icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500076
Jeevan GoudJeevan GoudFollow18 Jul 2024, 03:45 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

BSNL VI Sharing: జియో, ఎయిర్‌టెల్‌ ఆధిపత్యానికి చెక్..అతి తక్కువ ధరలకే BSNL, వొడాఫోన్ ఐడియా చారిత్రాత్మక ఒప్పందం!

Hyderabad, Telangana:

BSNL VI Network Sharing: ఒకే తాటిపైకి బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా భారతీయ టెలికాం మార్కెట్లో మరో విప్లవాత్మక మార్పునకు నాంది పడింది. మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్ కంపెనీల హవాకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) భాగస్వామ్య ఒప్పందం దిశగా అడుగులు వేశాయి.

సీఎన్‌బీసీ ఆవాజ్ నివేదిక ప్రకారం.. వొడాఫోన్ ఐడియా సీఈఓ అభిజిత్ కిషోర్, బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ రాబర్ట్ జె.రవిల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబడింది. గతంలో కేవలం ఢిల్లీ, ముంబై నగరాలకే పరిమితమైన ఈ మౌలిక సదుపాయాల భాగస్వామ్యాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఒప్పందం ఎలా పనిచేస్తుంది? 
ఈ కొత్త ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కీలకమైన పరస్పర సహకారాన్ని అందించుకోనున్నాయి.

1) నెట్‌వర్క్ రోమింగ్ ఒప్పందాలు: బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో దాని వినియోగదారులు వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌ను, అలాగే వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న చోట దాని వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు (ఇంట్రా అండ్ ఇంటర్-సర్కిల్ రోమింగ్).

2) వనరుల పంపిణీ: ఇరు కంపెనీలు తమ టవర్లను, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌లను పరస్పరం పంచుకుంటాయి.

3) ఆదాయ భాగస్వామ్యం: రెండు కంపెనీల మధ్య ప్రత్యేక ఆదాయ భాగస్వామ్య నమూనా (Revenue Sharing Model) అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ఒక కంపెనీ వినియోగదారులు మరో కంపెనీ నెట్‌వర్క్ వాడటం ద్వారా రెండు సంస్థలకూ ఆదాయం లభిస్తుంది.

పరస్పర ప్రయోజనాలు ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం వల్ల ఇరు కంపెనీలకు విడివిడిగా గణనీయమైన ప్రయోజనాలు కలుగనున్నాయి.

వొడాఫోన్ ఐడియా (Vi) పొందే లాభాలు..
బీఎస్ఎన్ఎల్‌కు చెందిన విస్తారమైన మౌలిక సదుపాయాలు, మార్గ హక్కులు (Right of Way), భూగర్భ నెట్‌వర్క్ సేవలను వొడాఫోన్ ఐడియా ఉపయోగించుకుంటుంది. ఇది Vi తన 4G, 5G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడానికి, భారీ వ్యయాలను ఆదా చేసుకోవడానికి దోహదపడుతుంది. తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ (BSNL) పొందే లాభాలు.. 
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ మెరుగుపరచడానికి Vi మొబైల్ టవర్లను బీఎస్ఎన్ఎల్ ఉపయోగించుకుంటుంది. దీనివల్ల ప్రతిచోటా కొత్త టవర్లను నిర్మించాల్సిన అవసరం లేకపోవడంతో ఖర్చులు భారీగా తగ్గుతాయి. వొడాఫోన్ ఐడియాకు చెందిన అత్యుత్తమ మార్కెటింగ్, మార్కెట్ అనుభవం కూడా బీఎస్ఎన్ఎల్ కు కలిసొస్తుంది.

జియో, ఎయిర్‌టెల్‌లకు బలమైన పోటీ ప్రస్తుతం మౌలిక సదుపాయాల పరంగా చూస్తే జియో, ఎయిర్‌టెల్ కంటే బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా చాలా వెనుకబడి ఉన్నాయి.

మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం వివిధ కంపెనీల టవర్ల/సైట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
రిలయన్స్ జియో: సుమారు 333,000 సైట్లు
భారతీ ఎయిర్‌టెల్: 292,000 సైట్లు
వొడాఫోన్ ఐడియా: 190,000 సైట్లు
బీఎస్ఎన్ఎల్: 121,000 సైట్లు

ఇప్పుడు బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియాలు చేతులు కలపడం ద్వారా వీటి ఉమ్మడి నెట్‌వర్క్ కవరేజ్ విస్తరించి వినియోగదారులకు మరింత నాణ్యమైన కనెక్టివిటీ అందుతుంది.

వినియోగదారులకు, ప్రభుత్వానికి కలిగే లాభం ఏంటి?
ఇటీవల ఎయిర్‌టెల్ తన కొన్ని తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లను నిలిపివేయడం, అలాగే జియో కూడా ప్లాన్ల ధరలను పెంచవచ్చనే ఆందోళనల నేపథ్యంలో, ఈ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం వినియోగదారులకు చౌకైన ప్లాన్లతో కూడిన అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ ఒప్పందంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ స్పీడ్ నాణ్యత మెరుగుపడుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రభుత్వానికి ప్రత్యేక ప్రయోజనం.. 
కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ను నేరుగా నియంత్రించడంతో పాటు, వొడాఫోన్ ఐడియా (Vi)లో కూడా 49 శాతం వాటాను కలిగి ఉంది. కాబట్టి ఇరు కంపెనీలు విడిగా వేల కోట్లు ఖర్చు చేసే బదులు, ఉన్న వనరులను పంచుకోవడం ద్వారా ప్రభుత్వ ధనం వృథా కాకుండా ఆదా అవుతుంది.

Also Read: వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై ఫాస్టాగ్‌ ద్వారా ట్రాఫిక్ చలాన్లు ఆటోమేటిక్ వసూళ్లు!

Also Read: July DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! జూలై డీఏ పెంపుపై కీలక అప్‌డేట్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mars Transit: రాహు నక్షత్రంలోకి అగ్నిగ్రహం మార్పులు.. సెప్టెంబర్ 2 వరకు ఈ రాశుల వారు చాలా జాగ్రత్త!

Hyderabad, Telangana:

Mars Transit In Aridra Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చాయాగ్రహంగా పేరు ఉన్న కుజుడితోపాటు రాహువు మధ్య సంబంధాలను అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. శక్తి బలంతో పాటు కోపానికి అధిపతి అయిన కుజుడు.. ప్రస్తుతం రాహువు పాలించే ఆరుద్ర నక్షత్రంలో సంచారం కొనసాగిస్తున్నాడు.. ఆగస్టు 12 సంచారం చేయగా.. సెప్టెంబర్ 2వ తేది వరకు అక్కడే సంచార దశలో ఉంటాడు.. ఇదిలా ఉంటే.. ఈ గ్రహం ఆరుద్ర నక్షత్రంలో అనేక మార్పులకు చోటు చేసుకోబోతోంది. అగ్ని తత్వానికి అధిపతిగా భావించే కుజుడు.. రాహువువు నక్షత్రంలో మార్పులు జరిపినప్పుడు మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అలాగే కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆర్థికంగా వృత్తి పరంగా ఆరోగ్యపరంగా అనేక హక్కులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో అనేక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే, ఈ కుజుడు ప్రభావంతో ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి సమస్యలు తప్పవు..
మేష రాశి 
మేష రాశి వారికి అధిపతి కుజుడే కావడంతో.. రాహువు నక్షత్రంలో దూకుడు స్వభావంతో మార్పులు చేయడం కారణంగా వీరికి కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనిచేసే సమయాల్లో ఉద్యోగులతో వాదనలకు దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపే క్రమంలో కూడా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రమాదాలతో పాటు గాయాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తొందరపాటుగా తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భారీ నష్టాలకు దారితీస్తాయి.

