తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండగ సాయన్న జయంతి
Hyderabad, Telangana:తెలంగాణ సాయుధ దళాల పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహోత్సవం సేవలను పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ డ్యాం పైన సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
TDP Mahanadu 2026: టీడీపీ శ్రేణుల్లో జోష్.. రేపటి నుంచే పసుపు పండుగ
Amaravathi, Andhra Pradesh:Telugu Desam Party Mahanadu 2026: ఆంధ్రప్రదేశ్లో మరోసారి పసుపు పండుగ జరగనుంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో జరగనుంది. తొలిసారి మహానాడు డిజిటల్ పద్ధతిలో జరగనుండడంతో కొంత విశేషంగా నిలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు 3 రోజుల పాటు నిర్వహించుకుంటూ వస్తోంది. పార్టీతోపాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు, పార్టీ బలోపేతం వంటి వాటిపై చర్చించడం మహానాడు లక్ష్యం.
టీడీపీ డిజిటల్ అడుగులు
నెల్లూరు వేదికగా మహానాడు కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహించాలని ప్రణాళిక వేసుకోగా రద్దు చేసింది. డిజిటల్ వేదికగా హైబ్రిడ్ విధానంలో జరగనున్న మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలందరిని భాగస్వామ్యం చేయనున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో భౌతికంగా మహానాడు నిర్వహిస్తారు. దానికి అనుసంధానంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి.. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంతో అనుసంధానం చేస్తారు.
Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతోపాటు నాయకులతో మాట్లాడిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో మహానాడు జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడించడం ద్వారా కార్యకర్తల్లో జోష్ తీసుకురానున్నారు. నేరుగా పార్టీ సిద్ధాంతాలపై మరింత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. స్త్రీశక్తిలో భాగంగా మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహానాడులో కీలకంగా చర్చించనున్నారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడులో రోజు 6 గంటల పాటు పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిజిటల్ మహానాడు జరగబోతుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి క్లస్టర్ వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్లలో నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరిశీలిస్తున్నారు.
Gold Treasure: భూమిని తవ్వితే బంగారం నాణేలు ప్రత్యక్షం.. గుప్తనిధి విలువ ఎన్ని కోట్లు తెలుసా?
Schieren, Diekirch:Ground Unearths 141 Gold Coins: రాజుల కాలం నాటి బంగారం బయటపడింది. మట్టిని తవ్వుతుండగా బంగారం నిధి వెలుగులోకి వచ్చింది. భూమి నుంచి బంగారు నాణేలు బయటపడడంతో అక్కడి స్థానికులు ఆసక్తిగా గమనించారు. అయితే ఆ బంగారం ఇప్పటిది కాదని కొన్ని వేల సంవత్సరాల కిందటిదని తేలింది. బయటపడిన గుప్తనిధిలో బంగారు నాణేలు ఉన్నాయి. ఆ నాణేల విలువ కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆ బంగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లక్సెంబర్గ్ దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న హోల్జ్థమ్ గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో సుమారు 1,700 సంవత్సరాలుగా భూమిలో పాతిపెట్టి ఉన్న బంగారం బయటపడింది. బయటపడిన బంగారు నాణేలు 141 ఉన్నాయి. అవి రోమన్ చక్రవర్తుల కాలానికి సంబంధించినవని తెలిసింది. ఆ బంగారానికి అత్యంత విలువ ఉంటుంది. వీటి విలువ లక్షల యూరోలు (లక్సెంబర్గ్ కరెన్సీ) ఉండవచ్చని సమాచారం.
Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
ఇది తెలుసుకున్న చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు వెంటనే హోల్జ్థమ్ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. మొదట్లో ఇది కేవలం ఒక చిన్న లోహపు ముక్క అని భావించినా.. తర్వాత పరిశోధన చేయగా చివరి రోమన్ సామ్రాజ్యానికి చెందిన బంగారం నాణేలు అని గుర్తించారు. ఆ బంగారానికి డబ్బు విలువ కంటే చారిత్రక విలువ అంతకన్నా ఎక్కువ ఉంది. రోమన్ చక్రవర్తుల పాలనకు సంబంధించిన భౌతిక ఆధారాలు లభించడం చాలా అరుదు.
Also Read: Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్
బంగారం లోహపు నాణేలు రోమన్ చక్రవర్తులకు సంబంధించినది లభించడంతో చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు ప్రాముఖ్యత అంతకంటే చాలా ఎక్కువ. లభించిన 141 నాణేలు విడివిడిగా లేకుండా ఒకే చోట జాగ్రత్తగా భద్రపరచి ఉండడం గమనార్హం. ఈ నిధిలో 'సోలిడి' అని పిలిచే 141 బంగారు నాణేలు ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యం అంతమవుతున్న సమయంలో క్రీస్తు శకం 4వ, ఐదో శతాబ్దాల మధ్య వీటిని ముద్రించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
భూగర్భంలోనే బంగారం
రోమన్ చక్రవర్తుల కాలం అంతమిస్తున్న సమయంలో దండయాత్రలు, ఆర్థిక సంక్షోభం ఎదురవడంతో ఆ గ్రామంలోని ఒక ధనిక కుటుంబం, లేదా ఎవరైనా అధికారి తమ అమూల్యమైన సంపదను భూగర్భంలో భద్రపరచి ఉంటారని పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు దాచిన బంగారం వేల సంవత్సరాల తర్వాత బయటపడడం విశేషం. శతాబ్దాల పాటు భూగర్భంలోనే ఉండిపోయిన ఈ బంగారం కరిగిపోకపోవడం గమనార్హం.
