అవగాహన ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్
Hyderabad, Telangana:శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ లో జిహెచ్ఎంసి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య నేతృత్వంలో దోమల వ్యాధి నివారణ కొరకు చేపట్టిన ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు కార్పొరేటర్, అదేవిధంగా ప్రజలందరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారికి సూచించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Collectors Conference: రేపటి నుంచి 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు
Velgapudi, Andhra Pradesh:AP District Collectors Conference: అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో హామీలు.. పథకాలు ప్రకటించడంతోపాటు పరిపాలనాపరమైన నిర్ణయాలు, విధానపరమైన అంశాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిపై నిత్యం సమీక్ష చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే జిల్లాల కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
8వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరగనుండగా.. రేపు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభం కానుంది. 10, 11వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుండగా దీనికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు పాల్గొననున్నారు.
7వ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికతో మొదటి రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, సాంకేతికత, పెట్టుబడులు, శాంతిభద్రతలు లాంటి కీలక విభాగాల వారీగా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ప్రభుత్వ సేవలు, వివిధ పథకాల అమలు వంటి వాటిపై క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో ఏయే అంశాలపై చర్చ జరగనుందో తెలుసుకుందాం.
మొదటి రోజు
జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర విజన్కు జిల్లాస్థాయి రోడ్మ్యాప్లపై సమీక్షిస్తారు. సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్యా రంగంలో పురోగతి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జలధార, జిల్లాల బెస్ట్ ప్రాక్టీసెస్ సదస్సులో పలువురు కలెక్టర్లు ప్రదర్శిస్తారు.
రెండో రోజు
సదస్సులో ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, ఆర్టీజీఎస్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, జిల్లాల వారీ ర్యాంకింగ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం, శాంతిభద్రతలు
EPF Advance Withdrawal: ఉద్యోగులకు ముఖ్య గమనిక..ఈపీఎఫ్ అడ్వాన్స్ కొత్త రూల్స్..ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు?
Hyderabad, Telangana:EPF Advance Withdrawal Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ వివిధ రకాల ఆర్థిక అవసరాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ నిధులను ఉపసంహరించుకునేందుకు స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది. అత్యవసరాలు, ఇంటి అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు ముఖ్యమైన కేటగిరీల కింద ఏ అవసరానికి ఎన్నిసార్లు డబ్బులు ఉపసంహరించుకోవచ్చో పరిమితులను స్పష్టం చేసింది.
వైద్య చికిత్సల కోసం ఎలాంటి పరిమితి లేకుండా ఎన్నిసార్లయినా విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఇవ్వగా చదువు, వివాహం, ఇంటి నిర్మాణం, ప్రత్యేక పరిస్థితులకు పరిమిత సంఖ్యలో క్లెయిమ్లు చేసుకోవచ్చని వెల్లడించింది.
కేటగిరీ-1
అత్యవసరాలు (Emergency Needs) చందాదారుల వ్యక్తిగత, కుటుంబ సభ్యుల అత్యవసరాల కోసం ఈ క్రింది విధంగా ఉపసంహరణలకు అవకాశం కల్పించారు:
అనారోగ్యం: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్సల కోసం చందాదారుడు తన మొత్తం సర్వీసు కాలంలో ఎన్నిసార్లయినా నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. దీనికి ఈపీఎఫ్వో నిబంధనలు వర్తిస్తాయి.
విద్య: వ్యక్తిగత లేదా తన కుటుంబ సభ్యుల చదువుల ఖర్చుల కోసం మొత్తం సర్వీసులో పది (10) సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు.
వివాహం: వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వివాహ ఖర్చుల కోసం మొత్తం సర్వీసు సమయంలో ఐదు (5) సార్లు క్లెయిమ్ చేయవచ్చు.
కేటగిరీ-2
ఇంటికి సంబంధించిన అవసరాలు సొంత ఇంటి అవసరాలు, నివాస సదుపాయాల కోసం నిధులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇల్లు, భూమి కొనుగోలు, నిర్మాణం: ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయడానికి, గృహ నిర్మాణం చేపట్టడానికి, గృహ రుణ (Home Loan) చెల్లింపులకు, అలాగే ఇంటి మరమ్మతుల కోసం మొత్తం సర్వీసు కాలంలో ఐదు (5) సార్లు నగదును అడ్వాన్స్గా పొందే అవకాశం ఉంది.
