తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండగ సాయన్న జయంతి
Hyderabad, Telangana:తెలంగాణ సాయుధ దళాల పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహోత్సవం సేవలను పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ డ్యాం పైన సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Union Cabinet: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ శుభవార్త.. మంత్రివర్గంలో కీలక నిర్ణయం
Wadgaon, Maharashtra:Indian Railways: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రైల్వే వ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కొన్ని ప్రాజెక్టులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను విస్తరించడంలో భాగంగా తెలంగాణ, ఏపీ మీదుగా పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసేలా రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.
Also Read: TVK Success Secret: తమిళనాడులో టీవీకే విజయ్ సునామీ వెనుక ఒకే ఒక్కడు.. ఎవరాయన?
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ), భారత రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసేలా రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఏపీకి భారీ ప్రయోజనం లభించనుంది.
ప్రాజెక్టుల వివరాలు
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 901 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు (3వ, 4వ లైన్లు) నిర్మించబడతాయి.
==> గుంతకల్ - వాడి (3వ , 4వ లైన్): ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా సాగుతుంది.
==> నాగ్దా - మథుర (3వ , 4వ లైన్): మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది.
==> బుర్హ్వాల్ - సీతాపూర్ (3వ, 4వ లైన్): ఉత్తరప్రదేశ్లో రద్దీని తగ్గిస్తుంది.
Also Read: Election Results 2026: ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే?
గణాంకాలు
మొత్తం ఖర్చు: రూ.23,437 కోట్లు
గడువు: 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
ప్రయోజనం పొందే ప్రాంతాలు: 6 రాష్ట్రాల్లోని 19 జిల్లాలు, 4,161 గ్రామాలు, సుమారు 83 లక్షల జనాభాకు మేలు జరుగుతుంది.
సరుకు రవాణా: ఏడాదికి అదనంగా 60 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది.
ఈ మూడు ప్రాజెక్టులతో పారిశ్రామిక వృద్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, ఇనుము వంటి వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. అంతేకాకుండా పర్యాటక రంగానికి ఊతమిచ్చింది. మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి మఠం), కాసాపురం ఆంజనేయ స్వామి ఆలయం, మథుర, బృందావనం, మహాకాళేశ్వర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రైల్వే రవాణా పెరగడంతో సుమారు 37 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గుతుంది. 185 కోట్ల కిలోల కార్బన్డైయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది కనుక తగ్గితే 7 కోట్ల మొక్కలు నాటడంతో సమానం.
పీఎం-గతి శక్తిలో భాగంగా ఈ ప్రాజెక్టులు రూపొందించారు. 'పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్' కింద కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇది సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుంది. ఈ మల్టీట్రాకింగ్ పనులతో రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Proddutur Murder Case: భార్య లావుగా ఉందని దారుణం.. పాలకోవాలో విషం కలిపి, కిల్లర్ భర్త వేసిన స్కెచ్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
Hyderabad, Telangana:Husband killed Wife For Being Fat In Proddutur: యూట్యూబ్లో హత్య చేయడం ఎలా అని సెర్చ్ చేశాడు.. జవాబు దొరికిన వెంటనే రూ.80 పెట్టి మరీ హైదరాబాద్ నుంచి విషం కొనుగోలు చేశాడు. చివరికి ఆ భార్యకు ఇష్టమైన పాలకోవా లోనే ఆ విషాన్ని కలిపి ఇచ్చాడు. ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ కిరాతక భర్త ఉదాంతం వింటే ఒళ్ళు గగుర్పాటుస్తోంది. అసలు భార్యాభర్తల పై ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. యూట్యూబ్ క్రైమ్ స్కెచ్ ఫాలో అయ్యి పాలకోవాలో విషం కలిపి మరి మర్డర్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇతడు చేసిన దారుణ ఘటన వైరల్ అవుతోంది. పోలీసుల ప్రకారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉండే కిరణ్ కుమార్, పద్మజా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ప్రధానంగా పద్మజ లావుగా ఉందన్న సాకుతో ఆమెను వదిలించుకోవడానికి కిరణ్ ప్లాన్ వేశాడు. అందుకే ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించిన ప్లాన్ వేశాడు. దీనికి యూట్యూబ్ ని ఆసరాగా చేసుకున్నాడు. గంటలకొద్దీ ఎలా మర్డర్ చేయాలా అని సెర్చ్ చేశాడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రూ.80 వేలు పెట్టు మరీ కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. అంతే కాదు తన భార్యకు ఇష్టమైన పాలకోవాలోనే ఆ విషం కలిపి తినిపించాడు. చివరికి ఆమె అపస్మారక స్థితిలో వెళ్లిపోయినా.. చనిపోయిందా? లేదా? అని నిర్ధరించుకోవడానికి దిండుతో ఆమె ముఖంపై అదిమి మరీ చంపేశాడు.
