తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండగ సాయన్న జయంతి
Hyderabad, Telangana:తెలంగాణ సాయుధ దళాల పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహోత్సవం సేవలను పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ డ్యాం పైన సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఎంత ఉంటే బెర్త్ పక్కాగా వస్తుంది? కొత్త IRCTC రూల్స్ ఇవే!
Hyderabad, Telangana:Train Waitlist: దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీహార్ వైపు వెళ్లే రూట్లలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలకు వెళ్లే వారికి టికెట్ కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం, పండుగ సీజన్లో అయితే వెయిటింగ్ లిస్ట్ 500 వరకు కూడా వెళ్తుంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుండటం వల్ల, డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట టికెట్ బుక్ అవ్వడం ఇబ్బందిగా మారుతుంది. ఆ సమయంలో వెయిటింగ్ లిస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ కావడానికి భారతీయ రైల్వే కొన్ని ఫార్ములాలు చెప్పింది, దాని ద్వారా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు.
సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకున్న వారిలో 21 శాతం మంది ఏదో ఒక సమయంలో క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అదనంగా, మరో ఐదు శాతం మంది ప్రయాణించలేని పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సీట్లు ఖాళీ అవుతాయి, వాటిని వెయిటింగ్ లిస్టు వారికి కేటాయిస్తారు. అంతేకాకుండా, భారతీయ రైల్వే కొన్ని ఎమర్జెన్సీ కోటాలను కూడా రిజర్వ్ చేస్తుంది.. అవి నిండకపోతే వాటిని కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు ఇస్తారు.
రైల్వేలో ఎన్ని సీట్ల వరకు ఉంటే కన్ఫర్మ్ అవుతుంది?
సాధారణంగా స్లీపర్ కోచ్లో 72 సీట్లు ఉంటాయి. ఇందులో 21 శాతం మంది టికెట్ క్యాన్సిల్ చేస్తే.. ఐదు శాతం మంది ప్రయాణించకపోతే, ఒక కోచ్కు సుమారు 18 కన్ఫర్మ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీని ప్రకారం ట్రైన్ 10 స్లీపర్ కోచ్లలో దాదాపు 150 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇదే సూత్రం సెకండ్ క్లాస్కు కూడా వర్తిస్తుంది.
Also Read: Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్కు ఏ యాప్ వాడితే సీట్ గ్యారెంటీగా వస్తుంది?
Also Read: Nepal Floods: నేపాల్లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!
అయితే పండుగ సమయంలో టికెట్ క్యాన్సిలేషన్లు, ప్రయాణించలేని వారి వల్ల వెయిటింగ్ లిస్టులో కన్ఫర్మ్ అవ్వడం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి వెయిటింగ్ టికెట్లు రాకుండా ఉండాలంటే ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ప్రతిరోజూ ప్రయాణానికి 60 రోజుల ముందు ఉదయం 8 గంటలకు రైల్వే టికెట్లు ఓపెన్ అవుతాయి. మీరు ప్రయాణించే రోజుకు 60 రోజుల ముందే బుక్ చేసుకుంటే, 99 శాతం మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగల సమయంలో ఉదయం 8 గంటల నుండి మొదటి 15 నిమిషాల్లోనే టికెట్ బుక్ చేసుకోవాలి. మీరు ప్రయాణించే తేదీలు ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకుని, టికెట్లు ఓపెన్ కాగానే బుక్ చేసుకుంటే సరిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party Protest: రేవంత్ రెడ్డి పాలనకు వెయ్యి రోజులు.. వారం పాటు బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు
Baddipadaga, Telangana:KTR Review: అడ్డగోలు హామీలు.. ఎన్నో ఆశలు ప్రజలకు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందని.. కాంగ్రెస్ అధికారం చేపట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే వారం పాటు నిర్వహించనున్న ఆందోళనలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష చేయగా.. మరోసారి పార్టీ కార్యక్రమాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పోరుబాట చేయనుందని ప్రకటించారు. వారం రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. 420 హామీల మోసంతో పాటు పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వెయ్యి రోజులైనా నెరవేరని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేద్దామని.. కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ ఒకటో తేదీన తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేయనున్నారు. ఆ చార్జ్షీట్ను ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించనున్నారు.
సెప్టెంబర్ 2
ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు
420 హామీల మోసాన్ని గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన
ప్రజలకు బాకీ ఉన్న హామీలతో ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ
సెప్టెంబర్ 3
వ్యవసాయ విధ్వంసంపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు
సాగునీరు, విద్యుత్, యూరియా, బీమా సమస్యలపై రైతులతో సమావేశాలు
హైదరాబాద్లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు
సెప్టెంబర్ 4
మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు
మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై నిరసన కార్యక్రమాలు
రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అంశాలపై నిలదీత
హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు
సెప్టెంబర్ 5
విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు
ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్పై పోరాటం
అదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు
సెప్టెంబర్ 6
హైదరాబాద్లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ
తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీత
గ్రామాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై నిరసన కార్యక్రమాలు
సెప్టెంబర్ 7
ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు
420 హామీల మోసంపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు
సెప్టెంబర్ 8
వారం రోజుల పోరాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు
అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు
సెప్టెంబర్ 10
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్ఎస్ సంఘీభావం
Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. 'బ్లడ్మూన్'గా కనువిందు చేసిన చందమామ!