కేటగిరీ-3
ప్రత్యేక పరిస్థితులు అనుకోకుండా ఎదురయ్యే ప్రత్యేక ప్రతికూల పరిస్థితుల్లో చందాదారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని అందించారు.
ప్రత్యేక పరిస్థితులలో విత్డ్రా..
ప్రకృతి విపత్తులు రావడం, లాకౌట్ లేదా సంస్థ మూసివేత జరగడం, ఉద్యోగం కోల్పోవడం, తీవ్ర రోగాల వ్యాప్తి సంభవించిన సమయాల్లో చందాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు (2) సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్వో అందించే ఈ అడ్వాన్స్ సదుపాయం ద్వారా చందాదారులు తమ విభిన్న అవసరాలకు అనుగుణంగా నిబంధనలను అనుసరించి నిధులను డ్రా చేసుకోవచ్చు.
Also Read: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!
Also Read: ఇళ్లు లేని వాళ్లకు గుడ్న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: అసెంబ్లీ వద్ద దాడిలో ఫేస్ మార్ఫింగ్, ఏఐ ఫొటోలు.. డీజీపీకి ఎమ్మెల్యేల ఫిర్యాదు
Baddipadaga, Telangana:Telangana DGP: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు ఆవరణ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై విడుదలైన ఫొటోలు అన్నీ మార్ఫింగ్.. ఏఐతో చేసినవని తెలుస్తోంది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫొటోలు ఫేక్ మార్ఫింగ్ అని, ఏఐ ఫొటోలు అని పేర్కొంటూ.. వాటిపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు డీజేపీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఏఐ ఫొటోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో తెలంగాణ డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ను బీఆర్ఎస్ శాసనసభాపక్షం తరఫున ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ చారి కలిసి ఫిర్యాదు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఇమేజ్లు, దుష్ప్రచార కంటెంట్ను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తెలిపింది. అలాంటి వారిపై తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
'తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి, దురుసు ప్రవర్తన ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఫేక్ డిజిటల్ కంటెంట్ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేక్ లేదా ఏఐ జనరేటెడ్ చిత్రాలను నిజమైనవిగా చూపిస్తూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడమే కాకుండా.. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది' అని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఫిర్యాదులో పేర్కొంది.
ఫేక్, మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ చిత్రాలు, పోస్టులను సైబర్ క్రైమ్ విభాగం వెంటనే గుర్తించి దర్యాప్తు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీని కోరారు. ఫేక్, మార్ఫింగ్, ఏఐ కంటెంట్ను రూపొందించిన.. అప్లోడ్ చేసిన, ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించాలని, సంబంధిత చిత్రాలపై సాంకేతిక ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, యూఆర్ఎల్లు, టైమ్స్టాంప్లు, మెటాడేటాను భద్రపరచాలని వినతిపత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. సైబర్ క్రైమ్, పరువునష్టం, తప్పుడు సమాచార ప్రచారం తదితర వర్తించే చట్టాల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఫేక్, మార్ఫింగ్ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పోలీస్ యంత్రాంగానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం గుర్తుచేసింది. రాజకీయ భేదాలు ఉన్నాయనే కారణంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై కల్పిత డిజిటల్ కంటెంట్ను తయారు చేసి ప్రచారం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రకటించింది. ఇక అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిపై కూడా సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఎమ్మెల్యేలు కోరారు. మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా, అత్యవసరంగా దర్యాప్తు నిర్వహించి, ఫేక్ డిజిటల్ కంటెంట్ను రూపొందించి ప్రచారం చేసిన వారితో పాటు అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డీజీపీని కోరారు.
Ganesh Utsav: వినాయక చవితి ఉత్సవాలపై నారా లోకేశ్ శుభవార్త.. ఏమిటో తెలుసా?