గతంలోనే తవ్వకాలు
నాణేలపై రోమన్ చక్రవర్తుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఒక చక్రవర్తి కాకుండా పలువురి చిత్రాలు నాణేలపై ఉండడంతో ఆ కాలంలో రాజకీయ అస్థిరత కారణంగా తరచూ చక్రవర్తులు మారిన విషయాన్ని నాణేలు చెబుతున్నాయి. గతంలో కూడా పలుచోట్ల బంగారం నిల్వలు బయటపడ్డాయి. పలుచోట్ల దాచి ఉంచిన గుప్తనిధులు బయటపడ్డాయి. 2019లో ప్రస్తుతం బయటపడిన ప్రాంతంలోనే ఒక పొలంలో బంగారు నాణెం గుర్తించారు. ఆ ఆధారంతో తవ్వకాలు చేపట్టగా తాజాగా 141 బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో భారీగా చారిత్రక ఆధారాలు బయటపడుతుండడంతో భవిష్యత్లో మరిన్ని తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది.
Telangana MSME Summit: MSMEలే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక...రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధన కోసం గ్రీన్ మానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు: మంత్రి శ్రీధర్ బాబు
Lakshmapur, Telangana:Telangana MSME Summit: సుస్ధిరత అలాగే ఆర్థిక అభివృద్ధి కలిసి నడిచేలా ఒక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను తెలంగాణ నిర్మిస్తోందని.. MSMEలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అని సగర్వంగా ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు. గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ వైపు మార్పు రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనకు కీలకమని ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ MSME గ్రీనింగ్ సమ్మిట్ – ఎ ర్యాంప్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
వివరాల్లోకి వెళితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), అలాగే హైదరాబాద్ ఎస్ అండ్ టి క్లస్టర్ సంయుక్తంగా తెలంగాణ MSME గ్రీనింగ్ సమ్మిట్ – ఎ ర్యాంప్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని HITEX Exhibition Centre లో అంగరంగ వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం MSMEల పనితీరును మెరుగుపరచడానికి కేంద్ర MSME మంత్రిత్వ శాఖ చేపట్టిన RAMP – రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ స్కీం కింద నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించడం విశేషం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలంగాణ పరిశ్రమల శాఖ, TGSPDCL, MSME DFO, TGIIC వంటి కీలక ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో తెలంగాణ MSME గ్రీనింగ్ పోర్టల్, MSME అసెస్మెంట్ టూల్కిట్ను ఆవిష్కరించారు. MSMEలు ర్యాంప్ కార్యక్రమంపై సమాచారం తెలుసుకోవడానికి, ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి ఇవి ఒకే డిజిటల్ వేదికగా పనిచేయనున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలోని MSME పరిశ్రమలను పర్యావరణహిత దిశగా మార్చేందుకు ఇండస్ట్రియలిస్టులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల సంఘాలు, బ్యాంకులు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్లు, ఎనర్జీ నిపుణులు, పరిశోధనా సంస్థలు ఒకే వేదికపై చర్చలు జరిపాయి. సమ్మిట్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశాల్లో MSME పారిశ్రామిక వేత్తలు తమ గ్రీన్ ఇనిషియేటివ్ ప్రయాణంలో అనుభవాలను పంచుకున్నారు. విద్యుత్ ఆదా టెక్నాలజీలు, శుభ్రమైన తయారీ విధానాలు, డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్స్ అమలులో ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ.. RAMP – రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ కార్యక్రమం MSMEల పోటీ సామర్థ్యం, స్థిరత్వం, వ్యాపారాలను పెంచే మంచి అవకాశం అని పేర్కొన్నారు. ర్యాంప్ కార్యక్రమం ద్వారా మార్కెట్ యాక్సెస్ పెంపుదల చేయడం, నాణ్యత ప్రమాణాలు, సస్టైనబిలిటీ, క్లస్టర్ అభివృద్ధి, టెక్నాలజీ అడాప్టేషన్, MSMEల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణను దేశంలోనే గ్రీన్, బాధ్యతాయుత పరిశ్రమల అభివృద్ధికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడమే ఈ కార్యక్రమం తుది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసే MSME ఎకోసిస్టమ్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని పలువురు అధికారులు ఈ సందర్భగా తెలిపారు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Business Ideas: కేవలం ఒక మిషిన్ కొనుక్కుంటే చాలు...ఆడుతూ పాడుతూ రోజుకు రూ. 5000 సంపాదించే అవకాశం..ఏం చేయాలంటే..?