వృషభరాశి 
వృషభ రాశి వారికి కుదిరి సంచారం కారణంగా ఆర్థికంగా ఎన్నో రకాల ప్రతికూల మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోపాన్ని వదిలేసి సంభాషణ పై తప్పకుండా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పరిస్థితులు కూడా మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి ఈ సమయాల్లో తప్పకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఊహించనిక అచ్చుల కారణంగా బడ్జెట్ కూడా దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడం చాలా మంచిది..

సింహరాశి 
సింహరాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వృత్తిలో ఎన్నో రకాల అద్దంకులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయాల్లో రాజకీయాల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా పనిపై దృష్టి పెట్టి జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. ముఖ్యంగా అధిక రక్తపోటు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరూ తప్పకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

మకర రాశి 
మకర రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ కుటుంబ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆకస్మికంగా ఊహించని ఖర్చులు వస్తాయి. దీని ఫలితంగా బడ్జెట్లో మార్పులు వచ్చి ఇతరుల నుంచి రుణాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Konda Surekha Janasena: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన ఇన్‌ఛార్జ్ కీలక ప్రకటన!

Hyderabad, Telangana:

Konda Surekha Rajasingh Janasena: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. క్రమశిక్షణా సంఘం ఆమెపై వేటు వేయాలని సిఫారసు చేయడంతో చర్యలు ఖాయమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సురేఖ కుమార్తె సుస్మిత జనసేనలో చేరతారని, ఆ తర్వాత సురేఖ సైతం అదే బాటలో పయనిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా మురళి తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తాము కాంగ్రెస్ వీడటం లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా, పార్టీ హైకమాండ్ తీసుకోబోయే తుది నిర్ణయం తర్వాతే సురేఖ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

సాదరంగా ఆహ్వానిస్తామన్న జనసేన..
కొండా సురేఖ కుటుంబం జనసేనలోకి వస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తామని పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం పార్టీలో చేరితే వరంగల్ ప్రాంతంలో జనసేన మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జనసేనతో పనిచేసేందుకు రాజాసింగ్ సిద్ధం..
మరోవైపు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని శంకర్ గౌడ్ వెల్లడించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు, పలువురు యువత, మేధావులు కూడా తమతో సంప్రదింపుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

గ్రేటర్ ఎన్నికలపై ధీమా..
త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో జనసేన పార్టీ తన సత్తా ఏంటో చూపిస్తుందని శంకర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కొండా సురేఖ తీసుకునే నిర్ణయం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది.

Also Read: Kalvakuntla Kavitha Mudhiraj: పెళ్లికొడుకు స్థానంలో నవ వధువుకి తాళికట్టిన కల్వకుంట్ల కవిత..

Also REad; మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Rohit Sharma RCB: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?

Hyderabad, Telangana:

Rohit Sharma RCB Jersey: భారత క్రికెట్ దిగ్గజం, 'హిట్ మ్యాన్'గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక ఎరుపు రంగు జెర్సీ ఫొటో సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారి, అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా, ఐపీఎల్ 2027 సీజన్‌లో రోహిత్ శర్మ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులోకి ప్రవేశించబోతున్నారనే ఊహాగానాలకు ఈ ఫొటో తావిచ్చింది.

గతంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని కోల్పోయిన నేపథ్యంలో, రోహిత్ మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలకు ఈ ఎరుపు జెర్సీ పిక్ మరింత బలాన్ని చేకూర్చింది. అయితే, ఈ వైరల్ ఫొటో వెనుక ఉన్న అసలు నిజం ఐపీఎల్ ఫ్రాంచైజీ మార్పు కాదని ఇప్పుడు స్పష్టమైంది.

వాస్తవానికి, రోహిత్ శర్మ బెంగళూరుకు చెందిన ప్రముఖ గేమ్‌టెక్ స్టూడియో అయిన 'లైట్ ఫ్యూరీ గేమ్స్'లో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా చేరారు. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న 'ది క్రికెట్' అనే ట్రిపుల్-ఏ (AAA) మొబైల్ గేమ్‌లో రోహిత్ శర్మ అధికారికంగా ప్లేయబుల్ క్యారెక్టర్‌గా కనిపించనున్నారు. సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న ఆ రెడ్ జెర్సీ లుక్, ఈ మొబైల్ గేమ్‌కు సంబంధించిన 'అల్టిమేట్ స్క్వాడ్ మోడ్' సినిమాటిక్ టీజర్ నుండి తీసుకున్నారు.