Nuzendla, Andhra Pradesh:Ganesh Chaturthi 2026: వారంలో ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం వినాయక ఉత్సవ కమిటీలకు గుడ్న్యూస్ వినిపించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసే గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి కీలక విషయం తెలుపుతూ 'ఎక్స్' వేదికగా నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 'ఈ గణేశ్ చతుర్థి సందర్భంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్న ప్రజలకు అండగా నిలవడానికి.. ఈ వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చడానికి మా ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది' అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. 'వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించి.. హిందూ బంధువులందరికీ సంతోషాన్ని కలిగించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి వినాయక చవితి మంటపాలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ప్రజల విశ్వాసానికి, ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే స్పందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
I am happy to announce that this #GaneshChaturthi, all Ganesh pandals across #AndhraPradesh will be provided free electricity. This is a major festive initiative by our government to support communities celebrating across the state and make the celebrations even more vibrant.…
— Lokesh Nara (@naralokesh) September 9, 2026
రేపో, మాపో మార్గదర్శకాలు
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్పై ఇంకా స్పష్టత రాలేదు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటనపై రేపో, మాపో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఉచిత విద్యుత్కు సంబంధించి ముందస్తుగా గణేశ్ ఉత్సవ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మీ సేవ లేదా.. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచిత విద్యుత్కు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
https://t.co/b5qyZHqGP0ప్రతి సోమవారం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే…
గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.@naralokeshవినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించి, హిందూ బంధువులందరికీ సంతోషాన్ని కలిగించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ
— PVN Madhav (Modi Ka Parivar) (@MadhavBJP) September 9, 2026
YS Jagan Padayatra: పాదయాత్ర షెడ్యూల్పై వైఎస్ జగన్ కీలక ప్రకటన..వచ్చే దసరా నుంచి షురూ!
Nunna, Vijayawada, Andhra Pradesh:YS Jagan Padayatra 2.0 Announcement: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్ర షెడ్యూల్పై కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయిందని.. మరో ఆరు నెలల్లో మూడేళ్లు గడిచాక.. తన పాదయాత్రను మొదలుపెట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అనగా 2027 సెప్టెంబరు లేదా అక్టోబరు నెల నుంచి తన పాదయాత్రను ప్రారంభించినున్నట్లు వైఎస్ జగన్ తాజాగా వెల్లడించారు.YS Jagan: పాదయాత్ర 2.0 ఎప్పుడో చెప్పిన మాజీ సీఎం వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YSRCP Chief YS Jagan Announces Padayatra On 2027 September Or October Watch VideoChandrababu: మూడేళ్ల కిందట అరెస్ట్.. జైలు జీవితాన్ని గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు
Nuzendla, Andhra Pradesh:Chandrababu Jail: 'మూడేళ్ల కిందట సెప్టెంబర్ 9వ తేదీన నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేయడం బాధ కలిగించింది' అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు. తాను 48 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని.. 31 ఏళ్ల కిందట తొలిసారి సీఎం అయినట్లు చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలని.. పేదలకు, తెలుగు జాతికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పండువారిపేట గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మూడేళ్ల కిందట సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ జరిగిన ఘటనలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నైజాన్ని.. అతడిపై మాజీ సీఎం రోశయ్య వ్యాఖ్యలను ప్రస్తావించారు. 'చాలా మంది నాపై ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. నాపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయలేక పోయారు. అదే నా నిబద్ధత' అని ప్రకటించారు.
'రాజకీయంపై కుటుంబం ఆధారపడకూడదనే 36 ఏళ్ల కిందట ఫ్యామిలీ బిజినెస్ ప్రారంభించాం. అప్పట్లో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కుటుంబ వ్యాపారాన్ని నా భార్యకు అప్పగించా' అని సీఎం చంద్రబాబు తెలిపారు. తనకు ధన వ్యామోహం లేదని స్పష్టం చేశారు. కేవలం తెలుగు జాతి బాగుండాలనే నిరంతరం ఆలోచన చేస్తానని చెప్పారు. 'నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన నన్ను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారు. నాపై ఆరోపణలు ఏమిటో చెప్పాలని అడిగితే అరెస్టు చేసిన తర్వాత చెబుతామని అన్నారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
50 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, విలువలకే ప్రాధాన్యం ఇచ్చాను. సెప్టెంబర్ 9న తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేశారు. ఆ కష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి అందించిన మద్దతు నా జీవితంలో మర్చిపోలేను. #NijamGelichindi#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/URjQhT19fB
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2026
'ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉన్న పళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. నా జీవితంలో ఎన్నడూ అనుకోని సంఘటన ఓ దుర్మార్గమైన వ్యక్తి ఆలోచనలతో జరిగింది. నేను జైల్లో ఉన్న సమయంలో నాకేం జరుగుతుందోనని తెలుగు జాతి మొత్తం రోడ్లపైకి వచ్చింది' అని చంద్రబాబు వివరించారు. పవన్ కల్యాణ్ తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే అడ్డుకున్నారని చెప్పారు. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తనకు ఆయన సంఘీభావం తెలిపారని తెలిపారు.