Lakshmapur, Telangana:Business Ideas: నిరుద్యోగ యువత వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారా? ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఉన్న ఊరిలోనే చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కనీసం 5000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి బిజినెస్ గురించి తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆ కార్లను శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. కారు శుభ్రం చేయించడానికి కార్ సర్వీస్ సెంటర్లకు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. హ్యాండీ కార్ వాషర్ ఉపయోగించి డోర్స్టెప్ కార్ క్లీనింగ్ సర్వీస్ (Doorstep Car Cleaning Service) ప్రారంభించడం ద్వారా అద్భుతమైన బిజినెస్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలను అందించేందుకు చక్కని అవకాశంగా చెప్పవచ్చు.
కస్టమర్ల ఇళ్లకు లేదా ఆఫీసులకు వెళ్లి, వారు ఉన్న చోటే వారి కార్లను ప్రొఫెషనల్గా క్లీన్ చేయడం ఈ వ్యాపారంలో అసలు సీక్రెట్. దీని వల్ల కస్టమర్ సమయం ఆదా అవ్వడం, తక్కువ నీటితో క్లీనింగ్, కస్టమర్ కళ్ల ముందే సర్వీస్ లభిస్తుంది. దీని కోసం బ్యాటరీతో నడిచే లేదా పోర్టబుల్ హై-ప్రెజర్ వాషర్ కోసం సుమారు రూ. 10 వేలు ఉంటుంది. కార్ ఇంటీరియర్ క్లీనింగ్ కోసం వాక్యూమ్ క్లీనర్ కొనాలి. దీని ధర రూ. 5000 ఉంటుంది. కార్ షాంపూ, డాష్బోర్డ్ పాలిష్, టైర్ పాలిష్, గ్లాస్ క్లీనర్ కారుపై గీతలు పడకుండా తుడవడానికి మైక్రోఫైబర్ క్లాత్స్ ఇలా మొత్తం పెట్టుబడి సుమారు రూ. 25000 వరకూ ఖర్చు అవుతుంది. మీరు ఒక టూ వీలర్, లేదా చిన్న కారులో ఈ సెటప్ అంటే ఏర్పాటు చేసుకొని బిజినెస్ ప్రారంభించవచ్చు.
Also Read: ప్రగతినగర్,నిజాంపేట్లో అమ్ముడుపోని ప్లాట్లు
ఇక ధరల విషయానికి వస్తే బేసిక్ ఎక్స్టీరియర్ వాష్ ధర హై ప్రెజర్ వాటర్ వాష్, షాంపూ, టైర్ క్లీనింగ్ కోసం రూ. 200 నుంచి రూ. 350 వరకూ చార్జ్ చేయవచ్చు. డీప్ ఇంటీరియర్ క్లీనింగ్ అంటే వాక్యూమ్ క్లీనింగ్, డాష్బోర్డ్ పాలిషింగ్, మ్యాట్ క్లీనింగ్ కోసం రూ. 300 నుంచి రూ. 500 వరకూ చార్జ్ చేయవచ్చు. ప్రీమియం ఫుల్ కార్ వాష్ కింద కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్, కలిపి వాక్సింగ్ , పాలిషింగ్ సర్వీసులతో రూ. 500 నుంచి రూ. 800 వరకూ చార్జ్ చేయవచ్చు.
నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కింద వారానికి ఒకసారి చొప్పున నెలలో 4 వాష్లకు గానూ 1800 నుంచి 2000 వరకూ వసూలు చేయవచ్చు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, బిజీ ప్రొఫెషనల్స్ టార్గెట్ కస్టమర్లు గా ఎంపిక చేసుకొని విజిటింగ్ కార్డులు, లేదా పాంప్లెట్స్ పంచడం ద్వారా మీరు కస్టమర్లను పొందవచ్చు. పండగల సమయంలో ఆఫర్స్, డిస్కౌంట్స్ అందుబాటులో ఉంచితే మరింత మంది కస్టమర్లు లభిస్తారు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: గంజాయి కేసులో కోర్టు సంచలన తీర్పు.. ఏడేళ్ల జైలు, భారీ జరిమానా!
Jagtial, Telangana:Jagtial Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గంజాయి సాగు తో పాటు అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు కోర్టు ఏడేళ్ల పాటు కఠిన కారాకార శిక్షతో పాటు పదివేల చొప్పున జరిమానా విధించినట్లు జగిత్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
కొడిమ్యాల పరిధిలో కొద్ది రోజుల క్రితం నిషేధిత గంజాయిని అక్రమంగా సాగు చేస్తూ.. ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకొని..ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు పకడ్బందీగా విచారించిన కొడిమ్యాల పోలీసులతో పాటు నిందితులకు వ్యతిరేకంగా పక్క సాక్షాధారాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు..