ఈ ప్రత్యేక గేమింగ్ మోడ్‌లో, ఆటగాళ్లు తమకు నచ్చిన కలల జెర్సీలను ఎంచుకొని, 700 మందికి పైగా లైసెన్స్ పొందిన క్రికెటర్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసుకొని తమ డ్రీమ్ టీమ్‌ను నిర్మించుకునే సరికొత్త అనుకూలత ఉంది. లైట్ ఫ్యూరీ గేమ్స్ సంస్థ కేవలం రోహిత్ శర్మతో మాత్రమే కాకుండా, భారత క్రికెట్‌లోని పలువురు ప్రముఖ ఐకాన్లతో కలిసి పనిచేస్తోంది.

ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ స్టూడియోకు మద్దతుగా నిలిచారు. వీరి జాబితాలోకి ఇప్పుడు రోహిత్ కూడా చేరడంతో, ఈ గేమింగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఈ సంస్థ తమ 'ది క్రికెట్' గేమ్ కోసం ముందస్తు యాక్సెస్ వినియోగదారుల కోసం ఫేజ్డ్ క్లోజ్డ్ బీటా టెస్టింగ్‌ను సెప్టెంబర్ 2026లో ప్రారంభించబోతోంది. ఈ టెస్టింగ్ ప్రారంభానికి ముందే, ఈ గేమ్ కోసం ఏకంగా మూడు లక్షలకు పైగా ఉచిత రిజిస్ట్రేషన్లు నమోదు కావడం దీనికున్న భారీ క్రేజ్, అభిమానుల ఆసక్తిని స్పష్టం చేస్తోంది. మొత్తంగా, రోహిత్ శర్మ ఎరుపు జెర్సీ వ్యవహారం ఆర్‌సీబీలో చేరడం అనే ఒక ఊహాగానం మాత్రమేనని, అసలు విషయం భారీ గేమింగ్ ఇన్వెస్టర్, గేమ్ క్యారెక్టర్ అని స్పష్టమైంది.

Also Read: అంతర్జాతీయ క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్..అనయ బంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి!

Also Read: టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ? బీసీసీఐ నుంచి కీలక సమాచారం లీక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

పల్నాడులో అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం.. 7 గురు మృతి, పదిమందికి తీవ్రగాయాలు..!

Hyderabad, Telangana:

Palnadu Bus Accident: నిన్న జరిగిన కోదాడ బస్సు ప్రమాదం మరువకముందే రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ఆటోను ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా వేలూరు గ్రామానికి చెందినవారు. వెంటనే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు సిజిహెచ్ ఆసుపత్రికి తరలించగా, మృతులను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. 

ఇక వీరంతా ఒక పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక మృతులంతా బొంత మణెమ్మ (55), బొంత బాబు (62), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50) సువార్త (45), మరియమ్మ (45) గా పోలీసులు గుర్తించారు.

వీళ్లంతా గురువారం తెల్లవారుజామున చిలకలూరిపేట అడ్డరోడ్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వేలూరు గ్రామానికి చెందిన ప్రయాణీకులు వెళ్తున్న సమయంలో బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లడంతో ఈ ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే తీవ్రంగా గాయపడిన వారిని కాపాడగా, పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొండ మంజులూరులో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
చిలకలూరిపేటలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులని చిలకలూరిపేట వేలూరు గ్రామానికి చెందినవారని అధికారులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Also Read: హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ.. ఐదుగురు దుర్మరణం!

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు IMD బిగ్ అలర్ట్..

 

తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!