Also Read: తీర్పులు ఇచ్చే చేతులే ప్రాణాలు తీసుకున్నాయి.. జడ్జి అమన్ కుమార్ శర్మ సూసైడ్ మిస్టరీ!
Also Read: బర్గి డ్యామ్లో ఘోర ప్రమాదం.. 30 మందితో వెళ్తున్న క్రూయిజ్ బోల్తా.. ఏడుగురి మృతదేహాల వెలికితీత!
హత్య తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయిందని అందరినీ నమ్మబలికాడు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పద్మజ చనిపోయిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పోలీసులకు కిరణ్ కుమార్ను కూడా విచారించారు. ఇక ఎట్టకేలకు నిందితుడు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. తన భార్య లావుగా ఉందని.. తనను తరచూ అనుమానిస్తుందనే కారణంతోనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. కేవలం భార్య లావుగా ఉందని ఇలాంటి దారుణ ఘటనకు ఒడిగట్టాడు. రాను రాను భార్య భర్తల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. ఈ భర్త వేసిన ప్లాన్ చూస్తే ఒళ్ళు గగ్గురుపొడుస్తోంది. అసలు భార్యాభర్తల మధ్య నమ్మకమే పోతుంది. అయితే వీళ్లు చేసిన దారుణాల వల్ల అనాథలుగా పిల్లలు మారుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP POLYCET 2026: ఏపీ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల.. నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోండిలా! డైరెక్ట్ లింక్ ఇదే!
Hyderabad, Telangana:AP POLYCET 2026 Results Announced:ఎట్టకేలకు ఏపీ పాలిసెట్ 2026 సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల చేసింది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు వెంటనే స్కోరు కార్డ్స్ కూడా ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం మంత్రి లోకేష్ 10 గంటల సమయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ https://polycetap.ap.gov.in/Default.aspx నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ రకాల పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి గాను ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
🔊 AP POLYCET–2026 Results Announced! 📢
This year, a record 1,77,581 candidates registered and 1,63,008 appeared for the examination held on 25.04.2026 — the highest participation ever. Of these, 1,48,950 have qualified, with an overall pass percentage of 91.37%.👏 Delighted…
— Lokesh Nara (@naralokesh) May 5, 2026
Election Results 2026: ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే?
Wadgaon, Maharashtra:TN And WB Election Results: భారతదేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చింది. పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకోగా.. తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారాన్ని సొంతం చేసుకుంది.
Also Read: Narendra Modi: ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: నరేంద్ర మోదీ
పశ్చిమబెంగాల్
మొత్తం స్థానాలు: 293, మ్యాజిక్ ఫిగర్: 148
తృణమూల్ కాంగ్రెస్: 77
బీజేపీ: 211
కాంగ్రెస్: 2
ఇతరులు: 3
తమిళనాడు
మొత్తం సీట్లు : 234, మ్యాజిక్ ఫిగర్ : 118
టీవీకే పార్టీ: 106
డీఎంకే కూటమి: 74
ఏఐడీఎంకే పార్టీ కూటమి: 51
కేరళం
మొత్తం సీట్లు : 140, మ్యాజిక్ ఫిగర్ : 71
యూడీఎఫ్: 102
ఎల్డీఎఫ్: 35
బీజేపీ: 3
Also Read: Pawan Kalyan: టీవీకే విజయ్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం
అస్సాం
మొత్తం సీట్లు : 126, మ్యాజిక్ ఫిగర్ : 64
బీజేపీ కూటమి: 102
కాంగ్రెస్ కూటమి: 21
ఇతరులు : 3
పుదుచ్చేరి
మొత్తం సీట్లు : 30 మ్యాజిక్ ఫిగర్ : 16
ఎన్నార్ కాంగ్రెస్, బీజేపీ కూటమి: 18
కాంగ్రెస్ కూటమి: 6
టీవీకే కూటమి: 3
ఇతరులు: 3
తమిళనాడులో ఎవరికి ఎన్ని ఓట్లు?