Hyderabad, Telangana:Lunar Eclipse Blood Moon: ఖగోళ ప్రియులకు కనువిందు కలిగించే అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతం కానుంది. నేడు ఆకాశంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఖగోళ ప్రక్రియలో దాదాపు 96 శాతం చంద్రుడిని భూఛాయ కమ్మేయనుంది. మిగిలిన కొద్ది భాగం మాత్రమే సూర్యకాంతితో వెలుగుతూ కనిపిస్తుంది. ఈ నెలలో వచ్చే పున్నమి చంద్రుడిని 'స్టర్జన్ మూన్' అని పిలుస్తారు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశిస్తూ 'రెడ్ మూన్'గా దర్శనమివ్వనున్నాడు.Subhash Chandra: "రూ.43,000 కోట్ల అప్పులు తీర్చాను..నా జీవితం తెరిచిన పుస్తకం": ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర
Noida, Uttar Pradesh:Subhash Chandra NCLT Insolvency: తన తప్పును అంగీకరించి, అప్పుల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని ఇచ్చిన మాటను నెరవేర్చిన మొదటి వ్యక్తిని తానేనని డాక్టర్ సుభాష్ చంద్ర పేర్కొన్నారు. బకాయిలను తీర్చడానికి జీల్ (ZEEL) సంస్థను దాదాపుగా అమ్మేయడంతో పాటు, తన ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు వ్యవస్థకు వడ్డీ రూపంలోనే రూ.60,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల వరకు చెల్లించినట్లు వివరించారు.
ఎన్సిఎల్టి (NCLT) క్లెయిమ్లపై వివరణ..
ఎన్సిఎల్టి కేసు ప్రధానంగా తాను ఇచ్చిన వ్యక్తిగత హామీలకు సంబంధించినదని చంద్ర స్పష్టం చేశారు. కొంతమంది రుణదాతలకు పూర్తి సొమ్మును తిరిగి చెల్లించినప్పటికీ వారు ఎన్సిఎల్టిని ఆశ్రయించారని తెలిపారు. ప్రచారంలో ఉన్నట్లుగా క్లెయిమ్ మొత్తం రూ.22,000 కోట్లు కాదని, అది రూ.3,992 కోట్ల క్లెయిమ్ మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.620 కోట్ల క్లెయిమ్ను పరిష్కరించామని, రుణదాతలకు రూ.1,063 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చామని వెల్లడించారు.
నిధుల సేకరణ - ఆస్తుల విక్రయం..
తమకు రావాల్సిన నిధులు కూడా పలుచోట్ల చిక్కుకుపోయాయని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మౌలిక సదుపాయాల నిధులను సేకరించాల్సి ఉందని తెలిపారు. బాకీలు పూర్తిగా తీర్చేందుకు మరో 1 నుంచి 2 ఆస్తులను విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 2016లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా రూ.39.08 కోట్ల నికర విలువను ప్రకటించగా, 2017 నాటికి రూ.45,888 కోట్ల నికర విలువ ఎలా వచ్చిందనే విషయంపై నిజం తప్పకుండా బయటపడుతుందని వ్యాఖ్యానించారు.
భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు విజ్ఞప్తి..
కేవలం రూ.17తో ప్రయాణం ప్రారంభించి దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరానని, నూతన ఆవిష్కరణలు చేస్తూ మళ్లీ పుంజుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్లోని ఓ మిత్రుడి సంస్థలో పనిచేయాలని భావిస్తున్నట్లు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 1-2 వారాల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని, సమాచారాన్ని సరిచూసుకోవాలని సుభాష్ చంద్ర ప్రజలను కోరారు. తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని, ఎవరికైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే నేరుగా తనకు ఈమెయిల్ చేస్తే సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు గుడ్న్యూస్..14-54 శాతం జీతాల పెంపు!
Also Read: జియో, ఎయిర్టెల్ ఆధిపత్యానికి చెక్..అతి తక్కువ ధరలకే BSNL, వొడాఫోన్ ఐడియా ఒప్పందం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karnataka Beggar: 10 ఏళ్ల భిక్షాటన.. గది నిండా డబ్బుల మూటలు..