'గత పాలకులు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయి. ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఏమీ లేదని తేల్చింది. గతంలో అచ్చెన్నాయుడు లాంటి నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. వేధింపులు చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తే ఆయన్ను అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు పంపేశారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒక్క నిముషం చాలు అని.. కానీ తాను ఆ పని చేయలేదని చెప్పుకొచ్చారు.
'నేను చాలా సౌమ్యంగా ఉంటా. ఏం చేయలేకపోతున్నారని చాలా మంది అనేవారు. కానీ నాకు సహనం ఎక్కువ. నేను చేసే ఏ పని అయినా అది తెలుగు జాతికి న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 'మాజీ సీఎం వైఎస్సార్కు ఆయన కొడుకు విషయంలో జాగ్రత్తలు తీసుకోమని ఆనాడే చెప్పా. గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని ఆయన తండ్రి వైఎస్సార్ చదువుకోవడానికి అమెరికా పంపిస్తే తిరుగుటపాలో వచ్చేశాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు' అని చంద్రబాబు ఆసక్తికర విషయం తెలిపారు.
'కొడుకుతో బాధలు భరించలేక అతడిని వైఎస్సార్ బెంగళూరులోనే ఉంచారని తల్లి విజయమ్మ మాజీ సీఎం రోశయ్యకు చెప్పుకుని బాధపడ్డారు. రోశయ్యే స్వయంగా ఈ విషయం చెప్పారు. ఓ సీఎంగా ఉన్న వ్యక్తి తన కుమారుడిని బెంగుళూరులాంటి చోట పెట్టాడు. అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో అర్థం చేసుకోండి' అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కొడుకును ఎప్పుడూ ఏపీకి రానీయలేదని గుర్తుచేశారు.
'బాబాయి వివేకాను గొడ్డలి వేటుతో కిరాతకంగా చంపేశారు. తెల్లవారితే సీఎంగా ఉన్న నాపై నింద వేసి తన పత్రికలో రాయించారు. తన చెల్లి సునీతను కూడా ఏమార్చారు. ఆ రోజే దోషులందరినీ అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా?. ఇప్పుడు తల్లిని, చెల్లినీ కూడా ఆస్తి కోసం మోసం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన దుస్థితి వచ్చింది' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!
Hyderabad, Telangana:TGEJAC Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం TGEJAC ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ (PRTUTS)ల ఉమ్మడి ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 10, 2026) నిర్వహించనున్న 'చలో హైదరాబాద్ - ఉద్యోగుల హక్కుల సాధన సభ' తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తొలుత ఈ కార్యక్రమానికి వేలాదిగా ఉద్యోగులు, పెన్షనర్లు తరలి రావడానికి ప్లానింగ్ జరగ్గా..తాజాగా ఈ ఆందోళనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.Wife And Husband: భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయనందుకు భార్య ఆత్మహత్య
Mahabubabad, Telangana:Wife Ends Her Life After Husband Deny To Video Call In Warangal Watch VideoBank Holidays: బ్యాంకులు సమ్మె..వరుసగా 4 రోజులు సెలవు..నెలాఖరులో మరో 3 రోజులు బంద్!
