎంతో వినమ్రంగా చెప్పారు. అథ్లెట్గా బాక్సింగ్ రింగ్లో అద్భుత విజయాలు సాధించిన ఆమె, ఇప్పుడు రియాలిటీ టీవీ స్టార్గా ఒక సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. ఈ కొత్త పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో మనం వేచి చూడాలి. ఈ షోలో ఆమె తన వ్యక్తిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుందో చూడటం అత్యంత ఆసక్తికరంగా మారింది. హౌస్లో మేరీ కోమ్ వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను ప్రజలు తెలుసుకుంటారు, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆమెను ఏ కోణం నుండి ఇంటికి పంపారో దాని ఆధారంగా ప్రేక్షకులు ఆమె అసలు వ్యక్తిత్వాన్ని గమనించవచ్చు.
మేరీ కోమ్ హౌస్లోకి ప్రవేశించిన శుభ తరుణంలో, ప్రియాంక చోప్రా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సాధించిన విజయవంతమైన ప్రయాణానికి గాను బిగ్ బాస్ స్వయంగా ఆమెను అభినందించింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అభినందనల వీడియోను వేదికపై అందరికీ చూపించారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన మేరీ కోమ్ను స్వదేశంలో తక్కువ అంచనా వేయలేము. దేశం కోసం పోరాడిన ఈ వీరనారి, రింగ్ వెలుపల కూడా విజయం సాధించగలదని ఆశిద్దాం.
Also Read: బిగ్బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్ప్రైజ్లతో 16 మంది కంటెస్టెంట్లు!
Also Read: భారత వెయిట్లిఫ్టర్ కీయా బెనర్జీకి చేదు అనుభవం.. నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vande Bharat Tirupati: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇప్పుడు తిరుపతికి మరో వందే భారత్ రైలు!
Tirupati, Andhra Pradesh:Vande Bharat Shivamogga Tirupati: తిరుమలకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే సర్వీసులను పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు ఎప్పుడూ ప్రయాణికులతో నిండిపోతోంది. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రాల నుండి కూడా సర్వీసులను పెంచాలనే వినతులు భారీగా వచ్చాయి. ఈ ప్రజాప్రతినిధుల వినతుల మేరకు రైల్వే శాఖ శివమొగ్గ టౌన్ - తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసింది.
తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కర్ణాటక నుండి కొత్త వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని తిరుపతి ఎంపీ రైల్వే బోర్డు చైర్మన్కు లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించి, తగిన ప్రతిపాదనను రూపొందించిందని ప్రకటించారు. ఈ విషయాన్ని ఎంపీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, రైల్వే బోర్డు చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రైలు మార్గం, ప్రయోజనాలు..
ఈ కొత్త వందే భారత్ రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ లో బయలుదేరి బిరూర్, అర్సికెరే, కేఎస్ఆర్ బెంగళూరు, కాట్పాడి మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం సమయంలో శివమొగ్గ టౌన్ లో బయలుదేరే విధంగా అధికారులు షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు ప్రకటన ద్వారా ముఖ్యంగా బెంగళూరు, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. వచ్చే నెలలోనే ఈ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.
ఈ కొత్త రైలుతో పాటు ఆంధ్రప్రదేశ్ భక్తులకు మరో తిరుగులేని గుడ్ న్యూస్ కూడా ఉంది. విశాఖపట్నం నుండి తిరుపతి మధ్య అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైలును కూడా త్వరలోనే ప్రవేశపెట్టేలా రైల్వే శాఖ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. దీనివల్ల సుదూర ప్రాంతాల భక్తులకు కూడా తిరుమల యాత్ర మరింత సులభతరం, సుఖమయం కానుంది.
Also Read: భరోసా పెన్షన్లకు ముహూర్తం ఖరారు..కొత్త పింఛన్ల కోసం కొత్త దరఖాస్తు ఆ రోజు నుంచే?
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandhu Singh 5 Girlfriends: 63 ఏళ్ల వయసులో ఐదుగురు ప్రియురాళ్లు..ఇద్దరు గర్భవతులు..డబ్బు కోసం గజదొంగగా మారిన తాత!
New Delhi, Delhi:Bandhu Singh 5 Girlfriends News: సాధారణంగా వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటారు. కానీ, 63 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఏమాత్రం మారకుండా, విలాసాల కోసం దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు ఒక వృద్ధుడు. తనకున్న ఐదుగురు ప్రియురాళ్ల సరదాలు తీర్చడానికి, వారి ఖరీదైన ఖర్చులను భరించడానికి దొంగగా మారిన ఈ తాత కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల అరెస్టు అయిన ఒక దొంగను 63 ఏళ్ల బంధు సింగ్గా అధికారులు గుర్తించారు. పోలీసుల విచారణలో బంధు సింగ్ గురించి వెల్లడైన వివరాలు విని స్వయంగా పోలీసు అధికారులే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బంధు సింగ్కు ఐదుగురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఈ విచారణలో తేలింది. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, తన ఉంపుడుగత్తెలతో సరదాగా గడపడం కోసం అతను దొంగతనాల బాట పట్టాడు.
బంధు సింగ్ ప్రియురాళ్లు అత్యంత విలాసవంతమైన, ఖరీదైన జీవనశైలిని కోరుకునేవారు. వారి కోరికలను తీర్చడానికి, వారి ఖరీదైన ఖర్చులను భరించడానికి అతనికి నిత్యం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమయ్యేది. కానీ అతనికి ఎటువంటి సరైన ఆదాయ వనరు లేదు. దీంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు.
తన ప్రియురాళ్ల ఖర్చుల కోసం బంధు సింగ్ ప్రతిరోజూ ఏదో ఒక ఇంట్లోకి లేదా దుకాణంలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడేవాడు. రాత్రి పూట అత్యంత కుయుక్తితో పక్కా పథకాలు వేసి, విభిన్న ప్రాంతాలలో నిరంతరం దొంగతనాలు చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
ఈ కథలో మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే, బంధు సింగ్ ఐదుగురు ప్రియురాళ్లలో ఇద్దరు గర్భవతులై పిల్లలను కూడా కన్నారు. దీంతో ఆ పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులతో పాటు, ప్రియురాళ్ల వివిధ రకాల విలాసవంతమైన కోరికలను తీర్చడానికి అతనికి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. అందుకే అతను ప్రతిరోజూ చాలా తెలివిగా, కుయుక్తితో దొంగతనాలు చేస్తూ సాగాడు.
చివరకు ఈ నిత్య దొంగల తాత పోలీసుల నిఘాకు చిక్కి అరెస్ట్ అయ్యాడు. బంధు సింగ్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా, అతని విలాసవంతమైన జీవనశైలి, దొంగతనాల వెనుక ఉన్న ఐదుగురు ప్రియురాళ్ల అసలు రంగు వెలుగులోకి వచ్చింది. చిన్న వయసు నుంచే దొంగతనాలకు పాల్పడుతున్న బంధు సింగ్, వయసు పైబడిన తర్వాత కూడా అదే దారిలో కొనసాగాడు. ఈ తాత వింత జీవనశైలి, అతని నేరాల కథ ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గతంలో ఎప్పుడో జరిగినదే అయినా.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ వార్త మరోసారి వైరల్గా మారింది.
Also Read: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం..19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!
Also REad: భరోసా పెన్షన్లకు ముహూర్తం ఖరారు..కొత్త పింఛన్ల కోసం కొత్త దరఖాస్తు ఆ రోజు నుంచే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