సాక్షాలను పరిశీలించిన గౌరవ న్యాయస్థానం.. నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో వారికి ఏడు సంవత్సరాల పాటు కఠిన జైలు శిక్షతో పాటు తల పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తుది తీర్పును వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. యువత భవిష్యత్తును నాశనం చేస్తే సహించేది లేదని.. మారకద్రవ్యాల రవాణా తో పాటు విక్రయాల ద్వారా యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. గంజాయి ముఠాలపై నిరంతరం నిఘా ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యాసంస్థల పరిసరాలతో పాటు మారుమూల గ్రామాల్లో గంజాయి సరఫరా కాకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి విఘాతం కలిగించేలా ఎవరైనా మారకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిందితులకు శిక్షపడేలా శ్రమించిన కొడిమ్యాల పోలీసు సిబ్బందిని.. ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Liquor Price: లిక్కర్ ధరలు పెంచొద్దు బాబోయ్.. కలెక్టరేట్కు మందుబాబుల వినూత్న లేఖ..
Hyderabad, Telangana:Telangana Liquor Price Hike News: రాష్ట్రంలోని జూన్ రెండవ తేదీ తర్వాత మద్యం ధరలు పెరుగుతున్నాయని ప్రచారం జోరుగా సాగుతూ ఉండడంతో.. మద్యం ప్రియులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న తాము.. ఇప్పుడు లిక్కర్ రేట్లు కూడా పెంచితే భరించే స్థితిలో లేమంటూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.. మద్యం ధరలను పెంచవద్దంటూ.. స్థానిక మద్యం ప్రియులు ఏకంగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్కు ఓ బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్కు పంపిన లేఖలు మద్యం ప్రియులు తమ అభ్యర్థనను వినూత్నంగా.. ఎంతో ఆవేదనతో కూడిన స్వరంతో వ్యక్తపరచినట్లు తెలుస్తోంది.. పరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలతో పోలిస్తే ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. మధ్యతరగతి.. శ్రామిక వర్గాల ప్రజలు తమ రోజంతా పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి, కాస్త ఉపశమనం కోసం మద్యంపై ఆధారపడుతూ ఉంటారని.. అలాంటిది మళ్లీ ధరలను పెంచితే ఆ అదనపు భారాన్ని మేము మోయలేమని.. లేఖలో పేర్కొన్నారు..
ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని వారు కలెక్టర్ ను కోరారు.. ప్రస్తుతం ఉన్న ధరలనే.. యధాతధంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలుస్తోంది. కాక కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఈ వినూత్న లేక కు సంబంధించిన స్క్రీన్షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా దీనిపై రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మద్యం ప్రియులు కూడా తమ హక్కుల కోసం ఈ స్థాయిలో స్పందించడం విచిత్రంగా ఉన్న.. వారి బాధలోనూ నిజం ఉందని కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
మరోవైపు ప్రతి ఏట జూన్ నెలలో బడ్జెట్ అంచనాలతో పాటు ప్రభుత్వ ఆదాయ వనరుల సమీక్ష నేపథ్యంలో మద్యం ధరల పెంపుపై ప్రచారం జరగడం సర్వసాధారణమే అయినప్పటికీ.. ఈసారి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఈ లేక పై అటు జిల్లా యంత్రాంగం.. ఇటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇలా చాలామంది మందుబాబులు కలెక్టర్లతో పాటు ఇతర అధికారులకు కూడా లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. కానీ ఈ లేక వాటన్నిటికంటే చాలా భిన్నంగా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sekhar Master: తిరుమల శ్రీవారి సేవలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్
Dharmavaram, Andhra Pradesh:Star Choreographer Sekhar Master Tirumala Temple Darshan Along With His Family Watch VideoJaya Prada: శ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో హీరోయిన్ జయప్రద
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:Actress Jaya Prada Visits Srikalahasti Temple And Offers Rahu Ketu Pooja Watch VideoCobra Shed Video: వామ్మె.. నాగుపాము కుబుసాన్ని చేతులతో వలిచేసిన యువకుడు.. వీడియో..
Hyderabad, Telangana:Cobra Shed Video Watch Here: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా వన్యప్రాణులు, విషసర్పాలకు సంబంధించిన వీడియోలకైతే నెట్టింట ఊహించని స్థాయిలో క్రేజ్ లభిస్తూ వస్తోంది. తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా పాముల పేర్లు చెబితేనే అడుగు వెనక్కి వేసే జనాలు ఉన్న ఈ రోజుల్లో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కుబుసాన్ని చేతులతో వలిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన పాములు తమ చర్మాన్ని మార్చుకునే క్రమంలో పాత చర్మాన్ని వీడుతుంటాయి. ఈ సమయంలో అవి తీవ్రమైన ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాయి. అందుకే ఆ సమయంలో వాటికి దూరంగా ఉండడం మంచిదని వన్యప్రాణి నిపుణులు చెబుతుంటారు. కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్లో ఉందని భావించవచ్చు.. ఒక భారీ నాగుపాము యువకుడు పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు..