Hyderabad, Telangana:Bank Strike Holiday: వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య సెప్టెంబర్ 11న సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించింది. ఈ సమ్మెకు తోడు వరుసగా సెలవులు రావడం వల్ల బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 11న బ్యాంకు సమ్మె జరగనుండగా, సెప్టెంబర్ 12 రెండో శనివారం సెలవు, సెప్టెంబర్ 13 ఆదివారం వారపు సెలవు, సెప్టెంబర్ 14న గణేశ చతుర్థి ప్రభుత్వ సెలవుదినం ఉన్నాయి. ఈ విధంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. పండుగ సమయంలో బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే ప్రజలు ఈ అంతరాయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎంలు, నగదు లావాదేవీలపై ప్రభావం
బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూసివేసి ఉండటం వల్ల వివిధ బ్యాంకింగ్ లావాదేవీల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తున్నప్పటికీ, నిరంతర సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు నింపే సేవల్లో ఆలస్యం జరగవచ్చు. దీని ఫలితంగా కొన్ని ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లలో నగదు వాడకం పెరుగుతుంది కాబట్టి ఏటీఎంల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎక్కువగా ప్రభావితమయ్యే వర్గాలు
ఈ నాలుగు రోజుల నిరంతర సెలవుల వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ నగదు లావాదేవీలు చేసే పారిశ్రామికవేత్తలు, పింఛనుదారులు, బ్యాంకింగ్ సేవలపై నేరుగా ఆధారపడేవారు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయాలనుకునేవారు ఆలస్యాన్ని నివారించడానికి ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఖాతాదారులకు ముందస్తు జాగ్రత్తలు
పండుగ పూట ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిపుణులు వినియోగదారులకు పలు సూచనలు చేశారు. అత్యవసర ఖర్చుల కోసం అవసరమైన నగదును ముందే విత్డ్రా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
డిజిటల్ బ్యాంకింగ్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకుని ఉపయోగించుకోవాలి. ముందస్తు లావాదేవీలు అనగా.. పండుగకు ముందే ప్రధాన ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవాలి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లతో సహా బ్యాంకింగ్ సేవలను ముందుగానే ఉపయోగించుకోవడం మంచిది.
భవిష్యత్ సమ్మె హెచ్చరిక
సెప్టెంబర్ 11న జరగనున్న సమ్మె తర్వాత కూడా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే, సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో మరో మూడు రోజుల సమ్మెకు దిగుతామని బ్యాంక్ ఉద్యోగుల సంఘాల సమాఖ్య హెచ్చరించింది. ఈ ప్రకటన బ్యాంకు ఖాతాదారులలో మరింత ఆందోళన రేకెత్తించింది. కాబట్టి ప్రజలు తమ ఆర్థిక ప్రణాళికను ముందుగానే చేసుకోవడం చాలా అవసరం.
Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Also REad: ఇళ్లు లేని వాళ్లకు గుడ్న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Natural Snake Repellent: ఈ వాసన చూస్తే పాములు కిలోమీటర్ పారిపోతాయి..ఇవి ఇంట్లో ఉంటే వాసనకు మీ దరిదాపుల్లోకి రావు!
Hyderabad, Telangana:Natural Snake Repellent Smells: వర్షాకాలంతో సహా అనేక సందర్భాల్లో ఇళ్లు, తోటలు, గ్యారేజీల వద్ద పాములు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇళ్ల చుట్టూ పొదలు పెరగడం, చెత్త పేరుకుపోవడం లేదా ఆహారం కోసం ఎలుకలు అధికంగా ఉండటం వల్ల ఆ ప్రాంతానికి పాములు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇంటి పరిసరాల్లోకి పాములు రాకుండా నివారించేందుకు దాల్చినచెక్క నూనె, లవంగ నూనె, వెల్లుల్లి, నిమ్మగడ్డి, బంతి పూలు వంటి ఘాటైన వాసన గల సహజ పదార్థాలను కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సహజ సువాసనలు పాములను 100% అరికడతాయనే గ్యారెంటీ ఏమీ లేదు. ఇవి కేవలం అదనపు ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే పనిచేస్తాయి
పాముల ముప్పు నుండి రక్షణ పొందడానికి కేవలం వాసనలపైనే ఆధారపడకుండా, ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించడం, పొదలు, చెత్తను తొలగించడం, ఇంటికి ఉన్న పగుళ్లను మూసివేయడం అత్యంత కీలకమని నిపుణులు వెల్లడిస్తున్నారు.
సహజ వాసనల ప్రభావం..
పాములను దూరంగా ఉంచడానికి కొన్ని ఘాటైన సువాసనలు ఉపయోగపడతాయని నివేదికలు తెలుపుతున్నాయి.
దాల్చినచెక్క నూనె లేదా పొడి..