Hyderabad, Telangana:Beggar House Yields Lakhs In Cash: పూట కూటి కోసం పది ఇళ్ళ ముందు చెయ్యి చాచే ఓ అభాగ్యురాలి నివాసంలో కళ్ళు చెదిరే స్థాయిలో డబ్బులు బయటపడ్డాయి.. ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా దయనీయ స్థితిలో బతుకుతున్న ఆ వృద్ధురాలు ఇంట్లో ఏకంగా బస్తాల కొద్ది నోట్ల కట్టలతో పాటు నాణేల మూటలు లభ్యం కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఆశ్చర్యకరమైన ఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో వెలుగు చూసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే.. శ్రీరంగపట్నంలోని పూర్ణయ్య వీధికి చెందిన సావిత్రి అనే వృద్ధురాలు గత పదేళ్లుగా అక్కడే నివసిస్తోంది.. ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది.. ఉదయం లేచినప్పటి నుంచి వీధుల్లో భిక్షాటన చేస్తూ.. వచ్చిన డబ్బులతో కాలం వెల్లదీస్తూ వస్తోంది.. సరైన వెలుతురుతో పాటు కనీసం మౌలిక సదుపాయాలు లేని ఓ చిన్న గదిలో.. అత్యంత అశుభ్రత వాతావరణంతో కూడిన అందులో ఆమె బ్రతుకుతోంది.. అయితే పదేళ్లుగా భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను ఆమె ఖర్చు చేయకుండా ఒకచోట మూటలు కట్టి భద్రపరుస్తూ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది..
తాజాగా సావిత్రి తీవ్ర అనారోగ్యానికి గురైంది.. ఇంట్లో నుంచి ఆమె ఎంత వరికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కొంత మంది స్థానికంగా నివసిస్తున్న వారి.. లోపలికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు.. ఆమె మంచానికి పరిమితమై నారకయాతన అనుభవిస్తున్నట్లు వారు గమనించారు. వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు మానవ దృక్పథంతో ఆమెకు ఆహారంతో పాటు నీళ్లు అందించారు.. ఈ క్రమంలో ఆ గదిని పరిశీలించగా.. మూలల్లో ఉన్న బస్తాలతో పాటు మూటలను చూసి వారొక్కసారిగా షాక్ అయిపోయారట.. వాటిని తెరిచి చూడగా అందులో భారీగా నోట్ల కట్టలతో పాటు చిల్లర నాణాలు ఊహించని స్థాయిలో కనిపించాయి.
వృద్ధురాలు ఇంట్లో బయటపడిన డబ్బుల మూటలను చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు యువకులు.. 20 మందికి పైగా ఓ బృందం ఏర్పడి ఆ డబ్బులు లెక్కించడం ప్రారంభించారు.. గంటలకు తరబడి శ్రమించిన తర్వాత ఆ మూటల్లో ఏకంగా కొన్ని లక్షల రూపాయల నగదు ఉన్నట్లు తేలింది.. వృద్ధురాలి సంపాదన చూసి లెక్కపెట్టిన వారి సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఒకవైపు ఆ వృద్ధురాలి ఇంట్లో డబ్బులు లెక్కపెడుతూనే.. మరోవైపు ఆమె పట్ల స్థానికులు గొప్ప మనసును చాటుకున్నారు.. సావిత్రికి స్నానం చేయించి.. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించారు.. అంతేకాకుండా ఆమె నివాసం ఉంటున్న గదిని పూర్తిగా శుభ్రం చేసి నిజమైన మానవత్వం చాటుకున్నారు.. ఇక ఇంట్లో దొరికిన మొత్తం డబ్బును సావిత్రి పేరు మీద బ్యాంకు డిపాజిట్ చేయాలని స్థానికులు నిర్ణయించారట.. కాగా ఇటీవల చనిపోయిన మరో వృద్ధురాలు ఇంట్లో కూడా ఇదే తరహాలో భారీ నగదు బయటపడటం విశేషం..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Raksha Bandhan: రాఖీ కట్టడం మహాపాపం.. ఈ వింత గ్రామం కథేంటో తెలుసా?
Hyderabad, Telangana:The 205-year-old Mystery News: భారతదేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు.. అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ ఎంతో ఘనంగా.. ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు.. సోదరుడి మణికట్టుపై సోదరీ రాఖీ కట్టి.. అతని దీర్ఘాయుష్షును కోరుకుంటుంది.. అయితే, దేశమంతా ఒకే రోజు ఈ పండగను జరుపుకుంటే.. ఓ గ్రామంలో మాత్రం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడాన్ని మహా అపచారంగా భావిస్తూ ఉంటారు.. వినడానికి ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ.. ఇది అక్షరాల నిజం.. పండగకు సరిగ్గా ఒకరోజు ముందు మాత్రమే ఇక్కడ రాఖీ కడుతూ ఉంటారట... ఇంతకీ ఆ గ్రామం ఏంటి? దీని వెనుక ఉన్న 205 ఏళ్ల నాటి చరిత్ర ఏమిటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ రాష్ట్రంలోని వనస్కాంత జిల్లా.. పాలంపూర్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చదోతర్ గ్రామంలోని ఈ వింత ఆచారం కొనసాగుతోంది.. ఈ ఊరిలో రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడం ఆశుభమని నమ్ముతూ ఉంటారట.. అందుకే దేశవ్యాప్తంగా పండగ జరుపుకోవడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇక్కడ మహిళలు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి ఘనంగా పండగ జరుపుకుంటూ ఉంటారు.. ఈ సాంప్రదాయం ఈనాటిది కాదట.. దాదాపు 205 ఏళ్ల నాటి క్రితం ప్రారంభమై నేటికీ కొనసాగుతూ వస్తోందట..