Namarjung, Gandaki Province:

Flash Floods Nepal: నేపాల్‌లోని రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. రసువా జిల్లాలోని భోటేకోశీ నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలు, వంతెనలు, రోడ్లు, జలవిద్యుత్ ప్రాజెక్టులు బురద, శిథిలాల కింద చిక్కుకుపోయాయి. గల్లంతైన 348 మందిలో 105 మంది భారతీయులు, 93 మంది నేపాల్ పౌరులు, 12 మంది బ్రిటిష్, ముగ్గురు అమెరికన్ పౌరులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

ఈ దారుణ విపత్తుకు భూకంపం ప్రేరేపిత కొండచరియలే కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ పార్లమెంటులో వివరించారు.  బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో టిబెట్ భూభాగంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో భారీగా మంచు, రాళ్లతో కూడిన కొండచరియలు విరిగిపడి టిబెట్ వైపు ఉన్న లెండే ఖోలా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. నీరు నిలిచిపోయి ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో, భోటేకోశీ నదిలోకి వరద ప్రవాహం విపరీతంగా పోటెత్తింది.

మౌలిక వసతుల విధ్వంసం.. 
ఈ వరదల కారణంగా 11 జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఒక సౌర విద్యుత్ ప్రాజెక్టు దెబ్బతినడంతో జాతీయ గ్రిడ్‌కు 431.1 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. త్రిశూలి నదిపై ఉన్న కనీసం 19 వంతెనలు దెబ్బతినగా, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయినట్లు రోడ్ల శాఖ అధికార ప్రతినిధి శుభరాజ్ నెఉపానే వెల్లడించారు.

భారత్ అండ..హెచ్చరికలు.. 
నేపాల్ సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలపడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు, అత్యవసర మందులను పంపేందుకు సిద్ధమయ్యారు. నది ఎగువన ఇంకా అవరోధాలు ఉండటంతో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని భావించి, భారత సరిహద్దు రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా వరద హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: భర్తను చంపి, పేగులు బయటకు తీసిన భార్య..కురుక్షేత్రలో ఘోర హత్యోదంతం!

Also Read: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ స్నానం..వీడియో వైరల్ కావడంతో సస్పెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీకి కట్టుబడి ఉన్నా.. క్రమశిక్షణ తప్పలేదు: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమవడం చర్చనీయాంశంగా మారింది. భేటీ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. క్రమశిక్షణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

క్రమశిక్షణ విషయంలో రేవంత్ రెడ్డి, నేను పార్టీకి కట్టుబడి ఉంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడ మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. 'కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే నేను మాట్లాడా. పార్టీ బలోపేతం కోసం నేను మాట్లాడా. కానీ పార్టీని బలహీన పరిచే విధంగా నేను మాట్లాడలేదు. అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.

తాను మాట్లాడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు మారాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. అభివృద్ధి నిధుల కోసమే తాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తనకు ఎదురుపడ్డాడని.. అతడి రాకకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 'తెలంగాణలో ఆంధ్ర మీడియా పెత్తనం ఎక్కువైంది. నాలాంటి నిఖారైనా నాయకుడిని ఆంధ్ర మీడియా కంట్రోల్ చేయలేదు. తెలంగాణలో ఆంధ్ర మీడియా చానల్స్ నా లాంటి సీనియర్లపై అసత్య కథనాలు రాస్తున్నాయి. నాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే సంగతి చూస్తా' అని హెచ్చరించారు.

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా మార్చారు. గాంధీ భవన్ కూడా ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయ్యేలా ముఖాముఖీ కార్యక్రమం చేపట్టాం' అని వెల్లడించారు. 'ఈ రోజు నా దృష్టికి భూముల సమస్యలు ఎక్కువ వచ్చాయి. పటేల్ పట్వారి విధానం వల్ల భూ సమస్యలు తక్కువగా ఉండేవి. నాడు ఇందిరా గాంధీ పంచిన భూములు మళ్లీ భూస్వాములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో తప్పిదాలు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పటిష్ట చర్యలు తీసుకోవాలి' అని పేర్కొన్నారు.