అతను ఏమాత్రం భయం లేకుండా.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ నాగుపాము తల భాగం నుంచి కుబుసాన్ని తన చేతులతో మెల్లగా తొలగించడం ప్రారంభించాడు. పాము కళ్లపై ఉన్న తెల్లటి పొరను సైతం అతను చాలా సున్నితంగా విడదీశాడు.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ యువకుడు అంత సాహసం చేస్తున్నా.. ఆ విషసర్పం అతడిపై దాడి చేయడానికి అస్సలు ప్రయత్నించడంలేదు.. ఎదురు తిరగకుండా..తల దించుకుని అతను చేస్తున్న పనికి సహకరించినట్లుగా ప్రశాంతంగా ఉండిపోవడం మీరు చూడొచ్చు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో అప్లోడ్ అయిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్, వేలాది షేర్లతో దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అయితే, చాలా మంది ఆ యువకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్.. పాముకు ఎంతటి ఉపశమనాన్ని అందించాడో! అని కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్. కాస్త తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Real Estate: మే 28 నుంచి తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు... దీనివల్ల కలిగే లాభమేంటి రియల్ ఎస్టేట్ కు బూస్ట్ వస్తుందా..?
Lakshmapur, Telangana:Hyderabad Real Estate: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో భూముల మార్కెట్ విలువ పెంపును అమలు చేయనుంది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ పెంపుదల కార్యక్రమం చేపట్టిందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ పెంపుదల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా బూస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పెంపుదల కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 100శాతం వరకు ఉండేలా సీలింగ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
భూములు ధరలు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతున్నాయి..:
హైదరాబాద్ పరిధిని 350 ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల మార్కెట్ ట్రెండ్ మరియు డిమాండ్ను బట్టి ప్రత్యేక రేట్లను ఖరారు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎకరా కనిష్ట విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల సగానికి పైగా ప్రాంతాల్లో ప్లాట్ల విలువను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అపార్ట్మెంట్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం 3500 నుంచి 4 వేల వరకు ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ విలువను 6000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రీమియం ఏరియాల్లో పెరిగే రేట్లు ఇవే..:
ఇక ప్రీమియం స్థలాలుగా పిలవబడే కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి వంటి ప్రాంతాల్లో ఎకరా ధర ప్రభుత్వ విలువ ప్రస్తుతం రూ. 2 కోట్లు ఉండగా, దాన్ని 4 కోట్ల వరకు పెంచాలని ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో చదరపు గజం విలువ రూ. 80,000 - రూ. 90,000కు చేరుకోనుంది. ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా అదనంగా రూ. 1,000 నుండి రూ. 1500 కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: ప్రగతినగర్,నిజాంపేట్లో అమ్ముడుపోని ప్లాట్లు
భూముల పెంపుదల వల్ల లాభాలు ఇవే..:
నిజానికి బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వ ధర్మం మాత్రం అలాగే ఉన్నాయి దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా తగ్గింది. అందుకే బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ ధరలకు మధ్య ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమి బేస్ రేట్లు పెరిగినట్లు అయితే ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం పెంచిన విలువను గైడ్ లైన్ వాల్యూ అని పిలుస్తారు లేదా సర్కిల్ రేట్ అని కూడా పిలుస్తారు. అంటే ఒక ప్రాంతంలో భూములను ఆస్తులను నిర్ణయించే మినిమం ధరగా చెప్పవచ్చు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: రికార్డుల్లేవు.. తిరగని బండ్లకు డీజిల్ బిల్లులు.. జగిత్యాల మున్సిపాలిటీలో విస్తుపోయే అక్రమాలు!
Hyderabad, Telangana:Jagtial Municipality Scam Latest News: జగిత్యాల (JGTL) మున్సిపాలిటీలో గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న అక్రమాలతో పాటు నిధుల దుర్వినియోగం బట్టబయలవుతున్నాయి. బల్దియాలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ఏసీబీతో పాటు జిలెన్స్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేకమైన విచారణ ఇప్పుడు స్థానికంగా అధికారుల్లో చర్చనీయాశానికి దారి తీస్తోంది. లక్షల రూపాయాల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పలువురు అధికారుల గుట్టు రట్టవుతుండటంతో మున్సిపల్ వర్గాల్లో వణుకు మొదలైన్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లలో ఐదుగురు కమిషనర్లు.. ఏకంగా కొంతమంది జైలుకు..
జగిత్యాల మున్సిపాలిటీలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో.. చెప్పడానికి ఇక్కడి అధికారుల బదిలీలతో పాటు అరెస్టులే నిదర్శనంగా నిలుస్తూ వస్తున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో పలువురు కమిషనర్లు ఇక్కడికి రావడంతో పాటు అవినీతి ఆరోపణలతో బదిలీపై వెళ్లడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే మరికొందరు అధికారులు ఏకంగా ఏసీబీకి చిక్కి ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టడం బల్దియాలోని అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది. పాలకుల అండదండలు చూసుకుని.. అధికారుల చేతివాటం తోడై మున్సిపాలిటీని అవినీతి కూపంగా మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.
రూ. 15 కోట్ల పనులకు రికార్డులే లేవు..