విజయ్ టీవీకే పార్టీ: 1.28 కోట్లు
డీఎంకే కూటమి: 1.17 కోట్లు
డీఎంకే పార్టీ ఒంటరిగా సాధించిన ఓట్లు: 83 లక్షలు
ఏఐఏడీఎంకే కూటమి: ఓట్లు 1.08 కోట్లు
ఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు: 77 లక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Narendra Modi: ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: నరేంద్ర మోదీ
New Delhi, Delhi:PM Modi Winning Speech: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా తెలిపారు. పశ్చిమబెంగాల్లో ప్రజాశక్తి గెలిచింది. బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బెంగాల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నా' అని ప్రధాని మోదీ తెలిపారు.
Also Read: Pawan Kalyan: టీవీకే విజయ్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం
'ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఐదు రాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించింది' అని ప్రధాని మోదీ తెలిపారు. 'బీజేపీ కార్యకర్తల సుదీర్ఘ కల, శ్రమ ఫలించింది. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నితిన్ నబీన్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన తొలి ఎన్నిక ఇది. బెంగాల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రవేశించింది. బెంగాల్ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించారు' అని నరేంద్ర మోదీ తెలిపారు. హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని చెప్పారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పరోక్షంగా టీఎంసీ పాలనపై విమర్శలు చేశారు.
ఈ ఎన్నికల ఫలితాలతో దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గుర్తించారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రోజు భారతదేశానికి, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజు అని తెలిపారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని పార్టీ శ్రేణుల సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
'అస్సాం విజయం అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఎన్డీయే కూటమి ఇస్తున్న ప్రాధాన్యాలకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనం' అని అస్సాం ఫలితాలపై ప్రధాన మోదీ తెలిపారు. అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి అస్సాంలో అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారని.. దాని ఫలితంగానే మరోసారి విజయం అని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan: టీవీకే విజయ్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం
Nuzendla, Andhra Pradesh:Pawan Kalyan Congrats To TVK Vijay: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతదేశ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పాయి. బీజేపీ భారీ విజయం సాధించగా.. కేరళంలో కాంగ్రెస్, తమిళనాడులో టీవీకే పార్టీ విజయ ధుందుబి మోగించాయి. రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని చూపిన ఈ ఎన్నికల ఫలితాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. టీవీకే విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: SRH vs KKR: సన్రైజర్స్ విజయ యాత్రకు బ్రేక్.. ఊపిరి పీల్చుకున్న కలకత్తా నైట్రైడర్స్
'ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Heavy Rain: నల్లగొండలో దంచికొట్టిన వాన బీభత్సం.. నేలకూలిన చెట్లు
అస్సోం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బీజేపీని అగ్ర నాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్వాసుల నమ్మకాన్ని ప్రోది చేసుకోడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది' అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. 'నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందనే గట్టి విశ్వాసంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు' అని వివరించారు.
Also Read: Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్, సువేందు అధికారికి విజయంలో భాగస్వాములైన బీజేపీ నాయకత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అస్సాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న హిమంత బిశ్వశర్మకు, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి విజయాన్ని మళ్లీ అందించిన రంగసామిని అభినందించారు. 'తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్ను మనసారా అభినందిస్తున్నా' అని పవన్ కల్యాణ్ తెలిపారు. 'ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. కేరళంలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూడీఎఫ్ నాయకత్వానికి అభినందనలు. ఈ ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలందరికీ పేరుపేరునా శుభాభినందనలు' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lucky Zodiac Signs: జూన్ 29 వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ధనవర్షం ఖాయం!
Hyderabad, Telangana:Astrology Predictions May-June 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దాదాపు 60 రోజుల తర్వాత పలు గ్రహాలు అద్భుతమైన మార్పులు చేయబోతున్నాయి. ముఖ్యంగా మే 2 నుంచి ప్రారంభమై జూన్ 29 వరకు అద్భుతమైన కాలం కొనసాగబోతోంది. ఈ సమయం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా మారబోతోంది. ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడితో బుధుడు కలయిక జరపడం వల్ల ఆయా రాశులవారికి చాలా బాగుంటుంది. అలాగే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభించి.. ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అంతేకాకుండా ఐదు రాశులవారికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి అంతా శుభం..
మేష రాశి
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మేష రాశివారికి కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. పాత బాకీల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా లభిస్తాయి.
వృషభ రాశి
ఈ సమయంలో ఏర్పడే బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాల ప్రభావంతో వృషభ రాశివారికి సువర్ణ అవకాశంగా మారుతుంది. అలాగే గురు గ్రహం ప్రభావంతో తండ్రి నుంచి భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు వివాహాలు కానివారికి ఈ సమయంలో మంచి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి. అలాగే సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.
