icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

80th Independence Day Speech: రోమాలు నిక్కబొడుచుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..

Hyderabad, Telangana:

80th Independence Day Speech 2026 In Telugu: ఈ సంవత్సరం మనమంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.. ఈ రోజున ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎంతో ఘనంగా స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటారు. ఇక పాఠశాలల్లోనైతే చెప్పనక్కర్లేదు.. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు చాలామంది విద్యార్థులు బహుమతులు పొందేందుకు వేడుకల్లో ప్రత్యేకమైన స్పీచ్ లు కూడా ఇస్తారు. మీరు కూడా దేశభక్తిని పెంపొందించడానికి మంచి స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ స్పీచ్ మీకోసమే..

అందరికీ గుడ్ మార్నింగ్.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం.. మరి ఎందరు వీరులు రక్తాన్ని ధారపోసి సాధించిన ఈ స్వాతంత్రమే ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాము.. బ్రిటిష్ పాలకుల సంఖ్యల నుంచి దేశానికి విముక్తి కల్పించడం కోసం చాలామంది ఉరికోయ్యాలను నవ్వుతూ ముద్దాడారు.. ముఖ్యంగా భగత్ సింగ్ తో పాటు రాజ్‌గురు, సుఖ దేవ్ లాంటి ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడారు.. 80 వ స్వాతంత్ర పర్వదినాన యావత్ దేశం వారికి ఘన నివాళ్లను అర్పిస్తోంది. ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా వారి త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకుంటున్నారు..

80 ఏళ్ల ప్రగతి ప్రస్థానం...
గడిచిన 8 శతాబ్దాల్లో మన దేశం అనేక రంగాల్లో ఊహించని స్థాయిలో ప్రగతిని సాధిస్తూ అగ్రదేశాల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు విదేశీ ఆహారం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి మన రైతాంగం ఎదిగింది.. అంతరిక్షంలో చంద్రయాన్ లాంటి అద్భుతమైన ప్రయోగాలతో అగ్రరాజ్యాలకు సైతం దీటుగా మన శాస్త్రవేత్తలు సత్తా చాటుతో ముందుకెళ్తున్నారు.. అలాగే ఐటీ రంగంతో పాటు సాంకేతిక వైద్య ఆర్థిక రంగాల్లో భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతూ వస్తోంది..

ఇవే మనం చేరుకోవాల్సిన శిఖరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.. కేవలం ఆగస్టు 15న మాత్రమే జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవడం కాదు.. పేదరికంతో పాటు నిరుద్యోగం, అవినీతి లేని నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి నేటి యువత తప్పకుండా నడుంబిగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చట్టాలను గౌరవించడంతోపాటు తోటి వారికి సహాయం చేయడం, ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడం కూడా నిజమైన దేశభక్తికి నిదర్శనం అని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది..

భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశపు అతిపెద్ద బలంగా భావించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. కుల మతాలతో పాటు వర్గ ప్రాంతీయ వేదాలను పక్కనపెట్టి మనమంతా భారతీయులం అనే భావనతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం యువతకు ఎంతగానో ఉంది.. ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవాన్లకు.. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ప్రతి ఒక్క రైతుకు ఈ సందర్భంగా సెల్యూట్ చేద్దాం.. రేపటి పౌరులుగా.. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం.

భారతీయులందరికీ.. ముఖ్యంగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.. జైహింద్, జై భారత్..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

నెట్ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క నంబర్‌కు SMS, మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ముందే!

Hyderabad, Telangana:

PF Balance Check 2026: ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల జీతం నుండి ప్రతి నెల కొంత పొదుపు చేయబడుతుంది. యాజమాన్యం కూడా కొంత మొత్తాన్ని జమ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లాగే ఈపీఎఫ్ అకౌంట్‌లో కూడా నగదు జమ అవుతుంది మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు తమ నెలవారీ జమ అయిన మొత్తాన్ని సులభంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా పాస్‌బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటి సేవలను ఇంట్లోనే సులభంగా పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ ఆన్‌లైన్ సర్వీస్, మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు.

ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం..
ముందుగా ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌తో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు మీ పాస్‌బుక్‌ను చూడవచ్చు. అక్కడ డిపాజిట్ చేసిన పిఎఫ్ మొత్తం ఇతర బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.

పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్..
మీరు పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు విత్‌డ్రాయల్ లేదా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే, అది అడ్వాన్స్‌గా లేదా ట్రాన్స్‌ఫర్‌గా పూర్తయిందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లోని 'Know Your Claim Status' విభాగంలో అందుబాటులో ఉంటుంది. అక్కడ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ సులభంగా కనిపిస్తుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం..
ఈపీఎఫ్ సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ఉమాంగ్ యాప్‌లో మీ అకౌంట్ వివరాలు ఇస్తే, అధికారిక వెబ్‌సైట్‌లో ఉండే వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి 'EPF' సర్వీస్‌పై క్లిక్ చేస్తే, ఎంప్లాయీ సర్వీస్ సెక్షన్‌లో పాస్‌బుక్ వివరాలు కనిపిస్తాయి.

పీఎఫ్ మిస్డ్ కాల్..
మీకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా, ఒక మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం 9966044425 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ యూఏఎన్ వివరాలను పొందవచ్చు. అయితే, మీ ఈపీఎఫ్ఓ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలి. కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.

పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్..
మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను పొందవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 'EPFOHO UAN HIN' అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు పంపాలి. మీకు హిందీలో వివరాలు కావాలంటే 'HIN' అని టైప్ చేయాలి, లేదంటే మీ భాషా అవసరాలకు అనుగుణంగా వివరాలు వస్తాయి.

Also Read: పాన్ కార్డు కోసం ఏజెంట్లకు డబ్బులు ఇవ్వక్కర్లేదు!

Also Read:  రైల్వే ప్లాట్‌ఫామ్‌పై షాప్ పెట్టాలనుకుంటున్నారా?

ఈపీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసే విధానం అందుబాటులో ఉంది. అయితే, మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్, ఓటీపీ, ఆధార్, బ్యాంక్ వివరాలను ఎవరికీ తెలియజేయకండి. ఈపీఎఫ్ఓ పాస్‌బుక్‌ను కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకోవాలి. ఎటువంటి పేమెంట్ ప్రక్రియలు చేయమని ఎవరైనా అడిగితే, ఎవరికీ మీ వివరాలు ఇవ్వకండి. ఈపీఎఫ్ఓ పీఎఫ్ బ్యాలెన్స్ స్టేటస్ ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరమైంది. దీనిని పోర్టల్, మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డ సంచలన వ్యాఖ్యలు

Hyderabad, Telangana:

Epuri Somanna: ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగింది. ఈ సభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాజగోపాల్ రెడ్డి అధికార పక్షంలో ఉండను. ప్రతిపక్షంలో ఉండను అంటే నేనెప్పుడూ ప్రజల పక్షమే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం నాది. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి' అని పిలుపునిచ్చారు. ఏపూరి సోమన్నలాంటి కళాకారులు గజ్జ కట్టాలి.. నేను రుమాలు చుడతా ప్రజల్లోకి వెళదామని సూచించారు.

'రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అంట..  తప్పు చేస్తే తప్పని అంటా. తెలంగాణ వచ్చాక కూడా పేదలకు న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు, కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేని వాళ్లు.. ఇవ్వాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు' అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇట్లాంటి వాళ్లు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే బాధ అనిపిస్తోందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి తనకు ఉందని ప్రకటించారు. తన నిజాయితీనే తన బలం అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.

'రానున్న కాలంలో నిజాయితీపరులు, యువకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. రాష్ట్ర రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలి. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారనున్నాయి. నా వెంట ప్రజలు ఉన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు, పాచిపోయిన ఎమ్మెల్యేలు నాకు అవసరం లేదు' అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఒకసారి గెలవగానే డబ్బు, అధికారం, పదవిపై వ్యామోహం పెరుగుతుందని.. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేస్తున్నారని కొందరికి రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

'నేను నామినేషన్లకు డబ్బులు ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యేలు అయినోళ్లు ఉన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించా. ఇప్పుడు వాళ్లను మనం పిలిస్తే వస్తారా రారు. వాళ్లు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే పోతారు' అని కొందరి ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కులం, మతం పేరు చెప్పుకొని పైకెదిగిన తర్వాత వసూలు రాజాలుగా మారిన వ్యక్తులను తరిమికొట్టాలని సంచలన ప్రకటన చేశారు.