స్థానిక కథనాల ప్రకారం.. 205 ఏళ్ల నాటి ఈ గ్రామంలో ఒక భయంకరమైన అంటువ్యాధి ప్రబలించిందట.. ఆ మహమ్మారి దెబ్బకు పెద్ద సంఖ్యలో మనుష్యులతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయట.. ప్రాణ భయంతో వనికిపోయిన గ్రామస్తులంతా కలిసి ఊరి శివాలయంలో ఉన్న ఒక సాధు వద్దకు వెళ్లి ఊర్లో ఉన్న పాలనంత ఒక చోటుకు చేర్చి.. ఆ పాలను ఊరి నలుమూలల చల్లుమని చెప్పారట.. ఆయన చెప్పినట్లుగానే గ్రామస్తులు ఆ పాలనంత ఊరంతా చల్లారు.. ఆశ్చర్యకరంగా.. కొద్దిసేపటికి పరిస్థితి అంతా శాంతించిందట.. వ్యాధి ఉధృతి తగ్గిపోయి గ్రామ సురక్షితంగా మారిపోయిందట..
ఆ తర్వాత ఆ సాధువు గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఇకపై ఈ గ్రామంలో ఏ సోదరి కూడా రక్షాబంధన్ రోజున తన సోదరుడి చేతికి రాఖీ కట్టకూడదని ఆదేశించారట.. ఒకవేళ అలా చేస్తే గ్రామానికి కీడు జరుగుతుందని కూడా హెచ్చరించారట.. అప్పటినుంచి ఈ గ్రామంలో ఏ ఆడపడుచు రాఖీ పౌర్ణమి రోజున సోదరుడికి రాఖీ కట్టదట..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఈ ఆచారం కారణంగా.. పండగకు ముందు రోజే గ్రామంలోని ఆడపడుచులంతా పుట్టింటికి వచ్చి.. అన్నదమ్ములకు రాఖీ కడతారు.. ఆ రోజున ఆ ఇంటి కోడళ్ళతో పాటు తమ ఆడపడుచులకు ఘనంగా స్వాగతం పలికి ఆతిథ్యం ఇస్తారు.. ఇక అసలు పండగ రోజున ఈ కోడళ్ళు తమ పుట్టింటికి వెళ్లి.. తమ సోదరులకు రాఖీ కడతారు.. ఇలా 205 ఏళ్ల క్రితం నాటి తమ పూర్వీకుల నమ్మకాన్ని ఆచారాన్ని ఈ గ్రామస్తులు నేటికీ ఎంతో శ్రద్ధగా కొనసాగిస్తూ వస్తున్నారు.. ఆధునిక యుగంలోనూ పాత నమ్మకాలను ఏమాత్రం వదలకుండా పాటిస్తున్న ఈ గ్రామస్తుల తీరు నిజంగా ఆశ్చర్యం కదా..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
రాఖీ వేళ RTC చార్జీల మంట.. స్పెషల్ బస్సుల పేరుతో దోపిడీ!
Hyderabad, Telangana:Rtc Extra Fares News: అన్నా చెల్లెళ్లతో పాటు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండగ సంతోషాన్ని ఆర్టీసీ చార్జీల మంట ఆవిరి చేస్తోంది. సంతులకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుందాం అనుకునే. సగటు ప్రయాణికుడి ఆశలపై ఆర్టీసీ యాజమాన్యం నీళ్లు చల్లుతూ వస్తుంది.. పండగపూట ఉండే రద్దీని ఆసరాగా చేసుకొని.. స్పెషల్ బస్సుల ముసుగులో ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతూ ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లులు పెడుతోంది.. ప్రజా రవాణా వ్యవస్థగా సేవలు అందించాల్సిన సంస్థ.. పండుగ ర దీని పూర్తిగా క్యాష్ చేసుకొనే పనిలో పడిందన్న తీవ్ర విమర్శలు ప్రయాణికులనుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి..
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణానికి కేవలం రూ.290 చార్జి ఉంటుంది.. కానీ ఇప్పుడు స్పెషల్ బస్సుల పేరుతో 1.50 రూల్ను తెరపైకి తీసుకువచ్చి అదనంగా.. రూ.100 నుంచి రూ.150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారట.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్లే మెట్రో డీలక్స్ స్పెషల్ బస్సుల్లో ఏకంగా రూ.400 వసూలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ అదనపు చార్జీల బాదుడు మరింత దారుణంగా ఉందట.. దీంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు పెరిగిన చార్జీలు చూసి లాబోదిబోమంటున్నారు..