సింహ రాశి
సింహ రాశివారికి పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా మారుతుంది. అంతేకాకుండా పదోన్నతులు లభించడమే కాకుండా.. అధికార బలంతో శత్రువులపై ఊహించని విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.
తుల రాశి
బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాల ఎఫెక్ట్తో వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన ఫలితాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో కొత్త జీవిత భాగస్వామి పరిచయం కూడా అవుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy S27: సామ్సంగ్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్.. 6 ఏళ్ల తర్వాత మారనున్న గెలాక్సీ S27 డిజైన్!
Hyderabad, Telangana:Samsung Galaxy S27 Design Leaks: స్మార్ట్ఫోన్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సామ్సంగ్ కంపెనీ ప్రతి ఏడాది అద్భుతమైన మొబైల్స్ను విడుదల చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ సిరీస్ గెలాక్సీ S డిజైన్లో త్వరలోనే కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆరు సంవత్సరాల తర్వాత సాంసంగ్ కంపెనీ త్వరలో రాబోయే గెలాక్సీ S27 సిరీస్తో అద్భుతమైన మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తాయి. అంతేకాకుండా ఈ సిరీస్కి సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా ఇటీవలే సోషల్ మీడియాల్లో లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ స్మార్ట్ఫోన్ సీరీస్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గెలాక్సీ S27 సిరీస్లో అత్యంత కీలకమైన వెనక భాగంలో ఊహించని మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఫ్లోటింగ్ లెన్స్ బైబై చెబుతూ..సామ్సంగ్ ఈసారి హారిజాంటల్ కెమెరా ఐలాండ్ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చూడడానికి అచ్చం.. గూగుల్ పిక్సెల్ (Google Pixel) ఫోన్ల కెమెరా మాడ్యూల్ను పోలి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ మార్పు ఫోన్కు మరింత గుర్తింపు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మాగ్నెటిక్ యాక్సెసరీస్ (Magnetic Accessories) సదుపాయాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి డిజైన్లో మార్పులు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ టెక్నాలజీని మరింత అద్భుతంగా మెరుగుపరిచేందుకు ఈ డిజైన్ను తీసుకు రాబోతోంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో మాగ్నెటిక్ కాయిల్స్ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. లీకైన కాన్సెప్ట్ చిత్రాల్లో కెమెరా ఐలాండ్లో మూడు కెమెరా సెన్సార్లు ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అల్ట్రా మోడల్స్లో నాలుగు కెమెరాలు ఉండే ఛాన్స్లు కూడా ఉన్నాయి.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఒకవేళ సామ్సంగ్ కంపెనీ ఇదే డిజైన్ను ఫైనల్ చేస్తే.. నాలుగు కెమెరాలను ఆ ఐలాండ్లో ఎలా పెడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కంపెనీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారక ప్రకటన కూడా చేయలేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనతో పాటు ఇతర అన్ని వివరాలను కూడా వెల్లడించే ఛాన్స్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ డిజైన్ సిరీస్ విడుదలైతే.. అద్భుతంగా సక్సెస్ అవుతుంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Car Deals: రూ.6 లక్షలకే టాటా ఆల్ట్రోజ్? కార్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ ఛాన్స్!
Hyderabad, Telangana:Best Second-Hand Car Deals Latest News: సెకండ్ హ్యాండ్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్తో లభించి మల్టీ నేషనల్ బ్రాండ్ కార్లు ఢిల్లీలో అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని రోహిణిలో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ మోటర్ షోరూమ్స్లో సగం ధరలకే లభిస్తున్నాయి. కాబట్టి చాలా మంది మిడిల్ క్లాస్ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇక్కడ ఏయే కార్లపై ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోహిణిలో ఉన్న కారు షోరూమ్స్లో చిన్న తరహా హ్యాచ్బ్యాక్ కార్ల నుంచి ప్రీమియం SUVల వరకు అన్ని రకాల కార్లు అత్యంత చౌకవ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా హారియర్, హోండా అమేజ్, టయోటా గ్లాంజా వంటి ప్రముఖ బ్రాండ్లను సంబంధించిన కార్లు ఇక్కడ సగం కంపెనీ తక్కువ ధరలో అందుబాటులో ఉండడం విశేషం.. ఇక్కడున్న సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో 2020 మోడల్ టాటా హారియర్ ఎక్స్టి మాన్యువల్ డీజిల్ కార్లను కేవలం రూ. 8.5 లక్షలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 2023 మోడల్ టాటా ఆల్ట్రోజ్ కారును రూ. 6.5 లక్షలకే అందుబాటులో ఉన్నాయి.