'తప్పుడు పనులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిది కాదు. ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అండగా ఉండాలి. కానీ అహంకారం పెంచుకోవద్దు. పదవి అనేది బాధ్యత కానీ... కిరీటంగా భావించవద్దు' అని రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. ఇప్పుడున్న నాయకులు చాలామంది గెలిచే వరకు ఒక తీరుగా.. గెలిచిన తెల్లారే మరో తీరుగా మారుతున్నారని వెల్లడించారు. అట్లాంటి వాళ్లకు తెల్లారేసరికి  పెద్దపెద్ద కార్లు ఎట్లా వస్తున్నాయని ప్రశ్నించారు.

'ఉన్నోడేమో 1000 రెట్లు పెరుగుతున్నాడు. లేనోడు ఇంకా అక్కడే ఉంటుండు. పైన ఉన్నోళ్లేమో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారు. పేదవాడికి రూ.5 లక్షల  ఇల్లు ఇవ్వడానికి 500 రూల్స్ పెడుతున్నారు' కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సగం ఇల్లు కట్టుకున్నాక... ఆటో ఉందనో ట్రాక్టర్ ఉందనో బిల్లులు ఆపేస్తున్నారని సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. తాను అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇన్నేళ్లు సహనంతో ఉన్న.. ఇక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

0
0
Report

BSNL Freedom Plan 2026: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చేసింది!

Hyderabad, Telangana:

BSNL 1 Rupee Freedom Plan 2026: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తన కొత్త, అలాగే ఇప్పటికే ఉన్న వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్లో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీపడుతూ తక్కువ ధరకే మెరుగైన సేవలు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, తాజాగా తన పాపులర్ 'రూ.1 ఫ్రీడమ్‌ ప్లాన్‌'ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, ఈసారి 'ఫ్రీడమ్‌ 2.0' పేరుతో మరింత ఆకర్షణీయంగా దీన్ని పునరుద్ధరించింది.

రూ.1 ఫ్రీడమ్‌ ప్లాన్ ప్రత్యేకతలు..
ఈ ప్రత్యేక ఆఫర్ కింద కొత్త వినియోగదారులు కేవలం రూ.1 చెల్లించి సరికొత్త బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్ కార్డ్‌ను పొందవచ్చు. అంతేకాకుండా, తొలి రీఛార్జ్ ప్లాన్ (FRC) కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ కాలపరిమితిని 24 రోజులుగా నిర్ణయించారు.

ఈ 24 రోజుల పాటు వినియోగదారులకు అపరిమిత (అన్‌లిమిటెడ్) వాయిస్ కాల్స్, రోజువారీ వినియోగం కోసం 100 ఎస్సెమ్మెస్‌లు, అలాగే ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.

అయితే ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. పాత యూజర్లకు ఇది వర్తించదు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పష్టం చేసింది.

రూ.2399 వార్షిక ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ బోనస్..
కేవలం కొత్త యూజర్ల కోసమే కాకుండా, ఇప్పటికే ఉన్న పాత వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వార్షిక ప్లాన్‌పై కూడా భారీ తగ్గింపులు, అదనపు లాభాలను ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యంత ప్రజాదరణ పొందిన రూ.2399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కంపెనీ సవరించింది. సాధారణంగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ ప్లాన్‌కు అదనంగా మరో 47 రోజులను కలుపుతూ మొత్తం 412 రోజుల సుదీర్ఘ కాలపరిమితిని అందిస్తోంది.

ఈ వార్షిక ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్యకాలంలో రీఛార్జ్ చేసుకునే యూజర్లకు మాత్రమే ఈ స్పెషల్ వార్షిక ఆఫర్ వర్తిస్తుందని టెలికాం వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ సంస్థ అందిస్తున్న ఈ సద్వినియోగ ఆఫర్లను ప్రజలు ఉపయోగించుకోవాలని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు.

Also REad: ఉద్యోగులకు రూ.45,000 కనీస పెన్షన్..ఏడాదికి నాలుగుసార్లు డీఏ పెంపునకు డిమాండ్!

Also REad: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Pocharam: 'ఉన్న విషయమే చెప్పా.. రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదు': పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

Banswada, Telangana:

Banswada: తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని.. తాను ఎవరికి అమ్ముడుపోలేదని కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పునరుద్ఘాటించారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతిచ్చానని.. అభివృద్ధిపై ఆశతోనే రేవంత్‌ రెడ్డికి మద్దతు తెలిపానని పోచారం స్పష్టం చేశారు. తాను ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లు చెప్పారు. తాను స్వార్థం కోసం చేసిన ఒక పని ఏదైనా చూపించాలని విమర్శకులకు సవాల్‌ చేశారు.