బస్టాండ్లలో రద్దీ ఉండడంతో.. ఎలాగోలా సీట్లు దొరికితే చాలనుకుని బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులకు కండక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత మార్గ మధ్యలో టికెట్ ఇచ్చే సమయంలో స్పెషల్ బస్సు పేరుతో ఈ పెంచిన చార్జీలను అకస్మాత్తుగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలుపుతున్నారు.. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రయాణికులపై కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి..
సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరించే జర్నలిస్టులకు కూడా ఈ స్పెషల్ బస్సుల్లో చేదు అనుభవం ఎదురవుతోందట... జర్నలిస్టులకు ప్రభుత్వం కల్పించిన వన్ బై థర్డ్ రాయితీ రూల్ను స్పెషల్ బస్సుల్లో వర్తించడం లేదు.. దీనిపై అధికారులతో పాటు సిబ్బందిని ప్రశ్నిస్తే.. టికెట్ ఇచ్చే TIMS మిషన్లలో ఆప్షన్లు చూపించడం లేదు అంటూ.. పొంతన లేని.. నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ వస్తున్నారట..
ఆర్టీసీ ఉద్యోగులతో పాటు అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఏ బస్సు స్పెషల్ బస్సు అనేది.. ఏది రెగ్యులర్ బస్సు అని తెలియక.. గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులతో పాటు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ స్పెషల్ చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని.. పండగ పూట సామాన్యులు ఆర్థిక భారం లేకుండా సంతోషంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!
Vijayawada, Andhra Pradesh:Irumudi Controversy Nara Lokesh: ఓ వైపు కలెక్షన్లు, బ్లాక్బస్టర్ టాక్తో నడుస్తున్న 'ఇరుముడి' సినిమా చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. చిత్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా, విద్యా వ్యవస్థను తప్పుగా చిత్రీకరించేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమికోపాధ్యాయ సంఘం (ఏపీటీఏ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్సీ బోరా గోపి మూర్తి అభ్యంతరాలు..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బోరా గోపి మూర్తి చిత్ర యూనిట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గంలోని ఒక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యార్థినుల యూనిఫామ్లను సినిమాలో యథాతథంగా చూపించడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా, సినిమాలో ఒక మహిళా ఉపాధ్యాయురాలి పాత్రను అత్యంత నెగటివ్గా, క్రూరంగా చూపించారని విమర్శించారు. స్పెషల్ క్లాసుల పేరుతో ఒక విద్యార్థినిని స్థానిక ఎమ్మెల్యే వద్దకు టీచర్ పంపే దృశ్యం అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఇలాంటి కల్పిత సన్నివేశాలు ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా సమాజంలో తప్పుడు భావనలు కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సామాజిక బాధ్యత విస్మరించవద్దు..
సినిమా అనేది ఎంతో శక్తివంతమైన మాధ్యమమని, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దర్శకులు, నిర్మాతలు సామాజిక బాధ్యతను విస్మరించకూడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలను అధిగమిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి సెన్సార్ బోర్డు ద్వారా ఈ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!
Also Read: ఫోన్ సూచనలతో అబార్షన్.. వికటించిన వైద్యం..ఐదు నెలల గర్భిణి దుర్మరణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anil Kumar Yadav Politics: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!
Nellore, Andhra Pradesh:Anil Kumar Yadav Quits YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరుపక్షాలు 2029 సార్వత్రిక ఎన్నికలను సైతం లక్ష్యంగా చేసుకుని ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కూటమి ఏకగ్రీవం చేసుకుంటే, ఆ నియోజకవర్గ ఇంఛార్జ్లకు భవిష్యత్ ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రకటన నెల్లూరు వైఎస్సార్సీపీలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.
రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా..
రాబోయే ఎన్నికల్లో తాను బరిలో నిలవకపోవచ్చని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో తనకంటూ ఒక పేజీ, చరిత్ర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాను ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ 2014, 2019లలో వరుసగా టికెట్లు ఇచ్చి, గుర్తించే స్థాయికి తీసుకువచ్చి మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ వచ్చినా, రాకపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన తృప్తి తనకు సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు సిటీలో మారుతున్న సమీకరణాలు..
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్కు కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ బాధ్యతలు దక్కాయి. అయితే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా అనిల్ స్థానంలో జిల్లాకే చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనిల్ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించగా, ఆయన ఓటమి చెందారు.
అదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని ఖలీల్ అహ్మద్కు కేటాయించగా, ప్రస్తుత మంత్రి పి.నారాయణ చేతిలో ఖలీల్ 72,489 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్గా ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తుండటంతో, అక్కడ అనిల్ కు మళ్లీ సీటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అనిల్ ముందస్తుగా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో జగన్ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
Also Read: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ బస్సులో దారుణం!