అయితే, ఇక్కడ కార్లను అత్యంత చీప్ ధరలకే అందించడమే కాకుండా పలు రకాల అదనపు సౌకర్యాలు కూడా సంస్థ అందిస్తూ వస్తోంది. ఇక్కడ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలనుకునేవారికి ప్యాన్ ఇండియా లోన్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. అలాగే కార్ల కొనుగోలు తర్వాత చేయాల్సిన ఆర్సీ (RC) ట్రాన్స్ఫర్ బాధ్యతను కూడా వారే తీసుకుని అన్ని క్లీయర్గా కొనుగోలు చేసేవారికి సర్వీసులు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి వాహనానికి సంబంధించిన అప్డేటెడ్ సర్వీస్ రికార్డులను అందించడం విశేషం..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలనుకునేవారు.. ఈ కార్లను నేరుగా వీడియో కాల్ ద్వారా పరిశీలించే సదుపాయం కూడా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ కార్లను కొనుగోలు చేసినవారికి ప్రత్యేకమైన Transportation సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు వివిధ సదుపాయాలను కూడా అందిస్తున్నారు. కాబట్టి చీప్ ధరల్లోనే మంచి కార్లను కొనుగోలు చేయాలనుకునేవారు రోహిణి సెక్టార్ 6, బి-2373 వద్ద ఉన్న షోరూమ్స్ను సందర్శించవచ్చు..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chalisa Yoga: ఒకేసారి చాలీసా యోగం, బుధాదిత్య యోగం.. ఈ రాశులవారికి ఇక పండగే!
Hyderabad, Telangana:Mercury-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయికకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలయికను సంయోగంగా పిలుస్తారు. ఇదిలా ఉంటే మే 4వ తేదిన బుధతో పాటు శుక్ర గ్రహాల కలయికతో అరుదైన యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన చాలీసా యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది..
బుధ, శుక్ర గ్రహాల కలయికతో అరుదైన చాలీసా యోగంతో పాటు బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా నాలుగు రాశుల్లో జన్మించివారికి జీవితంలో అద్భుతమైన సంపాదన కూడా లభిస్తోంది. ఈ కింది రాశులవారికి తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు కూడా లభిస్తాయి. అయితే, ఈసమయం నాలుగు రాశులవారికి స్వర్ణయుగంలా మారుతుంది.
మేష రాశి
చాలీసా యోగంతో మేష రాశివారికి ఈ సమయంలో అనేక రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో అనుకున్న అద్భుతమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి
బుధ గ్రహ ప్రభావంతో మిథున రాశివారికి అనుకోని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. అలాగే పనుల్లో నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగాల్లో పురోగతికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహ రాశి
బుధుడి ప్రభావంతో సింహ రాశివారికి గౌరవంతో పాటు సామాజంలో హోదా కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల విస్తరణకు కూడా అవకాశాలు కనిపిస్తున్నారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయం చాలా అద్బుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులారాశి
తులారాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు సౌకర్యం కూడా పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో సంబంధాలు కూడా రెట్టింపు అవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SRH vs KKR: సన్రైజర్స్ విజయ యాత్రకు బ్రేక్.. ఊపిరి పీల్చుకున్న కలకత్తా నైట్రైడర్స్
Hyderabad, Telangana:SRH vs KKR Highlights: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్ ఎదురైంది. స్వల్ప స్కోర్ మ్యాచ్లో కలకత్తా నైట్రైడర్స్ భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు.. బౌలర్లు ఘోరంగా విఫలమైన వేళ సన్రైజర్స్ చేతులెత్తేసింది. పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న కలకత్తా నైట్రైడర్స్ అద్భుతంగా ఆడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కలకత్తా విజయంతో ప్లే ఆఫ్ రేసు సమీకరణాలు ఆసక్తికరంగా మార్చింది.
Bandla Ganesh Daughter: నిర్మాత బండ్ల గణేష్ కూతురు పెళ్లికి తరలివచ్చిన తారా లోకం..
Hyderabad, Telangana:Telangana Rythu Bharosa: మూడో విడత రైతు భరోసా నిధుల జమకు ముహూర్తం ఖరారు..ఆరోజే అకౌంట్లోకి డబ్బు!