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన అనంతరం కీలక ప్రసంగం చేశారు. బీర్కూర్‌లో తాను మాట్లాడిన మాటలలో ఏమీ లేదని ఉన్న మాట మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. తాను అటు పోతనా  ఇటు పోతనా అని కొందరు అంటున్నారు.. కానీ ప్రజల కోసమే తన జీవితం అని ప్రకటించారు. 

'ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన దానికి అనుకూలంగా నేను పనిచేస్తా.  తప్ప నాకు ఒక పైసా అవసరం లేదు' అని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక శాతం కూడా తనకు స్వార్థం లేదని.. తాను స్వార్థం కోసం పోయానని విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వార్థం కోసం చేసిన ఒక పని ఏదైనా చూపించాలని విమర్శకులకు సవాల్‌ చేశారు. 'ఊరికేనే వెళ్లాడా ముఖ్యమంత్రిని కలిశాడా? ఆయనకు స్వార్థం ఉంది అని విమర్శిస్తున్నారు. నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? నేనేమైనా అమ్ముడుపోయినా' అని పోచారం ప్రశ్నించారు.

అమ్ముడు పోయానా? లేదానే విషయం స్పష్టం చేయడానికి తాను మాట్లాడాల్సి వచ్చిందని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వివరించార. 'ఫంక్షన్ హాల్ కేసీఆర్ ఇచ్చారు. ఆయన పేరు చెబుతా. ఎవరు ఏది ఇచ్చినా అది చెప్పడం తన ధర్మం, మానవత్వం అని ప్రకటించారు. 'పోచారం ఏమో మాట్లాడారు దాని వెనుక ఏదో రహాస్యం ఉంది ఏమో చేస్తున్నాడు అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. రహాస్యం ఏమి లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా' అని వివరించారు. తాను పోరాడి  సాధించుకుంటాను తప్ప తలదించుకొని పనిచేసే రాజకీయ నాయకుడిని కాదని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

మొన్న ఏమన్నారంటే..
రెండు రోజుల కిందట కార్యకర్తల సమావేశంలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ పార్టీ‌ అధినేత కేసీఆర్‌పై పోచారం విధేయత ప్రకటించారు. 'కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు' అని తెలిపారు. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నట్లు చెప్పారు. మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదని స్పష్టం చేశారు.

0
0
Report
Advertisement

Rajasingh Janasena: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!

Hyderabad, Telangana:

Rajasingh Janasena Telangana: హైదరాబాద్‌ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. రాబోయే గ్రేటర్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే.. బీజేపీ మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమైంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన కూడా నిర్ణయించుకుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలోని మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో తెలంగాణలో జనసేన బలపడితే, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయి ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, యువతలో జనసేనకు మంచి ఆదరణ ఉందని ఆయన ప్రశంసించారు.

రాజాసింగ్ సంకేతాల వెనుక ఆంతర్యమేమిటి?
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై రాజాసింగ్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కుతుంటారు. ఈ నేపథ్యంలో జనసేనలో తనకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పనిచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు ట్విస్ట్ ఇదే..
రాజాసింగ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దీని వెనుక కొన్ని రాజకీయ చిక్కులు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి చెందిన ఫైర్‌బ్రాండ్ లీడర్ రాజాసింగ్‌ను పవన్ కల్యాణ్ తన పార్టీలోకి ఆహ్వానించే సాహసం చేస్తారా? లేదా? అనేది ప్రస్తుతం పెద్ద సందేహంగా మారింది.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ వ్యూహం, రాజాసింగ్ అనుసరిస్తున్న తీరుతో తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో వేచి చూడాలి.

Also Read: గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Also REad: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్? ఆగస్టు 17న అసెంబ్లీలో అడుగుపెడతారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sewing Machines: మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం

Hyderabad, Telangana:

BC Women Free Sewing Machine: తెలంగాణలోని మహిళలకు 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని.. ఇది నిరంతరం కొనసాగే పథకం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వంద శాతం సబ్సిడీపై ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు ఉందని.. వాటిని ఉచితంగా మహిళలకు ఇస్తామని తెలిపారు. బీసీ మహిళల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం అని  పేర్కొన్నారు. బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం తీసుకువచ్చినట్లు వివరించారు.