విజిలెన్స్ విభాగంలో జరిపిన ప్రత్యేకమైన విచారణలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని గత కోన్ని సంవత్సరాలు చేపట్టిన సుమారు రూ.15 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ఎలాంటి రికార్డులతో పాటు ఆధారాలు మున్సిపల్ కార్యాలయంలో రికార్డ్లో లేవని సంచారం.. పనులు చేయకుండానే కాగితాల్లో చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారా? లేక నిధులను పూర్తిగా పక్కదారి పట్టించారా? అనే కోణంలో అధికారులు లోతుగా ప్రత్యేకమైన దర్యాప్తును కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
మున్సిపాలిటీని ముంచేసిన కుంభకోణాలు..
ఈ కుంభకోణంలో భాగంగా మున్సిపల్ వాహనాలకు కేటాయించే డీజిల్ వినియోగంలో భారీగా అవకతవకలు జరిగిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తిరగని వాహనాలకు కూడా తిరిగినట్లు చూపిస్తూ లక్షల రూపాయల డీజిల్ బిల్లులు స్వాహా చేసిన్నట్లు సమాచారం.. కొంతమంది అధికారులు పట్టణంలో శానిటేషన్, మెయింటెనెన్స్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా పనుల్లో ఇలాంటి మోసాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీకి చెందిన కొన్ని పాత వాహనాలతో పాటు విలువైన ప్రభుత్వ స్థలాల రికార్డులు, రిజిస్టర్లు కార్యాలయం నుంచి మాయమవ్వడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sun Transit 2026: సూర్య గ్రహ సంచారంతో బంపర్ లాభాలు.. మే 26 నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Hyderabad, Telangana:Sun Transit In Rohini Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ఎంతో శక్తివంతమైన గ్రహంగా కూడా చెప్పుకుంటారు. అన్ని నెలల పాటు సంచారం చేసే గ్రహాల్లో ఇది ఒకటి.. అయితే, ఈ గ్రహ సంచారం కారణంగా ప్రతి రాశి చాలా వరకు ప్రభావితం అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆయా రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా సూర్యుడి ప్రభావంతో కొన్ని రాశులవారు భారీ లాభాలు పొందుతారు. ఇదిలా ఉంటే మే 25వ తేదిన సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు. ఈ నక్షత్రాన్ని ఆనందం, ఆకర్షణ, సంపదతో పాటు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అయితే, ఈ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారు చాలా వరకు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి:
సూర్యుని అనుగ్రహంతో ఈ రోజు నుంచి వృషభ రాశివారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో కొత్త కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు భవిష్యత్తులో కొత్త పరిచయాలు కూడా పొందుతారు.
సింహ రాశి:
సింహ రాశివారికి సూర్యుడి నక్షత్ర సంచారంతో అద్భుతమైన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అలాగే యువత చదువుల్లో కూడా చాలా వరకు రాణిస్తారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బలంగా మారుతాయి. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు భారీ మొత్తంలో ధనం పెట్టుబడి పెడతారు.
ధనుస్సు రాశి:
సూర్య సంచారం ప్రభావంతో ధనుస్సు రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు భూమి, ఇల్లు, ప్లాట్ లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిసిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా వీరు తిరిగిపొందుతారు. అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి కూడా లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందంతో పాటు శాంతిని కూడా సొంతం చేసుకుంటారు. అలాగే వీరు శాంతిని కూడా పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev: శని దేవుడి బంపర్ ఆఫర్.. ఆ రాశుల వారికి అపార ధనలాభం, కోరిన కోరికలు నెరవేరే సమయం!
Hyderabad, Telangana:Shani Dev Blessing On Zodiac: శని దేవుడిని వ్యక్తుల కర్మ గ్రహంగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని సూర్యుడి కుమారుడిగా కూడా పిలుస్తారు. శని వక్తుల మంచి, చెడు కర్మలకు అనుగుణంగా ఫలితాలను అందిస్తాడు. అలాగే దీనిని అత్యంత క్రూరమైన గ్రహంగా కూడా చెప్పకుంటారు. ఈ శని ప్రభావం వల్ల దేవతలు సైతం తప్పించుకోలేకుండా ఉంటారు. కాబట్టి అన్ని గ్రహాల ప్రభావంతో పోలిస్తే.. ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. మే 17న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి సంచారం చేసిన సంగతి తెలిసిందే.. అక్టోబర్ 9 వరకు ఈ గ్రహం ఇక్కడే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కొన్ని రాశులవారికి శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
శని గ్రహం ప్రభావంతో మిథున రాశివారికి అక్టోబర్ 9 వరకు అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగాలు లేనివారు ఈ సమయంలో తప్పకుండా ఉద్యోగాలు కూడా పొందుతారు. అలాగే ఇప్పటి ఉద్యోగాలు చేస్తున్నవారు మీ బాస్ల నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా పొందుతారు. వీరు సీనియర్ల నుంచి కూడా అద్భుతమైన స్కిల్స్ నేర్చుకుంటారు.