Also Read: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Yerragondapalem Abortion: ఫోన్ సూచనలతో అబార్షన్.. వికటించిన వైద్యం..ఐదు నెలల గర్భిణి దుర్మరణం!
Erragondapalem, Andhra Pradesh:Yerragondapalem Abortion News: స్థానికుల సమాచారం ప్రకారం.. వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన గర్భిణి యర్రగొండపాలెం మండల పరిధిలోని మురారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మాబున్నీ (25) ఐదు నెలల గర్భిణి. ఆమెకు భర్త షేక్ చిన్నబాజీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న 'డాక్టర్స్ ప్రజా వైద్యశాల'కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎంబీబీఎస్ అర్హత కలిగిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. అయినప్పటికీ సిబ్బంది ఆమెను చేర్చుకుని చికిత్స అందించేందుకు సిద్ధపడ్డారు.
ఫోన్ సూచనల ఆధారంగా సిబ్బంది నిర్వాకం గురువారం ఉదయం సదరు ఆసుపత్రి సిబ్బంది ఓ వైద్యుడిని ఫోన్లో సంప్రదించి, మాబున్నీకి అబార్షన్ చేయాలని నిర్ణయించారు. వైద్యుడు ఫోన్ ద్వారా అందించిన సూచనల మేరకు, ఎలాంటి శస్త్రచికిత్స అనుభవం లేని కాంపౌండర్ శ్యామ్, నర్సు కలిసి పిండాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించడంతో మాబున్నీ ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది.
జాతీయ రహదారిపై బంధువుల ఆందోళన వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న సదరు ప్రైవేటు ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై దేవకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. భర్త చిన్నబాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనుమతులు లేకుండా దశాబ్ద కాలంగా నిర్వహణ ఈ ప్రైవేటు వైద్యశాలను దాదాపు పదేళ్ల క్రితం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో ఓ ప్రభుత్వ వైద్యుడు దీనిని నడిపించగా, ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఆయన బదిలీ కావడంతో అప్పటి నుంచి కాంపౌండర్, నర్సులే డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.
Also Read: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ బస్సులో దారుణం!
Also Read: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం, నింగిలో అద్భుతం..'బ్లడ్మూన్'గా కనువిందు చేయనున్న చంద్రుడు!
Hyderabad, Telangana:Lunar Eclipse Blood Moon: ఖగోళ ప్రియులకు కనువిందు కలిగించే అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతం కానుంది. నేడు ఆకాశంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఖగోళ ప్రక్రియలో దాదాపు 96 శాతం చంద్రుడిని భూఛాయ కమ్మేయనుంది. మిగిలిన కొద్ది భాగం మాత్రమే సూర్యకాంతితో వెలుగుతూ కనిపిస్తుంది. ఈ నెలలో వచ్చే పున్నమి చంద్రుడిని 'స్టర్జన్ మూన్' అని పిలుస్తారు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశిస్తూ 'రెడ్ మూన్'గా దర్శనమివ్వనున్నాడు.
భారత్లో కనిపించదు..
ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని భారత్లో నేరుగా వీక్షించే అవకాశం లేదు. గ్రహణం ఏర్పడే సమయం మన దేశంలో పగటి వేళ కావడమే ఇందుకు ప్రధాన కారణం. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:03 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది. ఉదయం 9:42 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో చంద్రుడి శోభ అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది. అయితే ఆ సమయానికి భారత్తో పాటు ఇతర ఆసియా దేశాల్లో సూర్యోదయం అయి ఉండటం వల్ల చంద్రుడు కనిపించడు.
కనిపించే ప్రాంతాలు..'బ్లడ్ మూన్' విశేషాలు..
ఈ పాక్షిక చంద్రగ్రహణం పశ్చిమ యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల్లో స్పష్టంగా కనిపించనుంది. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలతో పాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది పాక్షికంగా కనిపిస్తుంది. పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో గ్రహణ గరిష్ట సమయం సూర్యోదయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పశ్చిమ దిశగా ఆకాశంలో దాదాపు భూమికి సమాంతరంగా కనిపిస్తాడు.
ఉదయించే సూర్యుడి కాంతి చంద్రుడిపై పడినప్పుడు భూ వాతావరణం ఒక ఫిల్టర్లా పనిచేసి, ఎరుపు రంగు కాంతిని మాత్రమే ప్రసరింపజేస్తుంది. దీనివల్ల చంద్రబింబం ఎరుపు-గోధుమ రంగుల కలయికలో ఆకర్షణీయంగా కనిపిస్తూ 'బ్లడ్ మూన్' అనుభూతిని కలిగిస్తుంది.
మళ్లీ 2029లోనే..