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన అనంతరం పొన్నం ప్రభాకర్‌ కీలక ప్రసంగం చేశారు. బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వంద శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

కుట్టు మిషన్ల కోసం మహిళల నుంచి అధిక డిమాండ్‌ ఉంటుందని.. మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని మంత్రి ప్రభాకర్‌ తెలిపారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తూ, వాటి నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

0
0
Report
Advertisement

Jitesh Sharma Trade 2027: ఆర్‌సీబీ ఆటగాడిపై కన్నేసిన కావ్యా పాప..ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో అతడే కావాలని పట్టు!

Hyderabad, Telangana:

Jitesh Sharma Trade 2027 IPL: ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టైటిల్ చేజారడంతో వచ్చే ఏడాది మరింత బలంగా బరిలోకి దిగాలని చూస్తోంది. కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ జట్టులోని లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ముఖ్యంగా లోయర్‌ ఆర్డర్‌లో నమ్మకమైన ఇండియన్ ఫినిషర్‌ను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఆర్‌సీబీతో ట్రేడ్ చర్చలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫినిషర్ జితేష్ శర్మను తమ జట్టులోకి మార్చుకునేందుకు (ట్రేడ్ డీల్) సన్‌రైజర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ఆర్‌సీబీ పెట్టిన షరతు ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆశ్చర్యపరిచింది. జితేష్‌కు బదులుగా తమ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని ఆర్‌సీబీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇషాన్ కిషన్‌ను వదులుకునే ప్రసక్తే లేదు!
ఫామ్‌లో లేని జితేష్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను వదులుకునే సాహసం ఎస్‌ఆర్‌హెచ్ చేయలేకపోతోంది. ప్రస్తుతం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా నడిపించాడు. 2027 సీజన్‌లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉండటంతో, ఇషానే జట్టు భవిష్యత్ సారథిగా ఎదుగుతున్నాడు.

అలాగే 2026 సీజన్‌లో ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు సాధించి అదరగొట్టాడు. మరోవైపు, జితేష్ శర్మ 2026 సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫామ్‌లో లేని ఒక ఆటగాడి కోసం జట్టులో కీలకమైన మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం తెలివైన పని కాదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్రేడ్ చర్చలు ఏ కొలిక్కి వస్తాయనేది త్వరలోనే తేలనుంది.

Also Read: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మాజీ కెప్టెన్..అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!

Also Read: భారత్ Vs శ్రీలంక టెస్ట్ సిరీస్..మ్యాచ్ షెడ్యూల్ టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ ఎందులో?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Free Sewing Machine Scheme: ఉచితంగా కుట్టు మిషన్‌ ఎలా పొందాలి? దరఖాస్తు ఎలానో తెలుసా?

Baddipadaga, Telangana:

Telangana Sewing Machine Scheme: తెలంగాణ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే మరో పథకం ప్రారంభించింది. మహిళలు సొంత కాళ్లపై సంపాదించుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. అనంతరం ఈ పథకానికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడించారు. కుట్టుమిషన్ల పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

'బీసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తోంది . బీసీ మహిళలకు ఆటో మెటిక్ కుట్టు మిషన్‌ల పంపిణీ పథకం దరఖాస్తులు ఎల్లుండి ప్రారంభం అవుతాయి' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, ఆర్థికంగా సాధికారత సాధించేలా చేయడం పథకం ప్రధాన లక్ష్యం అని ప్రకటించారు. ఈ పథకానికి మహిళలు అందరూ కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు. ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15 వరకు మహిళలు కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఎన్ని మిషన్లు?
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కుట్టు మిషన్లు అందిస్తారు. మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.12,000 విలువైన కుట్టు మిషన్‌ను ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందించనుంది. ఈ పథకం ఇప్పుడే కాకుండా నిరంతరం కొనసాగుతుంది. ఒక కుటుంబం నుంచి ఒక్కరే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఒక్కో లబ్ధిదారుకు రూ.12 వేల విలువైన కుట్టు మిషన్ అందించనుండగా.. కుట్టు మిషన్ ఖర్చులో 100 శాతం ప్రభుత్వమే భరించనుంది.