దాల్చినచెక్క నూనెలోని ఘాటైన వాసన పాములకు ఇబ్బందికరంగా ఉంటుందని యునైటెడ్ స్టేట్స్కు చెందిన USDA యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఇన్స్పెక్షన్ సర్వీస్ (APHIS) పేర్కొంది. దాల్చినచెక్కలో ఉండే సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం కూడా పాములను దూరంగా ఉంచుతుంది. ఇంటి ప్రవేశ ద్వారాలు, గ్యారేజీలు లేదా తోట అంచుల్లో దీనిని చల్లవచ్చు. అయితే దీనిని వాడేటప్పుడు ఇంట్లోని పిల్లలు, పెంపుడు జంతువుల భద్రతను గమనించాలి.
లవంగ నూనె, వెల్లుల్లి..
లవంగ నూనెలోని ఘాటు వాసనకు పాములు దూరంగా ఉంటాయని భావిస్తారు. అలాగే వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాల వల్ల వచ్చే ప్రత్యేక వాసన పాములకు ఇబ్బంది కలిగిస్తుంది.
నిమ్మగడ్డి, బంతి పూలు..
నిమ్మగడ్డి విడుదల చేసే సిట్రోనెల్లా వాసన, బంతి పూల వేర్ల నుండి వెలువడే సమ్మేళనాలు కూడా పాములను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
పరిశుభ్రతే అసలైన రక్షణ..
ఈ సహజ పద్ధతులు కేవలం అదనపు రక్షణగా మాత్రమే తోడ్పడతాయి గానీ, పాములను పూర్తిగా నివారిస్తాయని ఎలాంటి హామీ లేదు. వాసనల కంటే ఇంటి పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యం.
పగుళ్లు మూసివేయడం: గోడలు, నేలలో ఉన్న పగుళ్లు, రంధ్రాలు, తలుపుల కింద ఉన్న ఖాళీలను మూసివేయాలి.
దాక్కునే స్థలాలు తగ్గించడం: పొదలు, రాళ్ల కుప్పలు, చెత్త, కట్టెల నిల్వలను తొలగించి పాములు ఆశ్రయం పొందే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి.
ఎలుకల నియంత్రణ: ఎలుకలు వృద్ధి చెందకుండా ఆహార వ్యర్థాలను బయట పారవేయకూడదు.
పాము కనిపిస్తే ఏం చేయాలి?
ఒకవేళ ఇంట్లో లేదా పెరట్లో పాము కనిపిస్తే, దానిని పట్టుకోవడానికి, కొట్టడానికి లేదా చంపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. దానికి సురక్షితమైన దూరం పాటించి, వెంటనే స్థానిక అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన పాముల నిపుణుల సహాయం తీసుకోవడమే సురక్షితమైన మార్గం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా మాత్రమే పాఠకాసక్తి కోసం పొందుపరిచినది. దీన్ని పాటించేముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Snake Attracting Plants: పాములను ఆకర్షించే మొక్కలు..మీ ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి!
Also REad: విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేసిన జోతిష్య్కుడు..వీడియో రికార్డు చేసి బెదిరింపులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Padayatra: పాదయాత్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన
Tadepalli, Andhra Pradesh:YS Jagan Padayatra: 'చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మరో ఏడాది కూడా గడిచిపోతుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా పాదయాత్ర సాగుతుంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 'వైఎస్సార్సీపీ పాలనపై మన ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోగలిగేలా.. ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలిగేలా మన పాలన సాగింది' అని పేర్కొన్నారు. ఏ ఇంటికి అయినా వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని వెల్లడించారు.
బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి పాదయాత్ర ఉంటుందని ప్రకటన చేశారు. వైఎస్సార్సీపీ పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారని.. ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోందని తెలిపారు.
'మ్యానిఫెస్టోకు ఒక అర్థం తీసుకొచ్చి. మొత్తం అమలు చేసిన చరిత్ర మనది. చంద్రబాబు ఏకంగా మ్యానిఫెస్టోతోపాటు ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంపారు. ఎన్నికల తర్వాత మ్యానిఫెస్టో జాడ ఉండదు' అని టీడీపీపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేశారు. తాము మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశామని.. ప్రతి మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చార. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
'ఏటా బడ్జెట్ సమయంలోనే క్యాలెండర్ ప్రకటించి పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మనది. గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. వ్యవస్థలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. రైతులు, పిల్లలు, మహిళలు, పేదలకు అందించే పథకాలు లంచాలు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? అన్న సందేహాలు తీర్చాం. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన ఇంటి గడప వద్దే అందించాం. పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేశాం' అని తన గురించి మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
'ప్రజలను చంద్రబాబు దగా చేశారు. ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన సంతకం, పవన్ సంతకంతో బాండ్లు పంపారు. మనం ఇచ్చిన పథకాలు మాత్రమే కాకుండా, మన కంటే ఇంకా మూడింతలు ఇస్తామని చెప్పారు' అని చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదని.. చెప్పింది చేసిందని తెలిపారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని.. తమ నాలుగువేళ్లు నోట్లోకి పోవడం లేదని ప్రజలు వాపోతున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
'చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదు. ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు. అరెస్టులు. జైలుకు పంపడం. రోజుకో డ్రామా. రోజుకో నటన. డైవర్షన్ పాలిటిక్స్' అని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం అని ప్రకటించారు. ఎన్నికలు సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదామని వైఎస్సార్సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని సూచించారు.
'రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో వీరు చేసే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం.. వాటన్నింటిపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనబడాలి. స్థానిక ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలు. ప్రజలకు తోడుగా కార్యకర్తలు నిలబడతారు. వారికి తోడుగా మన పార్టీ నిలబడాలి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. దౌర్జన్యంతో ఎప్పుడూ పాలకులు రాజ్యం చేయలేరని గుర్తుంచుకోవాలని కూటమి ప్రభుత్వానికి హెచ్చరించారు. జరగబోయే కురుక్షేత్రంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలని.. పోరాడాలని వైఎస్సార్సీపీ నాయకత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సూచనలు చేశారు.
OPPO A7 Pro ఫోన్ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో అదరగొట్టిన కొత్త ఫోన్!
Hyderabad, Telangana:OPPO A7 Pro Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ OPPO మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ను విడుదల చేసింది. దీనిని కంపెనీ ఒప్పో A7 ప్రోను చైనా మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఒప్పో నుంచి ఈ కొత్త A-సిరీస్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ను కలిగి ఉంది. అయితే, ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ A7 ప్రో స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IP69K రేటింగ్ను కలిగి ఉండడం విశేషం.. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఒప్పో A7 ప్రో స్మార్ట్ఫోన్ వివిధ రకాల స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. దీని మొదటి వేరియంట్ 6GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో రూ.31,000తో లభిస్తోంది. అంతేకాకుండా రెండవ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.35,000తో లభిస్తోంది.. ఇది డెసర్ట్ బ్రౌన్, ఎవ్రీ స్టెప్ బ్లాసమ్తో పాటు రైడింగ్ ది వేవ్స్ వంటి కలర్ ఆప్షన్స్లో లభిస్తోంది.. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి చైనాలో అందుబాటులోకి రాబోతోంది..
ఒప్పో A7 ప్రో ఫీచర్లు..
ఒప్పో A7 ప్రో స్మార్ట్ఫోన్ 6.57-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని రిజల్యూషన్ 2372x1080 పిక్సెల్స్తో పాటు రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz, గ్లోబల్ బ్రైట్నెస్ 800 నిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా పీక్ బ్రైట్నెస్ 1,400 నిట్స్ ఉండడం వల్ల స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS 16 పై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.. A7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 MAX చిప్సెట్ ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది. ఇది IP69K రేటింగ్ లభిస్తోంది.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఇది 45W సూపర్వూక్ ఫ్లాష్ ఛార్జ్కు కూడా సపోర్ట్ చేస్తుంది..
ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ వెనుక భాగంలో ఆటోఫోకస్తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, NFCతో పాటు GPS, QZSS కనెక్టివీ ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Madhuri Rathod: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాటతో ఎంత సంపాదనో తెలుసా? రూ.10 లక్షలు పెడితే..16.2 కోట్లతో దూసుకుపోతుంది!
Hyderabad, Telangana:Madhuri Rathod News: గత ఏడాది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి శుభకార్యం, పార్టీలో మారుమోగుతున్న జానపద పాటల్లో 'నిమ్మతోట వనములో' ఒకటి. ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ తన మాస్ డ్యాన్స్ అభినయంతో ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టారు. 'లీడింగ్ బాయ్స్' అందించిన కొరియోగ్రఫీ, లావణ్య రవిందర్ రాసిన ఆకట్టుకునే లిరిక్స్, ప్రభ గాత్రం ఈ పాటను యూట్యూబ్లో సంచలనంగా మార్చాయి.