Hyderabad, Telangana:Rythu Bharosa 3rd Installment: అన్నదాతలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని (రైతు భరోసా) పథకానికి సంబంధించిన మూడో విడతను రిలీజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 6 నాటికి రాష్ట్రంలోని రైతులకు మూడో విడత రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేయనున్నారని తెలుస్తోంది.Heavy Rain: నల్లగొండలో దంచికొట్టిన వాన బీభత్సం.. నేలకూలిన చెట్లు
Nalgonda, Telangana:Heavy Rain In Nalgonda District: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిడమనూర్ మండలం బంకాపురం గ్రామంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో రాములు అనే వ్యక్తి ఇంటి పై రేకులు ఎగిరిపోయాయి. అనుముల మండలం అంగడి బజార్లో ఈదురుగాలులతో విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న వడ్లు తడిచి ముద్దయ్యాయి. తిరుమలగిరి (సాగర్), పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో ఆకాశం మేఘావృతమై స్వల్ప జల్లులు కురిశాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వాతావరణం చల్లబడటంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని రోజులుగా ఎండలకు ఇబ్బందిపడ్డ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా.. పలు చోట్ల చెట్లు, మామిడి చెట్లు కూలిపోగా.. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోదాడ, యాదాద్రి జిల్లాలో బలమైన గాలులకు మామిడి పంట దెబ్బతింది. కాతకు వచ్చిన మామిడి కాయలు కిందపడ్డాయి.
Also Read: PV Sindhu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఒలింపిక్ స్టార్ పీవీ సింధు ప్రశంసలు
హలియాలో బీభత్సం
హాలియాలోని వజ్రతేజ రైస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ ఏరియాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రైస్ మిల్లులో నిలిపి ఉంచిన ధాన్యంతో కూడిన లారీలపై పట్టాలు ఎగిరిపోయాయి. దీంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు కవర్ల కోసం పరుగులు పెట్టారు. పంట చేతికొచ్చే తరుణంలో ప్రకృతి ప్రకోపంతో దిక్కుతోచని స్థితిలో రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ
Nagalapuram, Tamil Nadu:TN Election Results: దక్షిణాది ప్రాంతంలో కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ద్రవిడ సంస్కృతి.. ద్రవిడ వ్యతిరేక కూటముల మధ్య యుద్ధం అనేలా తమిళ ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి. తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి కోల్పోతుందనే సంప్రదాయం ఉంది. ఎన్నికలకు ఎన్నికలకు ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడనుందా? డీఎంకే మరోసారి అధికారం చేపట్టనుందా? తొలిసారి రాజకీయ పార్టీతో ఎన్నికల్లో నిలిచిన విజయ్ ఏ మేరకు ప్రభావం చూపనున్నారనేది రేపు తేలనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. మే 4వ తేదీన అంటే రేపు వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఫలితాలకు ముందే చెన్నై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో అగ్ర నాయకుల్లో టెన్షన్ మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
హంగ్ వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో నటుడు, టీవీకే విజయ్ అప్రమత్తమయ్యారు. తన పార్టీ అభ్యర్థులు చేజారకుండా మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ను బుక్ చేసినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులు నేరుగా అక్కడికే చేరుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తమిళనాడు గద్దె ఎవరిదనే విషయంలో సర్వే సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చేది డీఎంకే పార్టీ అని స్పష్టమవుతోంది.
ఎగ్జిట్ పోల్స్లో యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 98-120 సీట్లు వస్తాయని వెల్లడించింది. కింగ్ మేకర్ కాదు కింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మెజారిటీ సంస్థలు మాత్రం డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. విజయ్ పార్టీ పది సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పాయి. మొత్తం 234 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 118. యాక్సిస్ మై ఇండియా అంచనా నిజమైతే విజయ్ అధికారం చేపట్టడం ఖాయం. ఒకవేళ హంగ్ ఏర్పడితే మాత్రం తమిళ రాజకీయం మరెన్నో మలుపులు తిరిగే అవకాశం ఉంది.
ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డీఎంకే కూటమి 92-100 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 22-32 సీట్లు సాధిస్తాయని అంచనాలు వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల కొనుగోలు జరగకుండా పార్టీలు రిసార్ట్ పాలిటిక్స్కు తెరలేపాయి. మరి తమిళనాడు ఓటరు నాడీ ఎటువైపు ఉంది? దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం అద్భుతాలు సృష్టిస్తుందా? లేక స్టాలిన్ తన పీఠాన్ని నిలబెట్టుకుంటారా? రేపు మధ్యాహ్నం కల్లా ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