అర్హతలు.. ఎవరు అర్హులు
18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న బీసీ మహిళలు అర్హులు
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటకూడదు.
దరఖాస్తుదారులకు టైలరింగ్/కుట్టు శిక్షణకు సంబంధించిన అర్హతకు ప్రాధాన్యం
ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే కుట్టు మిషన్ అందిస్తారు.

దరఖాస్తు ఎలా?
లబ్ధిదారుల ఎంపిక కోసం ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. TGOBMMS వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ నిర్వహణ చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం నిబంధనలు ప్రభుత్వం రూపొందించింది. 

ఎంపిక ఎలా?
జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనున్నాయి. ఎంపికైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించడంతో పాటు స్వయం ఉపాధి దిశగా ప్రోత్సాహం. పథకం అమలులో అర్హత, ఆదాయం, శిక్షణ తదితర వివరాల పరిశీలన తప్పనిసరి. ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు.

0
0
Report

Python Video: నీటి గుంతలో 13 అడుగుల కొండచిలువ.. గుండెలు దడదడలాడించే రెస్క్యూ వీడియో!

Hyderabad, Telangana:

Giant Python Viral Video: సాధారణంగా పాము పేరు చెబితేనే.. చాలా మంది ఆమడదూరం పరుగులు తీస్తూ బయపడి పోతూ ఉంటారు.. ఇక అది భారీ కొండచిలువ (Python) అయితే.. చూసిన వెంటనే గుండె ఆగినంత పనవ్వడం ఖాయం.. సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే, తాజాగా ఓ నిర్మాణంలో ఉన్న నీటి గుంతలో ఏకంగా 13 అడుగుల పొడవాటి ఓ భారీ కొండచిలువను ఒక యువకుడు రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ వీడియోనే కనిపిస్తూ ఉంది..

నీటిలో భారీ కొండచిలువ.. 
చాలా రోజుల నుంచి అడవులు అంతరించిపోతుండటంతో వన్యప్రాణులు తరచుగా జనాలు నివసించే ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఓ పెద్ద నీటి గుంతలో భారీ కొండచిలువ పడిపోయింది. ఆ నీటిలోంచి బయటకు రాలేక ప్రాణాపాయ స్థితిలో, ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుండటాన్ని స్థానికులు గమనించారు.. ఆ భారీ పామును చూసి జనాలు భయంతో వణిపోకుండా... వెంటనే స్నేక్ క్యాచర్‌కు (Snake Catcher) సమాచారం అందించారు. అయితే, వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్  పవన్ సర్పమిత్ర (Pavan Sarpmitra) బృందం అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు.

ఆ కొండచిలువ ఏకంగా 13 అడుగుల పొడవు ఉన్నట్లు గమనించిన స్నేక్‌ క్యాచర్స్‌ సైతం ఆశ్చర్యపోయారు. పైగా కొండచిలువలకు విషం లేకపోయినా.. వాటికి ఉండే విపరీతమైన బలంతో మనుషులను సైతం చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాంటి పామును నీటిలోంచి బయటకు తీయడం చాలా కష్టమని వారు భావించారు. అయినా సరే.. ఓ యువకుడు ఏ మాత్రం భయం లేకుండా నిచ్చెన సాయంతో ఆ నీటి గుంతలోకి దిగాడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. 

పామును అతను ఎంతో సులభంగా పట్టుకునేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. పాము బరువు ఎక్కువగా ఉండటంతో పాటు అది విపరీతంగా గింజుకోవడంతో.. పైనున్న మరికొంత మంది యువకులు అతనికి సహాయంగా ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. అందరూ ఎంతో కష్టపడి పామును నీటిలో నుంచి బయటికి లాగడం కూడా మీరు చూడొచ్చు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఆ భారీ కొండచిలువను నీటిలో నుంచి పైకి తీస్తున్న దృశ్యాలు చూసి చాలా మంది భయపడిపోయిన్నట్లు తెలుస్తోంది. పామును సురక్షితంగా బయటకు తీసిన తర్వాత దాన్ని సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టిన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ షార్ట్ వీడియోను ఏకంగా 25 కోట్ల మందికి పైగా (250 Million Views) వీక్షించగా, 24 లక్షలకు పైగా లైక్స్ చేయడం విశేషం.. ఈ వీడియోను  చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లు పెడుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top