0
0
Report

Zee 24 Ghanta: పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధికి ఆరు సూత్రాలు ప్రకటించిన సువేందు అధికారి

Kolkata, West Bengal:

Zee 24 Ghanta Mega Conclave: చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వివరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాలన వంద రోజుల పాలన పూర్తి చేసుకుందని.. 6 సూత్రాల ప్రణాళిక, 3 ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్లు సువేందు అధికారి ప్రకటన చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కలకత్తాలో జరిగిన జీ 24 ఘంటా సదస్సులో సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు 6 సూత్రాల ప్రణాళికను సువేందు అధికారి ఆవిష్కరించారు. పారిశ్రామిక పునరుద్ధరణ, పరిపాలనా నిర్ణయాలు, అవినీతి ఫిర్యాదులకు సంబంధించి 3 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి, సరిహద్దు భద్రత, విద్య, పర్యాటకం వంటి పలు అంశాలపై జీ 24 కాంక్లేవ్‌లో చర్చించారు.

0
0
Report
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన క్రేజీ సీరియల్ హీరో..ఈసారి మాత్రం తానే వస్తా అంటున్నాడు!

Hyderabad, Telangana:

Mukesh Gowda Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ హీరోలకు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ సాధారణంగా ఒక సినిమా హీరో రేంజ్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ ఒకరు. సాధారణంగా ముఖేష్ గౌడ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ, 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి అంటే మాత్రం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు.

ఈ సీరియల్‌లో ఆయన నటన, లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఈ విశేష ఆదరణ కారణంగానే ఆయనకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

ఇంతటి క్రేజ్ ఉన్న ఈ నటుడికి గతంలోనే బిగ్‌బాస్ షో నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగు బిగ్‌బాస్ నుంచే కాకుండా, కన్నడ బిగ్‌బాస్ నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్లతో పిలుపు వచ్చిందని, అయితే అప్పట్లో బిగ్‌బాస్ గేమ్ తనకు పూర్తిగా అర్థం కాకపోవడం వల్లే ఆ ఆఫర్లను తిరస్కరించానని ముఖేష్ తెలిపారు.

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 ముగింపు దశకు చేరుకోవడంతో, సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ వంటి ఎందరో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఈసారి ఈ జాబితాలో ముఖేష్ గౌడ పేరు మరింత బలంగా వినిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఈ పదో సీజన్‌లో ముఖేష్ ఖచ్చితంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే గ్రాండ్ లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Toxic Vs Irumudi: 'టాక్సిక్' నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి' సినిమాకు ఊహించని బూస్ట్

Also Read: చిరంజీవి 'విశ్వంభర' విడుదల అవుతుందా? మూవీ యూనిట్ ఏం చేస్తుంది? 2027లో కూడా డౌటే?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

సెప్టెంబర్‌లో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి కనకవర్షం ఖాయం!

Hyderabad, Telangana:

Lakshmi Narayana Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికతో పాటు వాటి మార్పులు మానవ జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి గ్రహాలు అనుకూలం స్థానంలో ఉంటే అదృష్టం తలుపు తడుతుంది సరిగ్గా 2026 సెప్టెంబర్ నెలలో కూడా ఒక మహా అద్భుతం జరగబోతోంది ఈ నెలలో గ్రహాల గమనం అనేక అద్భుతాలకు మార్పులకు నాంది పలకబోతోంది. ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఈ సమయంలో ఏర్పడబోతోంది ఈ అరుదైన యోగంతో నాలుగు రాశుల వారికి ధన లాభాలతో పాటు కనక వర్షం కురవబోతోంది. అయితే, ఏ రాశుల వారికి అదృష్టం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీ బుధ గ్రహం తులా రాశిలోకి సంచారం చేసింది. అప్పటికే తులా రాశిలో శుక్రుడు సంచార దశలో ఉన్నాడు.. తులారాశిలో ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రాజయోగం వల్ల మహర్దశ పట్టబోతోంది.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అనుకున్న ధన లాభాలు కలగబోతున్నాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
వృషభ రాశి 
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృషభరాశి వారికి అంతులేని ధన లాభాలు కలగబోతున్నాయి.. వీరు చేపట్టే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. సకల భౌతిక సుఖాలు కలగడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రకాల ప్రణాళికలు ఈ సమయంలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మిత్రులకు సంబంధించిన ఆస్తులు కూడా మీ వైపు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా జీవితం మరింత అద్భుతంగా ఆనందకరంగా మారుతుంది. 