తులారాశి
శని దేవుని ఆశీస్సులతో తులారాశి వారికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అంతేకాకుండా కొత్త ఆస్తి లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడి ప్రభావంతో నాలుగు నెలల పాటు అదృష్టం ఊహించని స్థాయిలో పొందుతారు. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా తిరిగి ఊపందుకుంటాయి. కొత్త ఆస్తి లేదా కారు కొనుగోలు చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో పెళ్లికాని వారి జీవితంలోకి ఒక కొత్త భాగస్వామి పొందుతారు.
వృషభ రాశి
శని ప్రభావంతో వృషభ రాశివారికి ఈ సమయం ఒక వరంలా మారుతుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఆగిపోయిన మార్కెట్లో డబ్బులు ఈ సమయంలో తప్పకుండా అకస్మాత్తుగా తిరిగి పొందుతారు. ఆర్థిక పునాదులు కూడా మరింత బలోపేతమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాల్లో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇష్టమైన పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్తో పాటు వ్యాపారాలు చేసేవారు అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనుస్సు రాశి
రాబోయే నాలుగు నెలల పాటు ధనుస్సు రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. డబ్బుల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు కూడా అనుకున్నంత స్థాయిలో పొందుతారు. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో ధన లాభాలు పొంది.. విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు కొత్త కొత్త ప్రాజెక్ట్ల నుంచి సంపాదన కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో ధనం పొదుపు చేయడం వల్ల కెరీర్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Taiwan stock market: వణుకుతున్న చైనా.. స్టాక్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తోన్న Taiwan.. కారణాలు ఇవే..!!
Lakshmapur, Telangana:Taiwan stock market: గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సాక్ష్యమిస్తోంది. ఆర్టిఫికషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అపూర్వమైన విజ్రుంభణ, ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ అయిన తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ భారీ వృద్ధి కారణంగా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా తైవాన్ భారత్ ను అధిగమించింది. తాజాగా బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన డేటా ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ 4.95 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 415 లక్షల కోట్లు. భారత మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్లకు పడిపోయింది. ఈ చారిత్రాత్మక విజ్రుంభణతో అమెరికా, చైనా, జపాన్, హాంగ్ కాంగ్ ల తర్వాత చైనా ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరించింది. అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ 77.53 ట్రిలియన్లు కాగా.. దాని తర్వాత చైనా 15.61 ట్రిలియన్లు, జపాన్ 8.70 ట్రిలియన్లు, హాంగ్ కాంగ్ 7. 25 ట్రిలియన్లతో ఉన్నాయి.
అయితే తైవాన్ సాధించిన ఈ విజయం వెనక TSMC వన్ మ్యాన్ షోగా నిలిచిందని చెప్పాలి. ఈ ఒకే ఒక కంపెనీ ఎందుకంటే తైవాన్ ప్రధాన సూచీ అయిన బెంచ్ మార్క్ ఇండెక్స్ లో ఒక టీఎస్ఎంసీ కంపెనీకే 42శాతం మేర భారీ వాటా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ విప్లవంలో ఉపయోగించే అధునాతన సెమీకండక్టర్ల రంగంలో కూడా ఈ కంపెనీదే పూర్తి ఆధిపత్యం కొనసాగుతోంది. ఫలితంగా ఈ ఏడాదిలో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 49శాతం మేర పెరిగాయి. ఏఐ రంగంలోని ఈ అపారమైన ఉత్సాహంతోపాటు ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలుగా ఉన్న తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ప్రపంచ ఏఐ పెట్టుబడి చక్రానికి కేంద్రంగా నిలుస్తూన్న టెక్ హార్డ్ వేర్ రంగంలో తైవాన్ ఆధిపత్యం చెలాయించడంతోపాటు దాని పెరుగుతున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ప్రధాన కారణమని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ మేనేజర్ యి పింగ్ లియానో అన్నారు. టెక్ హార్డ్ వేర్ లేని మార్కెట్లు ఇప్పుడు తైవాన్, కొరియా వంటి దేశాల కంటే వెనకబడి ఉన్నాయని వెల్లడించారు. దీనికితోడుగా తైవాన్ ఆర్థిక నియంత్రణ సంస్థలు ఈమధ్య దేశీయ ఫండ్స్ ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేసే లిమిట్ ను పెంచాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫండ్స్ ఇప్పుడు టీఎస్ఎంసీ వంటి లార్జ్ క్యాప్ కంపెనీలో తమ మొత్తం ఆస్తుల్లో 25శాతం వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది గతంలో 10శాతంగా మాత్రమే ఉండేది. ఈ నిబంధన మార్చిన తర్వాత తైవాన్ మార్కెట్లోకి 6 బిలయన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులను తీసుకురాగలదని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
Also Read: ఈ ప్రభుత్వ పథకంలో చేరితే రూ.1 కోటి మీ సొంతం.. Post Office సూపర్ హిట్ Scheme ఇదే..!!