ఇటువంటి చంద్రగ్రహణం మళ్లీ 2029 వరకు కనిపించదు. ఆ ఏడాది జూన్లో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారే 'బ్లడ్ మూన్ ఎక్లిప్స్' సంభవించనుందని నాసా (NASA) పేర్కొంది. కాగా, ఈ అరుదైన చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Also Read; నేపాల్లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nepal Floods: నేపాల్లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!
Namarjung, Gandaki Province:Nepal Floods Death Toll: నేపాల్, పొరుగున ఉన్న టిబెట్లలో ఆకస్మిక వరదల బీభత్సానికి మృతుల సంఖ్య 392కు చేరింది. మొత్తం 1,468 మంది గల్లంతవగా, అందులో 290 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించగా, సహాయక చర్యల కోసం భారత్ 47.5 టన్నుల మానవతా సాయాన్ని పంపింది. హిమానీనదం కూలి లెండే నదికి అడ్డంకి ఏర్పడటంతో ఈ విపత్తు సంభవించింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన కృత్రిమ సరస్సుతో మరో ముప్పు పొంచి ఉంది.
290 మంది భారతీయుల ఆచూకీ కోసం గాలింపు..
ఈ విపత్తులో చిక్కుకున్న భారత పౌరులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా 290 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కాలేదని, ఇప్పటివరకు 84 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షించబడిన వారిలో నిర్మాణంలో ఉన్న త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు.
టిబెట్ వైపు చిక్కుకున్న మరో 200 మంది భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరగా.. నేపాల్, చైనా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపడుతున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అదనంగా, నేపాల్కు భారత్ 47.5 టన్నుల మందులు, ఆహార ప్యాకెట్లు, మానవతా సహాయాన్ని పంపించింది.
భారీగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు
నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో మంచు, రాళ్లతో కూడిన భారీ హిమపాతం సంభవించింది. ఇది లెండే నది ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకోగా, అనంతరం ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో నీరు, బురద, శిథిలాలు ఉధృతంగా దిగువకు పోటెత్తాయి. ఈ వరద ధాటికి రసువా జిల్లాతో పాటు తిమురే, రసువాగధి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వరదల కారణంగా..
35 మోటారు వాహనాల వంతెనలు, 45 వేలాడే వంతెనలు ధ్వంసమయ్యాయి. సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు, జలవిద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సహాయక చర్యలు.. సిబ్బంది గల్లంతు
రహదారులు తెగిపోవడంతో రక్షణ చర్యలు క్లిష్టతరంగా మారాయి. అయినప్పటికీ నేపాల్ పోలీసులు హెలికాప్టర్ల ద్వారా 796 మందిని, భూమార్గం ద్వారా మరో 796 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రసువా నుంచి 11 మంది భారతీయులతో సహా 27 మంది విదేశీ పర్యాటకులను కాపాడి కాఠ్మండుకు చేర్చారు.
మరోవైపు విధుల్లో ఉన్న 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బంది, 28 మంది నేపాల్ పోలీస్ సిబ్బంది, 13 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా గల్లంతయ్యారు. అలాగే జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 160 మంది ఆచూకీ తెలియరాలేదు.
కొత్తగా పొంచి ఉన్న ముప్పు
భోటే కోషి నదీ మూలం వద్ద కొత్తగా ఏర్పడిన ఒక ఆనకట్ట సరస్సు అధికారులను కలవరపెడుతోంది. ఈ సరస్సులో ఇప్పటికే దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరగా, రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ ఈ ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు భోటే కోషి, త్రిశూలి నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!
Also REad: నేపాల్లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Raksha Bandhan Gift Ideas: రక్షా బంధన్ 2026.. తోబుట్టువులను ఆశ్చర్యపరిచే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్!
Hyderabad, Telangana:Raksha Bandhan Gift Ideas 2026: తోబుట్టువుల మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని, అమితమైన అనురాగాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్. ఈ రక్షా బంధన్ 2026 పండుగకు మీ తోబుట్టువుల కోసం బహుమతులు కొనడం ఆలస్యమైందా? చింతించకండి! చివరి నిమిషంలో కూడా మీ ప్రేమను మరియు ప్రయత్నాన్ని ప్రతిబింబించేలా, వారి హృదయాలను హత్తుకునే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. బహుమతి ఎంత ఖరీదైనది అనేదానికంటే, దాని వెనుక ఉన్న మీ భావమే ఇక్కడ ముఖ్యం.
1) వ్యక్తిగతీకరించిన ఫోటో ఫ్రేమ్: మీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు లేదా ఈ మధ్యకాలంలో దిగిన హృదయానికి దగ్గరైన ఏదైనా అందమైన ఫోటోను ఫ్రేమ్ చేసి బహుమతిగా ఇవ్వండి. ఇది మాటలు లేకుండానే మీ పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చి మీ బంధం ఎంత బలమైనదో తెలియజేస్తుంది.