యూట్యూబ్తో పాటు స్పోటిఫై (Spotify), జియో సావన్ (JioSaavn) వంటి డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫార్మ్లలో కూడా ఈ ఆడియో వెర్షన్ దద్దరిల్లింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో వైరల్ అవ్వడమే కాకుండా.. విదేశాల్లోని తెలుగు వారు కూడా తమ వేడుకల్లో ఈ పాటను విరివిగా ఉపయోగిస్తున్నారు.
రూ.10 లక్షల ఖర్చు.. లాభం ఎంతంటే?
ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్లో ఏకంగా 162 మిలియన్ల (16 కోట్లకు పైగా) వ్యూస్ లభించాయి. దాదాపు రూ. 10 లక్షల లోపు నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ పాట, యూట్యూబ్, ఇతర ఆడియో ప్లాట్ఫార్మ్ల ద్వారా మొత్తం దాదాపు రూ.50 లక్షలకు పైగానే రెవెన్యూ సాధించింది. అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
నేపథ్యం, సంచలన వివాదాలు
సగటు మధ్య తరగతి కుటుంబంలో ఏడుగురు పిల్లల్లో ఒకరిగా జన్మించిన మాధురి రాథోడ్, జానపద నృత్యాలు, సోషల్ మీడియా వీడియోల ద్వారా స్వశక్తితో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, తనతో పాటు డ్యాన్స్ చేసే తోటి కళాకారుడు ఈశ్వర్ సాయితో వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పెద్ద వివాదం రాజుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఒకవైపు డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో కోట్ల వ్యూస్, భారీ సంపాదన సాధిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో వివాదాల చుట్టూ తిరుగుతుండటంతో మాధురి రాథోడ్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్ షాక్!
Also Read: బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన రెండు రోజులకే గోడదూకాలని..20 అడుగుల గోడపైకి ఎక్కి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ganesh Chaturthi 2026: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Vinayaka Chavithi 2026 Timing: భారతీయుల సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యమైనది. పార్వతీపరమేశ్వరుల చిన్న కుమారుడైన విఘ్నేశ్వరుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, పూజలకు ఏ సమయం అత్యంత ఉత్తమమైనది అనే విషయాలపై భక్తులలో క్లారిటీ లేక సందేహాలు ఏర్పడ్డాయి
చవితి తిథి వేళలు.. రెండు రోజుల అవకాశం
ఈ ఏడాది వినాయక చవితి తిథి సమయాల వివరాల్లోకి వెళితే.. భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 7:06 గంటలకు (AM) ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 7:44 గంటల (AM) వరకు కొనసాగుతుంది. ఈ విధంగా సుదీర్ఘ తిథి సమయం ఉండటం వల్ల 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను భక్తులు రెండు రోజుల పాటు జరుపుకునే పవిత్ర అవకాశం లభించింది.
సెప్టెంబర్ 14నే పూజించేందుకు అవకాశం..
అయితే, అత్యధిక శాతం మంది భక్తులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజునే ఈ పవిత్ర పండుగ పూజలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే వినాయక ప్రతిమలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తమ ఇళ్లకు, పూజా మండపాలకు తరలిస్తున్నారు. ఈసారి పండుగ సోమవారం రోజున రావడం భక్తులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం కలుపుకొని వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభించాయి.
ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 14న పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 7:44 గంటల వరకు తిథి అందుబాటులో ఉన్నందున ఆ రోజు ఉదయం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు.
11 రోజుల పూజలు, నవరాత్రుల ఉత్సవాలు
సాధారణంగా సెప్టెంబర్ 14న వినాయక ప్రతిమలను నిలిపి నాటి నుండి దాదాపు 11 రోజుల పాటు నిత్యం అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ భాద్రపద మాసం మొత్తం గణపతి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ మాసంలో గణేశ్ చతుర్థి రోజు నుండి ప్రారంభించి అనంత చతుర్దశి తిథి వరకు భక్తులు నిరంతరాయంగా గణనాథుడిని పూజిస్తారు.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా పాఠకుల ఆసక్తి మేరకు అందించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు.)
Also Read: ఇళ్లు లేని వాళ్లకు గుడ్న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
Also Read: సెప్టెంబరు 11న అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..BRICS కారణంగా వరుసగా 4 రోజులు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