మిథున రాశి 
మిథున రాశి వారికి ఈ సమయం ఒక స్వర్ణ యుగం లాంటిది లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా ఆర్థికంగా అతిపెద్ద ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు అందరికీ భారీ మొత్తంలో లాభాలు చేకూరుతాయి.. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా మారి అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.

కన్యారాశి 
సుదీర్ఘకాలం తర్వాత కన్యా రాశి వారికి విశేషమైన అదృష్టం పట్టబోతోంది. ఈ శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో జీవితం పూర్తిగా మారబోతోంది. ముఖ్యంగా చాలా కాలంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కళ్ళు చెదిరే ధన లాభాలు కలుగుతాయి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు లేదా ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులందరికీ అద్భుతమైన సమయం లాంటిది. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి 
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావం వృచ్చిక రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరికి అకస్మాత్తుగా ధన లాభాలు కలగడమే కాకుండా.. జీవితంలో వస్తున్న అనేక కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కోరుకున్న కోరికలు సింపుల్‌గా నెరవేరి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా లభించబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు ఎంతో సులభంగా చేయగలిగి సింపుల్గా విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Irumudi Collection: రూ.100 క్లబ్‌లోకి రవితేజ 'ఇరుముడి'..మాస్ మహారాజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్టర్!

Hyderabad, Telangana:Irumudi Rs 100 Crore Collection: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే నుంచే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన వారంలోపే రూ.100 కోట్ల కలెక్షన్ల్ గ్రాస్ ను కొల్లగొట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది.
0
0
Report

Fastag Traffic Fines: వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై ఫాస్టాగ్‌ ద్వారా ట్రాఫిక్ చలాన్లు ఆటోమేటిక్ వసూళ్లు!

Hyderabad, Telangana:

Fastag Traffic Fines Deduction: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా రవాణా బలోపేతం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి సాంకేతికత సాయంతో ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల ఈ-చలాన్ జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఈ సరికొత్త ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధానానికి సంబంధించి హెచ్‌ఎండీఏ (HMDA) అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, అనుమతులు, సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుత విధానం ప్రకారం కెమెరాలు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి వాహనదారులకు ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే, చాలామంది వాహనదారులు ఈ జరిమానాలను వెంటనే చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల బకాయిల వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తోంది. కానీ కొత్తగా ప్రతిపాదించిన ఫాస్టాగ్ అనుసంధాన విధానం అమల్లోకి వస్తే, జరిమానా విధించిన వెంటనే మొత్తం ఆటోమేటిక్‌గా వసూలైపోతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ విధానం కేవలం చలాన్ల వసూళ్లకే కాకుండా, నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను జోడించే దిశగా ఒక కీలక అడుగు కానుంది. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారిపై తక్షణ ఆర్థిక ప్రభావం పడుతుంది. అయితే, ఈ కొత్త విధానం ఎప్పుడు అమలవుతుంది? జరిమానాలు ఏ నిబంధనల ప్రకారం కట్ చేస్తారు? ముందస్తు సమాచారం ఎలా ఇస్తారు? అనే విషయాలపై ఇంకా అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఏదేమైనా, ఈ సరికొత్త నియమం అమల్లోకి వస్తే చలాన్ పడిన వెంటనే ఫాస్టాగ్ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది కాబట్టి, ఇది వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పెట్టే విషయమేనని సాధారణ జనం అభిప్రాయపడుతున్నారు.

Also Read: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్..రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రెస్‌మీట్

Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top