2) చేతితో రాసిన లేఖ లేదా జ్ఞాపకాల స్క్రాప్బుక్: హృదయపూర్వకంగా చేతితో రాసిన లేఖకు ఉన్న విలువ మరే బహుమతికీ ఉండదు. మీ మధ్య ఉన్న సరదా ముచ్చట్లు, పాత జ్ఞాపకాలు, మీ తోబుట్టువుపై మీకున్న కృతజ్ఞతను ఈ లేఖ ద్వారా వ్యక్తపరచండి. ఇది చాలా సులువైనది కానీ అత్యంత అర్థవంతమైనది.
3) గిఫ్ట్ కార్డ్లు: వారికి ఏమి కొనాలో తెలియక సతమతమవుతుంటే, వారికి ఇష్టమైన బ్రాండ్ యొక్క గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం బెస్ట్. దీనివల్ల వారు తమకు నచ్చిన వస్తువును స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.
4) చాక్లెట్లు లేదా స్వీట్ హ్యాంపర్లు: చివరి నిమిషంలో ఎంపిక చేసుకోగలిగే మధురమైన గిఫ్ట్ ఇది. ఒక నోరూరించే చాక్లెట్ల పెట్టె లేదా పండుగ స్వీట్ హ్యాంపర్ మీ తోబుట్టువు ముఖంలో తక్షణమే చిరునవ్వును రప్పిస్తుంది.
5) చర్మ సంరక్షణ లేదా గ్రూమింగ్ కిట్: ఇది ఒక ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన బహుమతి. ఒక మంచి స్కిన్ కేర్ లేదా గ్రూమింగ్ కిట్ అందించడం ద్వారా, మీరు వారి రోజువారీ సంరక్షణపై ఎంతగా శ్రద్ధ చూపుతున్నారో తెలియజేసినట్లవుతుంది.
6) ప్రత్యేకంగా తయారు చేయించిన మగ్ లేదా కుషన్: ఒక కప్పు లేదా కుషన్ (దిండు)పై మీ తోబుట్టువుకు నచ్చేలా అందమైన సందేశాన్ని లేదా చిత్రాన్ని ముద్రించి (కస్టమైజ్ చేసి) ఇవ్వండి. ఇది చిన్న ప్రయత్నమే అయినా వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.
7) పుస్తకాలు లేదా జర్నల్స్: మీ తోబుట్టువుకు పుస్తకాలు చదవడం లేదా రాయడం అలవాటు ఉంటే, ఒక మంచి పుస్తకం లేదా అందమైన జర్నల్ను గిఫ్ట్గా ఇవ్వడం చివరి నిమిషంలో చేయగలిగే చక్కటి ఎంపిక.
8) యాక్సెసరీలు (వాచ్, బ్రాస్లెట్, చెవిపోగులు): స్టైలిష్ వాచ్, అందమైన బ్రాస్లెట్ లేదా చెవిపోగుల జత వంటి చిన్న వస్తువులు కూడా వారి లుక్ను తక్షణమే మెరుగుపరుస్తాయి. తక్కువ శ్రమతో గొప్ప అనుభూతిని ఇచ్చే బహుమతి ఇది.
9) పెర్ఫ్యూమ్: ఒక మంచి సువాసన ఇచ్చే పెర్ఫ్యూమ్ ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. ఇది చాలా క్లాసిక్ బహుమతిగా నిలవడమే కాకుండా, చివరి నిమిషంలో కూడా చాలా సులభంగా లభిస్తుంది.
10) అనుభూతినిచ్చే బహుమతి (సినిమా, విందు లేదా విహారయాత్ర): కొన్నిసార్లు చేతికి ఇచ్చే వస్తువుల కన్నా మనసుకు ఇచ్చే అనుభూతులు మిన్న. వారితో కలిసి ఒక సినిమా చూడటం, హోటల్కు వెళ్లి విందు ఆస్వాదించడం లేదా ఒక చిన్న విహారయాత్రను ప్లాన్ చేయడం ద్వారా నాణ్యమైన సమయం గడపవచ్చు. ఎలాంటి భౌతిక బహుమతికైనా ఇది ఏమాత్రం తీసిపోదు.
అంతిమంగా రక్షా బంధన్ అంటే కేవలం బహుమతులు మార్చుకోవడం మాత్రమే కాదు. అది జీవితాంతం నిలిచిపోయే ప్రేమ, ఆప్యాయతతో కూడిన తీపి జ్ఞాపకాల కలయిక. చివరి నిమిషంలో ఇచ్చే ఏ చిన్న బహుమతి అయినా మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. కాబట్టి, సమయం లేదని ఒత్తిడికి గురికాకుండా మీ తోబుట్టువులపై మీకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను వ్యక్తపరచండి.
Also Read: మీ సోదరులకు రాఖీ ఈ సమయంలో కడితే శ్రేష్టం అంటున్నారు పండితులు..!!
Also Read: తెలుగులో రాఖీ విషెష్, మధురమైన కొటేషన్లు, ఫోటోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