చైనా మార్కెట్లో అనిశ్చితి.. ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల మార్కెట్లు ఒత్తిడికి గువుతుంటే.. గ్లోబల్ ఇన్వెస్టర్లకు తైవాన్ ఒక సురక్షితమైన టెక్ హబ్ మాదిరి కనిపించేలా చేసింది.
Also Read: ఒకే పాలసీ.. భార్యాభర్తలిద్దరికీ కోట్లలో కవరేజ్.. ఎల్ఐసీ కొత్త స్కీమ్ డీటెయిల్స్ ఇవే!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Crorepati Govt Scheme: ఈ ప్రభుత్వ పథకంలో చేరితే రూ.1 కోటి మీ సొంతం.. Post Office సూపర్ హిట్ Scheme ఇదే..!!
Lakshmapur, Telangana:Crorepati Govt Scheme: మన దేశంలో పోస్టాఫీస్ అంటే కేవలం సమాచారం చేరవేసే సంస్థ మాత్రమే కాకుండా ప్రజలకు పొదుపు అలవాటు చేసే ఒక వ్యవస్థగా కూడా మారింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఊరిలో ఉంటుందనే భరోసా, కళ్ల ముందే కనిపించే ఉద్యోగులు, ఎప్పుడైనా వెళ్లే వెసులుబాటు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలుకూడా పోస్టాఫీస్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న భారతీయ పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన సులభమైన పొదుపు పథకాలను తీసుకువస్తోంది. ఇప్పుడు చెప్పుకోబోయే పథకం కూడా అలాంటిదే.
పోస్టాఫీసు స్కీములు సురక్షితమైన పెట్టుబడి, అద్భుతమైన రాబడుల కారణంగా బాగా ప్రాచుర్యం పొందాయి. అలాంటి స్కీముల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఇది పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసే స్కీమ్. ఇందులో పెట్టుబడి పన్ను మినహాయింపులు, క్రమం తప్పని పెట్టుబడుల తర్వాత మెచ్యూరిటీ రాబడిపై పన్ను లేకపోవడం వంటి అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. నెలకు రూ. 12,500 పొదుపుతో రూ. 1కోటీకిపైగా నిధిని కూడబెట్టుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వ స్కీమ్ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది.
సురక్షితమైన పెట్టబడి సాధనాల విషయానికి వస్తే పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు ముందు వరుసలో ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పెట్టుబడి భద్రతకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విషయానికి వస్తే.. ఈ స్కీమ్ ప్రభుత్వ రక్షణను అందించడమే కాదు.. పన్ను రహితమైన భారీ మెచ్యూరిటీ కార్పస్ కూడా అందిస్తుంది. ఈ స్కీమ్ కు ఉన్న అనేక ప్రయోజనాల వల్ల ఈ పథకం బాగా ప్రాచుర్యం పొందింది.
Also Read: ఒకే పాలసీ.. భార్యాభర్తలిద్దరికీ కోట్లలో కవరేజ్.. ఎల్ఐసీ కొత్త స్కీమ్ డీటెయిల్స్ ఇవే!
పీపీఎఫ్ వడ్డీ రేట్లను చూస్తే.. పోస్టాఫీస్ ద్వారా నిర్వహించే ఈ ప్రభుత్వ స్కీమ్ రూ. 7.1శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పీపీఎఫ్ ఖాతా నిబంధనల ప్రకారం డిపాజిట్లపై వడ్డీని ప్రతినెలా 5వ తేదీ నుంచి చివరి తేదీ వరకు లెక్కిస్తారు. అందువల్ల మీరు ఏ నెలలోనైనా 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య మీ పీపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేస్తే మీకు ఆ నెల వడ్డీ అందుతుంది. పీపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేసిన తర్వాత మెచ్యూరిటీ 15ఏళ్లు ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కింద దీనిని 5-5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పెట్టుబడిదారులు పెద్ద నిధిని స్రుష్టించుకోవచ్చు. ఈ ప్రభుత్వ స్కీములో పెట్టుబడి మొత్తం పరిమితి.. ఏడాదికి గరిష్టంగా రూ. 1.50లక్షలు అంటే మీరు ప్రతినెలా రూ. 12,500 పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు రూ. 1.5లక్షల 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మరో 5ఏళ్లు పొడిగించినట్లయితే మీకు వడ్డీ 36.58లక్షలు వస్తుంది. అసలు 66.58లక్షలు లభిస్తాయి. 25ఏళ్ల తర్వాత మరో 5ఏళ్లు పొడిగిస్తే ఈ మొత్తంపై మీకు వడ్డీగా రూ. 68.58లక్షల లభిస్తాయి. అదే సమయంలో మొత్తం అసలు కలిపి రూ. 1.03కోట్లు ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టింది కేవలం రూ. 37.50లక్షలు మాత్రమే. వడ్డీ రూపంలోనే 68.58లక్షల వరకు అందుకుంటారు.
Also Read: నెలకు రూ. 2వేల పొదుపు.. 30ఏళ్లలోనే కోటీశ్వరులు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
